12, నవంబర్ 2020, గురువారం

అంతా ఒక్కటే

 *భార్య భర్తల మధ్య జరిగిన సంభాషణ*


భార్య: మీకు ఏమి పని లేదా? మొదట చాగంటి గారి మహా భాగవతం విన్నారు, అది అయిపోగానే మాడుగుల వారిది విన్నారు, తరువాత గరికిపాటి వారిది, ఇప్పుడు సుందర చైతన్యానంద స్వామి వారిది. 


ఎవరు చెప్పిన అదే మహా భాగవతం కధ కదా. ఒకరిది వింటే సరిపోదా?


భర్త: నువ్వు మినప్పిండి రుబ్బి మొదటి రోజు కొంచెం పిండిలో ఇడ్లీ రవ్వ కలిపి ఇడ్లీలు వేస్తావు, రెండో రోజు గారెలు, మూడో రోజు వడలు, నాలుగవ రోజు సాదా దోశలు, అయిదో రోజు కొంచెం ఉల్లిపాయముక్కలు వేసి ఉల్లి దోశ, ఆరో రోజు పొటాటో కూర వేసి మసాలా దోశ, ఏడో రోజు ఇంత టొమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఊతప్పమ్, ఎనిమిదో రోజు అదే పిండితో గుంట పునుగులు, తొమ్మిదో రోజు పుల్ల మజ్జిగ కలిపి పుల్లట్లు వేస్తూ ఉంటే నేను రేపు అనేది ఉందో లేదో అని ఆత్రంగా తినటం లేదా. 


వీటన్నిట్లో ఉన్నది మినప్పిండి అని తెలిసినా ఎంజాయ్ చేస్తున్నామా లేదా. మహా భాగవతం కూడా అంతే. 

😁😁😁😁😁

కామెంట్‌లు లేవు: