20, సెప్టెంబర్ 2020, ఆదివారం

declaration

 దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి గా ఉంది కూడా, తమ పదవిని దుర్వినియోగం చేయకుండా Nov 20, 2003 లో హిందువుల మనోభావాలకు గౌరవం ఇచ్చి signature declaration ఇచ్చారు అబ్దుల్ కలాం గారు....


అబ్దుల్ కలాం గారు భారత రాష్ట్రపతి గా ఉన్న కాలంలో , ఒకసారి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు రావడం జరిగింది. అక్కడ బందోబస్తు బలంగా ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణ వేళలో దర్శనం అయితే భక్తులకు ఆటంకం కలుగుతుందని వేకువజామున దర్శనానికి బయలుదేరారు. అక్కడ మంత్రులు మరియు వివిధ ప్రభుత్వ అధికారులతో ప్రధాన అర్చకులు ఆయనకు బంగారువాకిలి వద్ద స్వాగతం పలికారు. లాంఛనాలను సంతోషంగా స్వీకరించిన కలాం గారు బంగారు వాకిలి వద్దనే ఆగిపోయారు. ఎంత పిలిచినా రాలేదు. కొంత సేపటికి కలాం గారే అన్యమతస్థులు తిరుమల స్వామివారి దర్శనార్థం వస్తే, ఆ దేవస్థానం విధి అనుసరించి ఒక నోట్బుక్ లో signature declaration చేయాలని, ఆ నోట్బుక్ తీసుకురావాలని అధికారులను కోరారు. దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి గా ఉంది కూడా, తమ పదవిని దుర్వినియోగం చేయకుండా, హిందువుల మనోభావాలకు గౌరవం ఇచ్చి, ఆలయ సంస్కృతి సాంప్రదాయాలను దృష్టిలో ఉంచుకోవాలని అన్న ఆ మాటలను విన్న అధికారులు కలాం గారి అనుకువకు ఆశ్చర్య చెంది ప్రశంసించారు. Declaration చేసిన తరువాతనే స్వామి దర్శనార్థం ఆలయం లోనికి ప్రవేశించారు.🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: