4, డిసెంబర్ 2020, శుక్రవారం

. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి

 *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 34  / Sri Devi Mahatyam - Durga Saptasati - 34 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 10*

*🌻. శుంభ వధ - 1 🌻*


1-3. ఋషి పలికెను : ప్రాణసమానుడైన తమ్ముడు నిశుంభుడు వధింపబడడం, సైన్యం రూపుమాప బడడం చూసి శుంభుడు క్రోధంతో ఇట్లనెను : "ఓ దుర్గా! బలగర్వంతో క్రొవ్విన నీవు ఆ గర్వాన్ని (నా వద్ద) చూపకు, ఎంత గొప్పదానవని అనుకున్నా నీవు ఇతరుల బలంపై ఆధారపడి యుద్ధం చేస్తున్నావు.


4-5. దేవి పలికెను : నేను ఈ లోకంలో ఒంటరి దాననే అయి ఉన్నాను. నేను కాక మటెవ్వరు ఉన్నారు? ఓ దుష్టుడా! నాశకులైన వీరు నాలోనికి ప్రవేశించడాన్ని చూడు.


6. అంతట బ్రహ్మాణి మొదలైనవారు (మాతృకలు) అందరూ దేవి శరీరంలో లీనమయ్యారు. అంబిక ఒక్కరిత మాత్రమే ఉంది.


7–8. అంతట దేవి పలికెను : నా శక్తిచే నేనిక్కడ నా నుండి వ్యక్తమైన రూపాల నన్నింటిని నేను మళ్ళీ ఉపసంహరించుకున్నాను. నేను ఒక్కదానిని మాత్రమే నిలిచివున్నాను. యుద్ధంలో స్థిరంగా ఉండు.


9-10. ఋషి పలికెను : ఆ ఇరువురికీ (దేవీశుంభులకు) ఘోర యుద్ధం ప్రారంభించారు. దేవాసురులందరూ చూస్తున్నారు.


11. బాణవర్షం కురిపిస్తూ, వాడి శస్త్రాలను, దారుణాస్త్రాలను ప్రయోగించుకుంటూ, వారిరువురూ మళ్ళీ సర్వలోక భయంకరంగా యద్ధం చేసారు.


12. అంబిక వందల కొద్దీ వేసిన దివ్యాస్త్రాలను ఆ రక్కసుల తేడు వాటికి మారుదెబ్బవైయగల అస్త్రాలతో త్రుంచివేసాడు.


13. అతడు ప్రయోగించిన దివ్యాస్త్రాలను భయంకరంగా హుంకరించడం మొదలైన కార్యాలచే పరమేశ్వరి అవలీలగా ఖండించింది.


14. అంతట ఆ రాక్షసుడు వందల కొద్దీ బాణాలతో దేవిని కప్పివేసాడు. దేవి కినుక పూని తన బాణాలతో అతని వింటిని ఛేదించింది.


సశేషం....

🌹 🌹 🌹 🌹

కామెంట్‌లు లేవు: