20, సెప్టెంబర్ 2020, ఆదివారం

*శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ*



ఇదేంటి విష్ణు రూపం శివుడేంటి అన్న ప్రశ్న అందరికి వొస్తుంది 


మనకి తెలియనని ఎన్నో విశేషాలు తిరుమల లో దాగి వున్నాయి . ప్రతి ప్రదేశం ఆపురూపం, ప్రతి చోట ఒక విశ్వాసం  


ప్రతి దేవాలయానికి ఒక క్షేత్ర పాలకుడు ఉంటారని అందరికి తెలుసు 


ఎన్నో విశేషాలను తనలో దాచుకున్న తిరుమల లో మరి క్షేత్ర పాలకుడు ఎవరో మీకు తెలుసా . సాధారణం గా అందరు వరాహస్వామి అనుకుంటారు . కానీ ఈ తిరుమల లో 

క్షేత్ర పాలకుడు శివుడు .


అందుకే శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ అన్నది 


ఈ శివుడు తిరుమలలో ఎక్కడ వున్నదని సందేహం అందరికి వొస్తుంది . ఎక్కడ ఉన్నదంటే మనం తిరుమల ఆలయం లో కి ప్రవేశించినప్పుడు ధ్వజస్థంభం దగ్గరలో ఈ శివుడు కొలువయి వున్నాడు .  


ఒకప్పుడు ఇక్కడ ఒక చిన్న కోడలా ఉండేదని చెపుతారు , తరువాత కాలక్రమేణా ఇక్కడ ఉన్న శివుణ్ణి గోగర్భం 

 అనే ప్రదేశం లో ఉంచి రుద్ర పూజ చేస్తున్నారు 

కానీ క్షేత్ర పాలక రూపం లో ఒక చిన్న శివలింగాకారం , ద్వజస్థం దగ్గరలో వుంది .


సాధారణం గా మనం లోపాలకి వెళ్లి స్వామిని దర్శించి ప్రసాదం కోసం పరిగెడతాం 


కానీ ఈ ఆలయం లో ఎన్నో విశేషాలున్నాయి . ఈ సారి అదృష్టం బాగుంది మళ్ళీ తిరుమల దర్శిస్తే ఈ శివయ్యను కూడా దర్శించండి . ఎందుకంటే ఈ ఆలయం లో అయినా క్షేత్ర పాలక దర్శనం జరగనిదే దర్శనం పూర్తి కాదని అంటారు .


వెంకట + ఈశ్వర = వెంకటేశ్వర 


ఈ సారి ఆ కేశవునితో పాటు శివుణ్ణి కూడా దర్శనం చేసుకోవటం మర్చిపోకండి .


*జంధ్యాల శ్రీశైలపతి శర్మ*

కామెంట్‌లు లేవు: