20, సెప్టెంబర్ 2020, ఆదివారం

శివలింగం నకు అభిషేకించేందుకు ఉత్తమ ద్రవ్యాలేవి?


             గంగాజలం అన్నిటికంటే శ్రేష్టమైనది. ఏ నీటినైనా గంగతో సమానంగా భావిస్తూ ఆ గంగాధరుణ్ణి అభిషేకించవచ్చు. విషాన్ని కంఠంలో దాచుకున్న శివుని శరీరంలో తాపం తగ్గించేందుకు శివునికి నీటితో అభిషేకం చేయాలంటారు. పంచామృతంలు తర్వాత వరుసలోనివి, కాగా చెఱకు రసం, మామిడి రసం వంటి ఉత్తమ జాతి పండ్లతో మహాదేవునికి అభిషేకం చేయవచ్చు. పూలు కలిపిన నీళ్ళు, భస్మం, చందనం, పన్నీరు, సెంటు వంటి ద్రవ్యాలు కలిపిన జలాలతో కూడా శివుణ్ణి అభిషేకం చేస్తారు. అలాగే అన్నాభిషేకం చేస్తారు. స్రుష్టిలో సమస్తాన్ని సాంబశివునికి ఆరాధనకు వినియోగించవచ్చును. ఒక్కో ద్రవ్యానికి ఒక్కో ఫలితాన్ని పెద్దలు చెబుతారు. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనది ఆయన ఎక్కువగా ఇష్టపడేది మాత్రం జలాభిషేకమే.

కామెంట్‌లు లేవు: