20, సెప్టెంబర్ 2020, ఆదివారం

శివామృతలహరి

      .శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన

 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;


మ||

పలలంబస్తులు జీము నెత్తురుల ముంపై బుద్బుదప్రాయమై

మలినంబై కొరమాలినన్ నరుడు సమ్మానించు శ్రద్ధాళువై

పలువర్ణంబుల రత్నభూషణములన్ పాటీరశాటీ తతిన్

జిలుగుం దేహము; జీర్ణమౌటెరిగియున్ ; శ్రీ సిద్ధలింగేశ్వరా !

భావం;(నాకు తెలిసినంత వరకు)


మాంసము,ఎముకలు, చీము, నెత్తురులతో నిండి, మాలిన్యంతో కూడుకుని,నీటి బుడగలాగా నశించిపోయే,అల్పమైన, చివరకి ఎందుకు పనికి రాకుండా పోయే ఈ శరీరానికి,

మనిషి,రంగు రంగుల రత్నాలను పొదిగివున్న హారాలు వేసుకొని, పట్టు వస్త్రాలు ధరించి సుగంధ పరిమళాలు పూసుకొని

బాగా అలంకరించు కోవటానికి శ్రద్ద చూపుతాడు గానీ,

శాశ్వతము, నిత్యము అయిన పరమపదమును పొందే మార్గం వైపు దృష్టి సారించడు గదా స్వామీ! సిద్ధ లింగేశ్వరా!

కామెంట్‌లు లేవు: