3, నవంబర్ 2020, మంగళవారం

ఆవేశంగా అడిగిన ప్రశ్న...

 🌹ఒక తండ్రి ఆవేశంగా అడిగిన ప్రశ్న... మీరు ధ్యానం ఎందుకు మా పిల్లలకు నేర్పిస్తున్నారు వారి సమయాన్ని మొత్తం వృధా చేస్తున్నారు.. ఆ సమయం లో వారు చదువుకుంటే ఏదోఒకటి అవుతారు..                                🌹అవును నిజమే మీరు చెప్పింది... వారు చదువుకుంటే ఏదో  ఒక్కటి మాత్రమే అవుతారు.. కానీ ధ్యానం చేస్తే మొట్ట మొదట ఓపికతో విని నేర్చుకొనే  మంచి "విద్యార్థి "అవుతాడు                                🌹తన తపోప్పులను సరిచేసుకొంటూ ఆలోచనలను క్రమబద్దీకరిస్తూ ఉన్నతంగా ఎదిగే ఒక "ఇంజనీర్" అవుతాడు.         🌹శరీరంలో వచ్చే  అనారోగ్యాలను,  ఎక్కడికి వెళ్లనవసరం లేకుండా  ధ్యానశక్తి ద్వారా తానే సరిచేసుకొనే "డాక్టర్" అవుతాడు. 🌹ధర్మ అధర్మాలను విచ్చక్షణ చేసి ఖచ్చితత్వంతో ధర్మం కోసం పోరాడే "లాయర్" అవుతాడు     🌹కుటుంబాన్ని, దేసాన్ని, ప్రకృతిని.. రక్షిస్తూ  సాటిమనుషులను, సాటి జీవులను  ప్రేమించే ఒక "సైనికుడు" అవుతాడు                 🌹జీవితం లో ఎదురయ్యే అత్యంత జటిలమైన సమస్యలకు వెన్నుచూపక పోరాడే గొప్ప "ఫైటర్" అవుతాడు.                     🌹 ఎప్పటికప్పుడు తనలోని సృజనాత్మకతను మెరుగులు దిద్దే" ఆర్కిటెక్ట్" అవుతాడు.                   🌹ధ్యానం లో కూర్చొనే విశ్వపు రహస్యాలను తెలుకొనే ఆ "సైంటిస్ట్ "ని మించిన వాడవుతాడు                               🌹తనని తాను ప్రేమించుకుంటూ, తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ,  తల్లి తండ్రులను గౌరవించి ప్రేమిస్తూ మంచి పుత్రునిలా,  మానవత్వం వికసించిన మనిషినిలా తయారవుతాడు.                      🌹తను నేర్చుకున్న  జ్ఞానాన్ని ప్రపంచానికి పంచె ఒక యోగిలా గొప్ప "గురువుగా  "అవుతాడు.           🌹మరి మీరు చెప్పింది వందశాతం నిజమే కదా ధ్యానం చేయకపోతే ఏదోఒక్కటి  మాత్రమే అవుతారు.

🌹🌹🌹🌹🌹🌹

కామెంట్‌లు లేవు: