12, నవంబర్ 2020, గురువారం

సర్వమూ బ్రహ్మమే ]

 _*శ్రీశివానంద గురుభ్యోన్నమః : శివశ్రీ గెంటేల వెంకటరమణ గురుదేవుల బోధామృతమైన "ఋభుగీత " గ్రంథం నుండి (175)*_


_*12వ అధ్యాయము [సర్వమూ బ్రహ్మమే ]*_


_*ప్రతిసృష్టి చేయగలరు ! కానీ...  ప్రతిదీ సృష్టిచేయలేరు !!*_


_*మనిషి ఏది కొత్తగా కనుక్కున్నా... అది సృష్టిలో ఉన్నదాన్ని చూసే కనుక్కోవాలి తప్ప తాను కొత్తగా ఏదీ సృష్టించలేడు. ఎవరైనా ఈ సృష్టి రచనను అనుసరించాల్సిందే. మనలో ప్రాణంగా ఉన్నదే సృష్టిలో శక్తిగా ఉంది. సమస్త శక్తులు ఆ ప్రాణంలోనివే. ఎవరు ఎన్ని కనిపెట్టినా ప్రాణశక్తి వినియోగంతో జరగాల్సిందే. సైంటిస్ట్ ప్రాణాన్ని శక్తిగా చూస్తే, యోగి ప్రాణాన్నే చైతన్యంగా చూడగలడు. సృష్టిలో ప్రతి ఒక్కరూ దైవాంశ సంభూతులే ! కనుకనే సృష్టికి ప్రతిసృష్టి చేయగలుగుతున్నారు. విశ్వశక్తి యెడల వినయంగా ఉంటే  తాను ప్రతిదీ సృష్టి చేయలేనని గుర్తుంచుకుంటాడు. సృష్టితో సామరస్యంగా సహగమనం చేయగలుగుతాడు !!*_


_*శ్రీశివానందగురు ఎడ్యుకేషనల్ & కల్చరల్ ట్రస్ట్, శ్రీగురుధామ్ ధర్మక్షేత్రం, బలుసుపాడు, కృష్ణాజిల్లా, ఏపి, ది. 12.11.20.

కామెంట్‌లు లేవు: