27, అక్టోబర్ 2020, మంగళవారం

దుఃఖం లో ఉండి ఏడుస్తున్నారు

 🍁ఒకరోజు బుద్ధుడి శిష్య బృందం  లోని  ఒక శిస్యుడు బిక్షటనకు వెళ్లొచ్చి ఎంతో జిజ్ఞాసతో  బుద్ధుడి ని  ఇలా ప్రశ్నిస్తాడు 🔥


🌷 *ఎంతో నిరుత్సాహంతో* గురువు గారు   ప్రపంచం లోని  జనులందరు  దుఃఖం  లో ఉండి ఏడుస్తున్నారు  కదా  మరి  వారిపై ఆ భగవంతునికి  కరుణ రావడం లేదు ఎందుకు 

తమకు ఈ విషయం తెలిసినా తమరు

ఇంత ప్రశాంతంగా ఎలా ఉండ గలుగుతున్నారు అని ప్రశ్నిస్తాడు🍁


 *🌺దానికి బుద్దుడు ఇలా సమాధాన మిస్తాడు* ఎవరన్నారు బాధలో ఉన్న వారిపై ఆ పరమాత్ముడు కరుణ చుపట్లేదని ఎవరైతే బాధలు అనుభవిస్తున్నారు అని నువ్వు అంటున్నావో వారిపై ఆ పరమాత్ముడు అనంతమైన ప్రేమను కరుణను ఎల్లవేళలా 

చూపిస్తూనే ఉన్నాడు ఆ పరమాత్ము డే కనుక కరుణను

చూపక పోతే ఈ భూమి మీద ఎవరు ఉండేవారు కాదు🌸


🍁అప్పుడు శిష్యుడు అది ఎలాగో కొంచం వివరించ గలరా అని ఎంతో కుతూహలం తో అడుగుతాడు🍁


 *🌹అప్పుడు బుద్దుడు ఇలా అంటాడు*

ఈ సకల సృష్టి అంతకుడా కర్మ సిద్ధాంతం తో సాగుతోంది 


ఈ సిద్ధాంతం ప్రకారం తప్పు తెలిసి చేసిన తెలియక చేసిన 

దాని పర్యవసానం కొంతైనా 

అనుభవించక తప్పదు


  ఈ కష్టాలను అనుభవిస్తున్న వారందరు కూడ తెలియని 

అజ్ఞానంతో కొని తెచ్చు కున్నవే


ఈ విషయం తెలిసే ఆ పరమాత్మ వారిపై అనంతమైన కరుణ వర్షాన్ని కురిపిస్తున్నాడు


మనిషి కి వచ్చిన  కష్టాలను తట్టుకొని ఉండాలంటే మనిషి శరీరం తట్టుకొని ఉండలేదు ఆ వచ్చిన కష్టం తో హృదయం బద్దలై పోతుంది


అందుకే ఆ పరమాత్ముడు మనిషికి దుఃఖం అనే ప్రక్రియను ఇచ్చి ఆ ప్రక్రియ ద్వారా కన్నీటిని బయటకు తెప్పించి హృదయాన్ని తేలిక పరుస్తున్నాడు


ఎప్పుడైతే  హృదయం తేలిక పడుతుందో అప్పుడు గడిచిన కాలాన్ని మరిచి పోయి మళ్లీ

ముందుకు సాగిపో గలుగుతా  డు అని ఆ శిష్యునికి

 *బుద్దుడు ఆ పరమాత్మ కరుణను* వివరించాడు

🍁🌹🌸🌺🌷💐

కామెంట్‌లు లేవు: