15, సెప్టెంబర్ 2020, మంగళవారం

శ్రీవారిఆలయంలోమొదలైనబ్రహ్మోత్సవశోభ

#శ్రీవారిఆలయంలోమొదలైనబ్రహ్మోత్సవశోభ

బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవానికి సమయం ఆసన్నమవుతోంది. ఆపదమొక్కుల వాడికి మామూలు రోజుల్లో చేసే అలంకారాన్ని నిత్యకృత్య అలంకారం అని, పండుగ రోజులు, ఉత్సవాల సందర్భంగా చేసే అలంకారాన్ని విశేష అలంకారం అని అంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో, మూలమూర్తి మలయప్పస్వామి వారికి అలంకరించే ఆభరణాలును పరిశుభ్రం చేయడం టీటీడీ ప్రారంభించింది. జ్యువలరీ సెక్షన్ విభాగం ఆద్వర్యంలో శ్రీవారి ఆలయంలో ప్రధానంగా అత్యంత విలువైన ఏడు కిరీటాలు గరుడ సేవకు వినియోగించె సహస్రనామ హారం, లక్ష్మీ హారం, మకరకంఠి, పీతాంబరం, నిత్య కట్ల ఆభరణాలు, మొదలైన విలువైన వజ్రభారణాలను ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలు ముందు ప్రత్యేక నిపుణులతో హెర్బల్ లాంటి కెమికల్ తో శుద్ధి చేసి మెరుగులు దిద్దితారు. మూలవిరాట్టుకు, ఉత్సవ మూర్తులకు వినియోగించే ఆభరణాలు అన్నీ కలిపి తిరుమల వెంకన్నకు 11 టన్నుల స్వర్ణాభరణాలు ఉన్నాయి. శ్రీవేంకటేశ్వరుని ఆభరణాలకు ఎంతో చరిత్ర ఉంది. గత వెయ్యేళ్లలో ఎంతోమంది ప్రభువులు ఎన్నో వెలకట్టలేని ఆభరణాలను సమర్పించారు. స్వామివారి విశిష్టత, తిరుమల వైభవం, ఆభరణాలు గురించి.. ‘తిరుపతి శ్రీ వెంకటేశ్వర’ అనే బుక్‌లో..డా..సాదు సుబ్రమణ్యశాస్త్రిగారు 1921లో పబ్లిష్ చేశారు.

కామెంట్‌లు లేవు: