శ్రీమద్భగవద్గీత: పదునేడవ అధ్యాయము
శ్రద్ధాత్రయ విభాగయోగము:శ్రీ భగవానువాచ
విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణమ్
శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే (13)
దేవద్విజగురుప్రాజ్ఞపూజనం శౌచమార్జవమ్
బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే (14)
అశాస్త్రీయంగా అన్నదానం, మంత్రాలు, దక్షిణ లేకుండా అశ్రద్ధతో ఆచరించే యజ్ఞాన్ని తామసయజ్ఞమని చెబుతారు
దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానులను పూజించడం, పవిత్రంగా వుండడం. కల్లాకపటం లేకుండా ప్రవర్తించడం, బ్రహ్మచర్యదీక్షనూ, అహింసావ్రతాన్నీ అవలంబించడం –వీటిని శరీరంతో చేసే తపస్సని చెబుతారు.
కృష్ణం వందే జగద్గురుమ్..🙏
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి