16, మార్చి 2023, గురువారం

సంసారంలో సారమైనది

 శ్లోకం||

అసారే ఖలు సంసారే సారం శ్వశురమన్దిరమ్|

క్షీరాబ్ధౌ చ హరిః శేతే శివః శేతే హిమాలయే|

 

తాత్పర్యము-

సారవిహీనమైన ఈ సంసారంలో సారమైనది మామగారి ఇల్లే, అందుచేతనే విష్ణువు క్షీరసముద్రంలో (లక్ష్మి పుట్టిల్లు) శయనిస్తున్నాడు, శివుడు హిమాలయం మీద (హిమాలయంలో భాగమైన కైలాసం మీద)

శయనిస్తునాడు.


*🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు 🙏🙏*

జీవితం

"గెలవాలి అంటే.. కష్టాలను ఓర్చుకోవాలి,,


"బ్రతకాలి అంటే.. ఇష్టాలని మార్చుకోవాలి,,


"ఒకటి కావాలి అంటే.. మరొకటి ఒదులుకోవాలి,,


!...అదే జీవితం...!



సంచితఫలం

  సంచితఫలం !

🍁🍁🍁🍁🍁


ప్రపంచంలో ఏ మనిషి బతకాలన్నా డబ్బు అవసరం.డబ్బు లేకుంటే ఏ మనిషీ గడప దాటి వెళ్లలేడు.వెళ్లినా ఏ పనినీ సాధించలేడు.ఇది నిత్యసత్యం ! అయితే మనిషికి డబ్బు వస్తున్నప్పుడు దానిని అనుభవించాలి.లేదా దానం చేయాలి.అంతేకానీ అపారంగా కూడబెట్టకూడదు.కూడబెట్టిన డబ్బును ఇతరులు దోచుకుంటారు.దీనికి ఉదాహరణ తేనెటీగలు.అవి ఎంతో శ్రమించి పుష్పరసాన్ని ( తేనెను ) తెచ్చి,ఒకచోట కూడబెడుతాయి.కానీ ఏం లాభం? ఆ తేనెలను మనుషులు దోచుకొని పోతారు.అందుకే మనిషి డబ్బును పుష్కలంగా కూడబెట్టకూడదు.ఇంత మంచి నీతిని ఒక ప్రాచీననీతికారుడు ఎంత బాగా చెప్పాడో చూడండి:


'దాతవ్యం భోక్తవ్యం

ధనవిషయే సంచయో న కర్తవ్య:

పశ్యేహ మధుకరీణాం

సంచితార్థం హరంత్యన్యే !'





            _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లో𝕝𝕝  

*గుణో భూషయతే రూపం*, 

*శీలం భూషయతే కులమ్।*

*సిద్ధిర్భూషయతే విద్యాం*,

*భోగో భూషయతే ధనమ్....॥*

                                    - సూక్తిరత్నావళి.


తా𝕝𝕝 *గుణము రూపమునకు వన్నె దెచ్చును... శీలము కులము నకు వన్నె దెచ్చును.... సిద్ధి విద్యను అలంకరించును. భోగము ధనమునకు వన్నె దెచ్చును*....

ముందు నిర్ణయం!*

 🙏 నమస్కారం అండి 🙏


🙏 *ఓం నారాయణ- ఆదినారాయణ* 🙏


*గ్రంథం:* అమృత వాక్కులు, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య బోధలు

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 


*అంతా ముందు నిర్ణయం!*


ఏఏ జీవి ఏమి తినాలో? ఏమి అనుభవించాలో? ముందే నిర్ణయించబడి భూమి మీద పుడుతారు. అంతకుమించి ఏమీ అనుభవించలేడు. ఆశతో సంపాదించినా ఇనుప పెట్టెలలోను, బ్యాంకులలోను స్థిరాస్తుల రూపాలలో ఉంటే వాటికి కాపలాగా ఉండవలసిందే. తన సంపాదన ఇతరజీవుల రూపంలోని భగవంతునకై వెచ్చిస్తే భగవంతుడు గొప్పగా తృప్తి చెంది ఆశీర్వదిస్తాడని తమ ఆచరణతో శ్రీ స్వామి వారు చూచి నేర్చుకొని తరించమన్నారు. అంతటి విశ్వాసము, ఆచరణ ఉంటే సద్గురువే మనలను వెతుక్కుంటూ వస్తారని బోధిస్తున్నారు. 


*తన గురువుకు ప్రతిరూపమైన అగ్నిని ఒక్క క్షణం ఏమారకుండా సేవించారు. ఈ విశ్వమంతా తన గురురూపమే గనుక అన్ని జీవులూ తన గురురూపంగా భావించి సేవించారు.* సేవిస్తున్నారు. జీవుల గతచరిత్రనే చూడకుండా తన్నాశ్రయించిన ప్రతివారినీ ఆదుకుంటున్నారు. తనయందు విశ్వాసం గల్గి తన మార్గాన జీవిస్తారని చూస్తున్నారు. బొత్తిగా మనలో మార్పేలేకుండా వ్యాపార సరళిలో ప్రవర్తిస్తూ ఇది చేస్తే అది ఇస్తాననే మన నడవడిలో మార్పులేకుంటే *పొయ్యేవాళ్ళను పోనిచ్చేదే గదయ్యా!* అన్నారు. ఇది నేటికీ అక్షరాల నిజమై ఉంది.


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*శ్రీసాయినాథ ప్రబోధామృతము పారాయణ.*


రచన:- శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు


             *నూత్న యుగానికి వినూత్న బోధ*


“శ్రీ సాయిసచ్చరిత్ర”లో సాయి చెప్పినట్లు ఆయనబోధ అత్యద్భుతము అద్వితీయము (అధ్యాయం 18). ఆయన స్థితినిగానీ, బోధనుగాని అర్ధం చేసుకోవడఁ చాలాకష్టం. కారణం తాము సద్గురువునని ఆయన ఎన్నడూ చెప్పుకోలేదు. తమను భక్తులెలా భావించవలసినది. సేవించవలసినదీ చెప్పని అత్యంత నిరాడంబరుడు కాని అది తెలియక వారి భక్తులు ఉత్తమ ప్రయోజనం పొందలేకపోవడం గూడ ఆయనకు సమ్మతంగాదు. అందుకే ఆ విషయాలు వారికీ తెలియగలందుకే 'శ్రీగురుచరిత్ర' పారాయణ విధించారు. అయితే ప్రతివారికీ అలా చెప్పలేదు గదా, అంటే అందరూ ముముక్షువులుండరు, ఆ మాట వారే చెప్పారు మామిడిపూత ఉదాహరణతోనూ తనను లౌకిక ప్రయోజనాలాశించి ఆశ్రయిస్తారని చెప్పినపుడూ, మరికొందరికి భిన్నమైన అభిప్రాయాలు దృఢంగానాటుకొని యుండడం వలన సాయి చెప్పినా వారికి శ్రద్ధకల్గదు ఈనాడు మనలోగూడ చాలామందికిది తెలిసినా కలగనట్లే.



మానవుడు

 *శుభోదయం* 💐🙏


మనిషిని *మానవుడు* అని ఎందుకు అంటారు? 


అమ్మలో చివరి అక్షరం 

*మా*

నాన్నలో చివరి అక్షరం 

*న*

గురువులో చివరి అక్షరం.         

 *వు*

దేవుడు లో చివరి అక్షరం

*డు*


అమ్మలోని *ప్రేమ*

నాన్నలోని *బాధ్యత*

గురువులోని *జ్ఞానము*

దేవుడిలోని *ఆత్మ* స్వరూపమే.. *మానవుడు*



సాటి జీవకోటి పట్ల *ప్రేమతో*,  


ప్రకృతి పట్ల *బాధ్యతగా* వ్యవహరిస్తూ,

  

ఈ సృష్టి అంతా తనలాంటి 

*ఆత్మ స్వరూపమే* 


అనే *జ్ఞానం* 

కలిగి ఉండటమే 


*మానవత్వం* 

🙏🙏

ఆశీర్వాదం

 *🙌పురోహితుని ఆశీర్వాదం విలువ🙌*

                                               

                                                  *ఒకరోజు ఒక కోర్టులో జడ్జి గారి ముందుకు ఒక కేసు వచ్చింది*


*ఫిర్యాదు దారుడు ఒకతను ఈ విధంగా ఫిర్యాదు చేశాడు....*


*"ఒక పురోహితుడు తను సంపాదించిన ధనానికి ప్రభుత్వానికి Tax చెల్లించడం లేదు. కావున తమరు విచారణ జరిపి అతని సంపాదన అక్రమ సంపాదనగా గుర్తించి అతనిని తగిన విధంగా శిక్షించగలరని మనవి."*


*జడ్జిగారు పురోహితునితో "మీరు ధనాన్ని అక్రమంగా సంపాదించారా  లేక సక్రమంగా సంపాదించారా?"  అని ప్రశ్నించారు.*


*దానికి పురోహితుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు....*                         

*"నేను సంపాదించినదంతయు సక్రమమే...* 

*ఇసుమంతయు అక్రమం కాదు ."*


*"అయితే అంత ధనాన్ని  సక్రమంగా ఎలా సంపాదించారో వివరించండి" అని జడ్జిగారు అడిగారు.* 


*"అయ్యా ! ఒక రోజు ధనవంతులైన దంపతులిద్దరు ఆత్మహత్య చేసుకోవడానికి ఒక చెరువు వద్దకు వచ్చారు*.      


  *నేను ఆ సమయంలో సంధ్యావందనం చేస్తున్నాను*.                       

*ఆ సమయంలో వారు చేసుకోబోయే అకృత్యాన్ని చూసి వారించాను.* *'ఆత్మ హత్య మహా పాపం' అని వివరించి వారిని ఆ ప్రయత్నం నుండి విరమింప చేసి స్వాంతన కలిగించాను.*  


 *నా మాటపై విశ్వాసంతో వారు వెనుదిరిగి వెళ్లారు*

*కొద్ది రోజుల తరువాత నాపై గౌరవంతో వద్దన్నా వినకుండా కొంత ధనాన్ని ఇచ్చి 'ఆశీర్వదించండి'* *అని వేడుకున్నారు. అప్పుడు నేను 'సంతాన సిద్ధిరస్తు' అని ఆశీర్వదించాను.*


*కొన్ని సంవత్సరాల తరువాత వారికి కలిగిన సంతానాన్ని వెంటబెట్టుకొని ఆనందంతో నావద్దకు వచ్చి..*నా కుమారునికి మీ ఆశీస్సులు అందచేయండి. 'అని ప్రాధేయపడ్డారు.*


*దానికి నేను 'మీ పిల్లవాడు బాగా చదివి ప్రయోజకుడు అవుతాడు. మీకు మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకొని వస్తాడు.' అని ఆశీర్వదించాను.* 

*ఆ సమయంలో ఆనందంతో వారు  మరికొంత ధనం ఇచ్చి వెళ్ళారు.*


*మరికొన్ని సంవత్సరాల తరువాత ఈ మధ్యనే ఆ ధనవంతుడు తన కుమారుడు ప్రయోజకుడాయ్యాడనే విషయం తెలియ జేయడానికి నా ఇంటికి వచ్చి ఆశీర్వాదం అడిగాడు.*                      *నేను ఆ దంపతులిద్దరిని 'ఆయురారోగ్య వృద్ధిరస్తు' అని ఆశీర్వదించాను.*

*అప్పుడతను తన వద్ద ఉన్న ధనంలో మరికొంత ధనాన్ని ఇచ్చి ఆనందంగా ఇంటికి వెళ్ళాడు.*


 *అయ్యా! ఈ విధంగా నేను ధనవంతుణ్ణి అయ్యాను. నేను సంపాదించిన ధనము సక్రమమైనదో లేక అక్రమమైనదో తమరే తీర్పు ఇవ్వండి" అన్నారు.*


*పై విషయం అంతా సావధానంగా విన్న జడ్జి గారు ఈ విధంగా తీర్పు ఇచ్చారు...*


*"ఆరోజున ఆత్మ హత్య చేసుకోవాలనుకున్న ఆదంపతులను ఈ పురోహితుడు వారించకుండా ఉంటే వారికి తర్వాత జీవనం ఉండేది కాదు.* *కొన్ని రోజులకు వారు తమ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో కృతజ్ఞతా పూర్వకంగా కొంత ధనం ఇవ్వడం పూర్తిగా ఆమోద యోగ్యమైనదే.*                                   *ఆ ధనం సక్రమమైనదే.*


 *అటుపిమ్మట కొన్ని రోజులకు వారు సంతానవంతులై పుత్రుడు పుట్టాడనే ఆనందంలో మరికొంత ధనం ఇచ్చారు.* *అదియును సక్రమైనదే !*

*మరికొన్ని రోజులకు కొడుకు ప్రయోజకుడాయ్యాడనే సంతోషంతో మరికొంత ధనం ఇచ్చారు. అది కూడా సక్రమమే.*


*మరియు ధనవంతుని శేష జీవితం ఆయురారోగ్యాలతో ఉంటుందని తెలుసుకొని ఆనందంగా జీవిస్తున్నారు.*


*ఈ విషయంలో ఎక్కడా పురోహితుని సంపాదన అక్రమమని తెలుపలేము." అని తీర్పు వెల్లడించారు.* 


*ఈ సందర్భంలోనే జడ్జి గారు*ఇలా అడిగారు.*

*"అయ్యా ఇంత ధనాన్ని మీకు ఇచ్చి పుణ్యాత్ములైన ఆ ధనవంతులు ఎవరో తెలుసుకోవాలనే ఉత్సాహం తో ఉన్నాను.*

*వారు ఎవరో తెలుపగలరా?"* 


*"ఆ పుణ్య దంపతులు మీ తల్లిదండ్రులే !" అని తెలియచేశారు పురోహితుల వారు.* 


*వెంటనే దుఃఖంతో తను కూర్చున్న స్థానం నుంచి దిగి వచ్చి పురోహితునికి సాష్టాంగ నమస్కారం చేసాడు జడ్జి.*


*బ్రాహ్మణుడి ఆశీర్వాద బలం ఎంతో శక్తివంతమైనది !!!*

🙏🏻🙏🏻🙏🏻

ఇట్లు,

మీ 🚩

బహు జన్మల పుణ్య ఫలం

 బహు జన్మల పుణ్య ఫలం, మానవ జన్మ ! సృష్టి కర్త యొసగిన అత్యంత విలువైన జన్మ ! చరాచర జీవజాతి నిత్య ప్రశాంత జీవన గమనంలో తేజో ప్రకాశమై వెలుగొందెడి సుచైతన్య దివ్య దీపిక ! ప్రకృతి అనునిత్యం నేర్పెడి సన్మైత్రీ జీవన దృక్పథ మహోన్నత దార్శనికత ! యుగాలాది నిత్య జీవన చక్రభ్రమణంలో, విశ్వ జీవ సుసంక్షేమాత్మక నిత్య జీవనంలో, విశ్వ మానవాళి ప్రధాన పాత్ర పోషిస్తున్న తీరు, అనాదిగా ప్రత్యేకత సంతరించుకోవడం గమనార్హం ! విశ్వ సురక్షా భావనాత్మకతయే ప్రధానాంశమై, సకల విశ్వ జీవ సుసంక్షేమ జీవన మార్గమై, జరిగే కాలానికి, ప్రతి సెకనూ మహత్తరమై ప్రకాశించే సన్నివేశం ! " తాము సుసంక్షేమాత్మక జీవన బాటలో నడుస్తూ, సకల విశ్వ జీవరాశి కూడా స్వేచ్ఛగా ప్రశాంతంగా నిత్య జీవనం సాగించాలన్నదే ప్రధానాంశంగా, తమకు సృష్టి కర్త యొసగిన బ్రతుకుకు సరియైన రీతిలో సాకారాన్ని పొందాలనే మహోన్నత భావనగా, పరమోన్నత దివ్య సందేశాన్నొసగే ప్రకృతి, ప్రాతఃకాలంలో సకల జీవ జీవకారుణ్యతాత్మక నిత్య జీవన బాటను అందరికీ చేరువ చేస్తున్న నేపథ్యం ! సత్వర వసుధైక కుటుంబక నిర్మాణాత్మక బాధ్యతను, ప్రధానాంశంగా తీసుకోవలసిన విశ్వ మానవాళికి, రమణీయమైన, సుమధురమైన ప్రకృతి ఎల్లవేళలా సముచిత, సమోన్నత నిత్య సుచైతన్య దివ్య స్ఫూర్తి !                                                     ✍️గుళ్లపల్లి ఆంజనేయులు

 https://www.google.com/search?q=gayatri.seva+kasi&oq=gayatri.seva+kasi&aqs=chrome..69i57j33i10i160l2.17496j1j4&client=ms-android-samsung-ga-rev1&sourceid=chrome-mobile&ie=UTF-8

తర్వాత ఏమి సాధ్యమవుతుంది

 శ్లోకం:☝️

*యావత్స్వస్థో హ్యం దేహో*

 *యావన్మృత్యుశ్చ దూరతః ।*

*తావదాత్మహితం కుర్యాత్*

 *ప్రాణాన్తే కిం కరిష్యతి॥*


భావం: ఈ దేహం ఆరోగ్యంగా, వ్యాధి రహితంగా ఉన్నంత కాలం మృత్యువు దూరం. కావున అప్పటి వరకు ఆత్మలాభం కొరకు ధార్మిక ప్రవర్తన, పుణ్యకార్యములు చేయాల్సిందే! మరణం తర్వాత ఏమి సాధ్యమవుతుంది?