24, సెప్టెంబర్ 2020, గురువారం

పోత‌న త‌ల‌పులో....62

 


రాజ‌మార్గంలో వెళుతున్న కృష్ణ‌ప‌ర‌మాత్మ‌ను చూడ‌డానికి ద్వార‌క ప్ర‌జ‌ల‌కు రెండు క‌ళ్లూ చాల‌డం లేదు.



జలజాతాక్షుఁడు సూడ నొప్పె ధవళఛ్ఛత్రంబుతోఁ, జామరం

బులతోఁ, బుష్ప పిశంగ చేలములతో, భూషామణిస్ఫీతుఁ డై

నలినీభాంధవుతో, శశిధ్వజముతో, నక్షత్రసంఘంబుతో,

బలభిచ్ఛాపముతోఁ, దటిల్లతికతో, భాసిల్లు మేఘాకృతిన్..

        **

ఆ కమలనేత్రుడు శ్యామసుందరుడు శ్వేతఛత్రం అనే సూర్యునితో, చామరా లనే చంద్రునితో, పూలనే నక్షత్రాల సమూహంతో, కపిలవర్ణము గల అంబరాలనే ఇంద్రధనుస్సుతో, భూషణాలలోని మణుల కాంతులనే మెరుపు తీగలతో భాసిల్లే మేఘంలా ప్రకాశిస్తున్నాడు.


చిన్న‌గా ...శ్రీకృష్ణుడు జననీజనకుల సౌధానికి వెళ్లాడు. వారికి నమస్కరించాడు.

        ***

బిడ్డఁడు మ్రొక్కినఁ దల్లులు

జడ్డన నంకముల నునిచి చన్నుల తుదిఁ బా

లొడ్డగిలఁ బ్రేమభరమున

జడ్డువడం దడిపి రక్షిజలముల ననఘా!

             ***

చాలా రోజుల తరువాత శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వచ్చి నమస్కరించగా, తల్లులు బిడ్డడిమీది బద్దానురాగంతో చటుక్కున తమ తొడలపై కూర్చుండ బెట్టుకున్నారు. ఆపేక్షతో పొంగిపొర్లే ఆనంద బాష్పాల‌తో అతనిని అభిషేకించారు.



    🏵️పోత‌న ప‌దం🏵️

🏵️మాతృ ప్రేమ‌కు వంద‌నం🏵️

కామెంట్‌లు లేవు: