14, సెప్టెంబర్ 2020, సోమవారం

పిండం అంటూ నీళ్లలో వేసే అన్నం ముద్ద

#పిండం అంటూ నీళ్లలో వేసే అన్నం ముద్ద
*మరొక పేదవాడికి కడుపు నింపుతుంది కదా..?"*
"శెభాష్.. నిజమే" అనిపిస్తోంది కదూ..?? మరి ఆ అభిప్రాయం నిజమా? అంటే, ఆ భావన 100శాతం తప్పు .!

మరి ఎందుకో తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిమీదుంది. అందుకే ఎందుకో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

#పిండం : ఇవి పలు రకాలు.. కర్మకాండలకు , రకరకాల పిండాలు పెట్టడం హిందూ సంస్కృతిలో ఉంది.. కొందరు మాత్రమే పాటిస్తున్నారు.. కొందరు రాను రాను విసర్జించి ఉంటారు. కొందరు తొలినాళ్ళ నుంచి పాటించి ఉండక పోవచ్చు.

ఈ ప్రశ్న కు సమాధానం చూసే ముందు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
విశ్వంలో మనిషి ఒక్కడు మాత్రమే ఉన్నాడా?? ప్రాణంతో ఉన్న ఇతర జాతులేమీ లేవా? మరి సైన్సు ఏమి చెబుతోందో తెలుసా..!??

8.7 మిలియన్ల జీవరాశులు భూమిమీద జీవిస్తున్నాయని సైన్స్ పత్రిక చెబుతోంది. ఇంకా కూడా ఎక్కువే ఉండవచ్చు, ఖచ్చితంగా లక్షల సంఖ్యల్లోనే ఉంటాయి. అందరి కన్నా మేథస్సున్న మానవుడు మూఢాచారాలు నమ్మొచ్చా? అనే వాదం ఉన్నవారికి, మరి ఆయా ఇతర జీవులు ఎలా జీవిస్తాయో అన్న అనుమానం ఎందుకు కలుగట్లేదో అర్ధం కాని ప్రశ్న!?

మన కడుపుకి మనం తింటే చాలా..??
ఒక గిరి గీసుకుని అందులో మఠం వేసుకు కూర్చుని, ఎదుటి వారిమీద దుమ్మెత్తి పోయటం చాలా సులభమే..! కానీ గతించిన మంచోళ్ళు అలా చేయలేదు..పూర్వీకులు అన్నింటి గురించీ పట్టించుకున్నారు.
అన్ని ప్రాణుల అవసరాలనీ ఏదో ఒక రూపంలో తీర్చాలన్న నీతి ని ప్రభోదించారు..
అందులో భాగమే ఈ #పిండ_ప్రదానం అనే క్రతువు.

ఎవరైనా పెద్దలు లేదా కుటుంబ సభ్యులు కాలం చేసినప్పుడు పిండం పెట్టడం ఆచారం..
శాస్త్రంలో మంత్ర విధానంగా ఇలాచెప్పారు.

*"ఇదం పిండం గృధ్ర వాయస, జలచర ముఖేన ప్రేత భుజ్యతాం"*
(గద్దలు, కాకులు, జలచరాలు రూపంలో పితృదేవతలకు ఆహారం అందించాలి)

1. కాలం చేసిన వారి పేరుతో, వారిని గుర్తుంచుకోవాలనే ఉద్దేశ్యంతో (ఆత్మ శాంతి కోసం) ఊరి జనం మొత్తాన్ని పిలిచి స్థోమతకు తగ్గట్టు అన్నదానం చేస్తారు. ఇది బ్రాహ్మణ , బ్రాహ్మణేతరులకు కూడా అన్నదానం జరుగుతుంది. కాబట్టి మనుష్య జాతికి భోజనం పెట్టారు ఆ కుటుంబం వాళ్ళూ.

2. #వాయస_పిండం/ వికిర పిండం
(కాకి పిండం) : "కాకులు దూరని కారడవి అంటారు." ఈ ఉపమానం ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. అంటే కాకి ఎక్కువగా కనిపించే పక్షి జాతి కి చెందిన జీవి. ఆ పక్షిజాతికి భోజనం పెట్టడం అనేది అందులో పరమార్ధం.

నువ్వులు, అన్నం, నెయ్యి మాత్రమే కలిపిన ముద్ద పెడతారు. అంటే ఇక్కడ కాకి తినే పదార్ధాలనే ఉపయోగిస్తారనేది గ్రహించాలి. నెయ్యి వాసనకు త్వరగా వస్తాయి కాకులు.

3. నీటిలో వదిలే పిండం: నీటిలో కలిపే పిండాలలో మినుములు జలచరాలకు మంచిది కాదని గారెలు కలుపరు. అలాగే పిండాలతో పాటు కలిసి వచ్చిన దర్భను జాగ్రత్తగా ఏరి, నీటిలో కడిగి, నది ఒడ్డున వేస్తారు. నీటిలో వేస్తే జలచరాలు పొరపాటున దానిని చప్పరిస్తే నోరు చీరుకుపోయే ప్రమాదముందని అలాచేస్తారు.

ఇంతలోతుగా ప్రతీదీ ఆలోచించి శ్రద్ధతో చేస్తేనే అది ఫలవంతం అవుతుందని, ఏ మాత్రం అజాగ్రత్త పరాకు ప్రదర్శించకూడదని, *"శ్రద్ధయా కురుతే శ్రార్ధం"* శ్రద్ధతో చేసినది మాత్రమే శ్రార్ధం అవుతుందని పదే పదే గట్టిగా చెప్తారు.

పురోహితులని పిలిచి యధావిధిగా ఈ ఆబ్దీకాదులు జరిపించే వారికి ఈవిషయాలు చాలా వరకు తెలుసు. కానీ మన హేతువాద సోదరులకి హేతుబద్ధంగా చెప్పాలనేదే ఈ ప్రయత్నం.!

4. ఇక గోవుకు పెట్టే పిండం: సరే మనిషికి పెట్టరు, పక్షియైన కాకికి పెట్టరు . జలచరాలైన చేపలకి పెట్టరు , అదే రీతిలో జంతువైన ఆవుకి పెట్టరు . అది కూడా ఆవుకి బలిష్టమైన ఆహారం మాత్రమే పెడతారు అనేది తెలుసుకోవాల్సిన విషయం.

ఈ మధ్య గో సేవ అంటూ గోవుల్ని ఆదుకుంటున్నాం అని చెబుతున్నవారు, పిండాన్ని గోవులకి పెట్టనీయటం లేదనే విమర్శ కూడా ఉంది. అది చాలా తప్పు. అపోహ కూడా.! ఆవుకి బలమైన ఆహారం అందించడమే పిండ ప్రదానంలోని గుణం.

ఇక పెడవాదులు వేసే మరో ప్రశ్న. జంతువంటే గోవు మాత్రమేనా? ఇంకేం లేవా..? కుక్కకో, పిల్లికో పెట్టొచ్చు కదా? కాకికే పెట్టాలా పిచ్చుకకో పిట్టకో పెట్టొచ్చు కదా..?
కావాలని.. అడగాలని అడిగే ప్రశ్నలకీ కూడా సమాధానాలు ఉంటాయ్. !!

ఆవు ఎన్నో ఔషధ గుణాలున్న మేలు జాతి పశువని గుర్తించారు మన పూర్వీకులు. అంతే కాదు ప్రతి ఇంటిలో కుక్క ఉన్నా, లేకున్నా ఆవు మాత్రం ఉండేది. అందుకే ఆ కాలం వారు సుభిక్షంగా ఉన్నారు అనడంలో సందేహం లేదు. అన్నీ ఇళ్ళల్లో ఆవులు ఉంటాయి కాబట్టి, వాటికి కూడా భోజనం పెట్టడమే ముఖ్యోద్దేశ్యం.

కాకికే కాదు గ్రద్దకూ పెట్టొచ్చని మంత్రం చెబుతోంది....ఇందులో కూడ మరొక గొప్ప మర్మం ఉంది కూడా. ఎక్కడైతే కాకులు, లేదా గ్రద్దలు తిరుగు తుంటాయో.. అక్కడ విష జంతువులైన పాముల వంటి జీవులు సంచరించక పోవడం కూడా గమనించాలి.

ఇక ..
ఆవులకు పెట్టె పిండాలలో పాలు పాల పదార్ధాలైనవి (నెయ్యి వంటీవి) కలవవు. అలాగే చేపలకి పెట్టే పిండంలో మినుములు ఉండవు.... కాకులకి అంటే వాయసాలకి పెట్టే పిండంలో నెయ్యి, నువ్వులు ఉంటాయి. అవి బలమైన ఆహారం వాటికి. అలా ప్రతిదీ ఆచి తూచి ప్రయోగాత్మకంగా విజయం సాధించి మాత్రమే చేశారు.

కానీ అంతటీ గొప్ప సంస్కారవంతమైన గొప్ప ఆచారాన్ని కొనసాగించడానికి ఏదో ఒక పద్దతి వాడాలి కనుక. అలా ఆదేశించారు. అందుకే ఇంతకాలం ఆ ఆచారాలు కొనసాగుతున్నాయ్. ఈ రోజు ఏ చట్టం చేసినా వెంటనే తుంగలో తొక్కేస్తున్నారు..
ఆ దుస్థితి ఎందుకు దాపురించిందో మన హేతువాద మేథావులు చెప్పాల్సిందే..!
కొన్ని మంచి విషయాలు పాటించడానికి "భక్తి" అని చెప్పేరు. కొన్ని విషయాలను "ముక్తి" అని చెప్పారు.. అంతే..!

మనం ఏ కళ్ళతో చూడాలో అవే కళ్ళు పెట్టుకు చూడాలి. దృష్టి లోపం లేనోడు చత్వారం కళ్ళజోడు వాడితే నొప్పి ఖాయం.
అలాగే హేతుబద్దంగా ఉన్న వాటిని జనవిజ్ఞానులు ఎందుకు చెప్పటం లేదో అర్ధం కావడం లేదు.

వారు కేవలం వారికి తెలిసి గిరి గీసుకుని అదే ప్రపంచం అనే అపోహలో కొట్టుమిట్టాడుతున్నారో లేక కేవలం హిందువుల సంస్కృతి సంప్రదాయాల మీద జరుగుతున్న దాడులో అర్ధం కాకుండా వుంది.

మరి దొంగ బాబాల తప్పులను ఎత్తి చూపే జన మేథావులకి .. హైందవంలో మంచి కూడా ఉందన్న విజ్ఞానాన్ని ఎందుకు బోధించడం లేదో వెయ్యిడాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది..!

హిందూ సనాతన సంప్రదాయాలను గౌరవించండి - పాటించండి..

సర్వేజనా సుఖినోభవంతు...

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: