28, జులై 2020, మంగళవారం

సంధ్యావందనం

సంధ్యావందనం అంటే సమస్త వేద సారమైన శక్తి ఉపాసన. తత్వమసి  తెలుసుకొనే దారి. యిందులో నాలుగు వేదాలు ఉపనిషత్ సారము కూడి యుండునది. బ్రహ్మ పదార్ధ నిరూపణయే దీని సారము. యిక గాయత్రీ మంత్రం అనగా సృష్టికి మూల ప్రకృతిని తెలియుట. యిది వెనుక నుండి పఠనం చేసిన బ్రహ్మాస్రమే. అనగా బ్రహ్మ పదార్ధ నిరూపణ. ఆత్మ తత్వం దాని వెలుగు దాని చైతన్యం ప్రత్యక్షంగా ప్రకృతి ద్వారానే కనిపించు చున్నది. కాంతి ద్వారా అట్టి కాంతి యెుక్క మూల తత్వాన్ని మనో నేత్రములు దర్శించుట.అందుకు సంధ్యావందనం ప్రక్రియనే మూల తత్వం.
****************
 మారీచమాయ లేడి సంహారము వక సూక్మా పరిశీలన. సీతమ్మ కోరిక . అది ప్రకృతి మాయ యని ప్రకృతి రూపంలో అమ్మకు తెలిసు. కాని ఆ భాసము మాయ యని తెలియును. మాయ ఎప్పుడూ అనంతమైన వెలుగు రూపంలో లక్షణము. మాయ కనిపించదు వశము కాక తప్పదు. అయినా బధ్దులై యుండిరి. పోనీ సంహరణచేసిన ఉపయెూగమా! సంహరిస్తాడు ఉపయెూగంలేదు. సంహరిచుట క్షత్రియ ధర్మం కాదు. రక్షణయే ధర్మం. అధర్మ నాశనం. పోనీ ఆ మాంసం భక్షణకా. ముని వృత్తి దీక్ష. మాంస భక్షణము  నిషేధం. మరి యిచ్చట రెండు తత్వములు విరుద్ద తత్వములు మాయ యని తెలుసు బధ్దులై యుండిరి. దాని కర్మ అనుభవించాలని జీవ లక్షణమే మాయ.
***************[
 నా అనుభవం యిక్కడ వివరిస్తాను. నాకు ఏవిధమైన వేద విహితమైన చదువు లేదు. కాని నా 18 వ సంవత్సరము నుండి నమ్మకంతో బీజాక్షర మంత్రంతో యంత్రంతో గురువు ద్వాపా నే తోచిన విధంగా ఆరాధన జపం చేస్తున్నాను. కాని యింతవరకు ఏవిధమైన మరణభయంగాని ఏమీ కలగలేదు. దయచేసి నమ్మండి.నమ్మితే కలిగనది ఏదీ లేదు. కోరికలు లేకుండా సాధన చేయాలి. గరుముఖంగానే మంత్ర జపం తీసుకుని చెయ్యాలి. ప్రతీ అక్షరం బీజాక్షరమే . రామ కృష్ణ పంచాక్షరీ మెుదలగునవి అక్షరములే మంత్రములు.

కామెంట్‌లు లేవు: