4, డిసెంబర్ 2020, శుక్రవారం

రామాయణమ్ 142

 రామాయణమ్ 142

......................

శూర్పణఖ చెప్పిన విషయము పూర్తిగా విన్నాడు,మంత్రులందరినీ వెళ్లిపొమ్మన్నాడు. 

తాను ఏమి చేయాలో దీర్ఘముగా ఆలోచించి 

గుణ దోష విచారణ పూర్తిగా చేసి చేయవలసిన పనిగురించి ఒక అవగాహనకు వచ్చి వాహనశాలకు చేరుకున్నాడు.

.

రధాన్ని సిద్ధము చేయమని సారధికి ఆజ్ఞ ఇచ్చాడు.

.

సారధి అతిశీఘ్రముగా రత్నాలంకార భూషితమైన రధాన్ని సిద్ధము చేశాడు ,దానికి శ్రేష్టమైన గాడిదలు కట్టబడ్డాయి ,వాటి ముఖాలు పిశాచాల ముఖములాగా ఉన్నవి.

.

ఆ రధాన్ని ఎక్కి రావణుడు సముద్ర తీరము వైపుగా వెళ్ళాడు.

.

పది ముఖములు,ఇరువది భుజములు ,పది కంఠములు,పది శిరస్సులతో వైఢూర్యమువంటి

 వంటి నిగనిగలతోస్వర్ణాభరణ భూషితుడై ఆకాశమార్గాన ప్రయాణం చేస్తుంటే చూసేవారికి కొంగలతోకూడిన నల్లటి మేఘములాగా కనపడ్డాటట.

.

ఆ తీరమంతా నయన మనోహరముగా ఉన్నది వివిధవృక్షజాతులు,ఎన్నో రకాల పక్షులు ,గంధర్వులు,మునులు ,దేవతలు,అప్సరసలు మొదలగు వారిచేత శోభాయమానముగా ఉన్నది.

.

ఆ సముద్రాన్ని దాటి ఆవలి వైపుకు వెళ్ళాడు రావణుడు అక్కడ సుందరముగా ,పవిత్రముగా ,ఏకాంతముగా ఉన్న ఒక ఆశ్రమానికి చేరుకున్నాడు.

.

అక్కడ కృష్ణా జినాన్ని,జటలను,నారచీరను  ధరించి ,ఆహారనియమాలు పాటిస్తూ తాపసవృత్తిలో ఉన్న ముని వేష ధారియైన మారీచుని చూశాడు .

.

వచ్చిన రాక్షస రాజుకు యధావిధిగా అతిధి సత్కారాలు గావించాడు మారీచుడు.

అంత త్వరగా మరల తనవద్దకు రావడానికి గల కారణమేమిటి?

 అని ప్రశ్నించాడు .

.

వూటుకూరు జానకిరామారావు

కామెంట్‌లు లేవు: