🙏*శుభోదయం*🙏
నేటి సమాజంలో విలువలు తగ్గుతున్నాయనే,
ఆవేదన తరచూ వినిపిస్తుంది!.
కానీ, విలువలు చట్టాలతో నిలబడవు,
శిక్షలతో పెరగవు.
వ్యక్తి అంతర్గతంగా మారినప్పుడే,
సమాజమూ మారుతుంది!.
భయంతో కాక, ఆత్మసాక్షి పిలుపుతో,
మారే మనిషే నిజమైన సంస్కారవంతుడు.
అలాంటి వ్యక్తుల సంఖ్య పెరిగినప్పుడే,
సమాజంలో నమ్మకం, భద్రత,
మానవత్వం నిలుస్తాయి!.
రోజులో కొద్దిసేపైనా నిశ్శబ్దంగా,
మనసులోకి తొంగిచూసుకుంటే!,
మన ఆలోచనలను పరిశీలించుకుంటే!,
ఆ మౌన స్వరం మళ్లీ స్పష్టంగా వినిపిస్తుంది.
అప్పుడు నిర్ణయాలు వివేచనతో వస్తాయి!.
జీవితం భారంగా కాక,
అర్థవంతంగా అనిపిస్తుంది!.
బయట ప్రపంచం ఎంత కల్లోలంగా ఉన్నా,
లోపల ప్రశాంతత ఉంటే,
అదే నిజమైన సంపద!.
నేటి సమాజానికి అత్యవసరమైన,
ఆధ్యాత్మిక స్పృహ ఇదే!.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి