4, డిసెంబర్ 2020, శుక్రవారం

పార్ధుడు

యుద్ధం ముగిసింది ..అర్జనుడు హుందాగా కూర్చోగా రధం నగరాని వచ్చింది...కృష్ణుడు అర్జనుడిని ఓరకంట చూస్తూ " దిగు పార్ధా" అన్నాడు.

పార్ధుడు మొహం చిట్లించాడు ..చికాకుపడ్డాడు..

ఆనవాయితి ప్రకారం ముందుగా సారధి దిగి రధం యొక్క తలుపు తీసాక వీరుడు దిగుతాడు........

దానికి విరుద్ధంగా ముందు సారధి దిగకుండా తనను దిగమనడంతో అర్జనుడి ఇగో హర్ట్ అయింది...

ఐనా ఆ మహనుభావుడిని ఏమీ అనలేక...రధం దిగాడు..

అర్జనుడు దిగి కొంతదూరం పోయాక అప్పుడు దిగాడు కృష్ణుడు ..

మరునిముషం రధం భగ్గున మండి బూడిద అయింది...

అదిరిపడ్డాడు అర్జనుడు...

యుద్ధం లో ఎన్నో దివ్యస్త్రాలు ప్రయోగించబడినవి వాటిని తన శక్తిద్వారా అదిమిపట్టి ఉంచాడు కృష్ణుడు ఆయన దిగగానే శక్తి విడుదలై రధం మండిపోయింది... అదే ముందు కృష్ణుడు రధం దిగిఉంటె.....?

అలానే కొన్ని నిజాలు చేదుగా ఉంటాయ్

తప్పదు...

చెప్పడం ధర్మం...మాకన్ని తెలుసనుకుంటె మన ఖర్మం....

" ఓం నమో భగవతే వాసుదేవాయ".


🙏🏻జై శ్రీ కృష్ణ 🙏🏻

కామెంట్‌లు లేవు: