12, నవంబర్ 2020, గురువారం

రామాయణమ్ 121

 రామాయణమ్ 121

.

తెల్లవారగానే సుతీక్ష్ణ మహాముని వద్ద సెలవు తీసుకొని దండకారణ్యములో నివసించే మునుల ఆశ్రమాలను చూడటానికి బయలు దేరాడు రాముడు.

.

అంతకుముందే వారందరికీ ,మిమ్ములను రక్కసుల బారి నుండి కాపాడతానని , అభయమిచ్చివున్నాడు రాఘవుడు,

'

ముగ్గురూ ఎప్పటిలాగే నడవ సాగారు.

అప్పటిదాకా మౌనంగా ఉన్న సీతమ్మ, రామా నేనొక మాట చెపుతాను విను అన్నది.

.

.మనిషికి కామము వలన మూడు రకాలైన వ్యసనాలు జనిస్తాయి .వాటిలో మొదటిది అబద్ధమాడటం!

  సత్యసంధుడవైన నీవు కలలో కూడా అసత్యమాడవు .

ఆ విషయములో సందేహములేదు.

.

ఇక రెండవది ,

.

పరుల భార్యలను కామించుట!

,ఎకపత్నీవ్రతుడవైన నీవు అలాంటి పాపపు పని ఎప్పుడూ చేయవు .అలాంటి కోరిక నీకు ఇప్పుడు లేదు ఇక ముందు కూడా కలుగదు అది సత్యము.

.

ఇక మూడవది !

.

అకారణముగా వైరము పూని క్రూరముగా ప్రవర్తించటం ,

నీకు రాక్షసులు ఏ అపకారం చేసారని వారితో వైరం పెట్టుకోవాలనుకుంటున్నావు ?.

.

నీకు ఏ అపకారం చేయనివారిని సంహరిస్తానని మునులకు ఎందుకు మాట ఇచ్చావు ,!

.

తాపస వృత్తినవలంబించి పదునాలుగేండ్లు అరణ్యములో గడపటానికొచ్చాము. ఆ పని పూర్తి చేసుకొని తిరిగి వెళ్దాము ,అయోధ్యకు వెళ్ళిన తరువాత మరల క్షత్రియ ధర్మము పాటించవచ్చు అడవిలో వద్దు. 

.

నీ చేతిలో ఉన్న ధనుర్బాణాలు నీలో క్రౌర్య ప్రవృత్తిని పెంచరాదు.

.

నీ సహధర్మచారిణిగా ధర్మము అని నాకు తెలిసినది నీకు చెప్పటం నా బాధ్యత ,ధర్మమూర్తివి! నీకు తెలియని ధర్మమేమున్నది.

.

అని హితవు పలికింది సీతమ్మ.

.

NB

.

భర్తకు ఏ సమయములో ఏ హితవు చెప్పాలో తెలిసిన తల్లి సీతమ్మ.

మౌనంగా ఏమీ కూర్చుని ఆయనతో నడవలేదు.

అరణ్యములో రాక్షససంహారము చేస్తాను అని మాట ఇచ్చాడాయన! దాని ఫలితమే రాబోయే రోజులలో వారిరువురూ ఎదుర్కొన్న కష్టాలు.

.

ముందే ఊహించి ఆవిడ హితవు పలికింది .

.

జానకిరామారావు వూటుకూరు

కామెంట్‌లు లేవు: