12, నవంబర్ 2020, గురువారం

ఆముక్తమాల్యద

 అహం అహంకారం పనికిరాదు.

..............................................

ఒక్కసారి చదివి చూడండి...!

ఆముక్తమాల్యద!

                  ➖➖➖


       పూర్వం ఇద్దరు రాజులు యుద్ధానికి దిగారు. ఓడిన రాజు తన రాజ్యాన్ని వీడి అడవుల్లోకి    పారిపోయాడు.    అక్కడే ఆధ్యాత్మిక చింతనతో కాలం గడుపుతు వున్నాడు. గెలిచినరాజు ఆఉత్సాహంతో యజ్ఞం తలపెట్టాడు.   అనుకోకుండా, అక్కడ   యాగధేనువు  మరణించింది. అది  అశుభ సూచన!    యజ్ఞాన్ని ఎలా పూర్తిచేయాలోతెలియక ఆరాజు తికమక పడ్డాడు. నగర పురోహితుల్ని సంప్రతిస్తే ఆ ధర్మసూక్ష్మం  తెలిసినవాడు, ఓడి పోయిన రాజేనని తేలింది. 


   ధర్మసంకటం నుంచి  గట్టెక్కించగల వాడు ఆయనేనని నిశ్చయమైంది.

గెలిచినరాజు ఏమాత్రం సందేహించ కుండా ఓడినరాజు వద్దకువెళ్లి, యజ్ఞాన్ని పరిపూర్తి చేయాలని అర్థించాడు. 


  ఓడినరాజు శషభిషలకూ తావు లేకుండా ధర్మనిర్ణయం కోసం ముందు కొచ్చాడు. శత్రువుకు సహకరించాడు.


    ఆఇద్దరురాజులూ ఆర్షధర్మ నిర్వహణ విషయంలో అహంకారాల్ని త్యజించారు. వారి కథే.శ్రీకృష్ణదేవరాయలు వ్రాసిన ‘ఆముక్తమాల్యద’  లోని  ‘ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం’       సారాంశం! 


 సమాజం అనే ధర్మసౌధం పటిష్ఠంగా నిలిచేందుకు.  భారతీయ    ప్రాచీన సాహిత్యం ఎంతగా తోడ్పడిందో,   ఈ ఉదాహరణచూస్తే ఇట్టే అర్థమౌతుంది. 


   ఈకథలో ఓడిన రాజు ఖాండిక్యుడు; గెలిచినవాడు కేశిధ్వజుడు.  కథ చివర గొప్ప మలుపు ఒకటుంది.


     తన యజ్ఞసంపూర్తికి సహకరించిన ఖాండిక్యుడికి   గురుదక్షిణగా ఏది కావాలన్నా ఇస్తానని కేశిధ్వజుడు ప్రకటిస్తాడు. అది సనాతన సంప్రదాయం! 


  ఓడిన రాజుకు ఓర్మి ఎంతప్రధానమో గెలిచిన రాజుకు సంయమనం,  ధర్మ సంప్రదాయపరిరక్షణ అంతే అవసరం. 


   ఈ అవకాశాన్ని   చేజిక్కించుకున్న ఖాండిక్యుడు   తాను కోల్పోయిన రాజ్యం తిరిగి  గురుదక్షిణగా కావాలని అడిగినా ఇచ్చేయడానికి    కేశిధ్వజుడు  సిద్ధపడతాడు. 


         ఇక్కడే ఓ చిత్రం  చోటుచేసుకుంటుంది.   రాజ్యసంపద  అయాచితంగా వచ్చిపడుతున్నా   ఖాండిక్యుడు  కాదనుకొంటాడు.


 తనకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించాలని, అదే కేశిధ్వజుడి నుంచి తాను కోరుకునే గురుదక్షిణ అని ప్రకటిస్తాడు.


    ఖాండిక్యుడి నిర్ణయం   కేశిధ్వజుణ్ని విస్మయానికి    గురిచేస్తుంది ఆయన ఆలోచన ఏమిటో      తెలుసుకోవాలని అనిపిస్తుంది. అప్పుడు    ఖాండిక్యుడు అంటాడు'రాజ్యభోగాలు కేవలం భౌతిక సంపదలు!  వాటిని   కష్టంతో,   శారీరక శ్రమతో సాధించుకోవాలి.     అంతేగాని, అవి అయాచితంగా లభించాలని కోరుకో కూడదు!   


 కష్టపడి  సాధిస్తేనే వాటి విలువ తెలుస్తుంది!  నా కంటే   బలవంతుడి  చేతిలో  ఓడి పోయాను. 

అందులో  సిగ్గ పడాల్సింది     ఏమి వుంటుంది? తిరిగి పుంజుకొని   ధర్మ మార్గంలో,   క్షాత్రంతో నా రాజ్యాన్ని నేను తిరిగి చేజిక్కించుకోవాలి.   


 అది   ఒప్పుతుంది గాని,    దొడ్డిదారిన  పొందితే... పాపమవుతుంది!’ అని బదులిస్తాడు ఖాండిక్యుడు!


ఇలాంటి కథల్ని మన పిల్లలకు... పాఠ్యాంశాలుగా    నిర్ణయిస్తే, ఆపిల్లల బాల్యాన్ని    అవి  ధార్మికపథంలోకి నడిపిస్తాయి.వ్యక్తిత్వ      వికాసానికి దోహదం చేస్తాయి.        ఉచితాల కోసం తాపత్రయ పడకుండా ఆపుతాయి. ఉచితానుచిత జ్ఞానాన్ని   వారికి బాగా అలవరుస్తాయి.


      ఆముక్తమాల్యదలోని     'ఖాండిక్య-కేశిధ్వజోపాఖ్యానం' ఆ కావ్యానికి గుండెకాయ వంటిదని ఎంతోప్రశస్తి రావడానికి ముఖ్య కారణాలేమిటి?  ఆ కథలోని    ధార్మిక నేపథ్యం,ప్రబోధ గుణం. 


గెలుపు  ఓటముల    విషయంలో, కర్తవ్య నిర్వహణలో,   అయాచిత    అవ కాశాల తిరస్కరణలో...   ప్రతిఫలించిన ధర్మస్వరూపమే- మన భారతీయతకు వన్నెలద్దుతూ వచ్చింది!


    లోకంలో  ఇలాంటి కథలు   ఒళ్లు మరిపించడమే కాదు,    కళ్లు తెరుచు కొనేలా    చేస్తాయి. దీనికి మన ప్రాచీన సాహిత్యమే గొప్ప  ఆదరువు,       ఎంతో ఆలంబన!


*మన ఖర్మ .. నెహ్రు ఖాన్న్ పున్యామా అని, సెక్యూలర్ రాజ్యాంగ పరిధిలో ఇతర మతస్తుల విద్యా కమిటీ లు నిర్ణయించిన పాఠ్యఅంశాలు మన మీద రుద్ది, మన సంస్కృతిని గత 70 ఏళ్లుగా, నాశనం చేసేరు..*


 లోకా సమస్తా సుఖినోభవన్తు! రచయితకు వందనాలు🙏

--------------------------------------------------

కామెంట్‌లు లేవు: