*భావము లేని పద్యమునె పండితులెల్లc బఠించి మెచ్చిరే*
ఈ సమస్యకు నా పూరణ.
దీవెన లంద జేయునవి దివ్యము లైనవి పోతనార్యుచేన్
భావన భక్తియుక్తమయి భాషకు తేనెల నద్దినట్లుగాన్
జీవిత పారమార్థికము చేరగ వ్రాసిన కావ్యమందు దు
ర్భావము లేని పద్యమునె పండితులెల్లc బఠించి మెచ్చిరే.
అల్వాల లక్ష్మణ మూర్తి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి