27, అక్టోబర్ 2020, మంగళవారం

ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటాడు

 *🌺🙏ఓం నమో భగవతే వాసుదేవావ


*_🌴ఈ లోకంలో ప్రతి వాడు తాను ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటాడు. మంచిదే. కానీ దానికి తగ్గ ప్రయత్నము, సాధన మాత్రం చేయడం లేదు. మనకు ఉన్న దుఃఖములు పోవాలన్నా, మోక్షం పొందాలన్నా, జనన మరణ చక్రము నుండి తప్పుకోవాలన్నా, ముందు మన కృషి, ప్రయత్నము ఉండాలి. "నారు పోసిన వాడు నీరు పోయకపోతాడడా! ఎలా జరగాలంటే అలా జరుగుతుంది!. మనం ఏ చేసి లాభం లేదు! అంతా దేవుడి దయ ఎలా రాసి పెడితే అలా జరుగుతుంది!. శివుడి ఆజ్ఞలేనిదే చీమ అయినా కుట్టదు!" ఇటువంటి శుష్క వేదాంతం వల్లిస్తూ సోమరితనంతో ఉంటూ కనీస ప్రయత్నం మానేసి,ఏ సాధనలూ చేయకుండా ఉంటే ఏం పురోగతి సాధిస్తాం?. దేనికైనా మానవ ప్రయత్నం ముఖ్యం. మన కర్తవ్యం మనం నెరవేరిస్తే, భగవంతుడు మనకు తన వంతు సాయం అందిస్తాడు. ఈ సముద్రం దాటడం నావల్ల కాదని హనుమంతుడు చేతులు ముడుచుకొని కూర్చుంటే సీతాన్వేషణ సాధ్యం అయ్యేదా? కష్టపడితేనే కదా ఫలితం దక్కుతుంది. మన వంతు ప్రయత్నం చేయాలి. తగిన సాధన చేయాలి. అపుడే దైవానుగ్రహము తోడౌతుంది.🌴_*

కామెంట్‌లు లేవు: