12, ఆగస్టు 2020, బుధవారం

మహిమాన్విత దేవాలయాలు

A) సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు:
1. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం.
2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం.
3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం.
4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం.
5. మొగిలీశ్వర్.
6. కోదండరామ దేవాలయం,  కడప జిల్లా.

B) నిరంతరం జలము ప్రవహించే  దేవాలయాలు:
1. మహానంది
2. జంబుకేశ్వర్
3. బుగ్గరామలింగేశ్వర్
4. కర్ణాటక కమండల గణపతి.
5. హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం.
6. బెంగళూర్ మల్లేశ్వర్
7. రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం
8. సిద్ధగంగా

C) నిరంతరం అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్,  మంజునాథ్.
D) శ్వాస తీసుకునే కాళహస్తీశ్వర్
E) సముద్రమే వెనక్కివెళ్లే గుజరాత్ నిష్కళంక మహాదేవ్,  40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం.
F) ఆడవారి లాగ నెలసరి అయ్యే అస్సాం కామాఖ్యా అమ్మవారు ,  కేరళ దుర్గామాత.
G) ఉత్తరాయణం,  దక్షిణాయనం లో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం.
H) పౌర్ణమికి తెల్లగా,  అమావాస్యకు నల్లగా రంగుమారే తూర్పుగోదావరి పంచారామ సోమేశ్వరాలయం.
I) పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్న గ మారేది ఇక్కడే.
J) నిరంతరం పెరుగుతున్న కాణిపాకం,  యాగంటి బసవన్న,  కాశీ త్రిలబండేశ్వర్,  బెంగుళూరు బసవేశ్వర్
K) సంవత్సరానికి ఒకసారి స్వయంభువుగా వెలిచే అమర్నాధ్.
L) ఆరునెలలకు ఒకసారి తెరిచే బదరీనాథ్,  కేదారనాథ్ (ఆరునెలల తరువాత దీపం వెలుగుతూనే ఉంటుంది)
M) స్వయంగా ప్రసాదం తినే కేరళ శ్రీ కృష్ణ దేవాలయం.
N) యుగాంతానికి గుర్తుగా ఒక స్తంభంతో ఉండే పూణే కేధారేశ్వర్,  ఇక్కడ వేసవి వేడిలో లో నీరు చల్లగా నీరు ఊరుతుంది కూడా.
O) 12 ఏళ్లకు ఒకసారి పిడుగుపడే తిరిగి అతుక్కునే బిజిలి మహాదేవ్,  హిమాచల్ ప్రదేశ్.
P) ఉత్తరఖండ్ రోజులో మూడు రూపాలు మారే దారిదేవి.
Q) సంవత్సరానికి ఒక సారి తెరిచే హాసంబా దేవాలయం,  హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.
R) నీటితో దీపం వెలిగించే ఘడియ ఘాట్ మాతాజీ మందిర్,  మధ్యప్రదేశ్. అమ్మవారు కలలో పంతులకు ఇక నుండి దీపం నీటితో వెలిగించమని చెప్పింది,  అలాగే జరుగుతూ వుంది ఇప్పటికి.
S) మనిషి శరీరం వలె ఉండే హేమాచల నరసింహ స్వామి.
T) మనిషి వలె గుటుకేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామీ.
U) అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునేత్రి.
V) ఛాయా సోమేశ్వరం,  స్థంభం నీడ ఉంటుంది.
W) హంపి విరూపాక్షేశ్వర్,  గోపురం నీడ reverse order లో ఒక చోట పడుతుంది.
X) ఎందరో భక్తులకు దర్శనమిచ్చిన తిరుమల వెంకటేశ్వర స్వామి,  అనంత పద్మనాభ స్వామి,  రామేశ్వర్,  కంచి,  బృహదీశ్వర, చిలుకూరి బాలాజీ,  పండరినాథ్,  భద్రాచలం,  అన్నవరం etc
Y) నీటిలో తేలే విష్ణువు (వేల టన్నుల బరువుంటుంది ),  నేపాల్
Z) పక్షులు ఎగరని పూరి,  సముద్ర ఘోష వినని పూరి,  సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడ పడని పూరి,  దేవునికి సమర్పించగానే ఘుమఘుమలాడే  పూరి ప్రసాదం.

యివి నాకు తెలిసిన కొన్ని మహిమాన్విత దేవాలయాలు మాత్రమే. ఇటువంటివి దేశం లో కొన్ని వేల దేవాలయాలు ఉన్నాయి.

కామెంట్‌లు లేవు: