17, సెప్టెంబర్ 2023, ఆదివారం

తెలంగాణ

 *తెలంగాణ ఎప్పుడూ బ్రిటిష్ వారి ఆధీనంలో లేదు... చరిత్ర చదవండి!*


*నిజాంవిముక్త స్వాతంత్ర్యం*

 *1947 ఆగష్టు 15 అర్ధరాత్రి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది.* 

*దేశం మూడు ముక్కలై వచ్చిన ఈ స్వాతంత్య్రం వెనుక అనేకమంది వీరుల త్యాగం ఉంది. ఈ స్వాతంత్య్రం వెనుక అనేకమంది రక్తతర్పణమూ ఉంది. అదే రక్తతర్పణం, అదే వీరుల త్యాగం హైదరాబాద్ సంస్థానంలోనూ ఉంది. అయినా ఆ అర్ధరాత్రి ఇక్కడ స్వాతంత్య్ర భానూదయం కాలేదు. అందుకు కారకులు మతోన్మాది, నియంత నిజాం. అతని అడుగులకు మడుగులొత్తే రక్తపిశాచాలు మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సంస్థ రజాకార్లు.*


*నిజాం సంస్థానం లేదా హైదరాబాద్ రాష్ట్రమంటే ఇప్పటి తెలంగాణా అంతా, మరియు మహారాష్ట్ర, కర్ణాటకల్లో కొన్ని జిల్లాలు ఉండేవి.*


*ఈ సంస్థానం భాష దృష్టితో మూడు భాగాలుగా విభజితమయింది. అందులో *ప్రధానంగా తెలుగువారు నివసించేది తెలంగాణ. ఇవి ఎనిమిది జిల్లాలు. 1) వరంగల్, 2) కరీంనగర్, 3) ఆదిలాబాద్, 4) నిజామాబాద్, 5) మహబూబ్నగర్, 6) మెదక్, 7) హైదరాబాద్ అత్రాపుబల్దా (అత్రాపు అంటే చుట్టుప్రక్కల ప్రాంతాలనీ, బల్గా అంటే నగరమని అర్ధం), 8) నల్లగొండ.*


ఇక *రెండో భాగం మరఠ్వాడా,* *మహారాష్ట్ర ప్రజలెక్కువగా ఉండే ప్రాంతమిది. ఇందులో అయిదు జిల్లాలు. 1) ఔరంగాబాద్, 2) బీడు, 3) పర్బాని, 4) నాందేడు, 5) ఉస్మానాబాదు.*


*మూడవ భాగం* 

*ఈ రెండిటికన్నా చిన్నది. ఇది కర్ణాటక ప్రాంతం. కన్నడం మాట్లాడేవారు ఎక్కువగా ఉండేది. ఇవి మూడు జిల్లాలు. 1) గుల్బర్గా, 2) రాయచూరు, 3) బీదరు.*


*సంస్థానం పూర్వ చరిత్ర.*


*శాతవాహనులు క్రీ.పూ. 250 నుండి క్రీ.శ. 250 వరకు పరిపాలించారు.* 

*వారి రాజ్యంలో తెలంగాణతోపాటు కర్ణాటక మరియు మహారాష్ట్రలో కొంత భూభాగం ఉండేది.*


*నాగార్జున కొండకు ఇటువైపున ఉన్న నేటి తెలంగాణలోని కొంత ప్రాంతాన్ని ఇక్ష్వాకులు*


*పరిపాలించారు.*


*అమ్రాబాదు పాలమూరు జిల్లాలోనిది. ఇది ఆనాటి అమరావతి విష్ణుకుండినుల ఏలుబడిలో*


*9,10,11 శతబ్దాల్లో తెలంగాణ ప్రాంతంలోని కొంత భూభాగంను చాళుక్య రాజులు పరిపాలించారు.*



*క్రీ.శ. 1050 నుండి 1325 వరకు ఓరుగల్లును రాజధానిగా చేసుకొని కాకతీయులు తెలంగాణను పరిపాలించారు.*


*కాకతీయ రాజ్యం పతనం అయిన వెంటనే గోల్కొండ దాని చుట్టూ ఉన్న రాజ్యాల్ని బహమనీలు తమ చేతుల్లోకి తెచ్చుకున్నారు.*

 *1518లో బహమనీల పెత్తనాన్ని కూలద్రోసి ఇరాన్ దేశీయుడైన కులీ హుందాని కుతుబ్ ఉల్ ముల్కు అనే బిరుద నామంతో స్వాతంత్య్రం ప్రకటించుకొని గోల్కొండకు పాదుషా అయ్యాడు. అప్పటినుండి కుతుబ్ షాహీల పాలన ప్రారంభమయింది.*


*1687లో గోల్కొండలో కుతుబ్ షాహీల పాలన అంతం అయ్యింది. ఔరంగజేబు నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జాహ్ ను గోల్కొండ రాజ్యానికి (దక్కను సుభాకు) సుబేదారుగా నియమించాడు. ఇక్కడి నుండి నిజాంల పాలన ప్రారంభమయింది.*


*ఈ అసఫ్ జాహీలకు బిరుదు 'నైజాం' అనే పేరు ఉండడం వల్ల హైదరాబాద్ సంస్థానం 'నిజాం' రాజ్యంగా మారింది. ఏడుగురు నిజాంలు పాలించారు.*


*హైదరాబాద్ ను పరిపాలించిన ఈ ఏడుగురు నిజాముల్లో ఒక మీర్ మహబూబ్ అలీఖాన్ (6వ నిజాం) తప్ప, మిగతా అందరూ ప్రజా పీడకులే, నియంతలే, చరిత్రలో రక్తపాతాన్ని సృష్టించిన దుర్మార్గులే. హిందువుల మానప్రాణాలు హరించిన పరమ కిరాతకులే. అందులో...*


*చివరివాడైన ఏడో నిజాం అతి పరమ కిరాతకుడు, నరరూప రాక్షసుడు.*


*1927-28లో "మజ్లిస్ ఇత్తిహాదుల్ చైనులు స్లమీన్ అనే సంస్థ ఏర్పడింది.*

*దీనిలో హిందువులు ఎవరూ చేరని కారణంగా 1929లో ఇది మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ గా మారింది. దీనికి మొట్టమొదటి అధ్యక్షుడు సంస్థాన మత శాఖలోని ఓ పెద్ద అధికారి బహద్దూర్ యార్ జంగ్. ఇతడి తర్వాత మౌల్వి కాశీం రజ్వీ దాని అధ్యక్షుడు అయినాడు*


*హైదరాబాద్ సంస్థానంలో నిజాంలు మరియు రజాకార్లు జరిపిన అత్యాచారాలు, అమానుష చర్యలు...*


*బతుకమ్మ పండుగ సందర్భంగా కొన్నివేల ప్రదేశాల్లో స్త్రీలను నగ్నంగా చేసి బతుకమ్మ ఆడించి వినోదించారు.*


*రైతులు పండించిన కూరగాయలతో పాటు వారు పెంచుకున్న కోళ్ళను, మేకల్ని, గొర్రెల్ని ఎత్తుకొని పోయిన ఘట్టాలు లక్షలున్నాయి.*


*పొలాల్లో వ్యవసాయం పనుల మీదున్న స్త్రీలను ఎత్తుకొని వెళ్ళేవారు.*


*రాత్రిపూట రజాకార్లు వచ్చి ఓ ఊరు మీద పడేవారు. తుపాకులు పేల్చేవారు. కొందరిని చంపేవారు. కొందరిమీద అత్యాచారం జరిపేవారు. కొన్ని ఇళ్ళు దోచుకునేవారు.*



*స్త్రీలపైన కన్ను, ఆస్తిమీద కన్ను, భూమి మీద కన్ను, రాజ్యాల మీద కన్ను, దేవాలయం మీద కన్ను, భాషమీద కన్ను, సాహిత్యం మీద కన్ను, భక్తుల మీద కన్ను, ప్రతి మంచిదాని మీద కన్ను.*


*రజాకార్లంటే శాంతిని వాంఛించే స్వచ్ఛంద సేవకులు అని అర్ధం. కాని శాంతిని నాశనం చేసి, మానవ రక్తాన్ని త్రాగిన రాకాసి మూకలు రజాకార్లు.*


*90శాతం మంది హిందువుల మీద 10శాతం మంది ముస్లింల ఆధిపత్యం ఉండేది.* 

*ఏ పల్లెటూరిలో ఒక్క ముస్లిం ఉన్నా, అతని కుటుంబమున్నా అతనే రాజు అన్నవిధంగా వ్యవహరించడం జరిగేది.*


*బతుకమ్మల నగ్న సత్యం:* *నిజాంకు హిందువుల పండుగలంటే పడదు. హిందూ మహిళలు బహిరంగంగా నిర్వహించే ఈ పండుగ ఆగిపోవాలి. బతుకమ్మ ఆటమీద దాడులు మొదలైనవి. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే మహిళల్ని వివస్త్రల్ని చేసి ఆటాడించి ఆనందించే వరకు వెళ్ళింది.*


*అష్రఫ్ పేట గ్రామంలో దోపిడి: నిజాం పోలీసులు అందులో కిరాయికి చేరిన పఠాన్ గూండాలు, మజ్లిస్, రజాకార్ గూండాలు వందమంది వరంగల్ జిల్లాలోని అష్రఫ్ పేటపై పడ్డాడు. గ్రామాన్ని దోచేసి 20 మందిని చంపివేశారు.*


*తల్లీ కూతుళ్ళను భర్తల ఎదుట: హైదరాబాదు సమీపంలోని పంజాగుట్ట గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఇంటిలోని తల్లీ కూతుళ్ళని వాళ్ళ భర్తల ఎదుట, పిల్లలఎదుట హీనాతిహీనంగా చెరిచారు.*


*1948 జూలై మొదటి వారంలో సైదాబాగ్ ఇది గుల్బర్గాకు 12 మైళ్ళ దూరంలో ఉంది. రజాకర్లు, ఈ గ్రామంలో 15మంది స్త్రీలను నీచాతినీచంగా నిజాం సైన్యం మానభంగం చేసింది.*


*పురోహితులను మంటల్లో కాల్చిన రాక్షస మూక:* 

*ఒక రోజు శ్రాద్ధ కర్మలో భోక్తలుగా భోజనం చేసి ఏడుగురు బ్రాహ్మణులు తిరిగి వస్తున్నారు. త్రోవలో శాంతిని సంరక్షిస్తున్న రజాకార్ల ముఠా ఒకటి ఎదురైంది. ఆ ఏడుగుర్ని పట్టుకున్నారు. ఇద్దరు బ్రాహ్మణులు మాత్రం తప్పించుకొని పారిపోయారు. మిగిలిన ఐదుగుర్ని చింతచెట్టు కొమ్మకు వ్రేలాడదీశారు. క్రింద మంటలు పెట్టారు. ఆ మంటల్లో కాలి, మాడి, ఉడికి ఆ అమాయకులైన బ్రాహ్మణులు ప్రాణాలు వదిలారు.*


*భయంకర హింసతో అట్టుడికిన బైరాన్ పల్లి!: బైరాన్పల్లి నల్లగొండ జిల్లాలోని ఒక గ్రామం. రజాకార్ల క్రూరకృత్యాలు రోజురోజుకు మితిమీరి పోయాయి. రజాకార్ల నుండి తమ గ్రామాన్ని కాపాడుకోవడానికి బైరాన్పల్లి వాసులు స్వీయరక్షణ దళం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బైరాన్పల్లిని ఆదర్శంగా తీసుకొని గ్రామ రక్షక దళాలను అనేక గ్రామాలు ఏర్పాటు చేసుకున్నాయి. దానికి కక్ష సాధింపు చర్యగా రజాకార్లు, తెల్లవారుఝామున బైరాన్ పల్లిపై విరుచుకుపడ్డారు. క్రూరంగా గ్రామంపై బడ్డారు. బాంబులు విసిరారు. పశువుల్లా ఆడవాళ్లపైబడి బలాత్కారం చేశారు. *92మంది యువకులను ఊరవతల వరుసగా నిలబెట్టారు. త్రీనాట్ రైఫిల్ తో వరుసగా ఒకేసారి ఒకే గుండుతో ఎంతమందిని చంపవచ్చునో లెక్కగట్టి మరీ కాల్చారు.*

 *నాలుగు వరుసలలో ఒకరి వెనక ఒకరిని నిలబెట్టారు. ఒకే గుండు ఒకేసారి నలుగురిని చంపగా పోటీలు పడి అధికారులంతా కాల్చి చంపారు. నరసంహారం తర్వాత గ్రామంలోని వారి జనులను పిలిచి*

 *90 మంది శవాలను నిరుపయోగంగా వున్న ఒక బావిలో పడవేయించి సామూహిక సమాధి చేశారు.*


*మరో జలియన్ వాలాబాగ్ పరకాల...* 

*భారత చరిత్రలో జలియన్ వాలాబాగ్ ఎంత రక్తసిక్తమయ్యిందో తెలంగాణ విమోచన పోరాటంలో పరకాల అంతే నెత్తురు త్రాగింది. 1947 ఆగష్టు 15న స్వాతంత్ర్యం రానే వచ్చింది. నిజాం రాజ్యంలో త్రివర్ణ పతాకం ఎగురవేయడం నేరం. జాతీయ పతాకావిష్కరణ చేయవద్దని నిజాం ప్రభుత్వం హుకుం జారీ చేసింది. కానీ 1947 సెప్టెంబర్ 02 నాడు పరకాలలో పతాకా విష్కరణకు రంగం సిద్ధమైంది. పరకాల చుట్టుప్రక్కల 25 గ్రామాల నుండి ప్రజలు తండోప తండాలుగా వచ్చారు. ఈ దృశ్యాన్ని నిజాం ప్రభుత్వ అధికారులు జీర్ణించు కోలేకపోయారు. జెండా ఎగురవేయడం నేరమయింది. ముందస్తు హెచ్చరిక కూడా లేకుండా కాల్పులు జరపడానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ జియా ఉల్లా ఆదేశించారు. రజాకార్లు విచక్షణా రహితంగా బుల్లెట్ల వర్షం కురిపించారు. రక్తం ఏరులైపారింది. గ్రామం మొత్తం శవాల దిబ్బగా మారింది.*


*మొగిలయ్య గౌడ్ హత్య :* *భారతదేశం మొత్తం స్వతంత్ర భారత జయ జయ నినాదాలు చేస్తున్నది. వరంగల్లో బత్తిని మొగిలయ్య గౌడ్ కూడా జాతీయ జండాను ఎగురవేయాలి అని అనుకున్నాడు. మొగిలయ్య పెద్దగా చదువుకోకున్నా జాతీయదవాద భావాలు కలవాడు. కొంతమంది ప్రముఖులతో కలసి మొగిలయ్య పతాకా విష్కరణ చేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన రజాకార్ల గుంపు గ్రామంపై దాడి చేసింది. ఈలోగా తాటిచెట్లు గీయడానికి వెళ్ళిన మొగిలయ్య గౌడ్ కు ఈ దాడి వార్త తెలిసి హుటాహుటిన పరుగెత్తుకు వచ్చాడు. ఇంటిచూరులో ఉన్న కత్తిని తీసుకొని రజాకార్ల గుంపు పైబడ్డాడు. కత్తివిద్య తెలిసిన మొగిలయ్య దాడిలో ముగ్గురు నేలకూలారు. దానితో రజాకార్ల గుంపు చెల్లాచెదురయ్యింది. కొద్దిసేపట్లోనే వాళ్ళంతా కలసి అభిమన్యుని చుట్టుముట్టిన కౌరవుల్లా వచ్చి మొగిలయ్యను హత్య చేశారు. జాతీయ జెండాను ఎగురవేయడం మొగిలయ్య చేసిన నేరం....* *అమరవీరుడు షోయబ్ ఉల్లాఖాన్: 'రయ్యత్' పత్రిక సంపాదకుడు శ్రీ ముందుముల నర్సింగ రావు. నిజాం హయాంలో స్వతంత్ర అభిప్రాయాలతో వెలువడుతూ వచ్చిన 'రయ్యత్' పత్రికను నిషేధించారు. దీన్ని నిషేధించిన తర్వాత షోయబుల్లాఖాన్ ప్రజల భావాన్ని వ్యక్తం చేయటానికి ఒక పటిష్టమైన సాధనం కావాలి అని రయ్యత్ లేని కొరతను తీర్చాలనుకొని 'ఇమ్రోజ్' అనే పేరుతో ఒక దినపత్రికను ప్రారంభించాడు. 1947 నవంబర్ 15వ తేదీనాడు 'ఇమ్రోజ్' దినపత్రిక మొదటి సంచిక వెలువడింది. నిజాం సంస్థానం పోకడలను నిశితంగా విమర్శిస్తూ షోయబ్ సంపాదకీయాలు వ్రాసేవాడు. తన 'ఇమ్రోజ్' పత్రిక ద్వారా సాహసో పేతమైన పోరాటాన్ని సాగించాడు. న్యాయం, నీతి, మత సహనం కోసం నిర్భయంగా నిలుచున్నాడు. దీని పర్యవసానంగా షోయబుల్లాఖాన్ ను రజాకార్లు హత్య చేశారు.*


*ఓ నిజాము పిశాచమా!* *కానరాడు! నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంచి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ. అని ఎలుగెత్తి చాటాడు దాశరథి.*


*నిజాం సంస్థానంలో రజాకార్లుచేసినఅక్రమాల్ని హత్యల్ని దురంతాల్ని, విధ్వంసాల్ని తేదీలవారిగా కథనం చేస్తే కనీసం లక్ష పుటల చరిత్ర అవుతుంది.*

*1948 శ్రీ సర్దార్ వల్లాభాయ్ పటేల్ ద్వారా సైనిక చర్య తరువాత*

*రజాకార్లు పందుల్లా కొందరు వారి పాకిస్తాన్ పారి పోయారు..*

*వారి సంతతి  వారు ఇంకా కొందరు ఇక్కడే మిగిలి పోయారు*

*అందుకే కొందరు ఇప్పటికీ Old City ని పాకిస్థాన్  అంటారు*

*అక్కడ నో Power Bill*

*No Eater Bill, No Law and Order*

*ఇంకా కొందరు రజాకార్లు ఓల్డ్ సిటీ లో మిగిలి ఉన్నారు...*


*తెలంగాణ ఎప్పుడు ఇంగ్లీష్ వారి ఆధీనము లో లేకుండెను..*

*మనకు 1948 సెప్టెంబర్ 17* 

*నిజాం రాక్షస  సంహారం పాలన నుండి విముక్తి లభించింది ..*


*కానీ ఈ చరిత్ర ఇప్పటి తరానికి తెలియదు*

*! జై భారత్!! భారత్ మాతాకీ జై!!!  జై హింద్*

కామెంట్‌లు లేవు: