11, అక్టోబర్ 2020, ఆదివారం

శ్రీ మదాంధ్ర మహా భారతము

 గోపాలుని మధుసూదన రావు 


ఘనుడౌ నన్నయభట్టు తా గరిమ

           తో గావించె నాంధ్రంబునన్

మునిద్వైపాయన ప్రోక్తమై బుధ జ 

         నామోదంబునైయున్న శ్రీ

ఘనమౌ భారతసంహితన్ , జనులు 

          భాగ్యంబంచు శ్లాఘించగా , 

వినుతించన్ కవివర్యులంద రిల

         లో వేదంబుగా నెంచియున్

       

ఇన్నూరేండ్లు గతించిపోవ పిదపన్ 

            యీ నేలపై భవ్యమౌ 

పెన్నా తీరమునన్ జనించి ధృతితో 

             పెంపొంది తిక్కన్న ,యా

పన్నుండైన హరీశునిన్ దలచియున్

             పర్వంబులన్ సర్వమున్

యెన్నంగన్ పరిపూర్తి జేసె కవితన్ 

            వేనోళ్ళ కీర్తించగన్ 


ఒక శత వత్సరంబులకు 

            నుర్విలొ నెఱ్ఱన జన్మ మొందియున్

సకలము నందునన్ మిగిలి

           సాగకనున్న నరణ్యభాగమున్  

సుకవిత తోడ గూర్చియును

           శోభను దెచ్చెను , భారతాఖ్య మీ 

రకముగ పూర్తి నొందియును 

         రాగము తోడుత దక్కె జాతికిన్ 


వాగనశాసనుండు కవి 

           వంద్యుడుతిక్కన యెఱ్ఱనాదులున్

యాగమ సారమైన తొలి

          యాంధ్రకవిత్వము సృష్టిజేసియున్

రాజితమైన భారతము 

          రంజిల నిచ్చిరి యాంధ్రజాతికిన్       

సాగగ మూడు వందలగు

          సాలులు దక్కెను గ్రంథ మీవిధి న్


****************************************

కామెంట్‌లు లేవు: