27, అక్టోబర్ 2020, మంగళవారం

భజగోవిందం

 **మోహముద్గరః (భజగోవిందం)**


1) 


**భజగోవిందం భజగోవిందం

గోవిందం భజమూఢమతే

సంప్రాప్తే సన్నిహితే కాలే

నహి నహి రక్షతి డుకృఞ్కరణే ||


మరణ విషయంలో సామాన్యునికి జ్ఞానికీ ఉన్న తేడా ?

బాల్యంలో వ్యాకరణ సూత్రాలను వల్లె వేసి, వాటి ద్వారా శాస్త్రాలను అర్థం చేసుకోవాలి. ఆ తరువాత ఆ శాస్త్రాలలో చెప్పబడిన విషయాలను గ్రహించి, వాటిని జీవితంలో ఆచరించి, మానవజీవిత పరమలక్ష్యాన్ని అందుకొనుటకు ప్రయత్నించాలి. భగవత్ సాక్షాత్కారానికి సాధన చేయాలి. కాని ఈ పండితుడు ఇంత వృద్ధాప్యంలో, మరణకాలం సమీపించే ఈ సమయంలో కూడా ఇంకా వ్యాకరణ సూత్రాలను వల్లెవేస్తూ కూర్చున్నాడే! జీవిత సార్థక్యత కొరకు ప్రయత్నించాలనే ధ్యాస లేకుండా ఉన్నాడే! ఏమిటి ఈతని మూర్ఖత్వం? అని శంకరుల ఆవేదన. 

 ఈ పండితుడు ఎలాగైతే మరణకాలం సమీపించినప్పటికీ వ్యాకరణ సూత్రాలను పట్టుకుకూర్చున్నాడో అలాగే సాధారణ మానవులంతా ధనసంపాదన, వస్తుసంపాదన, భోగాలను అనుభవించటం అనే లౌకిక విషయాలలోనే మునిగి తేలుతున్నారు. ఇలా పుట్టిన దగ్గర నుండి చచ్చేదాకా ఈ ప్రాపంచిక విషయాలలోను, భోగాలలోను మునిగిపోతే ఈ జీవితాన్ని సార్థకం చేసుకొనేందుకు ప్రయత్నించేదెప్పుడు?

  మానవుడు ఈ ప్రపంచంలోకి వచ్చి పడిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోవాల్సిందే. వచ్చేటప్పుడు వట్టి చేతులతోనే వస్తాడు. వెళ్ళేటప్పుడు వట్టి చేతులతోనే వెళ్ళిపోతాడు. తాను సంపాదించిన ఇళ్ళూ వాకిళ్ళు, ధనసంపదలు అన్నీ ఇక్కడ వదిలిపెట్టి, ఇవి సంపాదించుటకు చేసిన కర్మల యొక్క ఫలాలను నెత్తిన బెట్టుకొని ఈ దేహాన్ని వదలి జీవుడు ఒంటరి ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణంలో తనకు సహకరించే వాటిని ఇప్పుడే - ఈ జీవితం ఉండగానే సంపాదించుకోవద్దా! దేహేంద్రియాలు, మనోబుద్ధులు చక్కగా పనిచేసున్నప్పుడే జన్మ సార్థక్యానికి ప్రయత్నించవద్దా!

 అందుకే ఇక్కడ హెచ్చరిక. నీ మరణకాలం సమీపించినప్పుడు ఈ ‘డుకృణ్ కరణే’ నిన్ను రక్షించదు - అని. అంటే ఈ లౌకిక విషయ భోగాలు, ప్రాపంచిక వస్తువులు, ధనసంపదలు - ఇవేవీ నిన్ను మృత్యువు నుండి రక్షించలేవు అని. 

 అయితే *ఈ ధనసంపదలు, ప్రాపంచిక వస్తువులు ఏవీ అక్కరలేదా! అంటే అవసరమే, వాటిని సంపాదించుకోవాలి. ఉపయోగించుకోవాలి. ఈ దేహాన్ని, కుటుంబాన్ని పోషించుకోవాలి. అంతవరకే వాటి అవసరం. కాని అదే వ్యామోహంలో పడిపోయి నీ జీవితపరమలక్ష్యాన్ని మరచిపోకూడదు. వాటన్నింటిని ఉపయోగించుకుంటూ మానవుడుగా నీవెందుకు జన్మించావో ఆ పరమార్థాన్ని సాధించుకోవాలి. అంతేగాని వాటినే పట్టుకు కూర్చోరాదు.

 మనం నదిని దాటి ప్రక్క గ్రామానికి వెళ్ళాలంటే పడవ కావాలి. పడవనెక్కి ప్రయాణం చేస్తున్న మనం ఆ పడవ మీద వ్యామోహంతో అందులోనే కూర్చుని అదే పనిగా నదిలోనే తిరుగుతుంటే మనం చేరుకోవలసిన గమ్యస్థానాన్ని చేరుకోలేం. ఎప్పుడో ఆ పడవ మునిగిపోతుంది. దానితో మన ప్రాణాలు ఎగిరిపోతాయి.

  కనుక నీవెవరో; ఎక్కడి నుండి వచ్చావో తెలుసుకొని, ఈ కష్టాలు, బాధలు, వ్యధలు మొదలైన వాటితో కూడిన ఈ జీవితాన్ని ఏ మార్గంలో మళ్ళించి, వాటి నుండి విముక్తి చెందాలో - నీవు ఎక్కడికి ప్రయాణించాలో తెలుసుకొని నీగమ్యస్థానమైన సచ్చిదానంద స్వరూప పరమాత్మను చేరుకోవాలి. శాశ్వతానందంలో ఉండిపోవాలి. 

 మరి అలాంటి వారికి మృత్యువు రాదా? - అంటే అందరికీ వస్తుంది. సామాన్యులూ మరణిస్తారు. జ్ఞానీ మరణిస్తాడు. సామాన్యులు మరణించి, మళ్ళీ మళ్ళీ జన్మలను తెచ్చుకుంటారు. ఈ జన్మలో ఎంతో కష్టపడి సంపాదించుకొన్న వాటిని అన్నింటిని వదలిపెట్టి; దీనుడిలా, హీనుడిలా, దిక్కులేని వాడిలా ఒంటరి ప్రయాణంచేసి, తన కర్మఫలాలకు - వాసనలకు అనుగుణంగా మరొక శరీరాన్ని ధరించి వస్తాడు. మళ్ళీ ఈ జన్మలోను అదే పని. ఇలా పుడుతూ చస్తూ జన్మలకు జన్మలెత్తుతూ ఉంటాడు. ఇదే మృత్యువు అంటే. మృత్యువుతో నాశనాన్ని తెచ్చుకుంటున్నాడు సామాన్యుడు.

  మరి మహాత్ముడో!

 అనేక జన్మలలో తాను సంపాదించిన సంపదలు గాని, తన వారనుకున్న వ్యక్తులు గాని తనకిప్పుడు లేరని, అలాగే ఇప్పుడున్న సంపదలు గాని, వ్యక్తులు గాని ఇక ముందు జన్మలలో తనవి కావని తెలుసుకొని, వాటిపై గల మమకారాన్ని విడిచిపెట్టి, తాను పరమాత్మ స్వరూపుడనని, ఆ పరమాత్మకు దూరమై జీవుడిగా బాధలు, దుఃఖాలు అనుభవిస్తున్నానని, ఈ బాధలు తొలగాలంటే మళ్ళీ ఆ పరమాత్మను చేరుకోవటమే తన పవిత్ర కర్తవ్యమని తెలుసుకొన్నవాడు; అలా చేరుకొనుటకు కావలసిన జ్ఞానాన్ని శాస్త్రాల ద్వారా, సద్గురువుల ద్వారా పొంది, జీవితంలో ఆచరించి, జ్ఞానియై ఈ జీవభావాన్ని విడిచిపెట్టి; పరమాత్మ భావంలో, పరమానంద స్థితిలో నిల్చి శరీరాన్ని వదలి వేస్తాడు. ఇదీ మృత్యువే. కాని మృత్యువుతో ఆనందాన్ని పొందుతున్నాడు మహాత్ముడు లేదా జ్ఞాని.

 కనుక నిరంతరము లౌకిక విషయాలలో మునిగిపోయినవాడు మళ్ళీ మళ్ళీ జన్మలను తెచ్చుకొని దుఃఖాల పాలౌతున్నాడు. అలాగాక లౌకికవిషయాలను తృణప్రాయంగా త్యజించగల మహాత్ముడు జీవిత పరమార్థాన్ని తెలుసుకొని ఆచరించి, జన్మరాహిత్యాన్ని పొంది శాశ్వత ఆనందంలో ఉండిపోతున్నాడు. ఇదే మృత్యువు నుండి రక్షించబడటం అంటే. 

🙏🙏

🙏🙏🙏**మోహముద్గరః (భజగోవిందం)**


1) 


**భజగోవిందం భజగోవిందం

గోవిందం భజమూఢమతే

సంప్రాప్తే సన్నిహితే కాలే

నహి నహి రక్షతి డుకృఞ్కరణే ||


మరణ విషయంలో సామాన్యునికి జ్ఞానికీ ఉన్న తేడా ?

బాల్యంలో వ్యాకరణ సూత్రాలను వల్లె వేసి, వాటి ద్వారా శాస్త్రాలను అర్థం చేసుకోవాలి. ఆ తరువాత ఆ శాస్త్రాలలో చెప్పబడిన విషయాలను గ్రహించి, వాటిని జీవితంలో ఆచరించి, మానవజీవిత పరమలక్ష్యాన్ని అందుకొనుటకు ప్రయత్నించాలి. భగవత్ సాక్షాత్కారానికి సాధన చేయాలి. కాని ఈ పండితుడు ఇంత వృద్ధాప్యంలో, మరణకాలం సమీపించే ఈ సమయంలో కూడా ఇంకా వ్యాకరణ సూత్రాలను వల్లెవేస్తూ కూర్చున్నాడే! జీవిత సార్థక్యత కొరకు ప్రయత్నించాలనే ధ్యాస లేకుండా ఉన్నాడే! ఏమిటి ఈతని మూర్ఖత్వం? అని శంకరుల ఆవేదన. 

 ఈ పండితుడు ఎలాగైతే మరణకాలం సమీపించినప్పటికీ వ్యాకరణ సూత్రాలను పట్టుకుకూర్చున్నాడో అలాగే సాధారణ మానవులంతా ధనసంపాదన, వస్తుసంపాదన, భోగాలను అనుభవించటం అనే లౌకిక విషయాలలోనే మునిగి తేలుతున్నారు. ఇలా పుట్టిన దగ్గర నుండి చచ్చేదాకా ఈ ప్రాపంచిక విషయాలలోను, భోగాలలోను మునిగిపోతే ఈ జీవితాన్ని సార్థకం చేసుకొనేందుకు ప్రయత్నించేదెప్పుడు?

  మానవుడు ఈ ప్రపంచంలోకి వచ్చి పడిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోవాల్సిందే. వచ్చేటప్పుడు వట్టి చేతులతోనే వస్తాడు. వెళ్ళేటప్పుడు వట్టి చేతులతోనే వెళ్ళిపోతాడు. తాను సంపాదించిన ఇళ్ళూ వాకిళ్ళు, ధనసంపదలు అన్నీ ఇక్కడ వదిలిపెట్టి, ఇవి సంపాదించుటకు చేసిన కర్మల యొక్క ఫలాలను నెత్తిన బెట్టుకొని ఈ దేహాన్ని వదలి జీవుడు ఒంటరి ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణంలో తనకు సహకరించే వాటిని ఇప్పుడే - ఈ జీవితం ఉండగానే సంపాదించుకోవద్దా! దేహేంద్రియాలు, మనోబుద్ధులు చక్కగా పనిచేసున్నప్పుడే జన్మ సార్థక్యానికి ప్రయత్నించవద్దా!

 అందుకే ఇక్కడ హెచ్చరిక. నీ మరణకాలం సమీపించినప్పుడు ఈ ‘డుకృణ్ కరణే’ నిన్ను రక్షించదు - అని. అంటే ఈ లౌకిక విషయ భోగాలు, ప్రాపంచిక వస్తువులు, ధనసంపదలు - ఇవేవీ నిన్ను మృత్యువు నుండి రక్షించలేవు అని. 

 అయితే *ఈ ధనసంపదలు, ప్రాపంచిక వస్తువులు ఏవీ అక్కరలేదా! అంటే అవసరమే, వాటిని సంపాదించుకోవాలి. ఉపయోగించుకోవాలి. ఈ దేహాన్ని, కుటుంబాన్ని పోషించుకోవాలి. అంతవరకే వాటి అవసరం. కాని అదే వ్యామోహంలో పడిపోయి నీ జీవితపరమలక్ష్యాన్ని మరచిపోకూడదు. వాటన్నింటిని ఉపయోగించుకుంటూ మానవుడుగా నీవెందుకు జన్మించావో ఆ పరమార్థాన్ని సాధించుకోవాలి. అంతేగాని వాటినే పట్టుకు కూర్చోరాదు.

 మనం నదిని దాటి ప్రక్క గ్రామానికి వెళ్ళాలంటే పడవ కావాలి. పడవనెక్కి ప్రయాణం చేస్తున్న మనం ఆ పడవ మీద వ్యామోహంతో అందులోనే కూర్చుని అదే పనిగా నదిలోనే తిరుగుతుంటే మనం చేరుకోవలసిన గమ్యస్థానాన్ని చేరుకోలేం. ఎప్పుడో ఆ పడవ మునిగిపోతుంది. దానితో మన ప్రాణాలు ఎగిరిపోతాయి.

  కనుక నీవెవరో; ఎక్కడి నుండి వచ్చావో తెలుసుకొని, ఈ కష్టాలు, బాధలు, వ్యధలు మొదలైన వాటితో కూడిన ఈ జీవితాన్ని ఏ మార్గంలో మళ్ళించి, వాటి నుండి విముక్తి చెందాలో - నీవు ఎక్కడికి ప్రయాణించాలో తెలుసుకొని నీగమ్యస్థానమైన సచ్చిదానంద స్వరూప పరమాత్మను చేరుకోవాలి. శాశ్వతానందంలో ఉండిపోవాలి. 

 మరి అలాంటి వారికి మృత్యువు రాదా? - అంటే అందరికీ వస్తుంది. సామాన్యులూ మరణిస్తారు. జ్ఞానీ మరణిస్తాడు. సామాన్యులు మరణించి, మళ్ళీ మళ్ళీ జన్మలను తెచ్చుకుంటారు. ఈ జన్మలో ఎంతో కష్టపడి సంపాదించుకొన్న వాటిని అన్నింటిని వదలిపెట్టి; దీనుడిలా, హీనుడిలా, దిక్కులేని వాడిలా ఒంటరి ప్రయాణంచేసి, తన కర్మఫలాలకు - వాసనలకు అనుగుణంగా మరొక శరీరాన్ని ధరించి వస్తాడు. మళ్ళీ ఈ జన్మలోను అదే పని. ఇలా పుడుతూ చస్తూ జన్మలకు జన్మలెత్తుతూ ఉంటాడు. ఇదే మృత్యువు అంటే. మృత్యువుతో నాశనాన్ని తెచ్చుకుంటున్నాడు సామాన్యుడు.

  మరి మహాత్ముడో!

 అనేక జన్మలలో తాను సంపాదించిన సంపదలు గాని, తన వారనుకున్న వ్యక్తులు గాని తనకిప్పుడు లేరని, అలాగే ఇప్పుడున్న సంపదలు గాని, వ్యక్తులు గాని ఇక ముందు జన్మలలో తనవి కావని తెలుసుకొని, వాటిపై గల మమకారాన్ని విడిచిపెట్టి, తాను పరమాత్మ స్వరూపుడనని, ఆ పరమాత్మకు దూరమై జీవుడిగా బాధలు, దుఃఖాలు అనుభవిస్తున్నానని, ఈ బాధలు తొలగాలంటే మళ్ళీ ఆ పరమాత్మను చేరుకోవటమే తన పవిత్ర కర్తవ్యమని తెలుసుకొన్నవాడు; అలా చేరుకొనుటకు కావలసిన జ్ఞానాన్ని శాస్త్రాల ద్వారా, సద్గురువుల ద్వారా పొంది, జీవితంలో ఆచరించి, జ్ఞానియై ఈ జీవభావాన్ని విడిచిపెట్టి; పరమాత్మ భావంలో, పరమానంద స్థితిలో నిల్చి శరీరాన్ని వదలి వేస్తాడు. ఇదీ మృత్యువే. కాని మృత్యువుతో ఆనందాన్ని పొందుతున్నాడు మహాత్ముడు లేదా జ్ఞాని.

 కనుక నిరంతరము లౌకిక విషయాలలో మునిగిపోయినవాడు మళ్ళీ మళ్ళీ జన్మలను తెచ్చుకొని దుఃఖాల పాలౌతున్నాడు. అలాగాక లౌకికవిషయాలను తృణప్రాయంగా త్యజించగల మహాత్ముడు జీవిత పరమార్థాన్ని తెలుసుకొని ఆచరించి, జన్మరాహిత్యాన్ని పొంది శాశ్వత ఆనందంలో ఉండిపోతున్నాడు. ఇదే మృత్యువు నుండి రక్షించబడటం అంటే. 

🙏🙏

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: