20, డిసెంబర్ 2020, ఆదివారం

తిరుప్పావై ఆరవపాశురము

 🌹🌷🌺🌸🥀🌾💐

*తిరుప్పావై ఆరవపాశురము వివరణ*


6. పుళ్ళుమ్ శిలుమ్బినకాణ్ పుళ్ళరైయన్ కోయిలిల్ వెళ్లే విళిశజ్లిన్ పేరవమ్ కేట్టిలైయో పిళ్ళాయ్ ! ఎళున్దిరాయ్ పేయ్ ములైనజణు కళ్ళచ్చగడమ్ కలక్కళియక్కాలోచ్చి వెళ్లత్తరవిల్ తుయి లమర్న్ విత్తినై ఉళ్ళత్తు క్కొణ్ణు మునివర గళుమ్ యోగిగళుమ్ మెళ్ల వెళున్దు అరియెన్ద పేరరవమ్

ఉళ్ళమ్ వుగున్దు కుళిర్ద్నేలో రెమ్బావాయ్


ఇచటి నుండి పది పాశురములతో పదిమంది గోపికలను లేపుట చెప్పబడును. ఇచట పదిమంది గోపికలనగా పది ఇంద్రియములు, పదిమంది ఆళ్వారులు గురువాక్య పరంపర కూడా ఈ పది పాశురములచే బోధించబడును


ఈ పాశురమున - భగవదనుభవము క్రొత్తయగుట వలన ఈ వైభవము తెలియని తానొక్కతే తన భవనములో పరుండి వెలికిరాని ఒక ముగ్ధను లేపుచున్నారు. లేపుటకు తెల్లవారవలయును కదా! తెల్లవారుటకు గురుతులు చెప్పుచున్నారు

              M.s.s.k

పక్షులు అరచుచున్నవి. దేవాలయమున శంఖము చేయు పెద్ద ధ్వని విన్నారా లేదా! ఓ పిల్లా! లెమ్ము. పూతన చనుబాల విషమును ఆరగించి కపట శకటాసురుని కాలు చాచి సంహరించి పాలసముద్రముపై చల్లని తెల్లని మెత్తని శేషశయ్యపై పవళించియున్న జగత్కారణ భూతుడగు శ్రీమన్నారాయణుని తన హృదయమున నిలుపుకొని

మెల్లగా లేచిన మునులు.యోగులు 'హరి హరి' యను చేయు పెద్దధ్వని మా హృదయమున చొరబడి చల్లబరిచి మమ్ములను మేల్కొలిపినది. నీవు కూడా లేచి రమ్ము.'


ఇచట పక్షులనగా ఆచార్యులు. పక్షులు రెండు రెక్కలతో ఆకాశమున నెగురునట్లు ఆచార్యుడు జ్ఞానాను స్థానములతో పరమాత్మ యందు విహరించు చుండును శంఖధ్వని యనగా ఓంకార ధ్వని అనగా ' జీవుడు పరమాత్మకు దాసుడు అని, భక్తునకు దాసుడు అని ఇచట పూతన యనగా ప్రకృతి. పూతన స్తనములు అహంకార మమకారములు. విషము శబ్దస్పర్శ రూప రసగంధములను విషయములు. శకటాసురుడనగా సుఖము నంతమొందించు ఈ శరీరము


ఈ పాశురమున ఫెరియాళ్వార్లను మేల్కొలుపు చున్నారు

            M.s.s.k

ఇందులో 'పిళ్ళాయ్' అనికదా సంబోధన. ఇది అజ్ఞానమును సూచించును ఈ అజ్ఞానము జ్ఞాన విపాకము వలన ఏర్పడినది.


పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్' అనికదా శ్రుతివాక్యము. అందులో ఆండాళు తల్లి తమ జనకులను మొదట స్మరించుట ఔచిత్యము కూడా. వల్లభరాయల సభలో వీరి విజయోత్సవమున ఏనుగుపై ఊరేగింపు జరుగుచుండగా శ్రీమన్నారాయణుడు శ్రీ భూనీలా సమేతులై గరుడవాహనారూఢులై వేంచేయగా వారికి మంగళా శాసనము గావించిరి. ఇది ప్రేమదశలో చేయు కార్యము. ప్రేమదశలో జ్ఞానదశ అడుగంటును. ఇట్లు జ్ఞానపరిపాక కార్యమగు అజ్ఞాన కార్యము గావున వీరు 'పిళ్ళాయ్' అగును.


ఇక ఈ పాశురమున గురుపరంపరా వాక్యము 'అస్మద్గురుభ్యోనమః' అనునది. గురువులు కొత్తగా సిద్ధాంత ప్రచారమును ప్రారంభించిన వారగుట వలన 'పిళ్ళాయ్ అనునది సరిపడును.

      

                  M.s.s.k

కామెంట్‌లు లేవు: