27, అక్టోబర్ 2020, మంగళవారం

చతుర్దశ భువనాలు


చతుర్దశ భువనాలు : మన పురాణాల్లో చతుర్దశ భువనాల ( 14 లోకాల ) ప్రస్తావన ఉంది . పురాణాలు బ్రహ్మాండాన్ని కొన్ని లోకాలుగా విభజించాయి . ఇవన్నీ విరాట్ పురుషుని ( విశ్వరూపుని ) శరీరంలోని అవయవాలని వేదం చెప్తోంది . భాగవతం రెండవ స్కంధంలో ఈ లోకాల గురించి వర్ణన ఉంది . మొత్తం పదునాలుగు లోకాలనీ , వాటిలో ఊర్ధ్వలోకాలు ( పైనున్నవి ) ఏడు , అధోలోకాలు ( క్రిందనున్నవి ) ఏడు అనీ చెబుతుంది భాగవత పురాణం . లోకాల విభజన గురించి భాగవతంలో ఇలా చెప్పబడింది . బ్రహ్మాండంలో కొన్ని అంతరాలున్నాయి . తత్వ పదార్ధాల సూక్ష్మ సూక్ష్మతర అవస్థలను బట్టి ఈ భేదాలు ఏర్పడుతున్నాయి . క్రింది లోకాల కంటే పై లోకాలలో తత్వ పదార్ధాలు సూక్ష్మతరంగా ఉంటాయి . లోకాలు మూడని కొందరు , ఏడని కొందరు , పదునాల్గని కొందరు అంటుంటారు . లోకాలను బ్రహ్మాండ శరీరానికి అవయవాలుగా భావిస్తే మొదటి భావన ప్రకారం విరాట్ పురుషుని కటి ( మొల ) నుండి పైభాగం ఏడు అవయవాలుగా , క్రింది భాగం ఏడు అవయవాలుగా మొత్తం పదునాల్గులోకాలు . రెండవ భావన ప్రకారం భూలోకం పాదాలు , భువర్లోకం నాభి , సువర్లోకం హృదయం , మహర్లోకం ఉరోభాగం , జనలోకం కంఠం , తపోలోకం పెదవులు , బ్రహ్మలోకం మూర్ఖంగా బ్రహ్మాండ శరీరానికి అవయవాలు రూపొందాయి . మూడవ భావన ప్రకారం భూలోకం పాదాలు , భువర్లోకం నాభి , స్వర్లోకం శిరస్సుగా మూడే లోకాలు ఉన్నాయి . బ్రహ్మాండపురుషుడే సమస్త లోకాలను భరిస్తాడు , పోషిస్తాడు , తనలో లయం చేసుకొంటాడు . ఊర్ధ్వలోకాలు : భూలోకం - సముద్రాలు , పర్వతాలు , నదీనదలాతో మానవులు , పక్షులు , జంతువులు మొదలైన జీవులతో సూర్యచంద్రుల: 

ఊర్ధ్వలోకాలు : భూలోకం - సముద్రాలు , పర్వతాలు , నదీనదలాతో మానవులు , పక్షులు , జంతువులు మొదలైన జీవులతో సూర్యచంద్రుల కిరాణలతో వెలిగే లోకం . ఎందరో జీవులు నివసిస్తున్న కొన్ని కోట్ల లోకాల్లో ఈ భూలోకం ఒకటి మాత్రమేనని , ఇంకా ఇలాంటి తెలియని లోకాలు ఎన్నో ఉన్నాయని విష్ణుపురాణం చెబుతోంది . భువర్లోకం - భూలోకానికి పైన ఉండేది , సామాన్య మానవుడు వెళ్ళలేనిది . ఇక్కడ సిద్ధులు మొదలైన ఇతరలోక జీవులు నివసిస్తారు . భూలోకం ఎంత వైశాల్యం ఉంటుందో , ఇది అంతే వైశాల్యం ఉంటుంది . పితృదేవతలు కూడా ఈ లోకంలోనే ఉంటారని కొన్ని గ్రంథాల్లో కనిపిస్తుంది . సువర్లోకం - భువర్లోకానికి పైన ఉండేది . ఇంద్రుడు మొదలైన దేవతలుండే లోకం . దీనినే స్వర్గం అని కూడా అంటారు . మహర్లోకం - సువర్లోకానికి పైన ఉండేది . మహాత్ములైన ఋషులు , మునులు నివసించే లోకం . ఈ లోక వాసులు బ్రహ్మ కల్పానికి సమానమైన జీవిత కాలం కలిగి ఉంటారు . జనలోకం - మహర్లోలోకానికి పైన ఉండేది . బ్రహ్మ మానస పుత్రులైన సనక , సనందన , సనత్కుమార , సనత్సుజాతాలు , శుద్ధమనస్కులైన ఇతర జీవులు ఉండే లోకం . తపోలోకం - జనలోకానికి పైన ఉండేది . నిప్పు చేత కూడా దహించబడిన వైబ్రౌజులు , అయోనిజులు ఉండే లోకం . సత్యలోకం - తపోలోకానికి పైన ఉండేది . బ్రహ్మదేవుడు నివసించే లోకం . కొన్ని గ్రంథాల ప్రకారం ఇదే పరమపదము . కానీ కొన్ని గ్రంథాల ప్రకారం దీనికి పైన వైకుంఠం ఉంటుందని వర్ణించబడింది . భోగబుద్ధితో కాక త్యాగబుద్ధితో జీవించి , కర్మలను భగవంతునికి అర్పించిన మహాపురుషులు , సాధకులు , అంతిమకాలంలో ఈ లోకానికి వెళ్ళి , ఇక్కడున్న బ్రహ్మదేవుని నుంచి ఆత్మజ్ఞానం పొంది , పరబ్రహ్మంలో ఐక్యమవుతారని " కైవల్యోపనిషత్తు " మొదలనవి చెప్తున్నాయి .

కామెంట్‌లు లేవు: