23, అక్టోబర్ 2020, శుక్రవారం

కనకదుర్గ గుడి,





 కనకదుర్గ గుడి, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలో ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. ఇది విజయవాడ నగరంలో కృష్ణా నది ఒడ్దున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం. విజయవాడ పేరు చెప్పగానే కనక దుర్గ ఆలయం గుర్తుకు వస్తుంది. హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది.ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది. మిరిమిట్లు గొలిపే ఆభరణాలు, పూలతో అలంకరించబడి ఉంటుంది. మూర్తికి ఎనిమిది చేతులు ఉన్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలంతో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది.


పేరువెనుక చరిత్ర :

కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మావారుని గురించి తపస్సు చేసి, ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయస్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలసిన మహిషాసురమర్ధిని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనక దుర్గ అయింది. ఇక్కడ అర్జునుడు శివుడి కొరకు తపస్సు చేసి శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు. కనుక ఈ ప్రాంతం విజయవాడ అయింది.


క్షేత్ర పురాణం సవరించు

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు.



కనకదుర్గ అమ్మవారి విగ్రహము

రాక్షసుల బాధ భరించ లేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమని ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివలీలలు, శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలోని ఆవరణలో అక్కడక్కడా గమనించవచ్చు


నవరాత్రి ఉత్సవాలు సవరించు

ఈ దుర్గాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరము దసర నవరోత్సవాలు జరుగుతాయి. ఈ దసర నవరోత్సవల లో ప్రతి రోజు ఒక అవతారముతో దర్శనము ఇస్తారు. ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో దర్శనము ఇస్తారు.


మొదతి రోజు స్వర్ణ కవచాలంకార దుర్గ దేవి

రెండొవ రోజు బాల త్రిపురసుందరి దేవి

ముడొవ రోజు గాయత్రి దేవి

నాలుగోవ రోజు అన్నపూర్ణా దేవి.

ఐదవ రోజు లలితా త్రిపురసుందరి దేవి

ఆరొవ రోజు సరస్వతి దేవి

ఎడొవ రోజు దుర్గాదేవి

ఎనిమిదొవ రోజు మహాలక్ష్మిదేవి

తొమ్మిదొవ రోజు మహిషాసురమర్దినిదేవి

పదోవ రోజు రాజరాజేశ్వారిదేవి

ఈ ఐదొవ రోజున జరిగే సరస్వతి అమ్మవారి అలంకరణ రోజు అమ్మవరి జన్మనక్షత్రంగా అనగా ములానక్షత్రం గా భావిస్తారు. ఆ రోజున వేలాది మంది భక్తులు, విద్యార్థులు తరలివస్తారు. ఈ దేవాలయంలో వినాయక స్వామి, ఈశ్వరుడు, శ్రీ రాము ల వారు కొలువుతీరి ఉన్నారు. ఈ దేవాలయాన్ని దర్సించుటకు అనేక మంది భక్తులు అనేక ప్రదేశాల నుండి వస్తారు.


దసరా పండుగ సంబరాలు-2020 సవరించు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న కనకదుర్గమ్మ వారు ఈ క్రింది తెలిపిన విధంగా వివిధ అలంకారాల్లో దసరా పది రోజుల్లో దర్శనమివ్వనున్నారు.


తేదీ వారపు రోజు తిథి అలంకరణ

17-10-2020 శనివారము ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి శ్రీ బాల త్రిపురసుందరి దేవి

18-10-2020 ఆదివారము ఆశ్వీయుజ శుద్ధ విదియ శ్రీ గాయత్రి దేవి

19-10-2020 సోమవారము ఆశ్వీయుజ శుద్ధ తదియ శ్రీ అన్నపూర్ణా దేవి

20-10-2020 మంగళవారము ఆశ్వీయుజ శుద్ధ చవితి శ్రీ లలితా త్రిపురసుందరి దేవి

21-10-2020 బుధవారము ఆశ్వీయుజ శుద్ధ పంచమి శ్రీ సరస్వతి దేవి

22-10-2020 గురువారము ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి శ్రీ దుర్గాదేవి

23-10-2020 శుక్రవారము ఆశ్వీయుజ శుద్ధ సప్తమి శ్రీ మహాలక్ష్మిదేవి

24-10-2020 శనివారము ఆశ్వీయుజ శుద్ధ అష్టమి శ్రీ మహిషాసురమర్దిని దేవి

25-10-2020 ఆదివారము ఆశ్వీయుజ శుద్ధ నవమి, దశమి (దసరా) శ్రీ రాజరాజేశ్వరీ దేవి

కామెంట్‌లు లేవు: