12, నవంబర్ 2020, గురువారం

విదురనీతి 40

 విదురనీతి 40


మన ప్రతి ఆలోచనా, ప్రతి చర్యా స్వార్ధంతో కూడుకున్నది. "నేను", మీద ఆధారపడి ఉంటున్నాం. కాబట్టే హింస లేకుండా జీవించలేకపోతున్నాం. స్వార్ధరహితంగా ఆలోచించినప్పుడే హింసలేకుండా చేసుకోగలం.


స్వార్ధం ఉండడం మంచిదే కాని అది పరిమితి మించకూడదు. పరిమితి మించిన స్వార్ధం హింసకు దారితీస్తుంది. స్వార్ధం లేకపోతే జీవితం ప్రశాంతంగా గడుస్తుంది.

దయ అంటే శత్రువునైనా ఆపదల్లో ఉంటే కాపాడటం, క్షాంతి: అంటే ఎవడైనా తనకు దు:ఖం కలిగిస్తే, మనసులో గాని, బయటగాని వాడిపై కోపం లేకుండా ఉండటం.


గుణవంతుల గుణాలను వెల్లడి చేయకుండా ఉండటం అసూయ. శౌచం అంటే పతితుల సొమ్మును గ్రహించకుండా ఉండటం, తినదగని పదార్ధాలను తినకుండా ఉండటం. 


శరీరాన్ని అలసటకు గురిచేసే తప్పుడు పనులకు దూరంగా ఉండటం, అనాయాసమైతే, నింధించబడే పనులను విడచి ప్రశస్తమైన పనులు చెయ్యటం మంగళదాయకం.


మనలో చాలామంది ఎవరికి వాళ్ళమే అధికులమనే అహంకారంతో ఉంటారు. ఈ అహంకారం వలన ఏ కార్యమూ సానుకూలంగా జరగదు. కార్యం సానుకూలమవ్వాలంటే ప్రతి వ్యక్తీ ముఖ్యంగా వినయం, విధేయత అలవరచుకోవాలి. 


(ఇంకా ఉంది )

కామెంట్‌లు లేవు: