20, సెప్టెంబర్ 2020, ఆదివారం

మనుషులం

 మనం మనుషులం. కావున మనం

మనుషులని ప్రేమించాలి,

వస్తువులను వాడుకోవాలి !


కానీ వాస్తవానికి మనం

మనుషులను వాడుకుంటున్నాం,

వస్తువులని ప్రేమిస్తున్నాం !!


నేడు ... వస్తువులకు ఉన్నటువంటి "విలువ"

మనుషులకి లేదు.


నేడు మనుషులకి "మానవత్వం" లోపించింది కాబట్టే

"మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడూ"

అని పాట రాసి, పాడారు.


స్వార్ధపూరిత మనుషుల మధ్య మనం జీవిస్తున్నాం.


అంగీకరించాల్సిన వాస్తవమేమిటంటే ఈరోజుల్లో మనుషులందరూ చాలా "కమర్షియల్" అయిపోయారు.


నేటి సమాజంలో "డబ్బుంటేనే మనిషికి విలువ" . మనిషికి ఎంత ఎక్కువ డబ్బుంటే

అంత ఎక్కువ విలువ.


"స్టేటస్" ని బట్టే గౌరవ మర్యాదలు లభిస్తున్నాయి.


స్నేహం, ప్రేమ, ఆప్యాయత, పలకరింపులు ... ఇవన్నీ

నటన/డ్రామా అయిపోయాయి.

చాలా మంది మనుషులు నటిస్తున్నారు.


చివరిగా ఒక మాట ... ఈ భూమి మీద అత్యంత ప్రమాదకరమైన జీవి ఏదైనా ఉంది అంటే అది "మనిషే" !

కామెంట్‌లు లేవు: