26, అక్టోబర్ 2020, సోమవారం

నీటిని తీసుకునే విధానం -

 నీటిని తీసుకునే విధానం  - 


 *  భోజనము చేయు సమయంలో మధ్యమధ్యలో కొద్దికొద్దిగా తీసుకోవడం వలన వాతపిత్తశ్లేష్మములను సమత్వం బొందించును. సమస్త ధాతువులకు సౌఖ్యం , సౌమ్యత కలుగజేయును. 


 *  జఠరదీప్తిని కలుగజేయును. అన్నం జీర్ణం కావించును. 


 *  భోజనకాలం నందు అధికముగా ఉదకపానం చేసిన , దాహం వేసినప్పుడు తగినంత నీరు పుచ్చుకొనచుండిన అన్నం అరగదు .


 *  భోజనం చేసిన తరువాత అధికంగా నీటిని తీసుకొనడం వలన జఠరాగ్ని మందగించి దేహమును కృశింపచేయును. కఫం పెంచును. 


 *  మిక్కిలి దాహంగా ఉన్నప్పుడు భొజనం చేసిన శరీరంలో గుల్మాలు ( వ్రణాలు ) , మిక్కిలి ఆకలిగా ఉన్నప్పుడు నీరు ఎక్కువ తాగిన భగంధర రోగమును పుట్టించును. 


 *  కడుపు నిండుగా ఉన్నప్పుడు , దాహం కాకుండా ఉన్నప్పుడు , అప్పటివరకు కష్టం అయిన పనులు చేసి వెంటనే నీరు తీసుకోవడం , నిద్రపోయి లేచిన మరుక్షణం , స్నానం చేసిన వెంటనే , స్త్రీ సంభోగం చేసిన వెంటనే , నిద్ర మధ్యలో లేచి , పరగడుపున , నిలబడియు , నడుముకి గట్టిగా బిగుంచుకొని , పడుకొని నీరు సేవించడం వలన అనేక రోగాలు పుట్టుటకు కారణం అవుతుంది. 


 *  అమితంగా నీటిని సేవించటం వలన పొట్టకి నష్టం చేయును . నరములకు జబ్బు కలుగును. పొట్టకి నష్టం చేయును . లివర్ కి సమస్య సృష్టించును. బుద్ధిమాంద్యం తెచ్చును. పడిసెం పట్టును. దేహం లావు ఎక్కును. కాళ్ళు చేతులు ఉబ్బును. కళ్లక్రింద తెల్లబారును. ముఖము యొక్క తేజస్సులో మార్పు వచ్చును. అతిమూత్రం మొదలగు అనేక రోగాలు వచ్చును. 


 *  అధికంగా దాహం అయినప్పుడు  ఒకేమారు అధికమొత్తంలో నీటిని పుచ్చుకొనరాదు. కొంచంకొంచం రెండుమూడు సార్లుగా తీసికొనవలెను. 


 *  చలువచేసేది ఫలములు , నీరు కలిగిన ఫలములు అనగా నారింజపండు , కమలాఫలం , బత్తాయి , పనసపండు , అరటిపండు , నేరేడుపండు , అనాసపండు , కర్బూజ పండు మొదలగు ఫలములు , మిఠాయి మొదలగు తీపి వస్తువులు , బెల్లము, వరిపిండితో చేసిన వస్తువులు , సెనగపప్పు మొదలగు పప్పుజాతులు , చేపలు , మామిడిపండ్లు తినినవెంటనే , పాలు త్రాగినవెంటనే , తాంబూలం వేసుకున్న వెంటనే  నీటిని త్రాగరాదు. అలా తీసుకున్నచో మలినమైన ఆహార రసం పుట్టును. పొట్టని జెఱుచును. అజీర్ణ విరేచనాలు అగును. 


 *  కుండలో గాని , బిందెలో గాని ఉన్నటువంటి సహజంగా ఉండు చల్లబడిన నీటిని మాత్రమే తాగవలెను. ఫ్రిజ్ మరియు వడగండ్ల తో చల్లబడిన నీరు ఏ కాలం నందు అయినను పుచ్చుకొనరాదు. పుచ్చుకొనిన దీర్ఘకాలంలో ఉబ్బసదగ్గు , క్షయ మొదలగు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు తప్పక వచ్చును. 


       పైన చెప్పిన విధముగా విరుద్ధంగా నీటిని తీసుకున్నచో కలిగెడు వికారములు కు విరుగుళ్లు ఉసిరికాయ , త్రిఫలా కషాయం . 


 

   గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100  రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

కామెంట్‌లు లేవు: