20, ఫిబ్రవరి 2021, శనివారం

మశ్చ వాహనం


 

Time Zone

 This one made a lot of sense to me...


New York is 3 hours ahead of California but it does not mean that California is slow, or that New York is fast. Both are  working based on their own "Time Zone."


Some one is still single. Someone got married and 'waited' 10 years before having a child. There is another who had a baby within a year of marriage.


Someone graduated at the age of 22, yet waited 5 years before securing a good job; and there is another who graduated at 27 and secured employment immediately !


Someone became CEO at 25 and died at 50 while another became a CEO at 50 and lived to 90 years. 

Everyone works based on their 'Time Zone',


People can have things worked out only according to their pace.

Work in your “time zone”.


Your Colleagues, friends, younger ones might "seem" to go ahead of you.

May be some might "seem" behind you.


Everyone is in this world running their own race on their own lane in their own time. God has a different plan for everybody.Time is the difference. Obama retires at 55, Trump resumes at 70


Don't envy them or mock them, it's their 'Time Zone.' 

You are in yours!


Hold on, be strong, and stay true to yourself. All things shall work together for your good. 


You’re not late … You are not early ... you’re very much On time!😊👍

Stay blessed.

You Are In Your Time Zone....🌐

*మాఘ పురాణం*_🚩 🚩 _*9 వ అధ్యాయము*

 🚩 _*మాఘ పురాణం*_🚩 

🚩 _*9 వ అధ్యాయము*_🚩


       *శనివారం*

*ఫిబ్రవరి 20, 2021*


🕉🍁🍁🍁🍁🍁🍁🕉


*గంగా జలం మహిమ*


🕉️☘☘☘☘☘☘🕉️


ఓ కార్తవీర్యార్జునా ! శివపూజ గురించి శివమహత్మ్యమును గురించి వివరించెదను వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రముపై వారధి కట్టినచోట శివలింగమును ప్రతిష్టించి శివుని ధ్యానించి , వారధిదాటి రావణుని చంపెను. అటులనే హనుమంతుడూ సముద్రమును దాటునపుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి , మహా బలమును సంపాదించి సముద్రమునుదాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసియే యుద్ధరంగములో ప్రవేశించును. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి జయము చేకూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంచలను తీర్చుకొనిరి. కనుక , పూజదు శివపూజ పవిత్రమైనది. అటులనే నదులలో గంగానది పరమపవిత్రమైనది. ఎటులనగా , గంగాజలము విష్ణుపాదములనుండి పుట్టినదియు , శివుని శిరస్సునుండి ప్రవహించునట్టిదియు అయినందుననే సర్వపాపహరమైనది. గంగా జలములో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకనూ గంగాజలము గురించి చెప్పబోవునది ఏమనగా యే నీళ్ళనుగాని , *"గంగ గంగ గంగ"* అని మూడు పర్యాయములు అనుకొని శిరస్సున చల్లుకొనినచో ఆ నీళ్ళు గంగాజలముతో సమానమయినవగును. గంగాజలము విష్ణుమూర్తి ప్రతి రూపము కనుక , మాఘమాసములో అంగాస్నానము అత్యంత పుణ్యప్రదమని తెలుపుచూ గంగా జల మహత్మ్యము గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుదు వివరించెను.


కొంత కాలము క్రిందట మగధరాజ్యములో పురోహితవృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులుండిరి. నలుగురికి నలుగురు కుమార్తెలుండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండీరి. కొన్నాళ్ళకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చెను , బ్రాహ్మణ కన్యలాయువకుని అందము చూచి , మోహించి , అతనిని సమీపించి చుట్టుముట్టి మమ్ములను వివాహం చేసుకోమని బలవంతము చేయగా ఆ బ్రాహ్మణ విధ్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోర్కెలను నిరాకరించెను. అంత ఆ కన్యలు కోపంతో నీవు పిశాచానివి కమ్మని శపించగా , ఆ విధ్యార్థియూ , మీరుకూడ పిశచులగుదురుగాక అని ప్రతి శాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే వుండి , అందరిని బాదించి , ఆహారము దొరికితే వాటాలకై పెనుగులాడుకొనుచుండిరి.


కొంతకాలమునకు ఒక సిద్దుడాకోనేటి దగ్గరకురాగా నా పిశాచముల తల్లి దండ్రులు , తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములెట్లు పోవునని అడిగిరి. ఆ సిద్దుడు వారందరిచేత మాఘమాసములో గయలోనున్న త్రివేణిలో స్నానము చేయించినచో వారికున్న పిశాచ రూపములు తొలగిపోవునని చెప్పగావారట్లు చేయుటచే అయిదుగురికి యధా రూపములు కలిగినవి. ఇట్లు జరుగుటకు మాఘమాసమహత్మ్యమే కారణము. మాఘమాస మందలి నదీ స్నానము మనుజులకే కాక దేవతలకు , గంధర్వులకు కూడ పవిత్రమైనది.


ఓక మాఘమాసములో నొకగంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడెను. అతని భార్య మాత్రము స్నానమాచరించనని చెప్పుటచే ఆమెకు దైవత్వము నసించి గంధర్వలోకానికి వెళ్ళలేకపోయినది. ఆమెను విడిచి పెట్టి ఆ గంధర్వుడొకడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుచూ విస్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంటచూసెను. ఆమె అందానికి , యవ్వనానికి విస్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే యిద్దరూ  కామక్రీడలలో తెలియాడుచుండగా , మరల ఆ గంధర్వుడు తన భార్యను వెదుకుచూ వచ్చి చూడగా , విస్వామిత్రుడు గంధర్వస్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృస్యమును చూచి మండిపడుచు తపస్వివై యుండి కూడా యిలా కామతృష్ణ కలవాడవైనందున , నీకు కోతి ముఖము కలుగుగాకయని విస్వామిత్రుని , పాషాణమై పడియుండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విస్వామిత్రుడు చేయునది లేక వానర ముఖం కలిగియుండగా నారదుడు ఆ విషయము తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి , *"విశ్వామిత్రా ! క్షణభంగురమైన తుచ్ఛకామ వాంఛకులోనై నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరేలెమ్ము గంగానదిలో స్నానము చేసి , నీ కమండలములో గంగా జలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము",* అని వివరించగా విశ్వామిత్రుడు గంగాస్నానముచేసి , విష్ణువును ధ్యానించి , కమండలముతో నీరు తెచ్చి , పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ శ్త్రీ రూపమును పొంది , గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపము నొందిన విస్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను.


     *తొమ్మిదవ అధ్యాయము* 

                 *సమాప్తం*

🌹🌷🌼🛕🔔🌼🌷🌹


      🙏🙏 *సేకరణ*🙏🙏

         *న్యాయపతి వేంకట*  

        *లక్ష్మీ నరసింహా రావు*

tenants

 🐜An ant knocked on the door of a house.


The house owner opened the door.


"I want a place to stay," said the ant.


"I have a vacant room which you can occupy for free of cost," said the owner.


The ant went inside and occupied the vacant room.


After some days, the ant brought in another ant 🐜and requested the

owner, "Can you please allow this ant to stay with me?"


"Oh sure, you can do so without paying any rent," said the owner.


After some days the ant brought a 3rd 🐜ant and requested the owner

to allow it to stay with them.


The owner agreed to it without asking for any rent.


This went on as the 🐜ant brought in more and more ants and the owner agreed to let them stay without any rent.


One fine day, the ant brought in the *10th* ant 🐜and requested the owner

to allow it to stay with them all.


The owner said, 

"OK, you can all stay here but now you all need to pay rent."


*Now the question is:*


Why did the owner ask for rent when the 10th ant came in?

.


.


.


.

🤔

.


.

🤔

.


🤔

.

.


..


.


.

.


🤔

.


.

.

🤔

.

.

.


.

.

.🤔


Because they were now *tenants!*

🐜🐜🐜🐜🐜🐜🐜🐜🐜🐜


PS: I am also looking for the guy who sent me this!

మన మహర్షులు- 28

 మన మహర్షులు- 28


 🌷మంకణ మహర్షి 🌷


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


పూర్వం మాతరిశ్వుడనే గొప్ప తపశ్శాలుండేవాడు. ఆయన భార్య సుకన్య. వాళ్ళ సంతానమే మన మంకణ మహర్షి.


మంకణ మహర్షి ఆశ్రమం ఉత్తములైన బ్రాహ్మణులతోనూ చక్కటి పూల, పండ్ల చెట్లతోనూ, సాధు జంతువులతోనూ, మునుల వేదఘోషతోనూ నిండి ఉండేది. ఈ ఆశ్రమాన్ని 'సారస్వత తీర్థం' అంటారు


ఒకసారి మంకణ మహర్షి బ్రహ్మర్షులందర్నీ పిలిచి సత్రయాగం ప్రారంభించాడు అందరూ వచ్చారు, ఏర్పాట్లన్నీ జరిగాయి. కానీ సరస్వతీనది అక్కడ ప్రవహించట్లేదని అనుకుంటూండగా బ్రహ్మ సరస్వతిని తల్చుకుని అక్కడ ప్రవహించేలా చేసి వాళ్ళ యాగం చక్కగా జరిగేలా చేశాడు. అక్కడ సరస్వతీ నదికి 'సుప్రభ' అని పేరు.


సరస్వతీనదికి నైమిశారణ్యంలో 'కనకాక్షి' అని, గయలో 'విశాల' అని, ఉద్దాలకుడు యాగం చేసిన చోట 'మనోరమ' అని, కురుక్షేత్రంలో కరువు వచ్చినపుడు 'సురేణువు' లేక 'సురతన్వ' అని వసిష్ట మహర్షి యాగం చేసినపుడు 'ఓఘవతి' లేక 'ఓఘమాల' అని ఇంకొక చోట 'విమలోదక' లేదా 'సువేణి' అనే పేర్లతో ప్రవహించింది. 


ఈ ఏడు నదులు కలిసిన చోటునే 'సారస్వతతీర్థం' అంటారు. అక్కడే మంకణ మహర్షి ఆశ్రమం ఉంది.


పరమశివభక్తుడు మంకణ మహర్షి 'ఆర్యావర్తము' అనే ప్రదేశము చేరి తపోనిష్టలో మునిగిపోయాడు. 


పంచాక్షరీ (నమఃశివాయ) మంత్రజపంతో అతని శరీరం సూర్యసమాన తేజోవంతమైంది. 


క్రమంగా భక్తి పారవశ్యంతో తాండవం చేయసాగాడు ఆ మహర్షి. అంతటి భక్తికి మెచ్చిన శివుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. 


కానీ మంకణుడు తాండవం ఆపడే... శివుడు అతని తాండవం ఆపడానికి ప్రయత్నించి ప్రశ్నించాడు "ఎవరికోసం నీ తపస్సు, నీ కోరిక ఏమిటి?". దేనికీ జవాబు చెప్పడాయే ఆ మహర్షి.

తాండవం ఆపడు.


 దానితో శివుడు ఉగ్రుడై- "వెయ్యి శిరస్సులు, వెయ్యి చేతులు, వెయ్యి కాళ్ళుతో కూడిన విరాడ్రూపంతో మహాతేజోమూర్తిగా" మహాతాండవం ప్రారంభించాడు.


 ఆయనతోపాటు ఒక స్త్రీమూర్తి కూడా ఉంది.


 ఆ మహాతాండవం ముందు మంకణుని నాట్యం వెలవెలబోయింది. దానితో అతనికి జ్ఞానోదయమయింది. శరణంటూ సాష్టాంగ నమస్కారం చేసాడు శివుడికి.


అప్పుడు శివుడు శాంతించి విశ్వరూపం ఉపసంహరించాడు. ప్రక్కనున్న దేవీ కూడా అంతర్ధానమైంది.


 మహర్షి శివుడికి నమస్కరించి "దేవాదిదేవా! ఈ మహాతాండవం ఏమిటి? ఆ స్త్రీమూర్తి ఎవరు?" అంటూ ప్రశ్నించాడు.


 అప్పుడు శివుడు "ఇది పరమేశ్వరుని దివ్యరూపం. ఆ దివ్యమూర్తిని నేనే. నాతో ఉన్న దేవి ప్రకృతి రూపిణి. బ్రహ్మరూపుడినై నేను సకల ప్రాణులను 25 (పంచవింశతి) తత్వాలతో పుట్టిస్తాను. విష్ణురూపుడినై వాటిని పోషిస్తాను. సంహారకాలంలో నేనే కాలస్వరూపుడినై వాటిని లయం చేస్తాను. సర్వప్రాణులయందు నేనే జీవాత్మనై ఉంటాను. నాకంటే అన్యమైనదేదీ లేదు. ఈ విషయం గ్రహించి, భక్తితో నన్ను ఉపాశించి, శివసాయుజ్యం పొందు" అని చెప్పాడు శివుడు.


(శ్రీ శివ పురాణంలోని సతీఖండము నుండి...)


మహాభారతం లోని శల్యపర్వం లోను, శివపురాణము లోను..ఇంకా అనేక సందర్భాలలోను  మంకణ మహర్షి ప్రస్తావన వస్తుంది..


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

ఇంట్లో మగవాడి కర్తవ్యం:

 ఇంట్లో మగవాడి  కర్తవ్యం:

1)  స్టవ్ మీదున్న కుక్కర్ వేసే 3 విజిల్స్ లెక్కబెట్టి 3 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేయడం.

 2)  స్టవ్ మీద పెట్టిన పాలు పొంగబోయే ముందే తెలివిగా స్టవ్ ఆఫ్ చేయడం.

3)  డోర్ బెల్ అటెండ్ అవ్వడం.

 4)    అటకపైన  పెట్టిన సామాను  కిందికి దించడం.

 5)   గట్టిగా మూత బిగించినవి తీసివ్వడం.

 6) సాస్, జామ్ మూతలు  ఓపెన్ చేసి ఇవ్వడం.

 7) ఇంట్లో  బల్లి, బొద్దింకలవంటి భయంకరమైన  జీవులను కొట్టి బయట పడేయడం.

 8) సిలెండర్ ఖాళీ అయిన వెంటనే మార్చడం.

9)    భార్య చెపితే మాత్రమే పిల్లలను  తిట్టి కంట్రోల్ చేయడం.

10)  డోర్  దగ్గర పడి ఉన్న న్యూస్ పేపర్  వెంటనే  చదివేయాలి లేదంటే,'పేపర్ మానేద్దాం, చదవరు పెట్టరు డబ్బు వేస్ట్ ' అని నిందిస్తుంది.

11)  షాపింగ్ చేసేటప్పుడు    నసపెట్టకుండా  భార్య వెంట ఏ షాప్ అంటే ఆ షాపులోకి  వెళ్లి కొన్నదానికి నోర్ముసుకొని బిల్ పే చేయడం.

12)  ఇంట్లో చిన్న చిన్న ఎల్కట్రిక్ ప్లంబింగ్ పనులు చేయడం.

13) టాయిలెట్ క్లీన్ చెయ్యటం

14) తనని అందంగా ఉన్నావని పొగుడుతూ ఉండటం

15) సీరియల్స్ నడిచేటప్పుడు నిశ్శబ్దముగ ఉండటం

16)ఫోన్ బిల్లులు, ఇంటర్నెట్ బిల్ సరిఅయిన టైం కి కట్టి తనకు కోపము రాకుండా చూసుకోవడం

17) కూరగాయలు తరిగి ఇవ్వటం

18) కొబ్బరికాయ పీచు తీసి ఇవ్వటం

19) అయిదు వందలు, రెండు వేలు నోట్లకు క్షణాల్లో చిల్లర తెచ్చి పెట్టటం

20) మళ్ళీ ఒక్కో సారి, తనకు పర్సు లో తేలిగ్గా ఉండటానికి వందనోట్లన్నీటి బదులు పెద్ద నోట్లు ఏర్పాటు చేసి పెట్టటం. 

  ఈ 20  పనులు చక్కగా నిర్వహించడం  భర్త కర్తవ్యం.🌹

తేనె గురించి సంపూర్ణ వివరణ - 2 .

 తేనె గురించి సంపూర్ణ వివరణ - 2 . 


       అంతకు ముందు పోస్టు నందు తేనె యందలి రకాలు మరియు తేనె సేవించటం వలన తగ్గు వ్యాధుల గురించి వివరించాను. ఇప్పుడు మీకు తేనెలోని రకాల గురించి మీకు వివరిస్తాను. 


 * అర్ఘ్యం అను తేనె - 


        ఇది పెద్దజాతికి చెందిన కొన్ని తేనెటీగల చేత పెట్టబడును. పసుపుపచ్చ రంగులా కనిపించును . వగరు రుచి కలిగి ఉండును. కొంచం చేదు రుచి అనిపించును . ఇది చాలా బలాన్ని ఇచ్చును . వాతము , పిత్తము , శ్లేష్మము మూడింటిని హరించును . 


 * చాద్రం అనే తేనె - 


         ఇది చూచుటకు పసుపు వర్ణం కలిగి కొంచం నలుపు వర్ణం కలగలసి ఉండును. మామూలు తేనె కన్నా ఇది చాలా చిక్కగా , తీపి ఎక్కువ కలదిగా ఉండి రక్తపిత్త రోగములు , పిత్త రోగములు , క్రిమిరోగములు పోగొట్టును . మందుల అనుపానముకు ఇది అత్యంత శ్రేష్టం అయినది. ఇది హిమత్పర్వత ప్రాంతముల యందు లభ్యం అగును. తక్కిన ప్రాంతముల యందు లభించుట అత్యంత కష్టసాధ్యం . ఇది ఎక్కువ మోతాదు తీసుకోరాదు అతిదాహామును పుట్టించును . 


  * చిన్నపువ్వు తేనె - 


          ఒక విధమగు చెట్లలో మామూలు తేనెటీగలు గాక ప్రత్యేకమైన ఒక జాతి ఈగలచే తేనెతుట్టె పెట్టబడును. ఇది మామూలు తేనె వలే ఉండక పలుకులు పలుకులుగా ఉండును. ఎలాంటి మేహరోగములు అయినను ఇది తగ్గించును . నాలుకకు రుచి లేకపోవటం , చర్ది , మధుమేహము వంటి సమస్యలను దూరం చేయును . ఈ తేనెను కొందరు "మధుశర్కర" అని పిలుస్తారు . అమితమైన తియ్యగా ఉండును. వాతము , మేహము , ఉన్మాదము , గ్రహణి రోగములను , రక్తపిత్త రోగములను జయించును. చాలా శ్రేష్టమైనది . దొరుకుట దుర్లభము . 


      తరవాతి పోస్టు నందు మరికొంత విలువైన సమాచారం మీకు అందిస్తాను. నేను రచించిన గ్రంథముల యందు మరింత విలువైన సమాచారం ఇవ్వడం జరిగింది . 


     గమనిక -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

కర్మ

 కర్మ


కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు. తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు.కృష్ణుడిరాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్ళి బోరున విలపిస్తాడు. చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న ధృతరాష్ట్రుడిని కృష్ణుడు ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. 


ధృతరాష్ట్రుడి దుహ్ఖం కోపంగామారి కృష్ణుడిని నిలదీస్తాడు. "అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచీ జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు తనకి వందమంది పుత్రులని పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు అని నిలదీస్తాడు. అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు.


. "ఓ రాజా! ఇదంతా నేను చేసిందీ కాదూ, నేను జరగనిచ్చిందీ కాదు. ఇది ఇలా జరగటానికి, నీకు పుత్రశోకం కలగటానికీ అన్నిటికీ కారణం నువ్వూ నీ కర్మ. యాభై జన్మల క్రితం నువ్వొక కిరాతుడివి (వేటగాడు). ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడినా నీకు యేమీ దొరకని సందర్భంలో ఒక అశోక వృక్షం మీద రెండు గువ్వల జంట వాటి గూట్లో గుడ్లతో నివసిస్తున్నాయి. వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులూ నీ బాణాన్ని తప్పించుకుని బ్రతుకగా అప్పటికే సహనము నశించినవాడివై కోపంతో ఆ గూట్లో ఉన్న వంద గుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్చిన్నం చేశావు. తమ కంటి ముందే తమ నూర్గురు పిల్లలు విచ్చిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూఉండిపోయాయి. ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపము నుండి విముక్తుడిని చేసి కర్మబంధం నుండి విడిపించింది, నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది, వదలక వెంటాడి ఆ కర్మ ఫలాన్ని అనుభవింపచేస్తుంది. కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరు" అని అంటాడు. 


ధృతరాష్ట్రుడు సమాధానపడ్డట్టు అనిపించినా మళ్ళీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు. కర్మ అంత వదలని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు? ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నిస్తాడు. అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి "ఓ రాజా! వందమంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి.. ఎన్నో సత్కర్మలు ఆచరించాలి. ఈ యాభై జన్మలు నువ్వు ఈ వందమంది పుత్రులను పొందడానికి కావల్సిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు. వందమంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పని చేయడం మొదలుపెట్టింది అని శెలవిస్తాడు. అది విన్న ధృతరాష్ట్రుడు కుప్పకూలిపోతాడు. 


మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలాలన్నీ ఒక్క చెడ్డపనితో తుడిచిపెట్టుకుపోతాయి అని శ్రీ కృష్ణుడి అంతరార్థం. 


- మహాభారతం 


---- ✍🏼

❤*అన్నదానం*❤ "ఏమండీ!! ఒక్క నిమిషం!! ఆగండి... ప్యాకింగ్ చేయడం అయిపోయింది. ఇదిగో నండీ ఈ పార్సిల్ తీసుకెళ్ళండి" హడావిడిగా తడిచేతులు చీర కొంగుకు తుడుచుకుంటూ బయటకు వచ్చి పురుషోత్తంకు కవరు అందించింది సుశీల... "సూర్యభగవానుడు ఒకరోజు అయినా తూర్పున ఉదయించడం మర్చిపోతాడేమెా!! కానీ నువ్వు మాత్రం ఈ పార్సిల్ చేసిన కవరు నాకివ్వడం మర్చిపోవుకదా!!" "అసలు ఇంతమంచి అలవాటు నీకున్నందుకు, మనం తినేదానిలో ఒక్కరికి అయినా అన్నం పెట్టి మనం తినాలని ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఆచరిస్తున్నందుకు నీకు అభినందనలు సుశీలా"!! "నన్ను పొగడ్తలతో ముంచకండి!! మీకు ఆఫీసుకు టైమ్ అయింది మీరు వెళ్లండి"!! అంటూ సుశీల నవ్వుకుంటూ లోపలకి వెళ్లి పోయింది... పురుషోత్తం ఆఫీసుకు వెళుతూ దారిలో ముసలివాడు కనిపిస్తే అతనికి అన్నం కవరు ఇచ్చి ఆఫీసుకు వెళ్లి పోయాడు.. పెళ్లి అయిన కొత్తలో "నీకేం కావాలో చెప్పు? ఏంకావాలన్నా కొంటాను? ఎంత ఖరీదైన దయినా ఫరవాలేదు"? అని పురుషోత్తం పదిసార్లు అడిగితే అప్పుడు మెుహమాటపడుతూ "నేను ఏం అడిగినా కాదనకూడదు మరి నా కోరిక విని నవ్వకూడదు"అని ముందే షరతు విధించింది. సుశీల... అడిగిన కోరిక విని మతిపోయినంత పని అయింది. ఖరీదైన నగలు చీరలు కోరుకుంటుంది లేదా విదేశాలకు తీసుకెళ్ల మంటుందని ఊహించాడు కానీ ఇంత గొప్ప...కోరికా! అని ఆశ్చర్య పోయాడు పురుషోత్తం... "ఏమండీ!! చిన్నప్పుడు మా బామ్మగారు చెప్పేవారు అన్ని దానాలలో అన్నదానం గొప్పదని!! అది నా మనసులో నాటుకు పోయింది నేను రోజూ ఒకరికయినా అన్నదానం చేయాలి. నా ఒంట్లో ఓపిక వున్నంతవరకూ నేను చేయగలిగినన్ని రోజులు ఎవరో ఒకరికైనా అన్నం పెట్టాలి. ఇదీ నా కోరిక ఒప్పుకుంటారా" !! ఇది నేను కలలో కూడా ఊహించలేదు. ఎంత గొప్ప కోరిక కోరావు సుశీలా!! తప్పకుండా ఆచరిద్దాం. "భగవంతుడు దయవలన మనకి ఆర్థిక ఇబ్బందులు లేవు. మీరు ఉద్యోగంలో మంచి పొజిషన్ లో వున్నారు. ఒకరికి అన్నం పెట్టినంత మాత్రాన మన ఆస్థులు ఏమీ తరిగిపోవు ఏమంటారు మీరు"? "నువ్వు ఇంత మంచి పని చేస్తానంటే నేను ఎందుకు కాదంటాను. తప్పకుండా అలాగే చేద్దాం"!! పురుషోత్తం ఆనందంగా ఒప్పుకున్నాడు... ఒక్కక్క సారి మంచి చేసినాకూడా చెడు ఎదురు పడుతుంది అంటారు. అది నిజమే అన్పిస్తుంది. ఒకోసారి భోజనం టైమ్ వరకు ఎదురు చూసినా ఎవరు దొరికేవారు కాదు. ఎవరికైనా భోజనం పెడితేగానీ భోజనం చేయననేది సుశీల. పెడదామంటే ఎవరూ దొరికేవారు కాదు..అప్పుడు పక్క అపార్ట్మెంట్ వాచ్ మేన్ ని పిలిచి భోజనం పెట్టి తను తినేది. ఆ వాచ్ మేన్ తాగుబోతు ఎప్పుడూ మత్తులోనే వుండేవాడు... ఇది చూసి పురుషోత్తం ఒక ఐడియా చెప్పాడు "నేను ఆఫీసు కు వెళ్లే టైమ్ కి వంట ఎలాగా అయిపోతుంది. అన్నీ పేక్ చేసి ఇచ్చేయి. బైక్ లో వెళుతూ ముసలివారు గానీ అంగవైకల్యం గల వాళ్లు పని చేయడానికి శక్తి లేనివాళ్ళు ఆకలితో వున్న వాళ్లు గానీ కనిపిస్తే ఇస్తాను. నువ్వు కూడా టైమ్ కి భోజనం చేసేయచ్చు అని చెప్పి ఒప్పించాను ".. "అప్పుడు ఈ ఐడియా బావుంది కానీ మీకు ఇబ్బంది అవుతుంది కదా"!! అంది. "నాకేం ఇబ్బంది లేదు నువ్వు చేసే పని ముందు నాదెంత"!! అని సుశీలని ఒప్పించి అప్పటి నుంచీ పార్సిల్ చేసి తీసుకెళ్లి ముసలివారికి,అంగవైకల్యం వున్న వారికి, చిన్న పిల్లల తల్లులకు, పిల్లలకు ఇవ్వడం చేయసాగాడు పురుషోత్తం... రెండు విస్తరాకులు ఒకదాని మీద ఒకటి వేసి ఇద్దరికి సరిపడా అన్నం పెట్టి లాక్డ్ కవర్లలో కూర ఒక కవరు, సాంబారు లేక రసం ఒక కవరులో, పచ్చడి లేక ఆవకాయ ఒక కవరు, ఆకుకూర పప్పు ఒక కవరు, పెరుగు ఒక కవరు,ఒక వాటర్ బాటిల్ ఇవన్నీ దేనికి దానికి సెపరేట్ గా పేక్ చేసి ఒక కవరులో పెట్టి ఇవ్వడం మెుదలు పెట్టింది. ఆ భోజనం తిన్నవారు ఎవరైనా సరే కడుపు ఫుల్ గా నిండి పోవలసిందే !! నెలకి నాలుగు ఆదివారాలు మిగతా సెలవు దినాల్లో పనిమనిషికి పెట్టేది. పండగలలో మాత్రం వీధులు తుడిచేవాళ్లని, పనిమనిషి కుటుంబాన్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి పిల్లలకు బట్టలు చీరలు దుప్పట్లు కొని ఇచ్చేది సుశీల... సుశీల చేసిన ఏ పనికి అడ్డు చెప్పేవాడు కాదు పురుషోత్తం. తనకోసం ఏనాడు నగలు చీరలు కొనమని అడిగేది కాదు.. సుశీల డెలివరీకి పుట్టింటికి వెళ్లి నపుడు మాత్రం సుశీల అత్తగారు వంటచేసి పేక్ చేయడం చేసేవారు. అమ్మా! నీకు ఇబ్బందిగా వుంటే మానేయమ్మా! అని కొడుకు అంటే కోడలు మెుదలు పెట్టిన మంచి కార్యక్రమాన్ని మనం మానేయడమెందుకు ? మనకోసం వండిన పదార్థాలే కొంచెం ఎక్కువ వండుతున్నాను. ఇందులో నాకు శ్రమ ఏముంది అని ఆవిడ కూడా వండిన అన్ని పదార్థాలు పేక్ చేసి ఇచ్చేవారు... ఆ అన్నదానం ఫలితమే అనుకుంటా! వాళ్ల పిల్లలు ఇద్దరు మంచి చదువులు చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించుకుని మంచి జీవిత భాగస్వామిని పొంది చీకూచింత లేకుండా సంతోషంగా జీవితంలో స్ధిరపడ్డారు. "అలా మేలు జరుగుతుందో,లేదో తెలియదు కానీ... ఒక ప్రాణమైతే మాత్రం నిలుస్తుంది కదా మిత్రమా.."🤔 ఈ లాంటి కుటుంబాలు మనకందరికి ఆదర్శ ప్రాయం మిత్రులారా....🙏🙏

 ❤*అన్నదానం*❤

  "ఏమండీ!! ఒక్క నిమిషం!! ఆగండి...

ప్యాకింగ్ చేయడం అయిపోయింది. ఇదిగో నండీ ఈ పార్సిల్ తీసుకెళ్ళండి" హడావిడిగా తడిచేతులు చీర కొంగుకు తుడుచుకుంటూ బయటకు వచ్చి పురుషోత్తంకు కవరు అందించింది సుశీల...


   "సూర్యభగవానుడు ఒకరోజు అయినా తూర్పున ఉదయించడం మర్చిపోతాడేమెా!! కానీ నువ్వు మాత్రం ఈ పార్సిల్ చేసిన కవరు నాకివ్వడం మర్చిపోవుకదా!!"


  "అసలు ఇంతమంచి అలవాటు నీకున్నందుకు, మనం తినేదానిలో ఒక్కరికి అయినా అన్నం పెట్టి మనం తినాలని ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఆచరిస్తున్నందుకు నీకు అభినందనలు సుశీలా"!!


  "నన్ను పొగడ్తలతో ముంచకండి!! మీకు ఆఫీసుకు టైమ్ అయింది మీరు వెళ్లండి"!! అంటూ సుశీల నవ్వుకుంటూ లోపలకి వెళ్లి పోయింది...


  పురుషోత్తం ఆఫీసుకు వెళుతూ దారిలో ముసలివాడు కనిపిస్తే అతనికి అన్నం కవరు ఇచ్చి ఆఫీసుకు వెళ్లి పోయాడు..


  పెళ్లి అయిన కొత్తలో "నీకేం కావాలో చెప్పు? ఏంకావాలన్నా కొంటాను? ఎంత ఖరీదైన దయినా ఫరవాలేదు"? అని పురుషోత్తం పదిసార్లు అడిగితే


  అప్పుడు మెుహమాటపడుతూ "నేను ఏం అడిగినా కాదనకూడదు మరి నా కోరిక విని నవ్వకూడదు"అని ముందే షరతు విధించింది.


  సుశీల... అడిగిన కోరిక విని మతిపోయినంత పని అయింది. ఖరీదైన నగలు చీరలు కోరుకుంటుంది లేదా విదేశాలకు తీసుకెళ్ల మంటుందని ఊహించాడు కానీ ఇంత గొప్ప...కోరికా! అని ఆశ్చర్య పోయాడు పురుషోత్తం...


   "ఏమండీ!! చిన్నప్పుడు మా బామ్మగారు చెప్పేవారు అన్ని దానాలలో అన్నదానం గొప్పదని!!


  అది నా మనసులో నాటుకు పోయింది నేను రోజూ ఒకరికయినా అన్నదానం చేయాలి. నా ఒంట్లో ఓపిక వున్నంతవరకూ నేను చేయగలిగినన్ని రోజులు ఎవరో ఒకరికైనా అన్నం పెట్టాలి. ఇదీ నా కోరిక ఒప్పుకుంటారా" !!


  ఇది నేను కలలో కూడా ఊహించలేదు. ఎంత గొప్ప కోరిక కోరావు సుశీలా!! తప్పకుండా ఆచరిద్దాం.


  "భగవంతుడు దయవలన మనకి ఆర్థిక ఇబ్బందులు లేవు. మీరు ఉద్యోగంలో మంచి పొజిషన్ లో వున్నారు. ఒకరికి అన్నం పెట్టినంత మాత్రాన మన ఆస్థులు ఏమీ తరిగిపోవు ఏమంటారు మీరు"?


  "నువ్వు ఇంత మంచి పని చేస్తానంటే నేను ఎందుకు కాదంటాను. తప్పకుండా అలాగే చేద్దాం"!! పురుషోత్తం ఆనందంగా ఒప్పుకున్నాడు...


  ఒక్కక్క సారి మంచి చేసినాకూడా చెడు ఎదురు పడుతుంది అంటారు. అది నిజమే అన్పిస్తుంది. ఒకోసారి భోజనం టైమ్ వరకు ఎదురు చూసినా ఎవరు దొరికేవారు కాదు.


   ఎవరికైనా భోజనం పెడితేగానీ భోజనం చేయననేది సుశీల. పెడదామంటే ఎవరూ దొరికేవారు కాదు..అప్పుడు పక్క అపార్ట్మెంట్ వాచ్ మేన్ ని పిలిచి భోజనం పెట్టి తను తినేది. ఆ వాచ్ మేన్ తాగుబోతు ఎప్పుడూ మత్తులోనే వుండేవాడు...

 

  ఇది చూసి పురుషోత్తం ఒక ఐడియా చెప్పాడు "నేను ఆఫీసు కు వెళ్లే టైమ్ కి వంట ఎలాగా అయిపోతుంది. అన్నీ పేక్ చేసి ఇచ్చేయి. బైక్ లో వెళుతూ ముసలివారు గానీ అంగవైకల్యం గల   వాళ్లు పని చేయడానికి శక్తి లేనివాళ్ళు ఆకలితో వున్న వాళ్లు గానీ కనిపిస్తే ఇస్తాను. నువ్వు కూడా టైమ్ కి భోజనం చేసేయచ్చు అని చెప్పి ఒప్పించాను "..


  "అప్పుడు ఈ ఐడియా బావుంది కానీ మీకు ఇబ్బంది అవుతుంది కదా"!! అంది. "నాకేం ఇబ్బంది లేదు నువ్వు చేసే పని ముందు నాదెంత"!! అని సుశీలని ఒప్పించి అప్పటి నుంచీ పార్సిల్ చేసి తీసుకెళ్లి ముసలివారికి,అంగవైకల్యం వున్న వారికి, చిన్న పిల్లల తల్లులకు, పిల్లలకు ఇవ్వడం చేయసాగాడు పురుషోత్తం...


  రెండు విస్తరాకులు ఒకదాని మీద ఒకటి వేసి ఇద్దరికి సరిపడా అన్నం పెట్టి లాక్డ్ కవర్లలో కూర ఒక కవరు, సాంబారు లేక రసం ఒక కవరులో, పచ్చడి లేక ఆవకాయ ఒక కవరు, ఆకుకూర పప్పు ఒక కవరు, పెరుగు ఒక కవరు,ఒక వాటర్ బాటిల్ ఇవన్నీ దేనికి దానికి సెపరేట్ గా పేక్ చేసి ఒక కవరులో పెట్టి ఇవ్వడం మెుదలు పెట్టింది. ఆ భోజనం తిన్నవారు ఎవరైనా సరే కడుపు ఫుల్ గా నిండి పోవలసిందే !!


  నెలకి నాలుగు ఆదివారాలు మిగతా సెలవు దినాల్లో పనిమనిషికి పెట్టేది. పండగలలో మాత్రం వీధులు తుడిచేవాళ్లని, పనిమనిషి కుటుంబాన్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి పిల్లలకు బట్టలు చీరలు దుప్పట్లు కొని ఇచ్చేది సుశీల...


  సుశీల చేసిన ఏ పనికి అడ్డు చెప్పేవాడు కాదు పురుషోత్తం. తనకోసం ఏనాడు నగలు చీరలు కొనమని అడిగేది కాదు..


  సుశీల డెలివరీకి పుట్టింటికి వెళ్లి నపుడు మాత్రం సుశీల అత్తగారు వంటచేసి పేక్ చేయడం చేసేవారు.

  అమ్మా! నీకు ఇబ్బందిగా వుంటే మానేయమ్మా! అని కొడుకు అంటే కోడలు మెుదలు పెట్టిన మంచి కార్యక్రమాన్ని మనం మానేయడమెందుకు ? మనకోసం వండిన పదార్థాలే కొంచెం ఎక్కువ వండుతున్నాను. ఇందులో నాకు శ్రమ ఏముంది అని ఆవిడ కూడా వండిన అన్ని పదార్థాలు పేక్ చేసి ఇచ్చేవారు...


  ఆ అన్నదానం ఫలితమే అనుకుంటా! వాళ్ల పిల్లలు ఇద్దరు మంచి చదువులు చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించుకుని మంచి జీవిత భాగస్వామిని పొంది చీకూచింత లేకుండా సంతోషంగా జీవితంలో స్ధిరపడ్డారు.

   "అలా మేలు జరుగుతుందో,లేదో తెలియదు కానీ... ఒక ప్రాణమైతే మాత్రం నిలుస్తుంది కదా మిత్రమా.."🤔

          ఈ లాంటి కుటుంబాలు మనకందరికి ఆదర్శ ప్రాయం మిత్రులారా....🙏🙏

రమ యనగా

 రమ యనగా లక్ష్మీ యని వక భావన. ర శబ్ద భావమునకు రెండవ మాత్ర వలన అనగా సంగీత పరంగా రా దానికి ౦ పూర్ణము వలన రామ శబ్దం లక్షణము తెలియుట. పదార్ధ తత్వమైనది రామ. ర రుద్ర శబ్ద మని వేదం. రుద్ర శబ్దమునకు మ ఎమ్ మెటీరియల్ పదార్ధరూపంలేని యెడల ర శబ్ద లక్షణము తెలియదు. రామ రెండుమార్లు శబ్దమునకు యింత అర్ధం వున్నవున్ని. మరి రా దీర్ఘ స్వరముతో రా.... మ అనగా మన ప్రాణవాయువు అమితమై శ్వాస రూపంలో గల జీవ భావన కలుగును. అనగా సో హం సో అహం. నేనే హం తో రూప ప్రకృతి యైన ఓ జీవుడను అని తెలియును. రామ లో నమః శివాయః లో మ రెండునూ పూర్ణమైన శక్తి మ మెటీరియల్స్ అనగా పదార్ధ రూపం దాల్చింది. మ శబ్దం లేని నమః శివాయః తత్వం న శివాయః శివ తత్వం బోధపడదు. అందుకే పంచాక్షరీ కూడా రామ శబ్ద లక్షణమే. హ అనే అక్షరం పూర్ణమునకు మరో రూపం. అది హవ  హోత అగ్ని రూప జనితమైన శక్తి దానికి చైతన్యమే హరి. ర కారం రుద్రమైతే రి అనునది రుద్ర చైతన్యశక్తియైన మ రూపంలో అమ్మ. అమ్మ అయ్యల శక్తి కలయిక యే హరి తత్వం.హరి తత్వం తెలియక సందిగ్ధంలో యున్నప్పుడు రామ పూర్వక పదార్ధ శక్తి వలన హరి రూపంలో గల తత్వం. యిది రామ శబ్ద తత్వంగా హరి శబ్దం తెలియుట. సులువుగా ఏ సమయంలోనైనా పలుకు ప్రక్రియ. హర అనగా యి చైతన్యంలేని తత్వం వున్నా కూడా అది యిది అని తెలియదు. అది అణు తత్వం. చైతన్య తత్వము హరి యని అన్నమయ్య హరీ ....యని  దీర్ఘ స్వర సంబంధం రామ వ్యాప్తి తత్వం. తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూ నేను వుందాం.

మొగలిచెర్ల

 *సేవామార్గం..*


"నిన్న మధ్యాహ్నం ఇక్కడికి వచ్చానండీ..నిన్నటి సాయంత్రం జరిగిన పల్లకీసేవ లో కూడా పాల్గొన్నాను..ఈరోజు ఉదయం స్వామివారి సమాధి దర్శనం చేసుకున్నాను..మరో మూడు రోజులు ఇక్కడే వుందామని అనుకుంటున్నాను..ఈ మంటపం లోనే బస చేస్తాను.." అని ఆ యువకుడు ఒక ఆదివారం మధ్యాహ్నం హారతి అయిపోయిన తరువాత నన్ను అడిగాడు.."మీ వివరాలు మా సిబ్బంది వద్ద ఇవ్వండి..ప్రతిరోజూ మధ్యాహ్నం అన్నప్రసాదం ఉంటుంది.."అన్నాను.."నాపేరు కోదండరామ మూర్తి..షాద్ నగర్ వద్ద..తెలంగాణ.." అన్నాడు.."ఆ వివరాలన్నీ మా వాళ్ళ వద్ద నమోదు చేయించండి.." అన్నాను..సరే అని చెప్పి వెళ్ళిపోయాడు..


ఆరోజు సాయంత్రం స్వామివారి హారతి ఇచ్చే వేళకు మందిరం లోకి వచ్చి స్వామివారి హారతి కళ్లకద్దుకొని..వెళ్ళిపోయాడు..అతని గురించి నేను గానీ..మా సిబ్బంది గానీ పెద్దగా శ్రద్ధ చూపలేదు..ఏదో తాను స్వామివారి సన్నిధి లో ఓ మూడురోజులు ఉండటానికి వచ్చాడు..ఆ తరువాత వెళ్ళిపోతాడు అనే భావన లో వున్నాడు..సోమవారం ఉదయం అర్చకస్వాములు వచ్చి శ్రీ స్వామివారి మందిర తలుపులు తెరచి ప్రభాతసేవ కొఱకు ఏర్పాట్లు చేసుకునే సమయానికి కోదండరామమూర్తి తాను కూడా స్నానం చేసి ఆలయం లోకి వచ్చాడు..పూలు కోసుకొచ్చి పళ్లెం లో పెట్టి అందించాడు..తులసి ఆకులు తీసుకొచ్చి అర్చకస్వాములకు ఇచ్చాడు.."స్వామీ..మీకేదైనా సహాయం కావాలంటే నాకు చెప్పండి..స్వామివారి సేవ చేసుకోవాలని అనుకుంటున్నాను..నాకూ అవకాశం ఇవ్వండి.." అని అర్చకులతో చెప్పాడు..ప్రభాతసేవ పూర్తయ్యేదాకా మంటపం లో వుండి..పూజారి గారు స్వామివారికి ఇచ్చిన హారతి కళ్లకద్దుకొని..వరుసక్రమం లో వచ్చి తీర్ధం తీసుకొని..మంటపం లోకి తిరిగివెళ్లి కూర్చున్నాడు..ఉదయం తొమ్మిది గంటలకు నావద్దకు వచ్చి.."స్వామివారి మందిరం లో ఈ మూడురోజులూ ఏదో ఒక సేవ చేయాలని అనుకుంటున్నాను..మందిరం శుభ్రం చేయమన్నా చేస్తాను..మీ వ్యవస్థ లో వేలు పెట్టాలనే ఉద్దేశ్యం కాదు..నా వంతుగా సేవ చేసుకోవాలని ఒక కోరిక..మీరు ఏ పని చెప్పినా చేస్తాను.." అన్నాడు.."మీరే అన్నారు కదా మందిరం శుభ్రం చేయగలను అని..అదే చేయండి.." అన్నాను..సరే అన్నాడు..ఆ మూడురోజులూ ఉదయం సాయంత్రం స్వామివారి మందిర ప్రాంగణం అంతా శుభ్రం గా ఊడ్చాడు.మూడుపూటలా స్వామివారి హారతి కళ్లకద్దుకొన్నాడు..తీర్ధం తీసుకున్నాడు..మంటపం లోనే నిద్ర చేసాడు..గురువారం ఉదయం ప్రభాతసేవ హారతి తీసుకొని..తన ఊరికి వెళ్ళిపోయాడు..


ఐదు నెలలు గడిచిపోయాయి..ఒక శనివారం మధ్యాహ్నం కోదండరామమూర్తి స్వామివారి మందిరానికి వచ్చాడు..ఈసారి ఒంటరిగా రాలేదు..తన భార్యను తీసుకొని వచ్చాడు..పల్లకీసేవ కొఱకు తమ పేర్లు నమోదు చేయించుకొని..ఇద్దరూ మా దంపతుల వద్దకు వచ్చారు..అతనిని చూడగానే గుర్తుపట్టాను.."బాగున్నారా?.."అని అడిగాను..చప్పున నా రెండు చేతులూ పట్టుకొని..తన నుదుటి పై పెట్టుకొని..కళ్ళు మూసుకున్నాడు..ఒక్కసారిగా భావోద్వేగం తో కన్నీళ్లు పెట్టుకున్నాడు..అతని భార్య అతని భుజం మీద చేయి వేసి..ఓదార్పుగా తట్టింది..ఈ చర్య నాకు అర్ధం కాలేదు..అతను కొద్దిగా తేరుకొని..కళ్ళు తుడుచుకుని.."ప్రసాద్ గారూ..పోయినసారి నేనొక్కడినే ఇక్కడికి వచ్చి స్వామివారి వద్ద మొత్తం ఐదు రోజులు వున్నాను..శనివారం నుంచీ గురువారం ఉదయం వరకూ..స్వామివారి సేవ చేసుకుంటాను అని నేను అడిగితే..మీరు, మీ సిబ్బంది..మీ పూజారులు అందరూ నాకు సహకరించారు..అప్పుడు నేను ఇక్కడికి రావడానికి ఒక కారణం ఉన్నది..మాకు వివాహం జరిగి ఏడేళ్లు అవుతున్నది..సంతానం లేదు..మా ఇద్దరి జాతకాలు చూపిస్తే..సంతానయోగం ఉన్నది అని చెప్పారు కానీ..పిల్లలు పుట్టలేదు..నేను పనిమీద హైదరాబాద్ వెళ్ళాను..అక్కడ శ్రీనగర్ ఆలయం పూజారి గారు నా జాతకం చూసి..మొగలిచెర్ల వెళ్లి మూడురోజులు నిద్ర చేయి..ఆ అవధూత దత్తాత్రేయుడి కరుణిస్తే నీకు సంతానం కలుగుతుంది అని చెప్పారు..ఈ మందిరం అడ్రెస్ కూడా వారే ఇచ్చారు..తిరిగి ఇంటికి వెళ్లి..ఈమెతో చెప్పి ఇక్కడికి వచ్చాను..ఇక్కడ మీ సహకారం మరువలేనిది..స్వామివారికి నాకు తోచిన సేవ నేను చేసుకున్నాను..పూర్తిగా ఈ స్వామివారినే నమ్మి..ఆయన మీదే భారం మోపి..నమస్కారం చేసుకొని వెళ్ళాను..ఇప్పుడు నా భార్య గర్భవతి..మూడో నెల..ఇప్పుడు మేమిద్దరమూ ఈ స్వామివారిని దర్శించుకొని ..మరలా మాకు సంతానం కలిగిన తరువాత..ఆ బిడ్డతో సహా వస్తాము..ఈమె ప్రయాణం చేయడం ఇబ్బందేమో అనుకున్నాను..కానీ తాను వస్తానని పట్టు పట్టింది..ఈరోజు రేపు వుండి..రేపు సాయంత్రం తిరిగి మావూరు వెళతాము..స్వామివారు పరిపూర్ణ దయ చూపారు మామీద.." అని అత్యంత సంతోషంగా చెప్పాడు..


కోదండరామమూర్తి సేవామార్గాన్ని ఎంచుకున్నాడు..అదికూడా పరిపూర్ణ భక్తి తో పూర్తి చేసాడు..ఎక్కడ భక్తి విశ్వాసాలు ఉంటాయో..అక్కడ భగవంతుడు తన కృపాకటాక్షణాలను ప్రసరింపచేస్తాడు..ఈ కోదండరాముడి విషయం లోనూ అదే జరిగింది..నమ్మి కొలిచినందుకు..మొగిలిచెర్ల అవధూత దత్తాత్రేయుడు ప్రతిఫలం ప్రసాదించాడు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

Plots are available ప్లాటులల్లో పెట్టుబడి పెట్టండి

ప్రస్తుత పరిస్థితుల్లో మన సేవింగ్స్ ను పెంచుకోవటానికి వున్న ఒకే ఒక మార్గం ప్లాటులల్లో పెట్టుబడి పెట్టటమే.  మనం గమనించినట్లయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాలల్లో ప్లాటుల రేట్లు రోజు రోజుకి అనూహ్యంగా వృద్ధి చెందుతున్నాయి. 

గత సంవత్సరం గజం 10 వేలు పలికిన ప్లాటు ఇప్పుడు 20 వేలకు పైగా పలుకుతుంది. కాబట్టి మధ్యతరగతి వారికి వారి సేవింగులను పెంపొందించుకోవటానికి ప్లాట్లల్లో పెట్టుబడి పెట్టటమే ఒకే ఒక అవకాశం. ఇప్పుడు హైదరాబాద్ శివార్లలో గజం 30 వేలు పైన్ పలుకుతుంది. మీకు 5 వేలు నుంచి 15 వేల వరకు కేవలం హైద్రాబాదు నుండి 30 నుండి 40 కిలోమీటర్లల్లో వున్న ప్రదేశాలలో మాత్రమే దొరుకుతున్నాయి. ఒక 10 లక్షల నుండి 20 లక్షల వరకు పెట్టుబడి పెడితే ఒకటి రెండు సంవస్త్సరాలలో మీరు ఊహించని ధర పలకటం ఖాయం. 

ఇదే సరైన సమయం  

ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం మీ ఆర్ధిక స్థితినే మారుస్తుంది. 

హైద్రాబాదు చుట్టుపక్కల వున్న తిమ్మాపూర్, కడ్తాల్, ఆమనగల్లు, శంకరపల్లిలలో ప్లాట్లు విక్రయానికి గలవు. మీరు హైద్రాబాదులో వున్నట్లైతే మీరు వున్న స్థలంనుండి కారులో మీకు మీరు కోరుకున్న బడ్జెట్లో మీకు సదరు ప్లాటు చూపెట్ట బడును. అదే మీరు వేరే దూర ప్రాంతంలో ఉండి ఇక్కడి ప్లాట్ కొనదలచిన కూడా మీరు కేవలం రిజిస్ట్రేషన్ సమయంలో వచ్చి మీ ప్లా టును కొనుక్కోవచ్చు. మీరు ఒకటి రెండు సంవత్సరాల తరువాత  అమ్మ దలిచిన అప్పటి రేటుకు మీకు అమ్మి మీకు మీ డబ్బు ఇప్పించగలము. 

వివరాలకు కాలు చేయండి 9848647145

బహుమతులు 

ఈ రెండు రోజలు అంటేశనివారము ( 20.2.2021) మరియుఆదివారము ( 21.2.2021) లలో బుకు చేసుకునే వారికి ఒక మిక్సీ కం గ్రైండర్ (750 watts ) బహుమతిగా ఇవ్వబడును. కనుక ఈ అవకాశము వినియోగించుకోగలరు. 


Plots are available in

Thimmapur, amangal, Kadtal, shankarpalli etc., For more information contact SARMA


9848647145

Car will be arranged for site visit from your place in Hyderabad


Good opportunity to invest today

For better profits of tomorrow



Gift.


The members booked plots on Saturday( 20.2.2021) and Sunday( 21.2.2021) will be gifted a mixture grinder of 750 watts

This gift will be given to those bookings of two days only 

For prices of plots call on phone

So 


Horry up