22, జనవరి 2023, ఆదివారం

దేవుడే ప్రభువు

 దాస భూతమిదం తస్య జగస్థావర జంగమం

శ్రీమన్నారాయణ స్వామీ జగతాం ప్రభురీశ్వరః (పద్మ పురాణం)


"సమస్త సృష్టికి ఆ దేవుడే ప్రభువు; చర-అచర ప్రాణులు, వస్తువులన్నీ అతని సేవకులే". ప్రాపంచిక భౌతిక విషయాసక్తి - "నా దగ్గర ఉన్న వాటన్నిటికీ నేనే యజమానిని. ఇదంతా నా సుఖం కోసమే. నా ఆస్తులు పెంచుకొని ఇంకా భోగించేందుకు నాకు హక్కు ఉంది" - అనే ఆలోచనా దృక్పథం కలిగి ఉంటుంది. దీనికి విరుద్ధమే ఆధ్యాత్మిక చైతన్యం. అది ఈ విధమైన ఆలోచనా దృక్పథం కలిగి ఉంటుంది, "భగవంతుడే సమస్త జగత్తుకి స్వామి, యజమాని, భోక్త. నేను కేవలం అతని నిస్వార్ధ సేవకుడిని/సేవకురాలిని. నాకున్న దాన్ని అంతా ఆ భగవంతుని సేవలోనే వినియోగించాలి. " అని. ఆప్రకారముగా, తనే తన కర్మల ఫలములను అనుభవించేది అని అనుకోరాదు. 

ఇదే విషయాన్ని శ్రీ కృష్ణుడు భగవద్గీతలో (2-47)

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన|

మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి||

(శాస్త్ర విహిత కర్తవ్య కర్మను ఆచరించుట యందే నీకు అధికారము కలదు. కానీ ఆ‌ కర్మ‌ ఫలములపై నీకు ఎటువంటి హక్కు లేదు. నీవే ఆ కర్మ ఫలములకు హేతువు అని ఎప్పుడు అనుకోకు. అలా అనుకుని చేయవలసిన కర్మలు మానుటయందు ఆసక్తి చూపరాదు) అని అర్జునునికి జ్ఞాన బోధ చేశారు.

కామెంట్‌లు లేవు: