14, సెప్టెంబర్ 2020, సోమవారం

ఆహారం

🕉️🕉️జై గురుదేవ్🕉️🕉️
  🌹ఓం సాయి రాం🌹

మన శరీరం లోకి వెళ్లిన ఆహారం 24 గంటల్లో... మలినంగా బయటికి  వెళ్లిపోవాలి, లేకపోతే  జబ్బులు.

మన శరీరం లోకి వెల్లిన నీరు 4 గంటల్లో…  బయటికి వెళ్లిపోవాలి, లేకపోతే  జబ్బులు.

మన శరీరంలోకి వెళ్లిన గాలి ఒక నిముషంలోగా… బయటికి వెళ్లిపోవాలి లేకపోతే మనం రోగ గ్రస్థులం అవుతాం.

మరి మనలోకి చేరిన కోపం, అసూయ, ద్వేషం, మోసం... ఇలాంటివన్నీ సంవత్సరాలుగా మనలోనే ఉంటే... ఏమౌతుందో తెలుసా...  మనం నిత్య రోగగ్రస్తులుగా అవుతాం.

కమాశ్చ, క్రోధశ్చ,లోబశ్చ దేహే తిష్ఠంతి తస్కరా:
 జ్ఞాన రత్నప హారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త

(కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, అనే ఆరుగురు శత్రువులు ఈ జ్ఞానమనే రత్నమును అపహరించడం కోసం నీ దేహమనే తిష్ట వేసి ఉన్నారు. జాగరూకుడవై ఉండు.)

అందుకే ఋషులు అంటారు... "మనం రోజూ జీవిస్తున్నాం అని అనుకుంటున్న మూర్ఖులం... నిజానికి మనం రోజూ కొద్దీ కొద్దీగా మరణిస్తున్నాం.  మనకు వయసు పెరిగితే... ఆయుష్షు తగ్గినట్టా? పెరిగినట్టా?... మనం ప్రతి రోజూ... నెగెటివ్ ఎనర్జీ లతో కొద్ది కొద్దిగా మరణిస్తున్నామన్న చేదు నిజాన్ని త్వరగా గ్రహించాలి.

మనలో చేరి బయటికి వెళ్లిపోకుండా తిష్ట వేసుకొని...  మన జీవితాల్ని మృతప్రాయం చేస్తున్న కోపాన్ని, ఒత్తిడిని, ద్వేషాన్ని, బద్ధకాన్ని, అనారోగ్యాన్ని…  ప్రతి రోజూ ధ్యానం, యోగ చెయ్యడం  ద్వారా ప్రాణ శక్తిని ఎక్కువగా పొంది నెగెటివ్ ఎనర్జీ దూరం చెయ్యాలి.  మన శరీరంలోకి అధిక మొత్తంలో ప్రాణ శక్తిని చేర్చే ఏకైక మార్గం  ధ్యానం, యోగాయే...

అందుకే భారతీయ ఋషులు ధ్యానం, యోగ మార్గాన్నే అనుసరించారు.

రోజూ ధ్యానం, యోగ  చెయ్యండి... ఆరోగ్యంగా  జీవించండి.

కామెంట్‌లు లేవు: