6, జనవరి 2021, బుధవారం

శివలింగానికి

 *శివాలయంలో ఉండే శివలింగానికి*

*మొత్తం 5, ముఖాలు ఉంటాయి*

===================


అందులో నాలుగు ముఖాలు

నాలుగు దిక్కులని చూస్తుంటే*

ఐదవ ముఖం ఊర్థ్యముఖమై ( పైకి చూస్తూ /

ఆకాశంవైపు చూస్తూ ) ఉంటుంది,*

5, ముఖాలకి 5, పేర్లు నిర్దేశించ బడ్డాయి,


1,సద్యోజాత,ముఖం, ( పశ్చిమ )*

2, తత్పురుష,ముఖం, ( తూర్పు )*

3, అఘోర,ముఖం ( దక్షిణ )*

4, వాసుదేవ,ముఖం ( ఉత్తర )*

5, ఈశాన, ముఖం ( ఆకాశం )*

శివాలయాలు అన్నింటిలో అత్యంత మహిమ

కలిగినది, కోరిన కోర్కెలు వెంటనే తీర్చేది,

పశ్చిమాభి ముఖమైన శివాలయం,*

మనకు ప్రతీ శివాలయములోనూ

ఈ 5, ముఖాలు ఉంటాయి,*

శైవాగమనంలో చెప్పినట్లుగా,

మనం తప్పకుండా,

శివాలయంలో ఏ దిక్కువైపు వెళితే

ఆ శివలింగం పేరునే స్మరించాలి,*

ఆ అయిదు ముఖాలలో నుండే

సృష్టి, స్థితి, లయ, తిరోదానము, అనుగ్రహము ( మోక్షము ) ఇవ్వబడతాయి,*

మీరు గుడిలోకి వెళ్ళగానే శివలింగం

పశ్చిమంవైపు చూస్తూ ఉంటుంది,*

దానిని సద్యోజాత శివలిగం అని అంటారు,*

అప్పుడు మనం తప్పకుండా అటువంటి శివలింగాన్ని చూసినప్పుడు ......

ఓం సద్యోజాత, ముఖాయ నమః అని అనాలి,

తూర్పువైపుకు చూస్తూ ఉంటే,

అటువంటి శివలింగాన్ని,

తత్పురుష ముఖం అని అంటారు,*

తత్పురుష ముఖం అనేది మనల్ని  

తిరోదానాన్ని చేస్తూ ఉంటుంది,*

ఓం వామ దేవాయ నమః అని అంటే

మనకు 3, ఫలితాలని ఇస్తుంది,


1, మీ దగ్గర ఏదైతే ఉందో,అది మీ చేయి

జారిపోకుండా మీతోనే ఉంచుతాడు,*

2, మనకు ఉత్తరోత్తరాభివృద్దిని

ఆయనే ఇస్తారు,*

3, మనకు ఉన్నదానిని అనుభవించే

ఆరోగ్యం ప్రసాదిస్తాడు,*

అఘోర ముఖమే సమస్త ప్రపంచాన్ని

లయం చేసి మళ్ళీ మనకు

జన్మను ఇస్తూ ఉంటారు,*

మనకు మృత్యువు పట్ల భయం పోగొట్టేది,

మనకు జ్ఞానం ఇచ్చేది ఇదే,*

శివాలయంలో లింగదర్శనం అయ్యాక

ఒకసారి పైకి చూసి

ఓం ఈశాన ముఖాయ నమః అని అనాలి,*

ఈ ఈశాన ముఖమే మనకు మోక్షాన్ని ప్రసాదించేది, ఈ ఈశానముఖం

ఆకాశంకి అధిష్ఠానం అయి ఉంటుంది,*

పురుషులు కేవలం పంచ మాత్రమే ధరించి,

పైన ఉండే ఉత్తరీయంని నడుముకు

కట్టుకొని మాత్రమే ప్రదక్షిణ చేయాలి,*

అలా ఎవరైతే చేస్తారో వారి పట్ల పరమేశ్వరుడు అత్యంత ప్రసన్నమవుతాడు !

🌹🌹🌹 ఓం నమః శివాయ 🌹🌹🌹

కామెంట్‌లు లేవు: