16, డిసెంబర్ 2020, బుధవారం

పత్రం పుష్పం

 🍀🌷🍀🌷🍀🌷🍀🌷🍀🌷🍀


పత్రం పుష్పం ఫలం తోయం,  యోమే భక్త్యా ప్రయచ్చతి

 తదహం భక్త్యు ప్రహృతమస్నామి  ప్రయతాత్మనః      ( భగవద్గీత )


సామాన్యమైన అర్థం ఏమిటంటే :-

భగవంతునికి పత్రం, పుష్పం, ఫలం, జలం సమర్పించి పూజ చేయమని.


 కానీ అంతరార్థం ఏమిటంటే అంతఃకరణాలైన మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం మాత్రమే భగవంతుడు సమర్పించమన్నాడు.


🌷 పత్రం -- మనస్సు -- చంచలం.

🌷 పుష్పం -- బుద్ధి -- వికసించడం.

🌷తోయం -- చిత్తం -- నిర్మలం.

🌷 ఫలం  -- అహంకారం -- నారికేళం రెండు ముక్కలవడం.


అవి ధ్యానం వల్లనే సాధ్యం.

👉 ధ్యానంలో 'మనస్సు' యొక్క చంచలత్వం పోతుంది.

👉 అప్పుడు లభించే ప్రాణశక్తి వల్ల 'బుద్ధి' వికసిస్తుంది.

👉 అప్పుడు లోపల ఉన్న చెత్త ఆలోచనలు అన్నీ పోయి 'చిత్తం' నిర్మలమవుతుంది.

👉 దానివల్ల నేను అనే 'అహంకారం' తొలగిపోతుంది.

 అప్పుడే లోకానికి మేలు చేస్తాడు. అటువంటి వాడే దైవానికి ప్రీతి పాత్రుడు అవుతాడు.


🍀🌷🍀🌷🍀🌷🍀🌷🍀🌷🍀

కామెంట్‌లు లేవు: