31, మే 2025, శనివారం

నౌకాగ్ర కాకవత'

 నౌకాగ్ర కాకవత'




కాకులకు గల సహజ గుణం ఒకచోట వాలి కొంతసమయం ఉండి మరల లేచి ఇంకొక చోటికి వెళ్ళుతాయి. అంటే ఒకచోట స్థిరంగా వుండవు. అలాగే ఒక కాకి ఒక నౌకమీద అంటే నౌకమీద వుండే స్తంభం మీద వాలిందట కొంతసమయం అది అక్కడ వున్నది. కానీ కాకికి తెలియకుండా ఒక సంఘటన జరిగింది అదేమిటంటే ఆ నౌకని నడిపే నావికుడు అతివేగంగే నౌకను సముద్రంలోకి తీసుకొని వెళ్ళాడు. ఈ విషయం తెలియని కాకి తన స్వభావానుసారం నౌక స్తంభం మీదినుంచి లేచి ఇంకొక చోటికి వెళ్ళటానికి యెగిరి వెళ్ళింది. కానీ దానికి ఆ స్తంభం తప్పించి ఆ పరిసరాలలో ఎత్తయిన ప్రదేశం అంటే భవంతులు కానీ, చెట్లు కానీ ఏవి కనుచూపు మేరలో కనిపించలేదు. అంతే కాదు చుట్టూ లోతయిన సముద్రం. పొరపాటున సముద్రంలో పడితే అంతం తప్పదు. కొంచం సేపు గాలిలో యెగిరి మరలా ఆ నౌక స్తంభంమీదనే వాలింది. కొద్దిసేపయినా తరువాత తన సహజ స్వభావంతో మరల గాలిలో యెగిరి అంతటా తిరిగి చూసింది కానీ పరిస్థితి అట్లానే వున్నది. అలాగ మరలా మరలా తిరిగి తిరిగి చివరకు తెలుసుకున్నది తనకు ఆ నౌక స్తంభం తప్ప వేరే ఆధారం లేదని. కానీ ఈ విషయం తెలుసుకోవటానికి ఆ కాకి చాలాసార్లు ఆ నౌక స్తంభం మీది నుంచి లేచి గాలిలో ఎన్నో సార్లు తిరిగిన తరువాత కానీ తనకు ఆ నౌక స్తంభం తప్ప వేరే గతి లేదని తెలుసుకోగలిగింది. కాబట్టి 




సాధక మన మనస్సు కూడా ఆ కాకి లాంటిదే ఎప్పుడు ఒక చోట నిలువదు ఒకచోటి నుండి ఇంకొక చోటికి అంటే ఒక విషయం మీదనుండి ఇంకొక విషయం మీదకు వెళుతూ ఉండటం దాని సహజ లక్షణం. ఆ లక్షణాన్ని వదిలి దానికి భగవంతుడు తప్ప ఇతర విషయాలు లేవనేవిధంగా సాధకుడు సద దైవ జ్యానంలో ఉండాలి ఎలాగంటే కాకికి ఒక్క నౌక స్తంభం తప్ప ఇంకొకటి కనపడనట్లు సాధకుని మనస్సుకు భగవంతుడు తప్ప ఇంకొక విషయం లేదు అనే విధంగా సాధకుడు ప్రవర్తిస్తే సాధకుని మనస్సు సదా భగవంతుని మీదనే ఉంటుంది. కాకపొతే ఇది చెప్పినంత సులువు కానే కాదు. అతి కఠోరమైన, నిరంతమైన కఠోర తప్పస్సు చేస్తేనే అది సాధ్యం. నేను ఆలా చేయగలనా అనే సందేహం ప్రతి సాధకునికి కలుగుతుంది. కానీ మిత్రమా నిత్య దీక్షాపరుడైన సాధకుడు తప్పకుండా సాధించగలడు. అరిషడ్వార్గాలను వదిలి ఇప్పుడే సాధన మొదలు పెట్టు తప్పకుండా నీ లక్ష్యం నెరవేరుతుంది. ఎందుకంటె సదా సర్వేశ్వరుడు సాధకునితోటె ఉంటాడు.  




ఓం తత్సత్ 




ఓం శాంతి శాంతి శాంతిః

విశ్వేశ్వరా

 శు భో ద యం🙏


                  విశ్వేశ్వరా!!


శా.

నీ విన్నాణము చిత్రమే, మకుటరత్నీభూతజైవాతృకా!/

గ్రైవేయీకృతకాద్రవేయ! గళరుద్రాక్షీభవద్బాడబా!/

సేవాస్వీకృత భూత రాక్షస పిశాచీప్రేత! నేత్ర ప్రభా/

శ్రీవిన్యస్త కృశాను! పార్వతమృగాక్షీదార! విశ్వేశ్వరా!

23

     -కవిసామ్రాట్. విశ్వనాధసత్యనారాయణ.


        మనం నేడు విశ్వనాధ వారి విశ్వేశ్వర శతకంలోని ఈపద్యం పరిశీలిద్దాం

       చిత్రవిచిత్రమైన ఊహలకు వ్యంగ్య

మర్యాదలకు ఆటపట్టైన శతక మిది.

విశ్వప్రతిభకు ముకురాయమానం.

          

               "కిరీటంలో తురాయిగా చంద్రుని అలంకరించుకోవటం.కంఠ హారంగా వాసుకిని అలంకరించుకోవటం,

మెడలో రుద్రాక్షగా గరళాన్ని నిలుపుకోవటం, సేవక సముదాయంగా

భూతప్రేత పిశాచములను నియమించటం, తృతీయ నేత్రంగా ఫాలభాగాన అగ్నినిధరించటం, కోయపిల్ల పార్వతిని భార్యగా స్వీకరించటం, ఏవిటయ్యా?ఈతిక్కపనులు?

        అంటూ హేళన జోడించి వ్యంగ్యంగా విశ్వరుని మహిమలను నుతించటం ,విశ్వనాధకుదక్క ,మరెవరికి సాధ్యం?

    మహాకవీ! నీకూ, నీప్రతిభకూ,

శత సహస్ర వందనాలు!!


                       స్వస్తి !!🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

గమ్మత్తైన_పద్యం

 #గమ్మత్తైన_పద్యం🌹

💥💥💥

పూర్వం ఒక రామ భక్తుడు.... రాముడంటే వల్లమాలిన ప్రేమ. శివుడి పేరు ఎత్తడు.

ఒకసారి ఓ పండితుడి దగ్గరికి వెళ్లి "రోజూ చదువుకునేలా విష్ణువును గూర్చి ఒక శ్లోకం వ్రాసి ఇవ్వండి" అన్నాడు.

ఆ పెద్దాయనకీ తెలుసు ... ఇతడికి శివుడు అంటే పడదని. సరే ఒక కాగితం మీద మంచి శ్లోకం ఒకటి వ్రాసి ఇచ్చాడు.

"విష్ణువుని స్తుతిస్తూ వ్రాసాను. మీ విష్ణువు సంతోషిస్తాడు. చదువుకో" అంటూ.

❤️గవీశపాత్రో నగజార్తిహారీ

కుమారతాతః శశిఖండమౌళిః।

లంకేశ సంపూజితపాదపద్మః

పాయాదనాదిః పరమేశ్వరో నః॥

 ఆశ్చర్య పోయాడు చదవగానే.

అందులో ఏమని చెప్పబడింది? పరమేశ్వరః నః పాయాత్ అని. 

అంటే పరమేశ్వరుడు మనలను కాపాడు గాక అని అర్ధం . తక్కిన పదాలన్నీ ఆ పరమేశ్వరునికి విశేషణాలు. అర్ధం చూడండి...

♦️గవీశపాత్రః ... గవాం ఈశః గవీశః .... ఆవులకు ప్రభువు అయిన వృషభం. అది వాహనం గా కలవాడు గవీశపాత్రః. అంటే సదాశివుడు.

నగజార్తి హారీ ... నగజ అంటే పార్వతీ దేవి ... ఆవిడ ఆర్తిని పోగొట్టిన వాడూ ... అంటే సాంబశివుడే.

కుమారతాతః .... తాతః అనే సంస్కృత పదానికి తండ్రి అని అర్థం ... కుమారస్వామి యొక్క తండ్రి అయినవాడు శివుడే నిస్సందేహంగా.

శశిఖండ మౌళి: ... అంటే చంద్రవంక శిరసున ధరించిన వాడూ.

లంకేశ సంపూజిత పాద పద్మ: ... లంకాధిపతి అయిన రావణునిచే పూజింపబడిన పాదపద్మములు కలవాడూ.

అనాదిః ... ఆది లేని వాడూ ... అంటే ఆదిమధ్యాన్తరహితుడు అయినవాడూ,

అటువంటి పరమేశ్వరః నః పాయాత్ .... వృషభ వాహనుడూ, పార్వతీ పతి, కుమార స్వామి తండ్రీ, చంద్రశేఖరుడూ, రావణునిచే సేవింప బడిన వాడూ అనాది అయిన పరమేశ్వరుడు మనలను కాచు గాక అనేది తాత్పర్యం.

♦️అర్ధం తెలియగానే మతి పోయింది. వ్రాసిన వాని మీద పిచ్చ కోపం వచ్చింది. అది పట్టుకుని తెగ తిరిగాడు.

చివరికి ఒకాయన "అది విష్ణువుని కీర్తించేదే ... ఏమీ అనుమానం లేదు" అని అతడిని ఓదార్చాడు.

ఇది మరో ఆశ్చర్యం.

అనాది అనే మాటలో ఉంది అంతా. కిటుకు చూడండి ....

పరమేశ్వరుడు ఎలాటివాడూ అంటే అనాదిః అట. అంటే ఆది లేని వాడు. అంటే పరమేశ్వరలో ఆది అక్షరం లేనివాడు.

ఇప్పుడు ఏమయ్యింది? రమేశ్వరః అయ్యింది. అంటే లక్ష్మీపతి అయిన విష్ణువే కదా!

గవీశపాత్రః ... లో గ తీసెయ్యండి .. వీశపాత్రః అవుతుంది. విః అంటే పక్షి అని అర్ధం. వీనామ్ ఈశః వీశః ... పక్షులకు రాజు అంటే గరుడుడు, ఏతా వాతా గరుడ వాహనుడైన విష్ణువు.

నగజార్తి హారీ ... మొదటి అక్షరం తీసెయ్యండి .... గజార్తి హారీ ... గజేంద్ర మోక్షణము చేసిన విష్ణువు.

కుమారతాతః .... ఆది అక్షరం తీసేస్తే ... మారతాతః .... మన్మధుని తండ్రి అయిన విష్ణువు.

శశిఖండ మౌళి: ... మొదటి అక్షరం లేకపోతే శిఖండమౌళిః... నెమలిపింఛము ధరించిన విష్ణువు.

లంకేశ సంపూజిత పాద పద్మ: ... మళ్ళీ ఆది లేనిదిగా చెయ్యండి ... కేశ సంపూజిత పాద పద్మ: ... క అంటే బ్రహ్మ, ఈశః అంటే రుద్రుడు ... అంటే బ్రహ్మ రుద్రేంద్రాదులు బాగుగా పూజించిన పాదపద్మములు కల విష్ణువు.

అతడు మనలను కాపాడు గాక ....

గరుడ వాహనుడూ, గజేంద్రుని ఆర్తిని పోగొట్టిన వాడూ, మన్మధుని తండ్రీ, నెమలి పింఛము దాల్చిన వాడూ, బ్రహ్మ రుద్రాదుల చేత పూజింపబడిన పాద పద్మములు కలవాడూ అయిన రమేశ్వరుడు .... విష్ణువు మనలను కాచు గాక అనే తాత్పర్యం .

ఇప్పటికి అతడు శాంతించాడు.

సమన్వయించుకోకపోతే జీవితాలు దుర్భరం ఔతాయి. సర్వదేవతలలో విష్ణువుని దర్శించగలిగితే వాడు వైష్ణవుడు. సర్వ దేవతలలో శివుని దర్శించగలిగితే వాడు శైవుడు. ఇది మన భారతీయ కవితా వైభవము.

🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

కపిలారణ్యం

 కపిల మహర్షి పేరు మీదే కపిలారణ్యం ! అదే నేటి కాలిఫోర్నియా ! 


పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతీ వంటి అనేక మంది పండితుల అభిప్రాయం. భూగోళంలో భారతదేశానికి సరిగ్గా అవతల వైపున అమెరికా ఖండం ఉంది. భారత దేశంలో నిల్చున్నవారి పాదాల క్రింద ఉన్నది కావున దానికి పాతాళంగా వ్యవహరించారు..


సగర చక్రవర్తి పుత్రులు 60,000 మంది అశ్వమేధ యాగం కోసం విడువబడిన అశ్వం కోసం భూమిని వజ్రం వంటి తమ గోర్లతో చీల్చి పాతాళానికి చేరుకుంటారు. అక్కడ ధ్యానంలో ఉన్న కపిల మహర్షిని చూసి, ఆయనే దొంగిలించాడని ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళగా, ఆయన వారిని భస్మం చేస్తారు.


ఆ కపిల మహర్షి తపస్సు చేసుకున్న ఆ ప్రదేశం ఆయన పేరున కపిలారణ్యంగా ప్రసిద్ధికెక్కిందని, అదే ఈనాటి కాలిఫోర్నియా (శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖ రేంద్ర సరస్వతీ మహాస్వామి వారు 1935 లో ఒక ఉప న్యాసంలో చెప్పారు.)


కాలిఫోర్నియకు దగ్గరలో ఉన్న ఆష్‌ల్యాండ్ (Ashland)

(సగర పుత్రులు బూడిద కుప్పలు గా

మారిన ప్రదేశం) మరియు హార్స్‌ల్యాండ్ (Horse land) (యాగాశ్వం కట్టిన ప్రదేశం) అనే ప్రదేశాలకు సరిగ్గా వ్యతిరేక దిశలో గంగా నది ఉద్భవించిన గంగోత్రి హిమానీ నదం (Gangotri Glacier) ఉంది, ఈ రెండు ప్రదేశాలు కూడా సరళ రేఖలో 30 డిగ్రీల అక్షాంశం (Latitude) మీద ఉన్నాయి.


వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి తోలి, ఆయన నివాసం కోసం ఇచ్చిన ప్రదేశం కూడా కాలిఫోర్నియనే దీని పురాతన నామం మహాబలి భూమి, ఇప్పుడది మలిపు (Malipu) అనే పేరుగా రూపాంతరం చెందింది. ఈ మలిపునగరానికి దగ్గరలోనే శాంటా మోనికా పర్వతం ఉంది. దీనికి లాస్ ఏంజిల్స్ చాలా దగ్గరి ప్రదేశం.

బలిచక్రవర్తిని శ్రీ మహా విష్ణువు పాతాళానికి అధిపతి గా నియమించాడు. తన రాజ్యంలో సుఖసంపదలు ఉండాలని బలి వరం కోరుకున్నాడు. అందుకే ఈనాడు అమెరికా అంత సంపదతో తులతూగుతోంది. పాతాళ లోకం భారతదేశ పాదాల క్రింద ఉంది, అక్కడికి వెళ్ళాలంటే 70,000 యోజనాలు లోతుగా భూమిలోకి వెళ్ళాలి.


భారతదేశం నుంచి భూమిలోకి నిలువు (Vertical) గా స్వరంగం త్రవ్వితే మనం మళ్ళీ అమెరికా ఖండానికే చేరుకుంటాము. రాముడి ఆజ్ఞ మింద హనుమంతులవారి పుత్రుడైన మకరధ్వజుని పాతాళానికి అధిపతిని చేస్తాడు. ఇప్పటికీ మకరధ్వజుల వారిని మధ్య అమెరికా, దక్షిణ అమెరికాల్లో పూజింతారు. మధ్య అమెరికా, హోండురస్‌ (Honduras)లో ఉన్న La Ciudad Blanca [la sjuˈðad ˈblɑnkɑ] నగరాన్ని Lost City of the Monkey God‘ గా వ్యవహరిస్తారు.


అక్కడి స్థానికులు కోతి ఆకారం కలిగిన భారీ మూర్తులను ఆరాధించేవారు. దాని ముందు స్థానిక జాతులు బలులు కూడా అర్పించేవారు (Theodore Morde అనే అమెరికెన్ సాహసికుడు 1939 లో వెళ్ళడించారు.) “సురాసురాణం అన్యోన్యం దివా రాత్రా విపర్యాయ" అనగా సూర్య సిద్ధాంతం ప్రకారం సురాసురులకు ఒకరికి రాత్రయితే మరొకరికి పగలు. భూమినుండి 50000 యోజనాల దూరంలో పాతాళం ఉన్నది.

ఇప్పటికీ అమెరికాలో సంకల్పం చెప్పుకున్నప్పుడు కపిలారణ్యే అని చదువుకుంటాం. మన భూగోళ అడ్డకొలత (diameter) ఇప్పుడు మనం లెక్క వేస్తె సరిగ్గా లెక్క సరిపోతుంది. అమెరికాలో వెలుగు చూసిన ఎన్నో పురాతన శివాలయాలు, నారసింహ చిత్తరువులు, Oregonలో ఒక పెద్ద సరస్సులో ప్రపంచంలో అతి పెద్ద శ్రీయంత్రం బయలు పడడం ఇవన్నీకూడా మన వాంగ్మయంలో చెబుతున్న చరిత్రకు ఆధారాలు చూపుతున్నవే.


మూల అమెరికాయులు (రెడ్ ఇండియన్లు) విగ్రహారాధన చేస్తారు. ఇప్పటికీ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అని వారు పూజించిన విగ్రహాలు చూపుతారు. మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు మునిమనవడు అయిన జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తే దాన్ని ఆపడానికి ఆస్తీక మహర్షి వస్తాడు. అతడి అభ్యర్ధన మేరకు ఆ యాగం ఆపబడు తుంది. అక్కడ మిగిలిన నాగులను వారి వంశస్థులను తీసుకుని ఆస్తీక మహర్షి పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇది ఎంత సత్యమో నేడు మెక్షికన్లను అజ్తెక్స్ (ఆస్తీకులు) అని పిలవడాన్ని బట్టి తెలుస్తుంది.


Azteks నేటికి కూడా మనలాగే విగ్రహారాధన చేస్తారు. మన ధర్మంలో ఒకప్పుడు విలసిల్లిన వామాచార ఛాయలు ఎన్నో కనబడతాయి. వారు కూడా కొన్ని పూజలు చేస్తారు. ఒక్టావియా పాజ్ అనే నోబెల్ గ్రహీత, ఒకప్పటి భారతదేశంలో మెక్సికన్ రాయబారి తన పుస్తకం The light of India లో విపులంగా చర్చించాడు. aztec మరియు మాయ సంస్కృతులు వాటికి హిందూ సంస్కృతికి ఎంత దగ్గర సంబంధం ఉన్నదో చెబుతాడు.

వారు మరింత వామాచార పద్ధతులలో జంతుబలులు కూడా చేసేవారు. వారి పుస్తకాలలో మన ఆస్తీక మహర్షి వృత్తాంతం ఉన్నది. వారి మాయన్ క్యాలెండర్ కూడా 3114BC నుండి మొదలు అవుతుంది. ఇంచుమించు మనం మహాభారత యుద్ధానంతరం సమయం సరిగ్గా సరి పోతుంది. వారి సృష్టి సిద్ధాంతం కూడా మన సిద్ధాంతంతో పూర్తిగా ఏకీభవిస్తుంది. వారి వేదాన్ని పూపుల్ వుహ్ అంటారు.


వారి పండగలు కూడా మన దశరా, దీపావళి, ఉగాది, చక్రపూజ మన సంస్కృతిలాగే అనిపిస్తాయి. వారుకూడా అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటారు. వారికి కూడా చాతుర్వర్ణ వ్యవస్థ వున్నది. వీటి అన్నింటి ఆధారంగా మరిన్ని పరిశోధన జరిగి మన వాంగ్మయ సత్యాలను ప్రపంచానికి తెలియ చెయ్య వలసిన అవసరం ఉన్నది.

పేదవాడా

 దారిద్ర్య! శోచోమి భవన్తమేవం 

అస్మచ్ఛరీరే సుహృదిత్యుపిత్వా |

విపన్నదేహే మయి మన్దభాగ్యే 

మమేతి చిన్తా క్వ గమిష్యసి త్వమ్||


ఓ పేదవాడా! నువ్వు చాలా కాలంగా మన శరీరంలో స్నేహితుడిలా ఉన్నావు, కానీ నేను చనిపోయిన తర్వాత, 'నీకు ఎవరు ఆశ్రయం ఇస్తారు? నువ్వు ఎక్కడికి వెళ్తావు?' నాకు చాలా ఆందోళనగా ఉంది!


మృచ్ఛకటికమ్.

పందిరి నాశ్రయించక

 ఉ॥

పందిరి నాశ్రయించక సువాసన గల్గియు జాజితీవలున్ 

సుందరి నాశ్రయించక సుశోభితమౌ యపరంజిభూషలున్ 

ముందటిరాజుఁ జేరక సమూర్జిత కైతల 

పండితాళియున్ 

వందిత భర్తఁ గూడక నపారగుణాన్విత యయ్యు జాయయున్ 

పొందగబోరు శేముషి ప్రమోదము నందుచు సృష్టి నెచ్చటన్ 

*~శ్రీశర్మద*

పార్వతీపరమేశ్వరుల విహారపు పద్యం

 పార్వతీపరమేశ్వరుల విహారపు పద్యం

తెనాలి రామలింగ కవి ఉద్భటారాధ్యచరిత్రమనే కావ్యంలో చెప్పిన పద్యం—


తరుణ శశాంక శేఖర మరాళమునకు సార గంభీర కాసారమగుచు

కైలాసగిరి నాథ కలకంఠ భర్తకు కొమరారు లేమావి కొమ్మయగుచు

సురలోక వాహినీ ధర షట్పదమునకు ప్రాతరుద్బుద్ధ కంజాతమగుచు

రాజ రాజ ప్రియ రాజకీరమునకు మానిత పంజరస్థానమగుచు


ఉరగ వల్లభ హార మయూరమునకు

చెన్ను వీడిన భూధర శిఖరమగుచు

లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి

అద్రినందన బొల్చె విహారవేళ. ఈ పధ్య భావార్ధమును సోదాహరణము గా ఎవరైనా తెలియజేయండి!

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: ఆరవ అధ్యాయం

ఆత్మసంయమయోగం: శ్రీ భగవానువాచ


అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ 

అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే(35)


అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః 

వశ్యాత్మనా తు యతతా శక్యో௨వాప్తుముపాయతః (36)


అర్జునా.. మనస్సు చంచల స్వభావం కలిగిందీ, నిగ్రహించడానికి శక్యం కానిదీ అనడంలో సందేహం లేదు. అయితే దానిని అభ్యాసంవల్ల, వైరాగ్యంవల్ల వశపరచుకోవచ్చు. ఆత్మనిగ్రహం లేనివాడికి యోగం సిద్ధించదని నా ఉద్దేశం. ఆత్మనిగ్రహం వుంటే అభ్యాసం, వైరాగ్యం అనే ఉపాయాలతో యోగం పొందవచ్చు.

ఆశ్రయం లేకపోతే ప్రకాశించరు"*...

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝 *అనర్ఘమపి మాణిక్యం హేమాశ్రయమపేక్షతే।*

          *వినాశ్రయం న శోభన్తే పణ్డితా వనితా లతాః॥*


                   *---- _సుభాషితరత్నకోశః_----*


తా𝕝𝕝 "*ఎంత అమూల్యమైన మాణిక్యమైనా అది శోభించాలంటే దానికి బంగారం ఆశ్రయం ఉండాలి... అదే విధంగా పండితులు, స్త్రీలు, లతలు ఆశ్రయం లేకపోతే ప్రకాశించరు"*...

                     

 ✍️🌹💐🌸🙏

శ్రీ భులేశ్వర్ ఆలయం

 🕉 మన గుడి : నెం 1126


⚜ మహారాష్ట్ర : పూణే 


⚜  శ్రీ భులేశ్వర్ ఆలయం



💠 ఈ ఆలయం మహారాష్ట్రలోని పూణే జిల్లాలో మల్షిరాస్ సమీపంలోని కొండపై ఉంది.  

ఇది రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించబడింది మరియు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాచే నిర్వహించబడుతుంది.



💠 ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది మరియు యాదవ పాలకుల కాలంలో 13వ శతాబ్దంలో నిర్మించబడింది.  

శివాజీ కాలం నాటి గైముఖి బురుజ్ నిర్మాణం వలె ఆలయ ప్రవేశ ద్వారం దాగి ఉన్నందున ఈ ఆలయాన్ని ముస్లిం ఆక్రమణదారులచే ధ్వంసం చేసి, తరువాత పునర్నిర్మించారని నమ్ముతారు.  ఆలయం ఉన్న కోటను దౌలత్ మంగళ్‌గడ్ కోట అంటారు.



💠 ఈ ఆలయం దాని వాస్తుశిల్పం కారణంగా ప్రత్యేకంగా ఉంటుంది.  

ఈ ఆలయాన్ని నిర్మించడానికి బ్లాక్ బసాల్ట్ రాక్ తీసుకురాబడింది, ఇది చుట్టూ ఉన్న గోధుమ రంగు బసాల్ట్ రాయి కంటే భిన్నంగా ఉంటుంది.  వృత్తాకార గోపురాలు మరియు మినార్లు వంటి ఇస్లామిక్ వాస్తుశిల్పాన్ని పోలి ఉండటం వల్ల బయటి నుండి ఇది ఆలయం కంటే మసీదుగా కనిపిస్తుంది.  గోడలపై శాస్త్రీయ శిల్పాలు ఉన్నాయి.

 ఈ ప్రత్యేకమైన డిజైన్‌కు కారణం ఆక్రమణదారులచే ధ్వంసమవకుండా ఆలయాన్ని రక్షించడానికి చేయబడింది.


💠 ఆలయం దాని గర్భగుడిలో ఐదు శివలింగాలను కలిగి ఉంది.  

అవి ఒక కందకంలో దాగి ఉండటం వల్ల, ఈ శివలింగాలు కాంతితో కనిపిస్తాయి.  ఈ ఆలయంలో లక్ష్మీదేవి, విష్ణువు మరియు మహాదేవుడు కూడా కొలువై ఉన్నారు.  


💠 ఈ ఆలయంలో స్త్రీల వేషధారణలో గణేష్ విగ్రహం  ఉంది మరియు దీనిని గణేశ్వరి లేదా లంబోదరి లేదా గణేశ్యని అని పిలుస్తారు.


💠 భూలేశ్వర్ ఆలయానికి పౌరాణిక మరియు చారిత్రక ప్రాధాన్యత కూడా ఉంది.  వాస్తవానికి ఇది దౌలత్మంగల్ కోట అని పిలువబడే ఒక కోట (దీనిని మంగళ్‌గఢ్ కోట అని కూడా పిలుస్తారు), ఇక్కడ పార్వతి కైలాసానికి వెళ్లి వివాహం చేసుకునే ముందు శివుని కోసం నృత్యం చేసిందని చెబుతారు.


💠 మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయానికి విపరీతమైన రద్దీ ఉంటుంది.  

ఒక స్థానిక నమ్మకం ఉంది, ఒక గిన్నె తీపిని శివుడికి సమర్పించినప్పుడు, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్వీట్లు మాయమవుతాయి.  


💠 ఈ ప్రాంతం వలస పక్షులకు నిలయంగా ప్రసిద్ధి చెందింది మరియు చాలా మంది ప్రకృతి ప్రేమికులు మరియు పక్షి పరిశీలకులు సందర్శిస్తారు.



💠 భులేశ్వర్ అనేది పూణే నుండి 45 దూరంలో ఉంది. 



రచన

©️ Santosh Kumar

తిరుమల సర్వస్వం 255-*

 *తిరుమల సర్వస్వం 255-*

*ద్వాదశ ఆళ్వారులు-19*


 *దేవదేవి ప్రతిన* 


 ఒకానొక దినాన 'దేవదేవి' గా పిలువబడే ప్రముఖనర్తకి చోళరాజు సభలో తన నృత్యగానాలను అతినేర్పుగా ప్రదర్శించి, చోళప్రభువును ఆకట్టుకొంది. రాజుగారిచే బహూకరింపబడ్డ వెలలేని కట్నకానుకలు, దాసదాసీ జనంతో పాటుగా ఆమె తన స్వగ్రామానికేగుతూ, మార్గమధ్యలో విప్రనారాయణుని పూదోటను చూడటం తటస్థించింది. మార్గాయాసంతో అలసి ఉన్న దేవదేవి, ముచ్చట గొలుపుతున్న ఆ ఉద్యానవనంలో తన సోదరితో పాటుగా విశ్రమించింది. ఆ పూదోట సోయగానికి అబ్బురపడిన వారిరువురూ కొంత తడవు సేద తీరిన తరువాత, వారికి సర్వసంగపరిత్యాగి యైన విప్రనారాయణుడు తారసిల్లాడు. వారిరువురూ విప్రనారాయణునికి నమస్కరించగా, అద్వితీయ సౌందర్యంతో అలరారుతున్న దేవదేవిని అత్యంత సమీపం నుండి చూచి కూడా, యౌవనదశలో నున్న ఆ సాధుపుంగవుడు ఏవిధమైన చిత్తచాపల్యానికి లోనవ్వలేదు. ఆ సాధుసత్తముడు వారినాశీర్వదించి నిష్క్రమించిన తరువాత; దేవదేవి తనవంటి సౌందర్యరాశిని చూచి కూడా నిర్వికారంగా ఉండగలిగిన ఈ విప్రుడు నిశ్చయంగా ఉన్మత్తుడే (పిచ్చివాడు) నని వెటకారమాడింది. అంతట ఆమె సోదరి వీరెవ్వరో ఇంద్రియనిగ్రహం కలిగిన సాధుపుంగవుని వలె గోచరిస్తున్నారని, దేవదేవి తళుకు బెళుకులకు లొంగిపోయే సాధారణ పురుషుడు కారని, ఆ మునివర్యుని వశం చేసుకోవడం దేవదేవి వల్ల కాదని, పుణ్యపురుషులను హేళన చేయడం కూడదని హితవు పలికింది. దానితో అహం దెబ్బతిన్న దేవదేవి ఆరునెలలలో ఆ సన్యాసిని తన దారి లోకి తెచ్చుకుంటానని; అతనిని తన కోసం సర్వం ధార పోసేటట్లుగా చేయగలనని; లేకుంటే తాను తన సోదరికి జీవితాంతం దాసిగా పడి ఉంటానని ప్రతిన పూనింది.


 *ముని ఆశ్రయంలో దేవదేవి* 


 తన పంతం నెరవేర్చుకోవడానికై వెనువెంటనే రంగం లోకి దిగిన దేవదేవి తన సర్వాభరణాలను, పట్టుపీతాంబరాలను తీసివేసి; కాషాయ వస్త్రధారియై విప్రనారాయణుణ్ణి సమీపించింది. తాను సమీప గ్రామంలో నున్న ఒక వేశ్యా కుటుంబంలో జన్మించానని; తనకు చిన్నతనం నుండే ఆ వృత్తి పట్ల ఏహ్య భావముందని; కానీ తన తల్లి తనను కులవృత్తి చెపట్టడానికై ఒత్తిడి చేయసాగిందని; మీవంటి మునిపుంగవుల సమీపంలో ఉంటే మరుజన్మ లోనైనా ఉత్తమజన్మ సంప్రాప్తిస్తుందని; ఉద్యానవనంలో తలదాచుకుంటూ మొక్కలను సంరక్షించడానికి తనను అనుమతించమని; లేకుంటే తనకు అత్మహత్యే శరణ్యమని కల్లబొల్లి మాటలల్లింది. అప్పటివరకు పరస్త్రీ సాన్నిహిత్యమే లేని, లోకరీతి తెలియని విప్రనారాయణుడు దేవదేవి కపటపు మాటలను పూర్తిగా విశ్వసించి, ఆ అబల దీనావస్థకు జాలిపడి, తన ఉద్యానవనం లోని ఒక పూరిపాకలో నివసించడానికి ఆమెను అనుమతించాడు. అదే అదనుగా భావించిన దేవదేవి తాను కూడా తాపసి దుస్తులు ధరించి, తోటపని చేస్తూ, మాలలల్లడంలో విప్రనారాయణునికి సాయపడుతూ, కొంత సమయం సంయమనంతో గడిపింది. దేవదేవి ఎంత సమీపంలోనున్నప్పటికీ విప్రనారాయణుడు ఏ విధమైన వికారానికి లోనుకాలేదు

2 ఆరు నెలలు పూర్తికావడానికి మరికొంత సమయం మాత్రమే మిగలి ఉండడంతో దేవదేవి కలవరానికి గురై; విప్రనారాయణుణ్ణి లొంగదీసు కోవడానికి అనువైన సమయం కోసం వేచిచూస్తూ, తన కార్యం సఫలం చేయమని శ్రీరంగనాథుణ్ణి పరిపరి విధాలుగా వేడుకోసాగింది.


 *ఉచ్చులో చిక్కిన విప్రుడు* 


 ఇంతలో వర్షఋతువు ఆసన్నమైంది. ఒకనాటి రాత్రి విప్రనారాయణుడు తన కుటీరంలో విశ్రమించి యుండగా ఉరుములు మెరుపులతో కూడిన కుంభవృష్టి కురియసాగింది. ఆ ఫెళఫెళారావాలకు నిద్రాభంగం కలిగిన విప్రనారాయణునికి, ఆశ్రమం బయటే విశ్రమిస్తున్న దేవదేవి దైన్యస్థితి తలపు చ్చింది. దయాహృదయం పెల్లుబికిన విప్రనారాయణుడు ఆరుబయలే ఒక వృక్షం క్రింద నిలుచుని జడివానలో తడిసి ముద్దవుతున్న దేవదేవిని కాంచి; తన ఆశ్రమం లోనికి వచ్చి, వర్షం వెలిసేంత వరకూ ఒక మూలన విశ్రమించడానికి ఆమెకు అనుమతినిచ్చాడు. అదే అదను కోసం వేచియున్న దేవదేవి ఆశ్రమం లోనికి ప్రవేశించి, తన కోకిల కంఠంతో మునీశ్వరుని క్షేమ సమాచారాలడుగుతూ, వారితో సంభాషణ ప్రారంభించింది. మొట్టమొదటి సారిగా అంత సమీపం నుండి వినవచ్చిన ఆమె మృదువైన కంఠస్వరం విప్రనారాయణునికి ఆసక్తి కలిగించింది. తన నేర్పరితనంతో దేవదేవి సంభాషణ తీరుతెన్నులను తనకు అనుకూలంగా మార్చుకో గలిగింది. అలా వారి సంవాదం సరససల్లాపంగా మారిన కొంత తడవు తరువాత, విప్రనారాయణుడు దేవదేవి కోరికపై ఆమెను తన పాదాల నొత్తడానికి అనుమతించాడు. తొలిసారిగా అంతటి మధుర స్పర్శను ఆస్వాదించిన విప్రోత్తముడు విచక్షణాజ్ఞానాన్ని కోల్పోయాడు. ఇరువురూ శ్రీరంగనాథుని భక్తులే! ఆ రంగశాయి లీలావినోదం వల్ల, దేవదేవి ప్రతిన నెరవేరింది. ఆరునెలల సమయం ముగిసే లోపుగానే విప్రనారాయణుడు దేవదేవికి దాసానుదాసునిగా మారాడు. బ్రాహ్మణ్యం మంట గలిసిపోయింది. విప్రనారాయణుడు నిత్యానుష్ఠానుదులకు, భగవతారాధనకు తిలోదకాలర్పించి, ఎల్లవేళలా దేవదేవి సాంగత్యంలో కాలం గడపసాగాడు. భోగలాలసుడై, ఆశ్రమాన్ని విడిచి దేవదేవితో పాటుగా ఆమె గృహానికి చేరుకున్నాడు. సత్సాంగత్యం వల్ల దేవదేవి కూడా పరిణతి చెందింది. తన ప్రతిన విషయం మరిచి, అర్థాంగి వలె విప్రనారాయణునికి చిత్తశుద్ధితో సపరిచర్యలు చేయసాగింది. కానీ, కేవలం ధనాపేక్ష మాత్రమే గలిగిన, కఠినాత్మురాలైన దేవదేవి తల్లి తన సర్వస్వం అప్పటికే ధారపోసిన విప్రనారాయణుణ్ణి, నిర్దాక్షిణ్యంగా ఇంటినుండి తరిమి వేసింది. దేవదేవిపై వ్యామోహం వీడని విప్రనారాయణుడు ఆరుబయట, వేశ్య ఇంటి అరుగుపై విశ్రమించాడు.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

శనివారం🍁* *🌹31 మే 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🍁శనివారం🍁*

    *🌹31 మే 2025🌹*       

    *దృగ్గణిత పంచాంగం*                  


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*జ్యేష్ఠ మాసం - శుక్ల పక్షం*


*తిథి  : పంచమి* రా 08.15 వరకు ఉపరి *షష్ఠి*

*వారం    : శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం   : పుష్యమి* రా 09.07 వరకు ఉపరి *ఆశ్లేష*


*యోగం : వృద్ధి* ఉ 10.44 వరకు ఉపరి *ధ్రువ*

*కరణం   : బవ* ఉ 08.42 *బాలువ* రా 08.15 ఉపరి *కౌలువ*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 10.30 - 01.00 సా 04.00 - 06.00*

అమృత కాలం  : *మ 02.49 - 04.23*

అభిజిత్ కాలం  : *ప 11.39 - 12.31*


*వర్జ్యం          : శేషం ఉ 06.56 వరకు*

*దుర్ముహూర్తం  : ఉ 05.34 - 07.18*

*రాహు కాలం    : ఉ 08.50 - 10.27*

గుళికకాళం       : *ఉ 05.34 - 07.12*

యమగండం     : *మ 01.43 - 03.21*

సూర్యరాశి : *వృషభం*

చంద్రరాశి : *కర్కాటకం*

సూర్యోదయం :*ఉ 05.41*

సూర్యాస్తమయం :*సా 06.47*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.34 - 08.10*

సంగవకాలం         :*08.10 - 10.47*

మధ్యాహ్న కాలం    :     *10.47 - 01.23*

అపరాహ్న కాలం    : *మ 01.23 - 04.00*


*ఆబ్ధికం తిధి         : జ్యేష్ఠ శుద్ధ పంచమి*

సాయంకాలం       :*సా 04.00 - 06.36*

ప్రదోష కాలం         :  *సా 06.36 - 08.48*

రాత్రి కాలం           :*రా 08.48 - 11.43*

నిశీధి కాలం          :*రా 11.43 - 12.27*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.06 - 04.50*

-------------------------------------------------

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🙏శ్రీ వేంకటేశ్వర స్వామి🙏*

     *🔯పంచకస్తోత్రం🔯*


*తారహీరక్షీరశార* 

*దాభ్రతారకేశకీర్తి* 

*విహార మాదిమధ్య్* *ఆన్తశూన్యమవ్యయమ్ ।*


*🌹ఓం నమో వేంకటేశాయ🌹*

*****************************

_*🚩హనుమ ధ్యాన శ్లోకాలు*_🚩


_*అంజనానందనం వీరం*_ 

_*జానకీశోకనాశనమ్*_

_*కపీశ మక్షహంతారం*_

_*వందేలంకా భయంకరమ్*_


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు - జేష్ఠ మాసం - శుక్ల పక్షం -‌ పంచమి - పుష్యమి -‌‌ స్థిర వాసరే* (31.05.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

ఈశ్వరుడి లీలా అపారమైనది

 *🌴🌈ఈశ్వరుడి లీలా అపారమైనది మనిషి శరీరంలోని వేళ్లపై ఉన్న చర్మం మీద రేఖలు రూపుదిద్దుకోవడం, శిశువు తల్లిగర్భంలో సుమారు నాలుగు నెలల వయసు ఉన్నప్పుడే ప్రారంభమవుతుంది. ఆ సమయంలో ఈ రేఖలు మాంసంపై జాలంలా... అంటే వలయంలా ఏర్పడతాయి. ఈ రేఖల ఏర్పాటుకు సమాచారం డిఎన్ఎ ద్వారా లభిస్తుంది.* 


*🌴🌈కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ రేఖలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ శిశువు తల్లి లేదా తండ్రి లేదా ప్రపంచంలోని ఏ ఇతర వ్యక్తితోనూ సరిపోవు. ఈ రేఖలను సృష్టించేవాడు కూడా అంతే ప్రత్యేకమైన పరమాత్మనే, ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవారి, ఇంకా ఈ లోకంలో లేనివారి చేతి, నుదుటి రేఖలను కూడా ఆయన రూపకల్పన చేస్తాడు, వాటి ప్రతి ఒక్క డిజైన్‌ను గుర్తుంచుకుంటాడు.*  


*🌴🌈కాబట్టి ప్రతిసారి ఆయన తన వేళ్లపై కొత్త రకమైన రూపాన్ని ఏర్పాటు చేస్తూ తన అద్భుతాన్ని చూపిస్తాడు. ఆశ్చర్యకరంగా, వేళ్ల రేఖలు కాలిపోవడం,*

*గాయపడడం లేదా ఏదైనా కారణంగా నాశనం కావడం జరిగినా, అవి మళ్లీ అదే నిర్మాణంతో తిరిగి వస్తాయి — అందులో ఒక చుక్క కూడా భిన్నంగా ఉండదు. ఈ సమస్తాన్ని నిర్వహిస్తున్న ఒక అద్భుతమైన శక్తి ఉంది, అదే ఈ ప్రపంచాన్ని నడుపుతోంది. ఆ పరమాత్మ మొదటగా మన హస్తరేఖలను సృష్టించాడు — ఇవే నేడు మన ఆధార్ కార్డు రూపంలో మన గుర్తింపుకి ఆధారంగా మారాయి... అతడే శక్తిశాలి భగవాన్... అతడే పరమేశ్వరుడు... అతడే సూక్ష్మంలో సూక్ష్మమైనవాడు, అనంతంలో అనంతమైన బ్రహ్మాండం.*


*┈┉┅━❀꧁ శివోహం ꧂❀━┅┉┈*

         *SPIRITUAL SEEKERS*

👆🇮🇳👆 🙏🕉️🙏 👆🇮🇳👆

30, మే 2025, శుక్రవారం

భూషలుగావుమర్త్యులకు

 శు భో ద యం 🙏



భూషలుగావుమర్త్యులకు భూరిమయాంగదతారహారముల్

భూషిత కేశపాశమృదుపుష్ప సుగంధజలాభిషేకముల్ భూషలుగావు,పూరుషుని భూషితుజేయు పవిత్రవాణివా 

గ్భూషణమే సుభూషణము

భూషణముల్ నశియించు నెప్పుడున్,

భర్తృహరి సుభాషితములు!!

భావము:మానవులకు నిజమైన భూషణము విద్యయేవిద్యను మించిన భూషణములులేనేలేవు.

      బంగరునగలు,ముత్యాలహారములు వివిధ అలంకార విశేషములెవ్వియు భూషణాభాసములేతప్పభూషణములుగావు పవిత్రవాణియే నిజమగుభూషణము.తక్కినభూషణములు రావచ్చును పోవచ్చును.విద్యాభూషణము మాత్రమే సుస్థిరమైనది

                         స్వస్తి!!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

శ్రీరామచంద్ర ప్రభువు

 🕉️ *శ్రీరామచంద్ర ప్రభువు యొక్క గొప్పవైన 16 గుణములు* 🕉️


*కో అస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్౹*

*ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః ॥*

*చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః౹*

*విద్వాన్ కః కః సమర్థశ్చ కః ఏక ప్రియదర్శనః ॥*

*ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కోనసూయకః౹*

*కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ॥*


ధర్మము తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలి అని చూపించినవాడు శ్రీరాముడు. 16 గుణములు పుష్కలంగా కలిగి ఉన్నవాడు రాముడు. అవే.. 1. గుణవంతుడు, 2. వీర్యవంతుడు, 3. ధర్మాత్ముడు, 4. కృతజ్ఞతాభావం కలిగినవాడు, 5. సత్యం పలికేవాడు, 6. దృఢమైన సంకల్పం కలిగినవాడు, 7. చారిత్రము కలిగినవాడు, 8. అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, 9. విద్యావంతుడు, 10. సమర్థుడు, 11. ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంతటి సౌందర్యము కలిగినవాడు, 12. ధైర్యవంతుడు, 13. క్రోధాన్ని జయించినవాడు, 14. తేజస్సు కలిగినవాడు, 15. ఎదుటివారిలో మంచిని చూసేవాడు. 16. అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు.

గణపతి ఉపనిషత్తు 🙏 రెండవ భాగం

 గణపతి ఉపనిషత్తు 🙏

                     రెండవ భాగం 

సర్వం జగదిదం త్వత్తో జాయతే! సర్వం జగదిదం త్వత్తస్తిష్ఠతి! సర్వం జగదిదం త్వయి లయమేష్యతి! సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి! త్వం భూమిరాపోఽనలోఽనిలో నభః త్వం చత్వారి వాక్పదాని! 5

సర్వం జగదిదం త్వత్తో జాయతే! 

ఈ సకల చరాచర జగత్తు నీనుండే ఉద్భవించినది.

సర్వం జగదిదం త్వత్తస్తిష్ఠతి! 

 ఈ జగత్తంతా నీలోనే ఉంటుంది. 

సర్వం జగదిదం త్వయి లయమేష్యతి

ఈ జగత్తు మొత్తంగా లయమయ్యేదీ నీలోనే. 

సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి

ఈ జగత్తంతా నీవైపే ప్రవహిస్తుంది (త్వయి ప్రత్యేతి) నిన్నే పొందుతుంది. 

త్వం భూమిరాపోఽనలోఽనిలో నభః

నీవే భూమివి, నీరు, వాయువు, అగ్నివి, ఆకాశానివి.

త్వం చత్వారి వాక్పదాని

 పరా పశ్యంతి మధ్యమా వైఖరి గా పేర్కొనబడే వాక్కు యొక్క నాలుగు పదాలు నీవే.

త్వం గుణత్రయాతీతః! త్వం దేహత్రయాతీతః! త్వం కాలత్రయాతీతః! త్వం అవస్థాత్రయాతీతః!

త్వం మూలాధారస్థితోఽసి నిత్యమ్! త్వం శక్తిత్రయాత్మకః! త్వాం యోగినో ధ్యాయంతి నిత్యమ్!

త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వమగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువః స్వరోమ్! 6


త్రిగుణాలకు (సత్వ రజస్ తమో) నీవు అతీతునివి, నీవు స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా పేర్కొనబడే దేహత్రయానికీ అతీతునివి. నీవు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు అతీతునివి. నీవే కుండలినీ శక్తిగా నిత్యమూ మూలాధార చక్రంలో స్థితమైన (ఉండే) శక్తివి. నీవే మూడు శక్తులకు (ఇఛ్ఛా జ్ఞాన క్రియా శక్తులు) అతీతమైన వానివి.

నిత్యం యోగులచే ధ్యానం చేయబడే వానివి నీవే. త్రిమూర్తులు, ఇంద్రాగ్ని వాయు సూర్య చంద్రాదుల రూపంలో భాసిల్లే వానివి నీవే. ముల్లోకములలో (భూః, భువః సువః) నీవే, ముల్లోకములూ నీవే అయిన వాడివి.


గణాదిం పూర్వముచ్చార్య! వర్ణాదీం స్తదనంతరమ్! అనుస్వారః పరతరః! అర్ధేందులసితమ్!

తారేణ ఋద్ధమ్! ఏతత్తవ మనుస్వరూపమ్! గకారః పూర్వరూపమ్ అకారో మధ్యమరూపమ్ అనుస్వారశ్చాంత్యరూపమ్! బిందురుత్తరరూపమ్! నాదః సంధానమ్! సంహితా సంధిః!

సైషా గణేశవిద్యా! గణక ఋషిః! నిచృద్గాయత్రీచ్ఛందః! శ్రీ మహాగణపతిర్దేవతా ఓం గం గణపతయే నమః!7

"గం" అనేది గణపతి బీజం. దానిని ఉఛ్చరించే పద్దతి చెపుతున్నారిక్కడ. "గ్" ను ముందుగా ఉఛ్చరించాలి అటు పిమ్మట వర్ణములకు ఆది అయిన "అ"కారాన్ని ఉఛ్చరించాలి. తదుపరి అనుస్వరాన్ని ఉఛ్చరించాలి. ఇది "గం" అవుతుంది. అదే గణపతి బీజం. (దీని సాధనచేత ఆ స్వామి గోచరమౌతాడు).

అర్ధేందులసితం... అక్షరములు ధ్వనులకు సంకేతాలు. ధ్వని నాద భరితము. బిందువు తదుపరి వచ్చే నాదాన్ని "అర్ధేందు" అనే సంకేతంతో సూచించారు. ఆ నాదంతో ప్రకాశించే వాడు.

తారేణ రుద్ధం... తార అనగా తరింప చేసే మంత్రము దానినే ఓంకారము లేదా ప్రణవము అంటున్నాము. రుద్ధము పరివేష్టితుడు. ప్రణవము చేత పరివేష్టితుడు లేదా ప్రణవ స్వరూపుడు.

ఇది అతని యొక్క మంత్ర రూపము.

(ఇక పోతే సామాన్యార్థంలో చెప్పుకుంటే....శివ సంబంధమైన వాడు గణపతి కాబట్టి అతడు అర్ధేందుచే (అష్టమినాటి చంద్రుని) ప్రకాశించే వాడు. తారకలచే (నక్షత్రములు) పరివేష్ఠితుడు, అని చెప్పు కోవచ్చు... కాని ఇది సంప్రదాయము కాదు.)

“గం” బీజం సాధన చేసే సమయంలో... "గ్" కారం పూర్వ రూపం, "అ" కారం మధ్యమ రూపం, అనుస్వరం అంత్య రూపం అవుతుంది కాగా బిందువు (౦) ఉత్తర రూపంగా ఉంటుంది. దీనిని పలికి నప్పుడు వచ్చే నాదమే సంధానము. దీనితో అత్యంత సాన్నిహిత్యం కలిగినది సంధి.

ఇది మొత్తంగా (సైషా.. స ఏషా...) గణేశుని విద్య. దీనికి ఋషి గణక ఋషి. అనగా దీనిని దర్శించి ప్రవచించిన వాడు, గణకుడు అనే ఋషి. దీని ఛందస్సు నిచృద్ ఛందం. అధిష్టాన దేవత గణపతి.

“ఓం గణపతయే నమః ఏక దంతాయ విద్మహే, వక్ర తుండాయ ధీమహి, తన్నో దంతిః ప్రచోదయాత్”!

ఏకదంతం చతుర్ హస్తం పాశమంకుశధారిణమ్

రదం చ వరదం హస్తైర్బిభ్రాణం మూషకధ్వజమ్!

రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససమ్ 

రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితమ్!

భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతమ్ 

ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతేః పురుషాత్పరమ్!

ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగీ యోగినాం వరః 9

ఏకదంతుడు, నాలుగు చేతులలో.... పాశము, అంకుశము, దంతము, (ఇది ఏనుగు దంతం, త్యాగానికి సంబంధించినది. మహాభారత రచనా కాలంలో తన దంతాన్ని విరిచి వ్రాసాడు) అభయ ముద్రను ధరించినవాడు, ఎలుక వాహనమును ధ్వజముగా కలిగిన వాడు, పెద్దదైన పొట్టను కలిగిన వాడు, చాటల లాంటి చెవులను కలిగిన వాడు, రక్త వర్ణ వస్త్రములను ధరించిన వాడు, ఎర్రనైన సుగంధములను పులుముకున్న శరీరము కలిగిన వాడు, ఎర్రనైన పుష్పములచే చక్కగా పూజిlతుడు, భక్త కోటిపై అమితమైన అనుకంప (దయ) కలిగిన వాడు, భగవంతుడైన వాడు, ఈ జగత్తుకు కారణమైన వాడు, అచ్యుతుడు (జారిపోని వాడు), సృష్టి ఆదిలోనే ఆవిర్భూతుడు, ప్రకృతి పురుషులకు కూడా పరమమైన వాడు, ఎవరైతే ఉన్నాడో (గణపతి) వానిని నిత్యం ఎవరైతే ధ్యానిస్తారో వారు యోగులలో శ్రేష్టునిగా చెప్పబడతారు.

హే వ్రాత పతి (సమూహమునకు భర్త) నీకు నమస్సులు. గణములకు పతియైన నీకు నమస్సులు, ప్రమథ గణములకు పతివైన నీకు నమస్సులు, లంబోదరుని వైన నీకు నమస్సులు, ఏకదంతుని వైన నీకు నమస్సులు (ఏక దంతము త్యాగానికి చిహ్నము) విఘ్నములను నశింప చేసే నీకు నమస్సులు, శివ సుత నీకు నమస్సులు (శివము అంటే మహదానందము.. దానికి పుత్రుడు అంటే ఆనంద మూర్తియే... పోతన గారు కూడా మహానందాంగనా డింభకుడు అని అంటారు. మహా ఆనందము అనే అంగనకు డింభకుడు) వరద మూర్తయే... అపరిమితమైన దయా కారుణ్యాలకు ఆకృతి వస్తే ఎలా ఉంటుంది అంటే అది గణపతి వలె ఉంటుంది అనేందుకు వరద మూర్తయే అన్నారిక్కడ. ఆ వరద మూర్తికి నమస్సులు.

ఇక చివరగా ఫల శ్రుతి....

ఈ అథర్వ శీర్షంను ఎవరైతే శ్రద్ధతో, చక్కగా అధ్యయనం చేస్తారో, వారు (స) బ్రహ్మ స్థానాన్ని పొందుతారు. వారు సర్వ విఘ్నములనుండి విముక్తుడవుతాడు, వారు సర్వత్రా సుఖములను పొందుతారు, వానికి పంచ మహా పాతకముల నుండి విముక్తి కలుగుతుంది.

సాయం సమయంలో దీనిని అనుష్ఠించడం వల్ల పగలు చేసిన పాపములు తొలగిపోతాయి. ప్రాతఃకాలంలో అనుష్ఠించినట్లయితే రాత్రి చేసిన పాపములు తొలిగిపోతాయి. సాయం ప్రాతస్సులలో అనుష్ఠించిన వానికి పాపములు అంటుకొనవు. సర్వత్రా ఏ కార్యములలో నైనా ఏ విధమైన విఘ్నములు కూడా అతనికి కలగవు. అతడు ధర్మార్ధ కామ మోక్షములను పొందగలడు. ఇది అధర్వ శీర్షం.

దీనిని శిష్యులు కాని వారికి ఇవ్వకూడదు. ఇక్కడ శిష్యుడు అంటే నేర్చుకోవాలనే జిజ్ఞాసతో గురువును సభక్తికంగా చేరిన వాడు. అశ్రద్ధ లేనివాడు, ఉపాసన యందు అనురక్తి కలిగిన వాడు. విషయంపైన భక్తిభావన కలిగిన వాడు. అలాంటి లక్షణాలు లేని వానికి ఈ విద్యను ఇవ్వగూడదని చెపుతుంది, ఈ సూక్తం. ఏ ప్రలోభాలకైనా లోనై అలా అనర్హులకు ఈ సూక్తాన్ని ఇచ్చినట్లయితే అతడు పాప కూపంలొ పడిపోతాడని హెచ్చరిస్తుంది.

ఏ ఏ కోరికలతో నైనా సహస్రావర్తనంగా దీనిని అనుష్ఠించినట్లయితే దీని చేత (అనేన) ఆ కోరికలు సాధింపబడతాయి. ఈ ఉపనిషత్ చేత గణపతిని అభిషేకించినట్లయితే అతడు చక్కని వాక్పటుత్వం కలిగిన వాడవుతాడు.

భాద్రపద శుద్ధ చవితినాడు భోజనం చేయకుండా (చతుర్థ్యామనశ్నన్… అన అశనము) ఎవరైతే జపిస్తారో, అతడు విద్వాంసుడౌతాడు. ఇది అథర్వణ వాక్యము.

దీనిని బ్రహ్మ విద్యగా ఆచరించడం వల్ల కొద్దిగా కూడా భయం అనేది ఉండదు (నభిభేతి)

గణపతిని ... ఎవరైతే దూర్వారములచే అర్చిస్తారో అతడు అపర కుబేరుడౌతాడు. పేలాలతో ఎవరైతే అర్చిస్తారో అతడు యశస్కుడు అవుతాడు. మేధోవంతుడౌతాడు. మోదక సహస్రముచే ఎవరైతే అర్చిస్తారో వారికి వాంఛించిన ఫలితం లభిస్తుంది. ఎవరైతే ఆజ్యము (నేయి) సమిధలతో హవనం చేస్తారో వారికి ముమ్మాటికీ సర్వమూ లభిస్తుంది.

ఎనిమిది మంది వేద విదులైన బ్రాహ్మణులను చక్కగా సమకూర్చుకొని గణపతి నెవరైతే అర్చిస్తారో వారు సూర్య వర్చస్సును పొందుతారు.

సూర్య గ్రహణ కాలంలో, మహానది (జీవనది) వద్ద ప్రతిమ సాన్నిధ్యంలో జపించిన వారికి మంత్ర సిద్ధి కలుగుతుంది. వారికి మహా విఘ్నములు, మహా దోషములు, మహా పాపములు తొలగిపోతాయి. అతడు అన్నీ తెలిసిన వాడవుతాడు... ఇది తెలుసుకోండి అంటుంది.. ఈ గణపతి అథర్వశీర్ష ఉపనిషత్తు.

ఓం శాంతిః శాంతిః శాంతిః

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు - జేష్ఠ మాసం - శుక్ల పక్షం -‌ చతుర్థి - పునర్వసు -‌‌ భృగు వాసరే* (30.05.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

ఆధ్యాత్మికత

 *ఆధ్యాత్మికత - సమాజము*




*ఆధ్యాత్మికత* అంటే మతాలకు, సిద్ధాంతాలకు, వర్గాలకు అతీతంగా *భక్తిని* ఏర్పర్చుకోగల్గి ఉన్నతమైన, ప్రశాంతమైన, నిశ్చలమైన, నిర్మలమైన, అన్య భావనలచే మిశ్రితము కాని స్థితిని చేరుకోనుట అని సాధారణ అర్థము. కాని, అంతటి ప్రశాంతత ఇప్పటి పరిస్థితులలో సాధ్యము కాదన్న భావన కల్గుతుంది. *ఎందుకంటే మహా మహా భక్తులలో గూడా మా దేవుడు గొప్పవాడoటే మా దేవుడు గొప్పవాడని (వైష్ణవులు, శైవులు, శాక్తేయులు, లింగాయతులు, తదితరులు) భావ వైరుధ్యాలతో సతమతమవుతున్నారు*. ఇటువంటి పరిస్థితులలో నిఖార్సైన ఆధ్యాత్మికతకు అవకాశమెక్కడిది. 


*ఈ మధ్యనే రామేశ్వరంలో శ్రీ రామచంద్రుల వారిచే శివ లింగ స్థాపన మరియు అర్చనపై పలు భిన్నాభిప్రాయాలు వెలువడుట ఆశ్చర్యకరము*.కాబట్టి ప్రస్తుతము నిరంతర భక్తి ప్రపత్తులు గలవారినే *ఆధ్యాత్మికులు* గా పరిగణిద్దాము. 


నీతి, ధర్మం ఈ రెండు మానవుణ్ణి సంస్కారవంతుడిని చేసి రాజమార్గంలో నడిపించేవి. నీతి అంటే దేశకాల పాత్రానుగుణంగా నడుచుకునే *హితరీతి* అని, ధర్మమంటే త్రికాలా సంబదితమైన *సత్యహిత* స్వరూపమని పెద్దలంటారు.


హృదయం, మేధ మానవుడికి జీవనాధారాలు. వీటిలో ఏది లోపించినా మానవత్వం సంపూర్ణం కాదు. ఈ రెండిటి సముచిత సమన్వయమే మానవత్వం. ఆ మానవత్వ సముపార్జనకై మానవుడు చేసే ప్రయత్నాలలో గ్రంథ పఠన, సాహిత్యోపాసన లలిత ప్రక్రియలు. 


ఈ క్రమంలో మానవుడు వేదాలను, వేదాంగాలను, ఉపనిషత్తులను, పురాణములను, ధర్మ శాస్త్రములను, ఆగమములను, ఇతిహాసములను (రామాయణ, మాహా భారత, భాగవతములు) మరియు భగవద్గీతను, ఇవే గాక లోక కళ్యాణ సంబంధమైన ఇతర గ్రంథములను అధ్యయనము చేసి ఉన్నాడు, కొనసాగిస్తున్నాడు కూడా. *ఇవి అన్నియు ఇహ పర సాధనాలే*. సాటిలేని నీతి, ధర్మ దర్పణాలు, ఇది విశ్వజనీనం. వీటిలోని ప్రతి వాక్యం, ప్రతి సన్నివేశం, ప్రతి కథ, ప్రతి పాత్ర గొప్ప నీతిని, ధర్మాన్ని స్పురింప జేస్తాయి.


ఆధ్యాత్మిక సూత్రాల ప్రకారము మానవ జన్మకు నాలుగు ప్రయోజనాలున్నాయి, వీటినే చతుర్విధ పురుషార్ధాలు అని అంటారు. అవి *ధర్మం*, *అర్థం*, *కామం*, *మోక్షం*. 


అర్థం, కామం, మోక్షం వ్యక్తిగతాలు. *లోక శ్రేయస్సును కల్గించేది "ధర్మం" మాత్రమే*. అందువల్ల ప్రతి ఒక్కరూ *ధర్మాన్ని రక్షించుకోవాలి*. దీనికి ప్రతిఫలంగా ధర్మం వ్యక్తుల్ని, సమాజాన్ని రక్షిస్తుంది. *ధర్మో రక్షతి రక్షితః*. సమాజంలో *ధర్మానికి* సమాంతరంగా *ధర్మ వ్యతిరేక* శక్తులు గూడా పనిచేస్తూ ఉంటాయి.


యోగ్యులైన వారు ఆ *పాపపు శక్తులను* చూస్తూ నిర్లక్ష్యము చేయరాదు. *ధర్మ రక్షణ* చేయకపోతే జాతి నిర్వీర్యమై పోతుంది. అందులో మనమూ (సామాన్యులు, మాన్యులు) ఉంటాము. *ఆధర్మాన్ని ఉపేక్షించడము ఆత్మహత్యా సదృశమే*.


*

29, మే 2025, గురువారం

భగవద్గీత

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


                    *భగవద్గీత*

                   ➖➖➖✍️```

       (సరళమైన తెలుగులో)```


*#రెండవ అధ్యాయము:* 

 ***సాంఖ్యయోగము.* 

————————————-

*21.వ శ్లోకము:*


*”వేదావినాశినం నిత్యం య ఏవమజమన్నయమ్l*

*కథం సః పురుషః పార్థ కం* *ఘాతయతి హన్తి కమ్||”*

```

“ఓ అర్జునా! ఎవరైతే ఈ ఆత్మను సత్యమైనదిగా, నాశనము లేనిదిగా, నిత్యమైనదిగా, జన్మలేనిదిగానూ, మార్పులేనిదిగానూ, మరణము లేనిదిగానూ తెలుసుకుంటాడో, అటువంటి వాడు ఎవరిని చంపిస్తాడు. ఎవరిని ఎందుకు చంపుతాడు? ఎలా చంపుతాడు. కాబట్టి ఎవరూ ఎవరినీ చంపరు, చంపించరు.”


ఇప్పటి దాకా ఆత్మ నిత్యము అది చావదు అని చెప్పిన కృష్ణుడు, ఇప్పుడు ఆత్మ ఎవరినీ చంపదు. ఎవరినీ చంపించదు అంటే ఎవరి చావుకూ కారణం కాదు అని అంటున్నాడు. అర్జునా! నీలో ఉన్న అత్మస్వరూపము, భీష్మద్రోణ, కృపాచార్యులలోనూ ఇతర రాజులు, సైనికులలోనూ ఉన్న ఆత్మస్వరూపాలను చంపదు. వారిలో ఉన్న ఆత్మలు చావడానికి నీలో ఉన్న ఆత్మ కారణం కూడా కాదు. నీవే అందరినీ చంపుతున్నాను అని అనుకోవడం నీ భ్రమ.


ఆత్మజ్ఞానం కలిగి ఉండటమే ఆధ్యాత్మికత, కాని మనలో ఉన్న నేను అనే అహంకారము, ఈ శరీరమే నేను అనే భ్రమను కలుగచేస్తుంది. నేనే ఈ శరీరము, అంతా నేనే చేస్తున్నాను అన్న భ్రమలో ఉన్నంత కాలము, ఆత్మతత్వము అర్థం కాదు. ఆత్మ అవినాశి అనీ, నిత్యం అని అవ్యయం అనీ తెలుసుకోవాలి.


మనం అందరం నేను నేను అంటున్నాము. నేను అంటేనే ఆత్మ. నా పేరు సుబ్బారావు. నాకు ఆకలి వేసింది. నాకు కోపం వచ్చింది. అంటే మనకు తెలియకుండానే 'నేను అంటే ఈ శరీరం కాదు. నాలో ఉన్న ఆత్మ స్వరూపము' అనే జ్ఞానం మనకు సహజంగానే ఉంది. కాని దానిని గురించి మనం ఆలోచించము. ఆచరించము మనం ఏది "నేను" అని అనుకుంటున్నామో ఆ "నేను" అనే దాని స్వభావం మనకు తెలియదు. అంటే నేను అంటే మనకు తెలుసు కాని దాని స్వభావం మాత్రం తెలియదు.


ఈ "నేను" అనే ఆలోచన జంతువులకు పక్షులకు లేదు. అవి "నేను" గురించి ఆలోచించవు. ఆహారం తినడం, ఎద వచ్చినప్పుడు కలవడం, నిద్రవస్తే నిద్రపోవడం వాటి సహజలక్షణం, వాటి నేచర్, వాటికి ఆలోచించే శక్తి లేదు. కాని మనకు ఆ శక్తిని ఇచ్చాడు భగవంతుడు. ఒక డిన్నర్ జరుగుతూ ఉంది. ఒక ఆవు ఒక పులి వచ్చాయి. అవి వాటి సహజమైన ఆహారం దగ్గరకు వెళతాయి అంటే ఆవు విజిటేరియన్, పులి నాన్ వెజిటెరియన్. కాని మానవుడు అటు ఇటు చూస్తాడు. తెలిసిన వాళ్లుంటే వెజ్ లేకపోతే నాన్ వెజ్ కు జంప్. 


అంటే జంతువులు తమ స్వభావాన్ని పట్టి పనులు చేస్తాయి. మనిషి ఆలోచించి చేస్తాడు. అవకాశాన్ని బట్టి చేస్తాడు.


ఈ "నేను" అనే అహంభావం మనిషిలో కలగడం వలన "నేను అందరి కంటే గొప్ప వాడిని, వాడు నా కంటే తక్కువ" అనే భావన కలుగుతుంది. జంతువులకు ఈ భావన కలుగదు. అవి తాము అన్నీ ఒకటే అనే భావనతో ఉంటాయి. కాబట్టి ప్రతిమనిషికి నేను అంటే ఏమిటో తెలుసు కాని దాని స్వభావం తెలియదు. ఈ శరీరమే నేను అనుకుంటూ ఉంటాడు. అలాగే మనకు నేను అంటే ఏమిటో తెలుసు. నేను అనే దాని స్వభావం మనకు తెలియదు కాబట్టి కనపడే ఈ శరీరమే నేను అనుకుంటున్నాము. మన కన్ఫ్యూజన్ అంతా ఇక్కడే ఉంది. నేనే ఈ శరీరం ఈ శరీరమే నేను అనుకోవడం, నేను స్వభావం గురించి తెలుసుకోక పోవడమే అసలు సమస్య కాబట్టి సాధకుడు తెలుసుకోవలసిందేమిటంటే "నేను 

ఈ శరీరం కాదు, నేను ఆత్మస్వరూపుడను" అని తెలుసుకోవాలి. అప్పుడు ఆత్మ అవినాశి, అజం, సత్యం, అవ్యయం అని తెలుసుకునే అవకాశం ఉంది. లేకపోతే వీటి అర్థాలు తెలియవు.


కాబట్టి ఆత్మజ్ఞానం రెండు దశలుగా తెలుసుకోవాలి. ముందు ఆత్మ యొక్క స్వభావం తెలుసుకోవాలి. అదే మొదటి పాదంలో చెప్పారు. ఆత్మ అవినాశి, నిత్యం, అజం, అవ్యయం అని, ఇంక రెండవ దశ ఆ ఆత్మ నేనే, నేనే ఆత్మను అని తెలియాలి. కాబట్టి రెండు దశల్లో ఆత్మజ్ఞానం సంపాదించాలి. కాని మనం అంతా ఈ శ్లోకం చదివి ఆత్మ ఇలా ఉంటుంది అని తెలుసుకుంటాము. కనిపించని ఆత్మ కొరకు వెదుకుతుంటాము. ఆత్మ కొరకు శోధిస్తున్నాను అని చెప్పుకుంటాము. కానీ నేను ఆత్మను అని మాతం అంగీకరించరు. మనలో ఉన్న ఆత్మ కొరకు బయట ఎక్కడెక్కడో వెదుకుతుంటాము. అదే అజ్ఞానము. దానికి కావాల్సినవి శ్రవణం అంటే ఆత్మ గురించి శాస్త్రముల ద్వారా వినడం, తరువాతది మననం, విన్నదానిని మననం చేయడం. ఆత్మస్వరూపం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం. దాని గురించి ఏవైనా సందేహాలు ఉంటే గురువు ద్వారా నివృత్తి చేసుకోవడం. మూడవది నిధి ధ్యాస. అంటే ఆత్మ ఎవరో కాదు నేనే. నేనే ఆత్మను. నేను ఈ శరీరం కాదు అనే జ్ఞానం కలగడం. అప్పటిదాకా నేనే దేహము, ఈ దేహంతో అన్ని పనులు చేస్తున్నాను. అమ్మో! ఈదేహం మరణిస్తుంది అని భయపడ్డ వాడు, ఆత్మజ్ఞానం కలగగానే, మరణించేది నేను కాదు, నా శరీరం మాత్రమే. నేను ఆత్మస్వరూపుడను నాకు మరణంలేదు అని నిశ్చింతగా ఉంటాడు. పైగా మరణాన్ని ఆనందంగా ఆహ్వానిస్తాడు.


కాబట్టి అర్జునా! నీవు దేహానివి కాదు. వీళ్లందరూ దేహాలు కాదు ఆత్మస్వరూపులు. దేహాలు వేరు వీళ్లు వేరు. నీవు చంపితే దేహాలు పోతాయి కానీ వాళ్లు ఎక్కడకూ పోరు. నీవు చంపడం వాళ్లు చావడం అంతా నీ భ్రమ, మిథ్య. చంపేవాళ్లు లేరు. చంపించేవాళ్లు లేరు. ఆత్మస్వరూపము ఎవరినీ చంపదు, ఎవరినీ చంపించదు. అలా అనుకోవడం 

నీ అవివేకమమ” అని బోధించాడు కృష్ణుడు.✍️```

```(సశేషం)

   🙏యోగక్షేమం వహామ్యహం🙏

రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం, 

 (రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ.పి.హైకోర్టు.)

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

           🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

తిరుమల సర్వస్వం 254*

 *తిరుమల సర్వస్వం 254*

*ద్వాదశ ఆళ్వారులు-18*


2  *విష్ణుసాయుజ్యం* 


 అప్పటికే చోరవిద్యలో ఆరితేరిన తిరుమంగై ఆళ్వార్ తన చోరవృత్తిని యథేచ్ఛగా కొనసాగించి, ఆ వచ్చిన సొమ్ముతో శ్రీరంగంలో అచ్చెరువొందే అనేక నిర్మాణాలను చేపట్టాడు. వాటిలో కొన్ని ఇప్పటికీ చూపరులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతాయి. అత్యద్భుత కళాఖండాలు సృష్టించిన వేలాది శిల్పకారులకు కూలి డబ్బులు సైతం చెల్లించలేని దయనీయస్థితికి చేరుకున్న తిరుమంగై ఆళ్వార్ తన సర్వస్వాన్ని ధారపోసి, అన్నపానాదులు సైతం త్యజించి, తాను కలగన్న నిర్మాణాలన్నింటినీ పూర్తిచేసి, పరమ భాగవతోత్తముడు అనిపించుకున్నాడు. తదనంతరం చిరకాలం శ్రీరంగనాథుని కైంకర్యంలో తరించి, పెక్కు వైష్ణవక్షేత్రాలను సందర్శించుకొని మోక్షప్రాప్తి నొందాడు.


 *నామాంతరాలు* 


 విష్ణుభక్తి ప్రధానంగా కలిగినప్పటికీ, అనేక విద్యలలో ఆరితేరిన వాడవ్వటం వల్ల, తిరుమంగై ఆళ్వార్ కు అనేక నామాంతరా లున్నాయి. బహుముఖ ప్రజ్ఞాశాలి యైన తిరుమంగై ఆళ్వార్, ఆ నామాలన్నింటికీ సార్థకత చేకూర్చాడు. అనన్య సామాన్యమైన కవితాసామర్థ్యం కలిగి యుండటం వల్ల 'చతుష్కవి శిఖామణి' గాను; రాజాస్థానంలో నున్నపుడు శత్రువులకు సింహస్వప్నంలా ఉండటం వల్ల 'పరకాలుని' గాను; వైష్ణవభక్తులకు తలమానికంగా భాసిల్లడం ద్వారా 'తిరుమంగై ఆళ్వార్ గాను ఖ్యాతి నొందాడు. వారి పండితీప్రకర్ష ద్వారా 'ఆశుచిత్రమధురవిస్తరకవితానిర్మాణదక్షులు' అనే బిరుదును కూడా స్వంతం చేసుకున్నారు.


 *సాహిత్యసాధన* 


 వీరు తమ రచనల్లో శ్రీవేంకటేశ్వరుణ్ణి భూమ్యాకాశలపై పాదాల నుంచిన త్రివిక్రమావతారునిగా, గజేంద్రమోక్షప్రదాతగా, అష్టదిక్కుల సంరక్షకునిగా, బదరికాశ్రమవాసిగా, సప్తలోక సంచాలకునిగా ఇంకా అనేక రకాలుగా అభివర్ణించాడు. 'ఓం నమో వేంకటేశాయ' అనే అష్టాక్షరీ మంత్రాన్ని జపించిన వారికి పునర్జన్మ రాహిత్యం సంప్రాప్తిస్తుందని కూడా వీరు తమ రచనల ద్వారా స్పష్ట పరిచారు. తిరువళుక్కూత్తిరుక్కై, తిరుక్కురుందాండకం, శిరియతిరుమడల్ అనే ఇతర గ్రంథాలను కూడా వీరు రచించారు.


 శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏడవరోజు ఉదయం 'సూర్యప్రభ వాహనోత్సవం' లో తిరుమంగై ఆళ్వార్ రచించిన 'పెరియ తిరుమొళి' లోని ఎనభై పాశురాలను; అదే రోజు రాత్రి జరిగే 'చంద్రప్రభ వాహనోత్సవం' లో 'పెరియ తిరుమొళి' లోని మరో నూటనలభై పాశురాలను పారాయణం చేస్తారు.

 *విప్రనారాయణుడు (తొండరడిప్పొడి ఆళ్వార్)* 


 తమిళదేశం లోని కుంభకోణం అనే పుణ్యక్షేత్రంలో శ్రీమహావిష్ణువు *'శారంగపాణి'* గా వెలశాడు. వీరు అతృప్తామృతునిగా వాసికెక్కారు. అతృప్తామృతమంటే 'ఎంత సేవించినా తృప్తి తీరని అమృతం'. అంటే, ఈ స్వామిని ఎంతసేపు కాంక్షించినప్పటికీ తనివి తీరదన్నమాట.


 *పుష్పకైంకర్యం* 


 ఆ కుంభకోణం క్షేత్రానికి కొద్ది దూరంలో గల మండంగుడి అనే చిన్న పట్టణంలో, ఒక విప్రోత్తమునికి కలిగిన బాలునికి *'విప్రనారాయణుని'* గా నామకరణం చేశారు. ధనుర్మాసపు జ్యేష్టానక్షత్రాన, 787 వ సంవత్సరంలో ఉద్భవించిన వీరు శ్రీమన్నారాయణుడు ధరించే, *'వైజయంతిమాల'* యని పేరొందిన పుష్పమాల యొక్క అంశగా భావింపబడుతారు. సద్ర్భాహ్మణ వంశ సంజాతుడవ్వడం వల్ల, పండితుడైన తండ్రిగారి పెంపకం వల్ల విప్రనిరాయణుడు అతి చిన్నవయసు లోనే వ్యాకరణ, తర్క, మీమాంసాది సర్వశాస్త్రాలను; వేదవేదాంగాలను అభ్యసించ గలిగాడు. దానితో బాటుగా, భగవద్భక్తిని కూడా అలవరచుకున్నాడు. యుక్తవయసు కొచ్చిన విప్రనారాయణునికి తల్లిదండ్రులు వివాహ ప్రయత్నాలు ప్రారంభింపగా, తన భగవదారాధనకు సంసారజీవితం ఆటంకమవుతుందనే ఉద్దేశ్యంతో; యువకుడు వివాహ ప్రస్తావనను నిరాకరించి, ఆజన్మ బ్రహ్మచారిగా ఉండదలిచాడు. ముక్తిబాటలో పయనిస్తూ శ్రీరంగనాథుని సందర్శనార్థం 'శ్రీరంగం' చేరుకున్న విప్రనారాయణుడు రంగనాథునికి నిత్యము పుష్పకైంకర్యం చేసే లక్ష్యంతో, మరో ఆళ్వార్ శ్రీవిష్ణుచిత్తుణ్ణి స్ఫూర్తిగా తీసుకుని; ఆలయానికి సమీపంలో ఒక పుష్పవనాన్ని పెంచసాగాడు. మిక్కిలి శ్రద్ధతో సంరక్షించడం వల్ల అనతి కాలంలోనే ఆ పూదోట రంగురంగుల, పరిమళ భరిత పుష్పాలకు నెలవై, నందనవనాన్ని తలపించేంత సుందరంగా తయారై, చూపరులను ఆకట్టుకుంది. విప్రనారాయణుడు మధ్యాహ్న సమయంలో భిక్షాటనతో జీవితాన్ని గడుపుతూ; ఉదయం మరియు సాయంకాల సమయాలలో పూమాలలల్లి శ్రీరంగనాథునికి సమర్పించు కునేవాడు.


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

17-26-గీతా మకరందము

 17-26-గీతా మకరందము.

    శ్రద్ధాత్రయ విభాగయోగము

   

  -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ర్పయుజ్యతే 

ప్రశస్తే కర్మణి తథా 

సచ్చబ్దః పార్థ యుజ్యతే.


తాత్పర్యము:- ఓ అర్జునా! " కలదు' అనెడి అర్థమందును, "మంచిది' అనెడి అర్థమందును 'సత్' అను ఈ

పరబ్రహ్మనామము ప్రయోగింపబడుచున్నది. అట్లే ఉత్తమమైన కర్మమునందును ఆ 'సత్' అను పదము వాడబడుచున్నది.


వ్యాఖ్య:- పరబ్రహ్మవాచకమగు "సత్' అను పదము "ఉనికి"ని, 'శ్రేష్టత్వము'ను రెండింటిని సూచించుచున్నది. ఆ రెండు అర్థములలోగూడ ఆ పదము ప్రయోగింపబడుచుండును. (దృష్టాంతమునకు సత్ + భావము = ఉనికి).


ప్రశ్న:- పరబ్రహ్మవాచకమగు 'సత్' అను పదము ఏ యర్థములందు వాడబడుచుండును?

ఉత్తరము:- (1) "కలదు అను అర్థమందును ("ఉనికి యనెడి అర్థమందు), (2) "మంచిది' అనెడి అర్థమందును అది వాడబడుచున్నది.

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*కర్ణ పర్వం – తృతీయాశ్వాసం*


*391 వ రోజు*


*కర్ణ పర్వము తృతీయాశ్వాసం*


కర్ణుడు తన చేత చిక్కిన ధర్మరాజును వదిలి సుయోధనుడిని రక్షించడానికి వెళ్ళాడని తెలియగానే ధృతరాష్ట్రుడు " సంజయా ! కర్ణుడు అలా బుద్ధి లేని పని ఎందుకు చేసాడు. చేత చిక్కిన ధర్మరాజును చంపక ఎందుకు వదిలాడు ? సుయోధనుడు అంత మాత్రం భీమునితో యుద్ధం చేయ లేడా ? కర్ణుడు మోసం చేసాడంటావా ? సరేలే తరువాత ఏమి జరిగిందో చెప్పు అన్నాడు.


*ధర్మరాజు శిబిరముకు వెళ్ళుట*


కర్ణుడి చేత విడువ బడిన ధర్మరాజు శిబిరానికి చేరి మెత్తటి శయ్య మీద పరుండి. తన శరీరానికి తగిలిన బాణములు తీయించు కుంటూ తనకు జరిగిన పరాభవానికి బాధపడ సాగాడు. ఇంతలో నకుల సహదేవులు లోనికి వచ్చారు. ధర్మరాజు వారిని వెంటనే భీమునకు సాయంగా వెళ్ళమని చెప్పాడు. నకుల సహదేవులు భీముడికి సాయంగా వెళ్ళారు. అర్జునుడు అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అర్జునుడు వేస్తున్న తీవ్రమైన బాణములు ఎదుర్కొంటూ అశ్వత్థామ అర్జునుడి మీద గదను విసిరాడు. ఆ గదను ముక్కలు చేసి వెంటనే అర్జునుడు అశ్వత్థామ శరీరంలో పది వాడి అయిన బాణములు గుచ్చి అతడి సారధిని చంపాడు. ఆగ్రహించిన అశ్వత్థామ కృష్ణార్జునుల మీద బాణవర్షం కురిపించాడు. అర్జునుడు ఆ బాణములు మధ్యలో తుంచి అశ్వత్థామ రధాశ్వముల పగ్గములను తెంచాడు. పగ్గములు తెగిన అశ్వములు రధమును ఎటో లాక్కుని వెళ్ళాయి. అది చూసి పాండవ సేనలు జయజయ ధ్వానాలు చేసాయి. కౌరవసేన పారిపోయింది.


*కర్ణుడు భార్గవాస్త్రాన్ని ప్రయోగించుట*


కురుసేనల వెనుకడుగు చూసి సుయోధనుడు " కర్ణా ! నీవు యుద్ధరంగమున ఉండగా కురుసేనలకు ఈ దుర్గతి ప్రాప్తించింది. నీవు సరిగా యుద్ధము చేసిన పాండవులు నీకు లెక్క కాదు. నీ వివిధాస్త్రాలను ప్రయోగించి నీ పరాక్రమాన్ని చూపించు " అని పురికొల్పాడు. అప్పుడు కర్ణుడు " శల్యా ! చూసావుగా సుయోధనుడి మాటలు మన రథమును అర్జునుడి వద్దకు పోనిమ్ము. అర్జునుడిని వధించి ఈ సువిశాల సామ్రాజ్యానికి సుయోధనుడిని చక్రవర్తిని చేసి నా ప్రతాపం లోకానికి తెలియజేస్తాను " అని వెంటనే విల్లు ఎక్కు పెట్టి భార్గవాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రము నుండి వివిధ ఆకృతులలో ఆయుధాలు వచ్చి పాండవ సేనను నాశనం చేస్తోంది. రధములు విరుగుతున్నాయి. హయములు, ఏనుగులు గుట్టలుగా చచ్చి పడుతున్నాయి. రధములు విరుగుతున్నాయి. ఆ అస్త్రప్రభావానికి తాళ లేని పాండవసేనలు పరుగులు పెట్ట సాగాయి.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీమహాభాగవతావతరణము

 🌻శ్రీమహాభాగవతావతరణము 🌻


సీ.

నారాయణుని దివ్యనామాంకితమ్మునౌ 

       కావ్యమ్ము విరచించు కౌతుకమున

నొకనాటి పూర్ణచంద్రోదయోదీర్ణ సత్ 

       చంద్రగ్రహణ దివ్యసమయ మందు

సజ్జను లనుమతిన్ స్నానమ్ము పాటించ

       గంగలో నిష్ఠతో  క్రుంకు లిడియు 

వెడలివచ్చి యచటి  విమల సైకత తటిన్  

       జేరి సద్భక్తితో  కూరుచుండి

తే.

ధ్యాన యోగాన పరమేశు నాత్మ నెంచి 

యర నిమీలిత నయనాల నరయు చుండ

భక్తపోతన్న యెదుటను ప్రభల నొల్కు 

దివ్య తేజస్సు కన్పించె  దిశలు వెలుగ       19*


సీ.

మెరుపుతీగకు ప్రక్క మేఘమ్ము వోలెను

          నువిద  చెంగట నుండ నొప్పు వాడు

చంద్రమండల సుధాసారమ్ము వంటిదౌ

          చిరునవ్వు ముఖమందు చిందు వాడు

వల్లీయుత తమాల వసుధజ వోలెను

           బలు విల్లు మూపునన్ బరగు వాడు

నీలాద్రి శిఖరాన నిల్చు భానునిగను

            ఘన కిరీటము దల గల్గు వాడు

ఆ.

పుండరీకయుగము బోలు నేత్రమ్ముల 

వెడద యురము తోడ  వెలయు నట్టి

రాజముఖ్యు డొకడు  తేజోనిధీశుండు 

పోతనార్యు నెదుట పొలిచి నిలిచె          20*


క.

కనె పోతన యా పురుషుని

తనువంతయు పులకలెత్త తన్మయమతితో,

కను లెదుటను కన్పించిన

ఘను డంతట పల్కెనిట్లు గాంభీర్యముగన్     21*


✍️గోపాలుని మధుసూదనరావు🙏

కోసిన కొమ్మకే విరులు గుత్తులు విచ్చెను

 *కోసిన కొమ్మకే విరులు గుత్తులు విచ్చెను తక్షణమ్ముగన్*

ఈ సమస్యకు నా పూరణ. 



వాసన లీను మల్లెలను వాకిట నాటెను సుందరొక్కతిన్


దూసెను నాకులన్నిటిని తూకొని, రెమ్మలు కత్తిరించెనే


పోసెను నీరు చాలగను పుట్టెను లేత చిగుర్లు ముందుగాన్


కోసిన కొమ్మకే విరులు గుత్తులు విచ్చెను తక్షణమ్ముగన్.


అల్వాల లక్ష్మణ మూర్తి.

అక్షరాంకగద్య

 శు భో ద యం 🙏


అక్షరాంకగద్య!


*ఆహా ఏమి రాశావయ్యా!!!!! ఏమి స్వామి నీ మహిమ?*

      (అక్షరాంక గద్య )

మల్లికార్జున పండితుడు శ్రీశైల మల్లన్నను అచ్చులు, హల్లులతో ఎలా స్తుతించాడో 

చూడండి. పాల్కురికి సోమన్న అద్భుతంగా వ్రాశారు. 

'అ'ఖిల లోకాధార 

'ఆ'నంద పూర

'ఇ'న చంద్ర శిఖి నేత్ర  

'ఈ'డితామల గాత్ర

'ఉ'రు లింగ నిజరూప

'ఊ'ర్జితా జలచాప

'ఌ'లిత తాండవకాండ 

'ౡ'నికృతా జాండ

'ఏ'కైక వర్యేశ 

'ఐ'క్య సౌఖ్యా వేశ

'ఓం' కార దివ్యాంగ   

'ఔ'న్నత్య గుణ సంగ

'అం'బికా హృదయేశ

'అః'స్తోక కలనాశ

'క'నద హీనాభరణ 

'ఖ'ల జలంధర హరణ

'గ'ల నాయక విధేయ 

'ఘ'న భక్తి విజేయ

'జ'శ్చూల కాలధర

'చ'రిత త్రిశూల ధర

'ఛ'ర్మ యాధ్వస్త 

'ఞ'న గుణ ధళ ధీర

'ట' త్రయాది విదూర 

'ఠ' ప్రభావాకార

'డ'మరుకాది విహార 

'ఢ' వ్రాత పరిహార

'ణ' ప్రవాగార 

'త'త్త్వ జోనేత

'థ'వి దూర జవ పక్ష 

'ద'వన పాలన దీక్ష

'ధ'రణీ థవోల్లీడ 

'నంది కేశారూఢ

'ప'ర్వతీశ్వర లింగ 

'బ'హుళ భూత విలాస

'భ'క్త్వ హృద్వ నహన 

'మం'త్రస్తుతోధార 

'య'క్ష రుద్రాకార

'ర'తిరాజ బిన హంస

'ల'లిత గంగోత్తంస 

'ళ'మా విదవ్రంశ 

'వ'రద శైల విహార 

'శ'ర సంభ వాస్ఫార

'ష'ట్తింశ తత్త్వగత  

'స'కల సురముని వినుత

'హ'రి నేత్ర పదపద్మ- అంశిత భూధరపద్మ

'క్ష'ర రహిత చరిత్ర - అక్షరాంక స్తోత్ర 

శ్రీ పర్వత లింగ 

నమస్తే నమస్తే నమస్తే నమః.

-పాల్కురికి సోమనాధుడు .

దేవాలయాలు_

 *_సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు_:* 


1. _నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం._

2. _కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం._ 

3. _బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం._

4. _అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం._

5. _మొగిలీశ్వర్._

6. _కోదండరామ దేవాలయం, కడప జిల్లా._

7._సూర్యనారాయణ దేవాలయం జోగుళాంబ అలంపూరు గద్వాల జిల్లా_


*_నిరంతరం జలము ప్రవహించే దేవాలయాలు:_* 

1. _మహానంది_

2. _జంబుకేశ్వర్_ 

3. _బుగ్గరామలింగేశ్వర్_

4. _కర్ణాటక కమండల గణపతి._

5. _హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం._

6. _బెంగళూర్ మల్లేశ్వర్_ 

7. _రాజరాజేశ్వర్_ _బెల్లంపల్లి శివాలయం_

8. _సిద్ధగంగా_

9._అలంపురం_


*_నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు._* 

1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి. 

2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్,  

3. మంజునాథ్.


*శ్వాస తీసుకునే* కాళహస్తీశ్వర్


*సముద్రమే వెనక్కివెళ్లే* 

1. గుజరాత్ నిష్కళంక మహాదేవ్, 

2. 40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం.


*స్త్రీవలె నెలసరి* అయ్యే 

1. అస్సాం కామాఖ్యా అమ్మవారు,  

2. కేరళ దుర్గామాత.


*బహ్మ పేరు తో ఏకైక శివాలయాలు*

అలంపూరులో నవఁబహ్మేశ్వర ఆలయాలు

9 రూపాలలో శివలింగాలు ఉంటాయి   


*రంగులు మారే ఆలయం.* 

1. ఉత్తరాయణం, దక్షిణాయనం లో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం.

2. పౌర్ణమికి తెల్లగా, అమావాస్యకు నల్లగా రంగుమారే శివాలయం పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరం సోమేశ్వర స్వామి వారి ఆలయం.

పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్న గ మారేది ఇక్కడే.


*నిరంతరం పెరుగుతూన్న విగ్రహాలు* 

 1. కాణిపాకం,  

2. యాగంటి బసవన్న,  

3. కాశీ తిలభండేశ్వర్,  

4. బెంగుళూరు బసవేశ్వర్

5. బిక్కవోలు లక్ష్మీగణపతి


*స్వయంభువుగా* 

సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్నాధ్.

*ఆరునెలలకు ఒకసారి తెరిచే* 

1. బదరీనాథ్,  

2. కేదారనాథ్ (ఆరునెలల తరువాత దీపం వెలుగుతూనే ఉంటుంది)

3. గుహ్యకాళీమందిరం. 


*సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు* 

హాసంబా దేవాలయం, హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.


*12 ఏళ్లకు ఒకసారి*

పిడుగుపడే తిరిగి అతుక్కునే బిజిలి మహాదేవ్, హిమాచల్ ప్రదేశ్.


*స్వయంగా ప్రసాదం తినే* 

1. కేరళ శ్రీ కృష్ణ దేవాలయం.

2. బృందావనం రాధాకృష్ణ శయనమందిరం


*ఒంటి స్తంభంతో*

యుగాంతానికి గుర్తుగా ఉండే పూణే కేధారేశ్వర్, ఇక్కడ వేసవి వేడిలోకూడా నీరు చల్లగా ఊరుతుంది.


*రూపాలు మారే*

ఉత్తరఖండ్ రోజులో మూడు రూపాలు మారే దారిదేవి.


*నీటితో దీపం వెలిగించే* ఘడియ ఘాట్ మాతాజీ మందిర్, మధ్యప్రదేశ్. అమ్మవారు కలలో పూజారికి కనబడి ఇక నుండి దీపం నీటితో వెలిగించమని చెప్పింది, ఇప్పటికి అలాగే జరుగుతూ ఉంది.


*మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు* 

1. హేమాచల నరసింహ స్వామి.

2. శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి


*మనిషి వలె గుటకలు*  

వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామీ.


*అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునేత్రి.* 


*ఛాయా విశేషం* 

1. ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది.

2. హంపి విరూపాక్షేశ్వర్, గోపురం నీడ reverse order లో ఒక చోట పడుతుంది.

3. బృహదీశ్వరాలయం


*నీటిలో తేలే* విష్ణువు _(వేల టన్నుల బరువుంటుంది ), నేపాల్_


*పూరీ* 

_పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడ పడని పూరి, దేవునికి సమర్పించగానే ఘుమ ఘుమలాడే పూరి ప్రసాదం._


_ఇవి తెలిసిన కొన్ని మహిమాన్విత దేవాలయాలు మాత్రమే._ *_ఇటువంటివి దేశం లో కొన్ని వేల దేవాలయాలు నిర్మాణం చేశారు (సృష్టి చేశారు)విశ్వకర్మ_ _పరమాత్మ వంశీయులైన విశ్వబ్రాహ్మణ_ _శిల్పాచార్యులు వారికి పాదాభివందనములు_*

Panchang



 

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🌷గురువారం 29 మే 2025🌷*


``

            *రామాయణం*


ఒకసారి చదివినంత 

మాత్రాన మన సమస్త 

పాపాలని తీసేస్తుంది...

``

     *వాల్మీకి రామాయణం*

            *52వ భాగం*

                 

*సంభ్రమః త్యజతాం ఏష సర్వైః వాలి కృతే మహాన్ |*

*మలయోఽయం గిరివరో భయం న ఇహ అస్తి వాలినః ||*

```

అప్పుడు వాక్య కోవిదుడైన హనుమంతుడు సుగ్రీవుడితో… 

“సుగ్రీవా! ఎందుకయ్యా ఇలా శిఖరముల మీద ఎగురుతున్నావు, ఇక్కడికి వాలి రాడు కదా. వాలికి ఉన్న శాపం వలన ఈ పర్వతం మీదకి వస్తే మరణిస్తాడు. నీకు కనపడినవాడు వాలి కాదు, మరి ఎందుకీ గెంతులు. నువ్వు మహారాజుగా ఉండవలసిన వాడివి, ఎవరో ఇద్దరిని చూసి నిన్ను చంపడానికే వచ్చారని అనుకొని గెంతులు వేశావు. ఏమిటయ్యా ఈ చపలత్వం. నడక చేత, అవయవముల కదలిక చేత, మాట చేత, అవతలివారు ఎటువంటి స్థితిలో ఉన్నారో, ఎందుకు వచ్చారో, వారి మనస్సులలో ఏ భావన ఉన్నదో కనిపెట్టి, దానికి అనుగుణంగా నడిచి, తనని, తన ప్రజలని రక్షించుకోగల సమర్ధత ఎవడికి ఉన్నదో వాడు రాజు. అంతేకాని కనపడ్డ ప్రతివాడిని చూసి ఇలా పారిపోతే, నువ్వు రేపు రాచపదవి ఎలా నిర్వహిస్తావు సుగ్రీవా?” అని అడిగాడు. 


అప్పుడు సుగ్రీవుడు… “హనుమా! నేను ఎందుకు భయపడుతున్నానో తెలుసా. రాజులైనవారు చాలా రహస్యంగ ప్రవర్తిస్తారు. వాలికి నేను శత్రువుని కనుక, నన్ను రాజ్యం నుండి బయటకి పంపాడు కనుక, తాను ఈ కొండమీదకి రాలేడు కనుక, నన్ను సంహరించడం కోసమని తనతో సమానమైన, బలవంతులైన ఇద్దరు క్షత్రియులని ముని కుమారులలా ఇక్కడికి పంపిస్తున్నాడు. అందుకే వాళ్ళు నిర్భయంగా చెట్ల వంక చూస్తూ వస్తున్నారు. వాళ్ళ చేతుల్లో కోదండాలు ఉన్నాయి, అందుకని నేను భయపడుతున్నాను. అంతగా చెబుతున్నావు కాబట్టి, హనుమా! నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు ఈ రూపాన్ని విడిచిపెట్టి వేరొక రూపాన్ని పొందు. ఆ రూపంతో ఆ ఇద్దరి దగ్గరికి వెళ్ళు, నా వైపుకి తిరిగి మాట్లాడు. వాళ్ళు నాయందు ప్రేమతో వస్తున్నారా, శత్రుత్వంతో వస్తున్నారా అన్న విషయాన్ని బాగా కనిపెట్టు. ప్రేమతో వస్తున్నవారైతే వాళ్ళని తీసుకురా, లేకపోతే మనం వేరే మార్గాన్ని ఆలోచిద్దాము. అందుకని నువ్వు తొందరగా వెళ్ళు!” అని సుగ్రీవుడు అన్నాడు.```


*కపి రూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజః।*

*భిక్షు రూపం తతో భేజే శఠబుద్ధితయా కపిః॥*

```

అప్పుడు హనుమంతుడు తన కపి రూపాన్ని విడిచిపెట్టి, భిక్షు రూపాన్ని(సన్యాసి రూపాన్ని) పొంది, శఠ బుద్ధితో బయలుదేరి రాముడి దగ్గరికి వెళ్ళాడు. సన్యాసి రూపంలో ఉన్న హనుమంతుడు రాముడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి… 

“మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు రాజర్షుల లాగ, తాపసుల లాగ ఉన్నారు. విశేషమైన కాంతితో ఉన్నారు. మీరు నడిచి వస్తుంటే, మిమ్మల్ని చూసి మృగాలన్నీ పారిపోతున్నాయి. మిమ్మల్ని చూసి ఇక్కడున్న సర్వ భూతములు భయపడుతున్నాయి. మీ యొక్క కాంతి చేత ఇక్కడున్న నదులలోని జలములు శోభిస్తున్నాయి. మీరు నడుస్తుంటే, సింహాలు నడుస్తున్నాయా? అన్నట్టుగా ఉంది. సింహాల యొక్క బలాన్ని అధిగమించిన స్వరూపంతో ఉన్నారు. మీ చేతులలో కోదండాలు, బాణాలు ఉన్నాయి. మిమ్మల్ని చూస్తుంటే ఎటువంటి శత్రువునైనా సంహరించగలిగిన పరాక్రమము చేత విరాజిల్లుతున్న వారిలా కనపడుతున్నారు. ఠీవిగా నడిచే ఎద్దుల్లా నడుస్తున్నారు. నడుస్తున్న పర్వతాల్లా ఉన్నారు. పద్మములవంటి కన్నులతో ఉన్నారు, జటామండలాలు కట్టుకొని ఉన్నారు. ఈ రూపములు ఒకదానితో ఒకటి సరిపోవడం లేదు. మీరు సూర్య-చంద్రుల్లా ఉన్నారు, విశాలమైన వక్షస్థలంతో ఉన్నారు. మనుష్యరూపంలో ఉన్న దేవతల్లా ఉన్నారు. పెద్ద భుజాలతో ఉన్నారు. మీ బాహువుల చేత ఈ సమస్త పృధ్వీ మండలాన్ని రక్షించగలిగిన వారిలా కనపడుతున్నారు. అటువంటి మీరు ఇలా ఎందుకు నడిచి వస్తున్నారు. దీనికి కారణం ఏమిటి. మీ మొలలకి చాలా పెద్ద కత్తులు కట్టి ఉన్నాయి. ఆ కత్తుల్ని చూస్తే భయం వేస్తుంది.


నేను సుగ్రీవుడి యొక్క సచివుడిని, నన్ను హనుమ అంటారు. అన్నగారైన వాలి చేత తరమబడినటువంటి మా రాజైన సుగ్రీవుడు రాజ్యాన్ని విడిచిపెట్టి ఋష్యమూక పర్వత శిఖరముల మీద నలుగురు మంత్రులతో కలిసి ఉంటున్నాడు. ఆయన ధర్మాత్ముడు, మీతో స్నేహం చెయ్యాలని అనుకుంటున్నాడు. అందుకని మీరు మా ప్రభువుతో ఎందుకు స్నేహం చెయ్యకూడదు! నేను ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాను, మీరు నాతో మాట్లాడడంలేదు. మీరు మాట్లాడితే వినాలని ఉంది. మీరు మాట్లాడండి.” అని చెప్పి హనుమ నిలబడిపోయాడు.


రాముడిని చూడగానే సన్యాసి రూపంలో ఉన్న హనుమంతుడు ఆ సన్యాసి రూపాన్ని విడిచిపెట్టేసి తన నిజ స్వరూపానికి వచ్చేశాడు. ఎందుకంటే, ఆయనకి రాముడు 

శ్రీ మహా విష్ణువుగా దర్శనమిచ్చారు.


అప్పుడు రాముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు… “చూశావా లక్ష్మణా, హనుమ ఎలా మాట్లాడాడో. ఆయన మాటలు విన్నావా. ఇలాగ మాట్లాడేవాడు మంత్రిగా దొరికితే కార్యాలు ఎందుకు నెరవేరవు! ఇలా మాట్లాడేవాడు ఎదురుగా వచ్చి నిలబడితే, కత్తి పట్టి ప్రాణం తీసేద్దాము అనుకున్న వ్యక్తి కూడా కత్తిని ఒరలో పెట్టేస్తాడు. ఇటువంటి వ్యక్తి మంత్రిగా కలిగిన ఆ రాజు ఎంత అదృష్టవంతుడు. ఈయన మాట్లాడిన విధానాన్ని చూస్తే, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం తెలియకపోతే ఇలా మాట్లాడలేడు. అన్నిటినీ మించి ఈయన వ్యాకరణాన్ని చాలాసార్లు చదువుకున్నాడు. ఈయనికి ఉపనిషత్తుల అర్ధం పూర్తిగా తెలుసు. అందుకనే ఈయన మాట్లాడేటప్పుడు కనుబొమ్మలు నిష్కారణంగా కదలడంలేదు, లలాటము కదలడం లేదు. వాక్యము లోపలినుంచి పైకి వచ్చేటప్పుడు గొణుగుతునట్టు లేదు, గట్టిగా లేదు. ఈయన మాటలు ప్రారంభించిన దగ్గరి నుంచి చివరి వరకూ ఒకే స్వరంతో పూర్తి చేస్తున్నారు. కాళ్ళు, చేతులు, శరీరాన్ని కదపడం లేదు. ఏ శబ్దాన్ని ఎలా ఉచ్ఛరించాలో, ఎంతవరకు ఉచ్ఛరించాలో అలా పలుకుతున్నారు. ఇటువంటి వ్యక్తి సుగ్రీవుడికి సచివుడిగా దొరికి, మన దగ్గరికి వచ్చి సుగ్రీవుడితో స్నేహం కలపాలని కోరుకుంటున్నాడు కనుక, మనం అనుకున్నటువంటి కోరిక సిద్ధించినట్లే. మనం ఎవరిమో, ఈ అరణ్యానికి ఎందుకు వచ్చామో హనుమకి చెప్పు లక్ష్మణా” అన్నాడు.


అప్పుడు లక్ష్మణుడు. “అయ్యా హనుమా! ఈయన దశరథుడి కుమారుడైన రాముడు. ఆ దశరథుడు పరమ ధర్మాత్ముడై రాజ్యాన్ని పరిపాలించాడు. ఆయన ఉన్నప్పుడు ఎవరూ ఆయనని ద్వేషించలేదు, ఆయనా ఎవరినీ ద్వేషించలేదు. చతుర్ముఖ బ్రహ్మగారు ఎలా అయితే అందరి చేత గౌరవింపబడతారో, అలా దశరథుడు లోకులందరి చేత గౌరవింపబడినవాడు. అటువంటి తండ్రి మాటకి కట్టుబడి రాముడు అరణ్యానికి వచ్చాడు. అప్పుడు ఎవరో ఒక రాక్షసుడు రాముడి భార్య అయిన సీతమ్మని అపహరించాడు. సీతమ్మని వెతికే ప్రయత్నంలో ఉండగా, మాకు కబంధుడనే రాక్షసుడు కనపడ్డాడు. ఆయనని సంహరించి, శరీరాన్ని దహిస్తే, ఆయన మళ్ళి ధనువు అనే శరీరాన్ని పొంది మమ్మల్ని సుగ్రీవుడితో స్నేహం చెయ్యమని చెప్పాడు. అందుకని మేము ఇక్కడికి వచ్చాము. నేను లక్ష్మణుడిని, రాముడి తమ్ముడు అని లోకం అంటుంది, కాని రాముడి గుణములచేత తృప్తి పొందినవాడనై, ఆ గుణములచేత విశేషమైన ఆనందమును పొందినవాడనై రాముడికి దాసుడిని అనుకుంటాను. లోకంలో కష్టంలో ఉన్నవారందరూ రాముడికి శరణాగతి చేశారు, అటువంటి రాముడు ఈనాడు సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాడు. అందుకని మేము సుగ్రీవుడిని మిత్రుడిగా పొందాలని అనుకుంటున్నాము” అన్నాడు.

```

*ఈదృశా బుద్ధి సంపన్నా జితక్రోధా జితేఇంద్రియాః।*

*ద్రష్టవ్యా వానరేఇంద్రేణ దిష్ట్యా దర్శనం ఆగతాః॥*

```

అప్పుడు హనుమంతుడు “జితేంద్రియులై, ధర్మాత్ములైన రామలక్ష్మణులని చూడడం మా సుగ్రీవుడికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. రండయ్యా మిమ్మల్ని తీసుకెళతాను” అని చెప్పి, రామలక్ష్మణులనిద్దరిని తన వీపు మీద కూర్చోబెట్టుకుని ఆ ఋష్యమూక పర్వత శిఖరముల మీదకి ఎక్కాడు.```


        *రేపు... 53వ భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

గురువారం🪷* *🌹29 మే 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐*

      *🪷గురువారం🪷*

    *🌹29 మే 2025🌹*

   *దృగ్గణిత పంచాంగం*                    


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*జ్యేష్ఠ మాసం - శుక్ల పక్షం*


*తిథి  : తదియ* రా 11.18 వరకు ఉపరి *చవితి*

*వారం    : గురువారం* ( బృహస్పతివాసరే )

*నక్షత్రం   : ఆరుద్ర* రా 10.38 వరకు ఉపరి *పునర్వసు*


*యోగం : శూల* మ 03.47 వరకు ఉపరి *గండ*

*కరణం   : తైతుల* మ 12.31 *గరజి* రా 11.18 ఉపరి *వణజి*

*సాధారణ శుభ సమయాలు:* 

                *-ఈరోజు లేవు-*

అమృత కాలం  : *మ 01.24 - 02.53*

అభిజిత్ కాలం  : *ప 11.39 - 12.31*


*వర్జ్యం            : ఉ 08.14 - 09.43*

*దుర్ముహూర్తం  : ఉ 09.55 - 10.47 మ 03.07 - 03.59*

*రాహు కాలం    : మ 01.43 - 03.20*

గుళికకాళం       : *ఉ 08.50 - 10.27*

యమగండం     : *ఉ 05.34 - 07.12*

సూర్యరాశి : *వృషభం* 

చంద్రరాశి : *మిధునం*

సూర్యోదయం :*ఉ 05.41*

సూర్యాస్తమయం :*సా 06.46*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.34 - 08.10*

సంగవకాలం         :*08.10 - 10.47*

మధ్యాహ్న కాలం    :     *10.47 - 01.23*

అపరాహ్న కాలం    : *మ 01.23 - 03.59*


*ఆబ్ధికం తిధి         : జ్యేష్ఠ శుద్ధ తదియ*

సాయంకాలం       :*సా 03.59 - 06.36*

ప్రదోష కాలం         :  *సా 06.36 - 08.47*

రాత్రి కాలం           :*రా 08.47 - 11.43*

నిశీధి కాలం          :*రా 11.43 - 12.27*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.06 - 04.50*

--------------------------------------------------

       *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌷ఓం శ్రీ గురు దత్తాయ నమః🌷*


*షడ్భుజమూర్తే భవ శరణమ్ ।*

*షడ్యతివర భవ శరణమ్ ।*

*దణ్డకమణ్డలు గదాపద్మకర ।* 

*శఙ్ఖచక్రధర భవ శరణమ్ ॥*


*ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

      *న్యాయపతి వేంకట*

    *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

 🌹🌷🌹🌷🌹🌷🌷🌹

సమస్త జ్వరాలు హరించుట కొరకు

 సమస్త జ్వరాలు హరించుట కొరకు పురాతన వైద్య ప్రక్రియ - 


       మొదట ఒక రోగిని నులకమంచం పైన పడుకోబెట్టాలి . మంచానికి నాలుగు వైపులా గాలి దూరకుండా బట్టలు కట్టాలి. తంగేడు అన్ని భాగాలు ( సమూలం ) బాగా నలుగగొట్టి ఒక వెడల్పాటి బేసిన్ లో వేసి నిండా నీరుపోసి బాగా మరిగించి ఆ బేసిన్ ని తీసుకొచ్చి మంచం క్రింద పెట్టాలి. దానిపైన పెట్టిన మూత తీయగానే వేడివేడి నీటిఆవిరి అడుగు నుండి నులకమంచం సందుల నుండి పైన పడుకున్న రోగి శరీరానికి తగులుతూ ఉండాలి. ఆ బేసిన్ ని క్రమంగా పాదాల దగ్గర నుండి కొంచం కొంచం జరుపుతూ తలవెనక వైపు కి లాగుతూ ఉండాలి. రోగిని కొద్దిసేపు వెల్లకిలా , కొద్దిసేపు బోర్లా ఇలా పడుకోబెడుతూ ఇలా మార్చి మార్చి చేస్తూ ఆవిరి రోగి శరీరం మొత్తానికి తగులుతూ ఉంటే తంగేడు ఆవిరికి శరీరం నుండి చెమట కారిపోయి అన్నిరకాల విషజ్వరాలు మటుమాయం అవుతాయి. 


          శరీరం బాగా నొప్పులతో కూడి ఉన్నప్పుడు కూడా ఈ పద్ధతిని ఆచరించడం వలన నొప్పుల నుంచి పూర్తి ఉపశమనం లభిస్తుంది.


   గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 50 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

గుడికి వెళ్ళడం

 గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు.


ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ


ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.


అసలు గుడి ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడింది?


దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి, ఈ విషయమై


వేదాలు ఏం చెప్తున్నాయి మొదలైన అంశాలు


తెలుసుకోవడం చాలా అవసరం.


మనదేశంలో చిన్నా పెద్దా వేలాది దేవాలయాలు


ఉన్నాయి. అయితే అవన్నీ వైదిక దేవాలయాల


పరిగణనలోకి రావు. నియమాలను పాటించి,


నిర్దుష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే గురువులు పరిగణిస్తారు. అలాంటివే అత్యంత


ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా


పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు


మరింత పునీతమయ్యాయి. స్థలమహత్యాన్ని


సంతరించుకున్నాయి.


భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాసయ్యేచోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అందుకే అలాంటి గుళ్ళలో అడుగు పెట్టగానే తనువూ, మనసూ ప్రశాంతత పొందుతాయి.


దేవాలయ గర్భగృహంలో ఉత్క్రుష్టమైన ఆకర్షణా తరంగాలు కేంద్రీకృతమైన చోట మూలవిరాట్టును నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని (రాగి రేకు) నిక్షిప్తం చేసి ఉంచుతారు. రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది. ఆవిధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది. అందువల్ల రోజూ గుడికి వెళ్ళి మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి. ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళేవారిలో ఆ శక్తి సోకినా గమనించదగ్గ తేడా తెలీదు. కానీ నిత్యం గుడికి వెళ్ళేవారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది.


ఇకపోతే గర్భగుడి మూడువైపులా పూర్తిగా మూసి ఉండి, ఒక్కవైపు మాత్రమే తెరిచి ఉంటుంది. అందువల్ల గర్భాలయంలో, ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే.


ఆలయాల్లో గంటలు మోగిస్తారు. వేద మంత్రాలు పఠిస్తారు. భక్తి గీతాలు ఆలపిస్తారు. ఈ మధుర ధ్వనులు శక్తిని సమకూరుస్తాయి.


గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, కర్పూర హారతి, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చర్య జరపడంవల్ల శక్తి విడుదల అవుతుంది.


మూల విరాట్టును ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడిగంటలు, మంత్ర ఘోష, పూల పరిమళాలు, కర్పూరం, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధం, తీర్థ ప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిసి ఎనలేని మేలు జరుగుతుంది.


గుడిలో దేవుడికి కొబ్బరికాయ , అరటిపళ్ళు నైవేద్యం పెడతారు. ఈ కొబ్బరిని, అరటిపళ్ళని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. వీటిని సేవించడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి.


తీర్థంలో పచ్చ కర్పూరం (Cinnamomum camphora) యాలుకలు (Cardamom) సాంబ్రాణి (సంబరేను చెట్టునుండి వచ్చే ధూపద్రవ్యం లేదా సాంబ్రాణి తైలము - benzoin), తులసి పత్రాలు (holy basil), లవంగాలు (Clove) మొదలైనవి కలుపుతారు. ఆయా పదార్థాలు అన్నీ ఔషధగుణాలు కలిగినవే. అలా గుడికి వెళ్ళినవారు సేవించే తీర్థం ఎంతో మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆయురారోగ్యాలను ఇస్తుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది.


ఇప్పుడు చాలామంది పాటించడంలేదు కానీ పూర్వం ఆలయానికి వెళ్ళేప్పుడు పురుషులు చొక్కా (షర్టు) లేకుండా వెళ్ళేవారు. దాంతో ఆలయ ప్రాంగణంలో ఉండే శక్తి తరంగాలు వేగంగా పురుషుల శరీరంలో ప్రవేశిస్తాయి. స్త్రీలు నిండుగా దుస్తులు వేసుకుని అనవసరమైన చూపులు తమపై పడకుండా జాగ్రత్త పడటం మన సంప్రదాయం కనుక అందుకు బదులుగా నగలు ధరించి వెళ్ళేవారు.


లోహానికి శక్తి తరంగాలను త్వరితంగా గ్రహించే శక్తి ఉంటుంది. ఆవిధంగా స్త్రీపురుషులిద్దరికీ ప్రయోజనం కలుగుతుంది.


భక్తులు గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతుంటుంది. కర్పూరహారతి వెలిగిస్తారు. గంటలు మోగుతాయి.తీర్థ ప్రసాదాలు ఇస్తారు. అలా అన్ని పాజిటివ్ ఎనర్జీలూ సమీకృతమై భక్తులకు ఆనందం, ఆరోగ్యం లభిస్తాయి. మనలో దివ్య శక్తి ప్రవేశించి, తేజస్సు అనుభూతికొస్తుంది. కనుక ఆలయానికి వెళ్ళడం కాలక్షేపం కోసం కాదు, ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి.🙏


సేకరణ C .Narendra Babu

అత్యంత పవిత్రమైనవి

 "ఉచ్చిష్టం శివనిర్మాల్యం 

వమనం శవకర్పటమ్!*

కాకవిష్ఠా సముత్పన్నః 

పంచైతేఽతి పవిత్రకాః!!"*


ఎంగిలి, శివ నిర్మాల్యం, వాంతి(కక్కినది),శవము పై కప్పిన బట్ట , కాకి రెట్ట నుండి పుట్టినది అత్యంత పవిత్రములు. సమన్వయం?                                                


1) ఉచ్చిష్టం(ఎంగిలి) అంటే దూడ తాగిన తరువాత పితికిన ఆవుపాలు. దూడ ఎంగిలి చేసినా అన్ని వైదిక, దైవిక కార్యక్రమాలకీ లౌకిక కార్యక్రమాలకీ అత్యంత శ్రేష్ఠం, పవిత్రం, పంచామ్రుతాలలో మొదటిగా వెలుగొందేది.


2) శివనిర్మాల్యం(శివార్చనానంతరం తీసిన ఆ పూజాద్రవ్యాలు), శివుని జటాజూటముల నుండి జాలువారే గంగ. శివుని అభిషేకించిన, పూజించిన ద్రవ్యములు శివ స్పర్శచెందినదేదైనా పవిత్రమే. విధిపూర్వకముగా గ్రహిస్తే అవి అత్యంత మహిమాన్వితములు.


3) వమనం(వాంతి లేక కక్కినది)అంటే రకరకాల పూలనుండి తేనెటీగలు మకరందం సేకరించి తేనెపట్టులో దాచడం. త్రాగిన తేనెను తేనెపట్టులో కక్కుట ద్వారా దాచినా అది వైదిక, అర్చనాది కార్యక్రమాలకు అత్యంత పవిత్రమైనదే. పంచామృతాలలో ఒకటి.


4)శవకర్పటం(శవంపై కప్పబడిన వస్త్రం)అంటే చనిపోయిన పట్టు పురుగు చుట్టూ ఉండే పట్టుగూడు నుండి తీసిన దారముతో నేసిన పట్టుపుట్టం. పట్టు దారం తీయడానికి పట్టుకాయలో దాగున్న పట్టుపురుగుని చంపి, అది చనిపోయిన తరువాత పట్టునూలు సేకరించినప్పటికీ పట్టువస్త్రం శుభకరమే.


5) కాకవిష్ఠాసముత్పన్నం(కాకి రెట్ట నుండి పుట్టినది)దేవాలయ, తటాక, నదీతీర, మైదాన, అరణ్యాలలోని రావి చెట్లు కాకి రెట్ట(విసర్జనం)ద్వారా స్వతస్సిద్ధంగా మొలకెత్తి పెరుగుతాయి. అయినాకూడా రావి పరమ పవిత్రం సాక్షాత్ విష్ణు స్వరూపం, త్రిమూర్తి స్వరూపం. యఙ్ఞ యాగాది క్రతువులలో సమిధగా సమర్పించుటకు అత్యంత అర్హమైనది. 


దోషములు కూడుకున్నవిగా కనపడ్డా ఈ ఐదు వస్తువులూ అత్యంత పవిత్రమైనవి.

28, మే 2025, బుధవారం

*తీర్థ యాత్ర

 🔔 *తీర్థ యాత్ర* 🔔


తిరుమల తిరుచానూరు శ్రీకాళహస్తి కాణిపాకం యాత్ర ఎలా చేయాలి..?!* కలియుగప్రత్యక్షదైవం అయిన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే జన్మధన్యం అయినట్టే అని భావిస్తారు. అందుకే ఏడాదికి ఓసారి కొందరు, ఏడాదికి రెండుసార్లు మరికొందరు, వీలు కుదిరినప్పుడల్లా ఇంకొందరు స్వామి సన్నిధికి క్యూ కట్టేస్తారు.అయితే తిరుమల వెళ్లొచ్చేవారిలో ఓ సందేహం ఉంటుంది. అలాంటి వారికోసమే ఈ కథనం...


తిరుమల యాత్రాక్రమం ఏంటి?


ఎక్కడి నుంచి ప్రారంభించాలి?


ఏ క్షేత్రం మొదట దర్శించుకోవాలి?


కొండపైకి వెళ్లి స్వామిని చూసి కిందకు రావాలా?


తిరుమల చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు చూసేసి కొండెక్కాలా?


ఈ ప్రశ్నలకు సమాధానంగా..తిరుమల యాత్ర 7 స్టెప్స్ లో చేయాలని చెబుతారు ఆధ్యాత్మిక వేత్తలు. అవేంటో చూద్దాం...


 *కాణిపాకం* 


తిరుమల యాత్ర కాణిపాకం నుంచి ప్రారంభించాలి. ఏ కార్యక్రమం ప్రారంభించినా ముందుగా వినాయకుడిని తల్చుకుంటాం కదా. అలానే ముందుగా కాణిపాకం స్వామిని దర్శించుకోవాలంటారు. గణపతి ప్రార్థన చేస్తే లక్ష్మీదేవి వెంటనే కరుణిస్తుందంటారు ఆధ్యాత్మిక వేత్తలు


 *తిరుచానూరు* 


అయ్యవారి కన్నా ముందు అమ్మవారిని ప్రశన్నం చేసుకోవాలి. అందుకే శ్రీవారి దర్శనం కన్నా ముందు తిరుచానూరు వెళ్లి పద్మ సరోవరంలో స్నానం ఆచరించి..పద్మావతి అమ్మవారిని దర్శించుకోవాలి


 *కపిలతీర్థం* 


తిరుచానూరు నుంచి కపిలతీర్థం వెళ్లి అక్కడ స్నానమాచరించి స్వామిని దర్శించుకుంటే గత జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయంటారు. అనంతరం అక్కడి నుంచి కొండెక్కాలి


 *తలనీలాలు* 


కొండపైకి వెళ్లాక ఇంకేముందు స్వామివారిని దర్శించుకుంటే చాలు అనుకోవద్దు..ముందుగా తలనీనాలు సమర్పించండి.


 *పుష్కరిణిలో స్నానం* 


స్వామివారి పుష్కరిణిలో స్నానమాచరించే భాగ్యాన్ని పొందమంటారు ఆధ్యాత్మిక వేత్తలు


 *వరాహస్వామి* 


 *వరాహస్వామి దర్శనం చేసుకోకుండా శ్రీనివాసుడి దర్శనం చేసుకోకూడదు.* 


వరాహ దర్శనాత్ పూర్వం శ్రీనివాసం నమేన్నచ

దర్శాత్ ప్రాగ్ వరాహస్య శ్రీనివాసో న తృప్యతి


వరాహస్వామి కన్నా ముందుగా వచ్చి శ్రీవారిని దర్శించుకుంటే దానికి ఫలితం ఉండదని ఈ శ్లోకం అర్థం.


తమిళులు వరాహస్వామిని జ్ఞానం ఇచ్చే స్వామిగా భావిస్తారు. శరీరంలో ఉన్న అన్నమయకోశం, విజ్ఞానమయకోశం, ఆనందమయకోశం అని ఉంటాయి. వరహాస్వామి దర్శనంతో జీవుడు విజ్ఞానమయ కోశంలోకి ప్రవేశించి ఆ తర్వాత ఆనందకోశంలో ఉన్న స్వామిని దర్శించుకోవడం సాధ్యమవుతుందని అర్థం. అందుకే వరాహస్వామిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనానికి వెళ్లాలి. ఒకవేళ వరాహస్వామిని దర్శించుకోకుండా తిరుమల ఆలయంలోపలకు వెళితే ఓ స్తంభంపై వరాహస్వామి కనిపిస్తారు.


 *శ్రీవారి దర్శనం* 


వరాహస్వామివారిని దర్శించుకున్నాక శ్రీనివాసుడిని దర్శించుకోవాలి


 *శ్రీ కాళహస్తి* 


చివరగా కొండదిగి కిందకు వచ్చిన తర్వాత శ్రీకాళహస్తి దర్శనంతో తిరుమల యాత్ర ముగుస్తుంది. చివరిగా శ్రీ కాళహస్తి దర్శనం ఎందుకు అనే సందేహం వచ్చి ఉండొచ్చు. పురాణాల్లో దీనికి సంబంధించి ఏమీ లేదు. అయితే సాధారణంగా సర్పానికి సంబంధించిన పూజలు ఏమైనా చేసినప్పుడు గతంలో చేసిన దోషాలకు ప్రాయశ్చిత్తం చేసుకునే శ్లోకం ఉంటుంది. ప్రాయశ్చిత్తం అంటే దోషంతో సమానం అని అందుకే ఆఖరిగా శ్రీ కాళహస్తి దర్శనం చేసుకోవాలని చెబుతారు. అయితే దీనికి ప్రామాణికం ఏమీ లేదు. ప్రచారం అంతే. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.!!

🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

అధర్మాచరణ వలన

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝 *అధర్మేణైధతే తావత్*

           *తతో భద్రాణి పశ్యతి|*

           *తతః సపత్నాన్ జయతి*

           *సమూలస్తు వినశ్యతి||*


తా𝕝𝕝 *అధర్మంతో కొన్ని సార్లు వృద్ధిచెందువాడు మంచి సుఖములను చవిచూచును.... తన శత్రువులనూ గెలుచును.... అయితే ఆ అధర్మాచరణ వలన అనతికాలంలోనే సమూలముగా నాశనము కావడము తథ్యము*....

                     

 ✍️🌹💐🌸🙏

⚜ శ్రీ కులస్వామిని భవానీ వాఘజై ఆలయం

 🕉 మన గుడి : నెం 1124


⚜ మహారాష్ట్ర : తేరావ్ - చిప్లున్ 


⚜ శ్రీ కులస్వామిని భవానీ వాఘజై ఆలయం



💠 శ్రీ భవానీ వాఘ్‌జై ఆలయం, తేరావ్ అనేది భవానీ మరియు వాఘ్‌జై దేవతలకు అంకితం చేయబడిన దేవాలయం . 

ఇది తాలూకా చిప్లున్ , జిల్లా తేరావ్ గ్రామంలో ఉంది . రత్నగిరి , మహారాష్ట్ర అసలు ఆలయం సుమారు 1860లో నిర్మించబడింది.



💠 మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలయాన్ని మహారాష్ట్రలోని పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా ప్రకటించింది. 


💠 ఈ ఆలయం 123 అడుగుల పొడవు, దక్షిణం వైపు 76 అడుగులు మరియు ఉత్తరం వైపు 36 అడుగులు వెడల్పు కలిగి ఉంది. పునాది ఎత్తు 4 అడుగులు, అంతర్గత ఎత్తు 22 అడుగులు. ఆలయంలో భవానీ, వాఘ్‌జై, కల్కై మరియు నవదుర్గ దేవతలతో పాటు శివశంకర్ కూడా ఉన్నారు. 


🔆 చరిత్ర


💠 శ్రీ భవానీ వాఘ్‌జై ఆలయాన్ని 350 సంవత్సరాల క్రితం పూర్వీకులు నిర్మించారు. దీనిని మొదట 1839 లో పునర్నిర్మించారు. సంవత్సరాలుగా, ఆలయం తీవ్ర శిథిలావస్థకు చేరుకుంది, దీని ఫలితంగా గ్రామస్తులు దాని స్థానంలో కొత్త ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. 


🔅2002లో, టెరవ్ కమ్యూనిటీ ఆలయాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించింది మరియు శ్రీ కులస్వామిని భవానీ వాఘ్‌జై ట్రస్ట్ స్థాపించబడింది. 

ఈ గ్రామానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఆలయ పునర్నిర్మాణ ఖర్చులకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 

నగరాల్లో పనిచేసే వారు తమ ఒక నెల జీతం, పదవీ విరమణ చేసిన వారు తమ ఒక నెల పెన్షన్‌ను, వ్యాపారవేత్తలు తమ ఒక నెల ఆదాయాన్ని, రైతులు మరియు కార్మికులు ఒక్కొక్కరు రూ. 1000 విరాళంగా అందించారు. 

భారతి మహారాజ్, ఆలండి ఆశీర్వాదంతో ఆలయ పునర్నిర్మాణం 14 మే 2003న ప్రారంభమైంది. 


💠 ఈ ఆలయం 123 అడుగుల పొడవు, దక్షిణం వైపు 76 అడుగులు మరియు ఉత్తరం వైపు 36 అడుగులు వెడల్పు కలిగి ఉంది. 

పునాది ఎత్తు 4 అడుగులు, అంతర్గత ఎత్తు 22 అడుగులు. 

ఆలయంలో 4 విభాగాలు ఉన్నాయి. ఈ విభాగాలలో శ్రీ భవానీ, శ్రీ శివశంకర్, నవదుర్గ, వాఘ్‌జై మరియు కల్కై వంటి వివిధ దేవతలు ఉన్నారు. 

ఈ నాలుగు విభాగాలలో దక్షిణ భారత శైలుల గోపురాలు జాగ్రత్తగా రూపొందించబడ్డాయి. 

ఒక గోపురంలో శ్రీ హనుమంతుడి చిన్న విగ్రహం ఉంది. 


💠 భవానీ దేవత విగ్రహం పైన ఉన్న గోపురం నేల నుండి 55 అడుగుల ఎత్తులో ఉంది. ఆలయంలో సుమారు 2000 మంది కూర్చోగల సామర్థ్యం ఉన్న పెద్ద హాలు ఉంది, 100 అడుగుల బాల్కనీ ఉంది. ఆలయం 40 అడుగుల రెండు పెద్ద ద్వారాలను కలిగి ఉంది. దాని చుట్టూ వివిధ అందమైన విగ్రహాలు కూడా ఉన్నాయి. 


💠 భవానీ దేవి ప్రధాన విగ్రహం 9 అడుగుల ఎత్తు మరియు నల్ల రాయితో తయారు చేయబడింది. 

ఆమె చేతిలో మహిషాసురుడిని చంపడాన్ని వర్ణించే వివిధ ఆయుధాలు ఉన్నాయి . 



💠 మహారాష్ట్రలో నవదుర్గగా ప్రసిద్ధి చెందిన పార్వతి దేవి తొమ్మిది రూపాల విగ్రహాలు ప్రతిష్టించబడిన ఏకైక ఆలయం ఇదే . 



💠 ఈ ఆలయంలో తూర్పు వైపున పెద్ద అర్ధ వృత్తాకార తోటతో 7 తోటలు ఉన్నాయి. ఆలయంలో పెద్ద చెట్లతో కూడిన పెద్ద అడవి కూడా ఉంది. 



💠 చిప్లున్ నగరానికి 8 కి.మీ దూరంలో కొండపై ఉంది.


రచన

©️ Santosh Kumar

17-24-గీతా మకరందము

 17-24-గీతా మకరందము.

    శ్రద్ధాత్రయ విభాగయోగము

   

  -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదానతపఃక్రియాః | 

ప్రవర్తన్తే విధానోక్తాః 

సతతం బ్రహ్మవాదినామ్ || 


తాత్పర్యము:- అందువలన, వేదములను బాగుగనెఱింగినవారియొక్క శాస్త్రోక్తములగు యజ్ఞదాన తపః క్రియలన్నియు ఎల్లప్పుడును "ఓమ్” అనిచెప్పిన పిమ్మటనే అనుష్టింప బడుచున్నవి.


వ్యాఖ్య:- ‘ఓమ్, తత్, సత్' అను మూడు పదములలోను మొదటిది యగు ‘ఓమ్’ అను పదముయొక్క మహిమను వెల్లడించుచున్నారు - పరబ్రహ్మముయొక్క వాచకము (నామము) అయి అతిపవిత్రమై, మహాశక్తివంతమై యలరుచుండుటచే వేదవేత్తలందఱును తాము ప్రారంభించు యజ్ఞదానతపస్సులను క్రియలన్నిటియొక్క ఆదియందు ఎల్లప్పుడును ‘ఓమ్' అను ఆ ఏకాక్షర ప్రణవమంత్రమును ఉచ్చరించుచున్నారు. అట్లుచ్చరించిన పిదపయే ఆ యా క్రియలను వారు ఉపక్రమించుదురు. (అట్లే ఆ యా క్రియలు సమాప్తమైన వెనుకను మఱల 'ఓమ్’ అని (ఆ ప్రణవమును) ఉచ్చరించుచుందురు). అట్లొనర్చుటవలన ఆ యా క్రియలలో ఏవైనలోపములు, దోషములు ఉన్నచో అన్నియు తన్మంత్ర ప్రభావమువలన భస్మీభూతములైపోవ ఆ కర్మలు పరిపూర్ణఫలముల నొసంగగలవు.


“సతతమ్” - (ఎల్లప్పుడును) అని చెప్పుటవలన అట్టి వేదవేత్తలు తామాచరించు ఆ యా యజ్ఞదానాది సత్క్రియల ప్రారంభమున ఎల్లప్పడును ఆ ప్రకారమే ప్రణవోచ్చారణము చేయుదురని స్పష్టమగుచున్నది. ఇంజనువలన రైలు పెట్టెలన్నియు కదలునట్లును, ఒకటి యను సంఖ్యచే ప్రక్కనగల పూర్ణానుస్వారములు (సున్నలు) అన్నియు శక్తివంతములగునట్లును, మొదటగల ఓంకారముచే తక్కిన మంత్రములు, క్రియలు అన్నియు చైతన్యవంతములు, ప్రతిభావంతములు అగును.


ప్రశ్న: -"ఓంకారము" యొక్క మహిమను తెలుపుడు?

ఉత్తరము: - వేదవేత్తలు తా మాచరించు యజ్ఞ దాన తపఃక్రియలకు మొదట ఎల్లప్పడును ఓంకారమును ఉచ్చరించియే పిమ్మట ఆ యా క్రియలను చేయుచుందురు.

తిరుమల సర్వస్వం -253*

 *తిరుమల సర్వస్వం -253*

*ద్వాదశ ఆళ్వారులు-17*


*తిరుమంగై ఆళ్వార్* 


 శ్రీమహావిష్ణువు చేబూని ఉండే *'శార్ఙ్గము'* అనే ధనుస్సు యొక్క అంశగా భావించబడే తిరుమంగై ఆళ్వార్ తమిళదేశం లోని 'కురయలూరు' అనే గ్రామంలో జన్మించారు. శ్రీమహావిష్ణువు కున్న సహస్రనామాలలో *'శార్ఙ్గపాణి'* యనే నామధేయం కూడా ఒకటి.


 776 వ సంవత్సరంలో, కార్తీకమాసపు కృత్తికానక్షత్రంలో జన్మించిన వీరు సేనాధిపతిగా, రాజప్రతినిథిగా, భాగవతోత్తమునిగా, చోరుశేఖరునిగా, కవిపుంగవునిగా అనేక పాత్రలు పోషించి; వైష్ణవదివ్యక్షేత్రాల నెన్నింటినో సందర్శించి విష్ణుసాయుజ్యం పొందారు. వారి జీవన గమనానికి సంబంధించిన ఆసక్తికరమైన గాథ అనేక దయనీయ మలుపులు తిరుగుతూ కరుణ, భక్తిరస ప్రధానాలుగా చదువరులలో ఉత్సుకత నింపుతుంది.


 *కంచి వరదుని కటాక్షం* 


 'నీలుడు' అనే కడజాతి వానికి జన్మించిన తిరుమంగై ఆళ్వార్ జన్మనామం కూడా 'నీలుడే'! బాల్యం నుండి కులవిద్యతో పాటుగా యుద్ధవిద్య లన్నింటిలో అత్యంత నైపుణ్యం సంపాదించడంతో అప్పటి చోళరాజు నీలుణ్ణి సైన్యాధిపతిగా, తన సామ్రాజ్యంలో కొంత భాగానికి రాజప్రతినిధిగా నియమించాడు. క్షాత్రవిద్యలతో పాటుగా భగవదారాధానలో కూడా అమితాసక్తిని ప్రదర్శించే నీలుడు ప్రజల నుండి పన్నుల ద్వారా సేకరించిన సొమ్మును ప్రభుత్వ కోశాగారంలో జమ చేయకుండా, భగవత్కైంకర్యాలకు వెచ్చించేవాడు. పన్నుబకాయిలు పేరుకు పోవడంతో, చోళప్రభువు నీలునిపై 'ప్రభుత్వనిధుల మళ్ళింపు' నేరం మోపి; అతనిని నిత్యపూజలకు నోచుకోని ఒక వైష్ణవాలయంలో బంధించాడు. అలా పెక్కుదినాలు ఆకలిదప్పులతో అలమటిస్తూ బందీగా ఉన్న నీలుడు తన అన్నపానాదుల కోసం, సౌకర్యం కోసం, స్వేచ్ఛ కోసం చింతించకుండా; భగవదార్చన చేయలేక పోయినందుకు కృంగిపోయాడు. త్వరలో తనను విడుదల చేయించి, తనచే నిత్యపూజ జరిపించుకొమ్మని పరమేశ్వరుణ్ణి వేడుకొన్నాడు. అతని త్యాగనిరతికి, నిస్వార్థచింతనకు, భక్తిశ్రద్ధలకు ముగ్ధుడైన కంచి వరదరాజస్వామి నీలునికి స్వప్నంలో సాక్షాత్కరించి ఒక గుప్తనిధి జాడ తెలియజేశాడు. నీలుడు చోళరాజు సమ్మతితో నిధిని తెగనమ్మగా సమకూడిన సొమ్ముతో పన్నుబకాయిలను జరిమానాతో సహా తీర్చివేసి, మిగిలిన రొక్కాన్ని భగవత్కైంకర్యానికై వినియోగించాడు. అంతే గాకుండా తన ఆధ్యాత్మిక చింతనకు అడ్డుగా నున్న రాచకొలువును విడనాడి, శ్రీహరిని కొలుచుకుంటూ కవితా వ్యాసంగంలో మునిగి పోయాడు. తన పాశురాల సంకలనమైన *'పెరియ తిరుమొళి'* లో శ్రీమన్నారాయణుని కథానాయకునిగా, తనను కథానాయకిగా ఊహించుకొని మధురభక్తిని ప్రకటించాడు.


 *మంత్రోపదేశం* 


 కాలాంతరాన, ఒకానొక సరోవరంలో జలకమాడుతున్న 'కుముదవల్లి' అనే గంధర్వకన్యను కాంచి మోహించిన నీలుడు ఆమె విధించిన మొదటి షరతు ప్రకారం పంచసంస్కారాలు గావించుకొని, శ్రీవైష్ణవునిగా పునర్జన్మ నెత్తి, ఆమెను శాస్త్రసమ్మతంగా పరిణయమాడాడు. ఆమె విధించిన రెండవ షరతును అనుసరించి ఒక సంవత్సరకాలం పాటు ప్రతినిత్యం వేయిమంది శ్రీవైష్ణవులకు అన్నసంతర్పణ కావించే మహత్కార్యానికి పూనుకున్నాడు. ప్రతిరోజూ వేయిమందికి అన్నదానమంటే అది మహారాజులకే గానీ, సామాన్యులకు సాధ్యపడే కార్యం కాదు. కొద్దికాలానికే నీలుని ఆర్థిక వనరులన్నీ అడుగంటి పోయాయి. అన్న సంతర్పణను కొనసాగించడం శక్తికి మించిన భారమైంది. రేయింబవళ్ళు కష్టించినప్పటికీ ప్రతిరోజు వేయిమందికి అన్నవితరణకు కావలసినంత పైకాన్ని కూడబెట్ట లేకపోయాడు. ఆరునూరైనా సరే, భాగవతుల విషయంలో సతీమణి కిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టు కోవలసిందే! ఎంతకూ తరుణోపాయం కానరాక పోవడంతో, నీలుడు భావసారూప్యత గలిగిన కొందరు వైష్ణవభక్తులను కూడదీసి, చోరబృందంగా ఏర్పడి, బందిపోటు తనాలకు పాల్పడసాగాడు. శాస్త్రాలను క్షుణ్ణంగా అభ్యసించిన నీలుని దృష్టిలో చోరవృత్తి నేరమే అయినప్పటికీ, దానికి పరిహారముంది. కానీ వాగ్దానభంగం మాత్రం ప్రాయశ్చిత్తం లేని నేరం. అది కుడా, భాగవతోత్తముల విషయంలో అనృతానికి (అసత్యం) పాల్పడడం మరింత మహాపరాధం. ఇలా తర్జన భర్జన పడిన అనంతరం అక్రమ మార్గాలలో ధనార్జన చేసినవారి నుండి మరియు నాస్తికుల నుండి ధనాన్ని దొంగిలించి, ఆ సొమ్ముతో శ్రీవైష్ణవులకు అన్నసంతర్పణను నిరాటంకంగా కొనసాగించాడు. 


 ఇలా కొంత తడవు జరిగిన తరువాత శ్రీరంగనాథుడు తిరుమంగళై ఆళ్వార్ భక్తిశ్రద్ధలను పరీక్షింప గోరాడు. శ్రీరంగనాథుడు ఒక పెళ్ళిబృందంలో వరుని రూపంలో ఊరేగుతూ తనను దోచుకోబోతున్న నీలునికి తారసపడి, స్వీయరక్షణకై అతనితో ముష్టియుద్ధం గావించాడు. తన ప్రాణాలకు తెగించి వీరోచితంగా పోరాడిన నీలుడు పెళ్ళిబృందం వారి ఆభరణాలను, ధనాన్ని దోచుకున్నాడు. కానీ వారి మానప్రాణాల కేమాత్రం హాని తలపెట్టలేదు. ఊరేగింపులో నున్న వైష్ణవుల జోలికి పోలేదు. అతని సాహసాన్ని, కార్యనిరతిని, వాగ్దానాన్ని నిలబెట్టు కోవడానికి ప్రదర్శించిన తెగువను, శ్రీవైష్ణవుల పట్ల అతనికున్న నిబద్ధతను చూచి ముచ్చట పడిన శ్రీరంగనాథుడు స్వయంగా ప్రత్యక్షమై నీలునికి *'నారాయణాక్షరి'* మంత్రోపదేశం కావించాడు. శ్రీరంగశాయిని కనులారా కాంక్షించిన తిరుమంగై ఆళ్వార్ భక్తిశ్రద్ధలు మరింతగా ఇనుమడించాయి.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*కర్ణ పర్వము ద్వితీయాశ్వాసముసమాప్తం*



*390 వ రోజు*

కర్ణుడు సుయోధనుడికి సాయం వచ్చాడు. కర్ణుడు తన శరములతో శిఖండి విల్లును, కేతనమును ఖండించాడు. శిఖండి అక్కడ నుండి పారిపోయాడు. దుశ్శాసనుడు ధృష్టద్యుమ్నుడు ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధము చేస్తున్నారు. నకులుడు కర్ణుడి కుమారుడైన వృషసేనుడి సారథిని చంపాడు. వృషసేనుడి సైన్యము చెదిరి పోయింది. వృషసేనుడు వేరొక సారథిని తీసుకుని యుద్ధానికి వచ్చాడు. సహదేవుడు శకుని కుమారుడైన ఉలూకుడిని తీవ్రంగా గాయపరిచాడు. ఉలూకుడు ఆ దెబ్బకు పారిపోయాడు. సాత్యకి శకుని ఒకరితో ఒకరు తీవ్రంగా పోరుసల్పుతున్నారు. సాత్యకి శకుని రథాశ్వములను చంపగా శకుని రథము దిగి పారిపోయాడు. భీముడు సుయోధనుడిని సారథిని చంపి రథమును విరుగ కొట్టాడు. సుయోధనుడు మరొక రథము ఎక్కి అక్కడి నుండి తొలిగి పోయాడు. యుధామన్యుడు కృపాచార్యుని ఎదుర్కొని అతడి విల్లు విరిచాడు. కృపాచార్యుడు వేరొక విల్లు తీసుకుని యుధామన్యుడి సారథిని చంపి కేతనమును, విల్లును విరిచాడు. యుధామన్యుడు పారిపోయాడు. అశ్వత్థామ అర్జునుడిని ఎదుర్కొన్నాడు. కృష్ణార్జునుల మీద శరములు గుప్పించాడు.అర్జునుడు అశ్వత్థామ మీద అనేక దివ్యాస్త్రాలు సంధించాడు. ధర్మరాజు చిత్రసేనుడిని ఎదుర్కొని భీముడు, నకుల సహదేవులు, ధృష్టద్యుమ్నుడు సుయోధనుడిని అతడి పరివారాన్ని ఎదుర్కొన్నారు. అది చూసి కర్ణుడు సుయోధనుడికి సాయంగా వచ్చి ధర్మరాజు గుండెలకు గురిపెట్టి బాణము వేసాడు. ఆ దెబ్బకు ధర్మరాజు రథము మీద కూలబడి రథమును పక్కకు పోనిమ్మని చెప్పాడు. కౌరవులు ధర్మరాజును తరిమారు. కేకయ, పాంచాల యోధులు వచ్చి ధర్మరాజును రక్షించారు. భీముడు సుయోధనుడితో యుద్ధం చేస్తున్నాడు. కర్ణుడు కేకయ, పాంచాల సేనలను నుగ్గు చేసి ధర్మరాజును తరిమాడు. ధర్మరాజు వెను తిరిగి కర్ణుడి మీద శరవర్షం కురిపించి కర్ణుడి సారథిని హయములను చంపాడు. నకులుడు సహదేవుడు ధర్మరాజుకు సాయంగా వచ్చి కర్ణుడి మీద శరములు గుప్పించారు. కర్ణుడు విజృంభించి ధర్మరాజు తలపాగా కొట్టి అతడి సారథిని చంపాడు. ధర్మరాజు నకులుడి రథము ఎక్కాడు. ఇంతలో శల్యుడు కర్ణుడిని చూసి " కర్ణా ! ఏమిటీ పని నీపరాక్రమము అర్జునుడి మీద చూపాలి కాని ధర్మరాజు మీద కాదు. నీవు పొరపాటున ధర్మరాజును చంపితే అర్జునుడు నిన్ను వధించుట తధ్యం. కనుక ధర్మరాజును వదలి అర్జునుడితో యుద్ధము చెయ్యి. కర్ణా ! అటు చూడు నీ అనుంగు మిత్రుడు సుయోధనుడు భీమసేనుడి చేత చిక్కి నిరాయుధుడయ్యాడు. సుయోధనుడు భీముని చేతిలో మరణించిన నీ శ్రమ వృధా ! నీవు పాండవులను గెలిచినా ప్రయోజనము ఉండదు. కనుక సుయోధనుడిని రక్షించు " అన్నాడు. శల్యుని మాటలు విని కర్ణుడు ధర్మరాజును వదిలి సుయోధనుడి వైపు వెళ్ళాడు. కర్ణుడు తనను విడిచి వెళ్ళగానే ధర్మరాజు నకుల సహదేవులతో తన శిబిరానికి వెళ్ళాడు.

*కర్ణ పర్వము ద్వితీయాశ్వాసముసమాప్తం*


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

నేటి వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు - జేష్ఠ మాసం - శుక్ల పక్షం -‌ ద్వితీయ - మృగశిర -‌‌ సౌమ్య వాసరే* (28.05.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

అడుగులకు మడుగులు:*

 *అడుగులకు మడుగులు:*


పూర్వం మహారాజులూ, మహారాణులూ బయల్దేరినప్పుడు వాళ్లవెనక కొంగులెత్తి పట్టుకోవడానికి సేవకులుండేవాళ్ళు. అలాగే ముందు గుడ్డలు పరిచేవాళ్ళు, కాళ్ళకు నేల తగిలి ఒత్తిడి కలిగి బాధ పడకుండా. పూర్వం రాజకుమార్తెలు ఏడు మల్లెపూల ఎత్తుండేవాళ్లని కాశీమజిలీల వంటి కథలు వర్ణిస్తాయి. అంత సుకుమారులకు నడుస్తున్నా ఇబ్బంది కలక్కుండా 'మడుగులు' పరిచేవాళ్ళు. మడుగు అంటే మడతపెట్టిన గుడ్డ. ఒంటిపొర గుడ్డలు పరిచినా కాళ్ళు కందిపోవచ్చు. కాబట్టి గుడ్డ మడతలు పరిచేవారన్నమాట. ఆ పరచటాన్ని కూడా మరింత సుకుమారంగా ఒత్తటమన్నారు. అడుగులకు మడుగులొత్తే పని సేవకులందరిలోనూ తక్కువరకం వాళ్ళ కర్తవ్యం. రాజులకు సరే. సామాన్యులక్కూడా ఇలాంటి సేవలు చేయటం దాస్య ప్రవృత్తికి చిహ్నం. అయితే సామాన్యుల భోగం కట్టుగుడ్డల్తో సమాప్తమవుతుంది. ఉత్తుత్తి సేవలు చేయించుకోవలసిందే వాళ్ళు. ఈ కాలంలో మడుగుల్లేకపోయినా అవి ఉంటే ఎలా సేవలు చేస్తారో అలా వంగి వంగి దణ్ణాలు పెడుతూ బతకటాన్ని అడుగులకు మడుగులొత్తటం అంటారు. అంటే - బానిసలా వ్యవహరించటం/ప్రవర్తించటం, రాజమర్యాదలు జరపటం, విపరీతంగా గౌరవించటం.

27, మే 2025, మంగళవారం

జ్యేష్ఠ మాసం ప్రారంభం

 *జ్యేష్ఠ మాసం ప్రారంభం సందర్భంగా...* 


*మే 28 బుధవారం నుండి జ్యేష్ఠ మాసం ప్రారంభం...* 


*జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవునికి ప్రీతికరమైన మాసం...* 


ఈ మాసంలో తనని ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని. బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకుని ఈ నెల రోజుల పాటు పూజించడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చని. ఈ మాసంలో చేసే విష్ణుసహస్రనామ పారాయణం అనంత ఫలాన్నిస్తుంది. అలాగే నీళ్ళను దానం చేయడం వలన చాలా ఉత్తమమైన ఫలితాలు దక్కుతాయి. జ్యేష్ఠ శుద్ద తదియనాడు రంభా తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యేకంగా పార్వతి దేవిని పూజించడమే కాదు, దానాలకు శుభకాలం. ముఖ్యంగా అన్న దానం చేయడం ఉత్తమం. జ్యేష్ఠశుద్ద దశమిని దశపాపహర దశమి అంటారు. అంటే పది రకాలను పాపాలను పోగొట్టే దశమి అని అర్ధం.


పాపాలను హరించే శక్తి కలిగిన దశమి రోజున గంగా స్నానం, లేదా ఏదైనా నదిలో పదిసార్లు మునకేస్తే మంచి ఫలితాన్నిస్తుంది. ఈ మాసం శుక్లపక్ష పాడ్యమి మొదలు దశమి వరకు అంటే తొలి పదిరోజులూ కాశీలోని దశాశ్వమేధఘాట్ లో బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని గంగానదిలో స్నానం చేయడంతో పాటు గంగానదిని పూజించాలి. అందుకు వీలుకాని వారు సమీపంలోని నది గానీ, లేదా ఇంటిలో గానీ గంగానదిని స్మరిస్తూ స్నానం చేయాలి. నల్ల నువ్వులు, నెయ్యి, పేలాలు, బెల్లం నదిలో వేయాలి. ఈ రోజున ఇష్ట దైవాన్ని పూజించి ఆలయాల సందర్శిస్తే శుభం జరుగుతుంది.


జ్యేష్ఠ శుద్ద ఏకాదశినే నిర్జల 'మతత్రయ' ఏకాదశి అనే పేరుతోనూ పిలుస్తారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పెసరపప్పు, పాయసం, పానకం, నెయ్యి, గొడుగు పేదవారికి దానం చేయాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే 12 ఏకాదశులను ఆచరించిన ఫలితం దక్కుతుంది. జ్యేష్ఠ శుద్ద ద్వాదశిని దశహరా అంటారు. ఇది దుర్దశలను పోగొట్టగలిగే శక్తి కలిగిన తిథి. ఈరోజు నది స్నానాలు చేయాలి. అలాంటి అవకాశంలేనప్పుడు ఇంట్లో స్నానమాచరించే సమయంలో గంగా దేవిని స్మరించడం ఉత్తమం. జ్యేష్ఠ పూర్ణిమను మహాజ్యేష్టి అంటారు. ఈ రోజున తిలలు దానం చేసిన వారికి ఆశ్వమేథయాగం చేసిన ఫలితం లభిస్తుంది. జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన జ్యేష్ఠ మాసంలో గొడుగు, చెప్పులను అనాధలకు, నిర్భాగ్యులకు దానం చేసిన వారికి ఉత్తమగతులతో పాటు ఐశ్వర్యం ప్రాప్తిస్తాయని విష్ణు పురాణం తెలిపింది. వామన ప్రీతికి విసనకర్ర, జల కలశం, మంచి గంధం దానం చేయాలి. ఈ పౌర్ణమినే ఏరువాక పున్నమి పేరుతో జరుపుకుంటారు. ఇది రైతుల పండుగ.. ఎద్దులను అలంకరించి పొంగలి పెట్టి, ఉరేగింపుగా పొలాల వద్దకు తీసుకెళ్లి దుక్కి దున్నిస్తారు. వటసావిత్రి వ్రతం చేయనున్న మహిళలు జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత పదమూడో రోజున మహిళలు వటసావిత్రి వ్రతం చేసుకుంటారు. భర్తలు పది కాలాల పాటు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతులు కావాలని మనసార కోరుకుంటూ ఈ పూజ చేస్తారు.


జ్యేష్ఠ బహుళ ఏకాదశిని యోగినీ 'వైష్ణవ మాద్వ ' ఏకాదశి, సిద్ద ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల అనుకున్న పనులు నేరవేరుతాయి. ఏకాదశి సూర్యోదయం నుండి ద్వాదశి సూర్యోదయం వరకు నీటిని త్యాగం చేసి ద్వాదశినాడు స్నానాదికాలు పూర్తిచేసి, బ్రాహ్మణులకు నీటితోపాటు సువర్ణదానం చెయ్యి. తర్వాత జితేంద్రియులైన బ్రాహ్మణులతో కలసి భోజనం చెయ్యి. శ్రీమహావిష్ణువు నాతో ' ఏ మానవుడు నన్ను తలచి ఏకాదశి వ్రతం చేస్తారో వారు పాపాల నుండి విముక్తులవుతారు అని తెలియజేశాడు. జ్యేష్ఠ బహుళ చతుర్దశి మాస శివరాత్రి ప్రదోష కాలంలో శివునికి అభిషేకం, బిల్వదళాలతో పూజిస్తే అకాల మృత‌్యుహరణం, యశస్సు కీర్తి, ఆరోగ్యం లభిస్తుంది. సూర్యుడిని ఆరాధించే 'మిథున సంక్రమణం' వ్యవసాయ సంబంధమైన పనులకు శుభారంభాన్ని పలికే 'ఏరువాక పున్నమి' ఈ మాసంలోనే పలకరిస్తుంటాయి. ఇక దాన ధర్మాలకు అవకాశమిస్తూ విశేష పుణ్యఫలాలను ప్రసాదించే 'జ్యేష్ఠ పౌర్ణమి' శ్రీ మహా విష్ణువు ఆరాధనలో తరింపజేసే 'అపర ఏకాదశి' ఈ మాసాన్ని ప్రభావితం చేస్తుంది. ఏకాదశి వ్రతం చేసిన వారికి స్వర్గం ప్రాప్తిస్తుంది. ఏకాదశి రోజు ఎవరైతే నీటిని కూడా తాగకుండా వుంటారో వారికి ఒక్కొక్క ఏకాదశికి కోటి సువర్ణ ముద్రలు దానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది.