14, అక్టోబర్ 2020, బుధవారం

రామాయణమ్ 139

 రామాయణమ్ 139

..................

రావణుడు కొలువుకూటములో ఉన్నతమైన రత్నఖచిత సింహాసనము మీద ప్రజ్వరిల్లుతున్న అగ్నిలాగా మహాతేజస్సుతో కూర్చొని ఉన్నాడు.

.

ఆ రాక్షస రాజు శరీర కాంతి నున్నని వైఢూర్యమాణిక్యపు  కాంతివలె ఉన్నది .కాల్చి శుద్ది చేసిన బంగారు కుండలములు ధరించి ఉన్నాడు

,అందముగా ఉన్న భుజాలు ,

తెల్లని దంతకాంతి,

పెద్ద ముఖముతో పర్వతములాగా ఉన్నాడు


ఆయన గొప్ప తపస్సంపన్నుడు .బ్రహ్మ గురించి పదివేల సంవత్సరాలు ఘోర తపమాచరించి ఆయనకు తన శిరస్సులు అర్పించాడు.

.

ఆతని శరీరము మీద ఎక్కడ చూసినా ఆయుధాల దెబ్బలు మానిన గుర్తులే !

మరీ విశేషముగా ఇంద్రుడి వజ్రాయుధపు దెబ్బలే అవి! 

.

అవి ఒక యోధుడి కి అలంకారములు.

.

వాడు మృత్యువుకే మృత్యువు!

.

వాడు మహా క్రూరుడు ,పూర్తికావచ్చిన యజ్ఞాలను ధ్వంసము చేసి వికృతానందము పొందేవాడు.

.

వాడి కంటికి అందముగా కనపడ్డ స్త్రీ వాడి స్వంతము కావలసినదే  . అలాంటి స్త్రీని దక్కించుకోవడానికి వాడు ఎంతటి సాహసమైనా చేస్తాడు , వాడు ఒకసారి  మహావిషసర్పము తక్షకుడి భార్యను చూశాడు ,అంతే వాడి మనసు నిలవలేదు .భోగవతిని ముట్టడించాడు  రాజైన వాసుకిని ఓడించాడు తక్షకుడి ప్రియభార్యను బలాత్కారముగా తెచ్చుకున్నాడు.

.

కుబేరుడి మీదకు దండయాత్రకు పోయి అతడి పుష్పకవిమానాన్ని తెచ్చుకున్నాడు.

.

వాడికి కోపము వస్తే అలా వెళ్ళిపోయి దేవతల చైత్రరధాన్ని,నందనవనాన్ని,పద్మసరస్సును ఊరకే పాడుపాడు చేసేవాడు.

.

యజ్ఞధ్వంసము నందు ఆసక్తి,

బ్రహ్మహత్యలు వాడికి అలవాటు,

.

కఠినుడు, 

దుష్టప్రవర్తనగలవాడు,

జాలిలేదు ,

ప్రజలకు అహితము చేయటములో వాడికి ఆసక్తి మెండు.

.

కొలువుదీరి ఉన్న మహాభయంకరుడైన రాక్షరాజు వద్దకు వచ్చి వాలింది శూర్ఫణఖ. 

.

అది భయము, కోపము, అవమానము ,కలగలసిన తత్తరపాటుతో ఉన్నది. అది ఇంతవరకు జీవితములో రాముడిలాంటి యోధుడిని చూడలేదు,వినలేదు 

అంతటి దెబ్బ ఎప్పుడూ తినలేదు .

.

రామాయణమ్ 140

...........

మంత్రులతో కూర్చొని సమాలోచనలు చేస్తున్నాడు రావణుడు.

.

సుడిగాలిలా వచ్చి ఆయన ముందు వాలింది శూర్పణఖ.

వచ్చీ రావడముతోనే రావణుని నిందించడము మొదలుపెట్టింది .

.

నీవేమి రాజువు !నీకు పోగాలము దాపురించినదిలే ! అసలు బయట ప్రపంచములో ఏమి జరుగుతున్నదో నీకు పడుతున్నదా! అవునులే నీ గూఢచార వ్యవస్థ అంత దరిద్రముగా తగలబడ్డది ,

.

నీపాటికి నువ్వు హాయిగా నచ్చిన దానితో కులుకుతూ ,భోగాలలో మునుగుతూ కాలము వెళ్ళబుచ్చుతున్నావు.

.

నీకు భోగాలు ముఖ్యమని అనుకుంటూ కాలము గడుపుతున్నావు నీలాంటి రాజును జనులు స్మశానపు అగ్ని లాగ గౌరవించరు.

.

భోగాలలో మునిగిన రాజు సముద్రములో మునిగిఉన్న పర్వతము లాగా శోభిల్లడు.

.

ఇంత చపల చిత్తుడవు  నీవు రాజు ఎలా కాగలిగావు?

.

నీకు పరాక్రమం ఒకటుంటే  సరిపోదు ! గూఢచార వ్యవస్థ ,కోశాగారము,పరిపాలనా వ్యవహారము నీ ఆధీనములో ఉంచుకోవటము తెలవాలి ,అప్పుడే నీ రాజ్యము స్థిర పడుతుంది .

.

అసలు నీవేమి తెలుసుకుంటున్నావో నాకు తెలియటము లేదు.

.

అక్కడ జనస్థానములో కొంపలంటుకుంటున్నాయి. 

.


నీ సైన్యము పదునాల్గు వేల మందినీ ఒకడు ఊచకోత కోశాడు, దూషణుడు,త్రిశిరుడు,మహాబలశాలి ఖరుడు అందరూ ఆ ఒక్కడి చేతులలో ఒకేసారి చనిపోయారు.

.

వాడు రాముడు!

.

ఆ రాముడు ఋషులకు అభయమిచ్చినాడు ! 

వారికి రాక్షస బాధ లేకుండా చేస్తానని!.

.

ఎండిన కర్రలు,మట్టిబెడ్డ ,బూడిద వీటివల్ల ఉన్న ఉపయోగము కూడా స్థాన భ్రష్టుడు అయిన నీ వంటి రాజు వల్ల ఉండదు.

.

శూర్పణఖ మాట్లాడే మాటలు రావణుడి హృదయములో క్రోధాగ్నిజ్వాలలు రేపుతున్నాయి ,

.

మంత్రుల సమక్షములో ఇలా చిన్నబుచ్చుతూ మాట్లాడింది !

.

 ఎరుపెక్కిన కన్నులతో ఇలా అన్నాడు,

.

ఎవడా రాముడు?

 ఎట్లాంటిది వాడి బలము?

అసలు అంత దుర్గమమైన దండకారణ్యము లో వాడెందుకు ప్రవేశించాడు?

అతని ఆయుధము ఏమిటి?

అని ప్రశ్నించాడు.

.

అప్పుడు శూర్పణఖ ,

అతడు దశరధ కుమారుడు ,

ఆజానుబాహువు ,

విశాలమైన నేత్రాలున్నవాడు,

నారచీరను ,కృష్ణాజినమును ధరించిఉన్నాడు.

మన్మధుడితో సమానమైన

 సౌందర్యము ఆతనిది!

.

కందర్ప సమరూపశ్చ రామో దశరధాత్మజః

.....

అని పలికి రాముడి పరాక్రమాన్ని వర్ణించ సాగింది .

కామెంట్‌లు లేవు: