30, జూన్ 2021, బుధవారం

#కథ ఇంతటితో అయిపోలేదు

 👩‍🦰ఒక మహిళ షాపింగ్‌కు వెళ్ళింది. అంతా పూర్తయ్యాక క్యాష్ కౌంటర్ వద్దకు వచ్చి, బిల్లు చెల్లించడానికి తన హేండ్ బ్యాగ్ తెరిచింది.

క్యాషియర్ ఆమె బ్యాగు లో

ఒక టీవీ రిమోట్ గమనించాడు.

అతను ఉండబట్టలేక ఆడిగేసాడు..

"మీరు ఏప్పుడూ మీ టీవీ రిమోట్‌ను మీతో తీసుకువెళతారా?" అని.

ఆమె "లేదండీ, ఎప్పుడూ ఇలా తీసుకురాను, అప్పుడప్పుడు మాత్రమే.. ఈరోజు మావారు క్రికెట్ మ్యాచ్ ఉందని చెప్పి నాతో పాటు షాపింగ్ కి రాలేదు అందుకే నేను రిమోట్ తీసుకుని వచ్చేసా..."

అంటూ తన క్రెడిట్ కార్డ్ ఇచ్చింది.


#నీతి : మీ భార్య మాట వినండి, ఆమెకు అవసరమైన పనుల్లో సహకారం అందించండి ..!


#కథ ఇంతటితో అయిపోలేదు ..!


క్యాషియర్ నవ్వుతూ ఆమె కొన్న వస్తువులన్నీ తిరిగి తీసుకున్నాడు. 

ఊహించని ఈ సంఘటన చూసి ఆమె నిర్ఘాంతపోయింది ..!


"ఏమైంది..!!??" అని క్యాషియర్ని అడిగింది.

అతను చెప్పాడు, “మీ భర్త మీ క్రెడిట్ కార్డును బ్లాక్ చేసారు...”


#నీతి : మీ భర్త అభిరుచులను ఎల్లప్పుడూ గౌరవించండి.


#కథ కొనసాగుతుంది ..!


భార్య ఈసారికి తన భర్త క్రెడిట్ కార్డును పర్స్ నుండి తీసి స్వైప్ చేసింది. దురదృష్టవశాత్తు అతను తన సొంత కార్డును బ్లాక్ చేయలేదు.


 #నీతి : మీ భార్య యొక్క శక్తిని మరియు జ్ఞానాన్ని తక్కువ అంచనా వేయవద్దు ..!

 

#కథ ఇంకా అయిపోలేదు ..!


స్వైప్ చేసిన తర్వాత, ఆ యంత్రం, 


"మీ మొబైల్ ఫోన్‌కు పంపిన పిన్ను నమోదు చేయండి" అని సూచించింది ..!


 #నీతి : ఒక్కోసారి మనిషి ఓడిపోయినప్పుడు, సాంకేతికత కూడా రక్షిస్తుంది ‌..!


#కథ_కొనసా....గుతుంది ..!


ఆమె మరలా నవ్వి, తన పర్సులో మెసేజ్ శబ్దంతో మోగిన మొబైల్ ను  బయటకు తీసింది.


అది తన భర్త ఫోన్.


ఆమె దానిని రిమోట్ కంట్రోల్‌తో బాటుగా తీసుకుని వచ్చేసింది.

ఎందుకంటే, తన షాపింగ్ సమయంలో భర్త తనకు కాల్స్ చేసి విసిగించకుండా ఉండేందుకు. చివరకు ఆమె తన షాపింగ్ పూర్తి చేసుకొని సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది. 

 

#నీతి : ఎప్పుడూ మీ భార్యని తక్కువ అంచనా వేయవద్దు ..! 


#కథ_కొనసాగుతుంది ..!


ఆమె ఇంటికి చేరుకునేసరికి ఇంటి బయట ఆమెకు తన భర్త కారు కనిపించ లేదు.


ఒక నోట్ తలుపు మీద అతికించబడి  ఉంది.

అందులో ఇలా రాసి ఉంది ..!


"రిమోట్ దొరకలేదు. మ్యాచ్ చూడటానికి ఫ్రెండ్స్ తోబాటు బయటకు వెళ్తున్నాను. నేను వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. నీకు ఏదైనా అవసరమైతే నా ఫోన్ కు కాంటాక్ట్ చెయ్యి ..! అని ఇంటి తాళాలు కూడా తనతోబాటే తీసుకుపోయాడు


#నీతి : మీ భర్తను నియంత్రించడానికి ప్రయత్నించవద్దు. 😋😂😆😉😁


#తెలివి_ప్రతిభ_అనేది_ఇకరి_సొత్తు_కాదు 🙈🙈🙈

*'ఓం'తో అలసట మాయం

 *'ఓం'తో అలసట మాయం..శాస్త్రీయంగా నిరూపించిన బాలిక*


ఓం శబ్దంతో శరీరంలో అలసట దూరమవుతుందని పద్నాలుగేళ్ల బాలిక ప్రయోగాత్మకంగా నిరూపించింది. పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన సైన్ కాంగ్రెస్‌లో తన ప్రదర్శనతో ఆ బాలిక శాస్త్రవేత్తలను అకట్టుకుంది. కోల్‌కతాలోని అడమ్స్ వరల్డ్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న అన్వేష రాయ్ ఓంకారంపై పరిశోధన చేసింది. 


ఓం శబ్దాన్ని వినడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగి, కార్బన్‌డైయాక్సైడ్, లాక్టిక్ యాసిడ్ నిల్వలు తగ్గతాయని, తద్వారా అలసట ఉండదని అన్వేష తన ప్రయోగం ద్వారా కలకత్తా, జాదవ్‌పూర్ యూనివర్సిటీలకు చెందిన ఫిజిక్స్, ఫిజియాలజీ ప్రొఫెసర్ల సమక్షంలో నిరూపించింది. అన్వేష ప్రాజెక్ట్ విన్నూత్నంగా ఉందని, అంతే కాకుండా ఆమోదయోగ్యం కూడా ఉందని కలకత్తా యూనివర్సిటీకి చెందిన ఫిజియాలజీ విభాగం హెడ్ ఫ్రొఫెసర్ దేవశీష్ బందోపాధ్యాయ అన్నారు. 


అన్వేష అనే పేరులోనే అన్వేషణ ఉందని, బెంగాలీలో అన్వేషణ్ అంటె వెదకడమని ఆ బాలిక తెలిపింది. ఓంకారం నుంచి వెలువడే ప్రత్యేక పౌన:పున్యం కలిగి శబ్దాలు శరీరంలోని న్యూరోట్రాన్స్‌మిటర్స్‌తోపాటు హార్మోన్ల (సెరోటినిన్, డోపమైన్) స్థాయిని పెంచుతాయి...ఈ ప్రక్రియకు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరగడమే కారణమని అన్వేష రాయ్ తెలియజేసింది. అలాగే తక్కువ పరిమాణంలో లాక్టిక్ యాసిడ్ విడుదల అవుతుందని దీంతో అలసట అనేది ఉండదని అన్వేష తెలిపింది. 


గత దశాబ్దంలో సంగీతం సాధన ద్వారా శరీరానికి వ్యాయామం చేకూరి, మానసిక ప్రశాతంత కలుగుతుందని పరిశోధకులు నిరూపించినట్లు పశ్చిమ్ బెంగాల్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సెక్రెటరీ రిన వెంకట్రామన్ అన్నారు. కానీ ఓంకారం శరీరంపై నిర్దిష్ట ప్రభావం చూపుతుందని అన్వేష నిరూపించిందని ఆయన తెలిపారు. 


ఇప్పటివరకు ఎవరూ ఓం శబ్దంపై ప్రత్యేక పరిశోధనలు చేపట్టలేదని స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త దీపాంకర్ దాస్ తెలిపారు. ఇటీవల రాష్ట్రస్థాయి సైన్స్ కాంగ్రెస్ నిర్వహించిన వర్క్‌షాప్‌నకు 165 విద్యార్థులను ఎంపిక చేశామని ఆయన అన్నారు. వర్క్‌షాప్‌లో భాగంగా అన్వేష ఉత్తరాఖండ్‌లో పర్యటించినపుడు బగేశ్వర్ నుంచి 68 కిలోమీటర్లు దూరాన ఉన్న కేదారీనాథ్‌కు కాలినడకన రోజూ నీటిని తీసుకెళ్తున్న కొంతమంది పూజరుల్లో ఎలాంటి అలసట కనపడకపోవడంతో ఆశ్చర్యపడింది. 


అలాగే వాళ్లు దోవపొడువునా ఓంకారాన్ని జపిస్తూ ముందుకు సాగడం గుర్తించింది. దీంతో ఓంకారంపై తన ప్రయోగాన్ని నిర్వహించాలని భావించింది. దీనిపై పరిశోధనకు అక్కడే శ్రీకారం చుట్టింది. ఓం శబ్దం ద్వారా శరీరంలో 430 హెర్జ్‌ల పౌన:పున్యాలను వెలువడుతున్నట్లు గుర్తించి వివిధ ల్యాబొరేటరీల్లో ఐదు ప్రయోగాలను నిర్వహించింది. 


17 మంది యువతీ, యువకులకు ఓంకారాన్ని 30 నిమిషాల పాటు వినిపించి వారి శరీరంలోని ఆక్సిజన్, కార్బన్‌ డయాక్సైడ్ శాతాలను లెక్కించింది. ఓం శబ్దంతో వారి శరీరంలో ఆక్సిజన్ పరిమాణం పెరిగి, కార్బన్ డయాక్సడ్ శాతం తగ్గినట్లు అన్వేష తెలిపింది.

ప్రశ్న పత్రం సంఖ్య: 3 --సాహిత్యానికి సంబందించిన క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుపండి

 ప్రశ్న పత్రం సంఖ్య: 3              కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

సాహిత్యానికి సంబందించిన క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుపండి 

1) ఆది కావ్యం అని దేనిని అంటారు' 

2) తెలుగులో ఆది కవి అని ఎవరిని అంటారు  

3) తెలుగులో వ్రాసిన ఆది కావ్యం ఏది 

4) వేదాలను విభజించిన మహర్షి ఎవరు 

5) వేదాలు ఎన్ని 

6) దక్షణ ఆసియా ఖండంలో తోలి నవల ఏది 

7) ఇతిహాసాలు అని వేటిని అంటారు 

8) పోతన వ్రాసిన గ్రంధం ఏది 

9) "ఉరక రారు మహాను బావులు" వ్రాసింది ఎవరు 

10) "భాస్కర శతకం" వ్రాసింది ఎవరు 

11) మనుచరిత్ర వ్రాసింది ఎవరు 

12) ప్రభంధంలో ఎన్ని ఆశ్వాసాలు ఉంటాయి 

13) "బారిస్టర్ పార్వతీశం" రచయిత 

14) " సాక్షి వ్యాసాలు " ఈయన వ్రాసాడు 

15) " చెరుకు తుద వెన్ను పుట్టిన" ఏ శతకము లోది  

16) రామ రాజభూషణుడు వ్రాసిన ప్రబంధం 

17)  శ్రీ శ్రీ అని ఎవరిని అంటారు 

18) రామాయణ కల్ప వృక్షం వ్రాసింది ఎవరు 

19) "కుమారసంభవం " ఎవరు వ్రాసారు 

20) ఏనుగు లక్ష్మణ కవి తర్జిమా చేసిన సుభాషితాలు 

21) "పాండురంగ మహత్యం" వ్రాసినది 

22) జలజాతాసన వాసవాది సురపూజా భాజనంబై తనర్చు 

తాంతాయుధు కన్నతండ్రి శిరమచ్చో వామపాదంబునం తొలగం ద్రోసె లతాంగి’ 

ఈ పద్యం ఏ గ్రంధంలోది 

23) రామాయణం తెలుగించిన  తోలి కవియిత్రి ఎవరు 

24) తిరుపతి వెంకట కవులు అనగానే గుర్తుకు వచ్చేది 

25) "చందమామ రావే జాబిల్లి రావే" రచయిత ఎవరు  

26) "శృంగార నైషధము " కవి ఎవరు


పాము కరిస్తే ఇలా చేయండి

 *పాము కరిస్తే ఇలా చేయండి చేయించండి*


ఎంతటి విషపు పాము కరిచినా….ఇలా చేసి ప్రాణాలు రక్షించవచ్చు. గుర్తుపెట్టుకోండి, షేర్ చేయండి.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 50 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. భారతదేశంలో ఈ సంఖ్య రెండు లక్షలని అంచనా.. మన దేశంలో దాదాపు 250 జాతుల పాములున్నప్పటకిీ వాటిలో 52 విష సర్పాలు ఉన్నాయి. మన ప్రాంతంలో మాత్రం 5 పాములు అత్యంత విషాన్ని కల్గిఉన్నవి. అవి కరిస్తే మ్యాగ్జిమమ్ 3 గంటల్లో మనిషి చనిపోతాడు.. ఏదైనా ప్రథమ చికిత్స చేస్తే ఆ 3 గంటల వ్యవధిలోనే చేయాలి, లేకపోతే పాము కరిచిన ఆ వ్యక్తి మనకు దక్కడు.

కరిచిన పాము విషపుదా, మామూళుదా….? అని తెల్సుకోవాలంటే అది కరిచిన చోట ఎన్నిగాట్లున్నాయో చూడాలి. ఒకటి లేదా రెండు గాట్లు ఉంటే కరిచింది విషపు పాము అని, మూడు అంతకంటే ఎక్కువ గాట్లు ఉంటే అది విషరహిత పాము అని గుర్తించాలి.

విషపు పాము కరిస్తే….కరిచిన చోట పాము విషం శరీరంలోకి వెళుతుంది. అక్కడి నుండి గుండెకు , గుండె నుండి అన్ని శరీరభాగాలకు చేరుతుంది….ఇలా విషం అన్ని శరీరభాగాలకు చేరే వరకు 3 గంటల సమయం పడుతుంది ఆలోపు చికిత్స చేయకుంటే మనిషి బతికే అవకాశాలు దాదాపు శూన్యం.

విషపు పాము కరిచిన వెంటనే…. కాటు కు పైన అంటే గుండె వైపుగా బలంగా తాడుతో కట్టాలి. సూదిలేని సిరంజీని తీసుకోని ఆ గాట్లలో ఓ గాటు దగ్గర పెట్టి రక్తాన్ని గుంజాలి….మొదటగా రక్తం కాస్త నలుపు రంగులో ఉంటుంది అంటే అది విషతుల్యమైన రక్తం అని అర్థం…ఇలా రెండు మూడు సార్లు రెండు గాట్ల వద్ద చేయాలి. ఇలా చేశాక మనిషి సృహలోకి వస్తాడు.

వాస్తవానికి పాము తన కొరల్లో ఉంచుకునే విషం 0.5 ML నుండి 2 ML వరకు మాత్రమే.!

ప్రతి ఒక్కరి ఇంట్లో హోమియోపతి మెడిసిన్ అయిన NAJA-200 ను 5ML బాటిల్ ఉంచుకోవాలి దీని ఖరీదు 5/- నుండి 10 రూపాయలే.దీనిని పాము కరిచిన వ్యక్తి నాలుక పై 10 నిమిషాలకోసారి 3 సార్లు వేస్తే…పాము కరిచిన వ్యక్తి త్వరగా కోలుకుంటాడు.

తర్వాత డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి.


*ఈ వర్షకాలం అందరికి ఉపయోగ పడే పోస్ట్...* కాబట్టి 

*షేర్ చేయండి*

ఏమండీ గారు*

 👩‍❤️‍👨👩‍❤️‍👨👩‍❤️‍👨👩‍❤️‍👨


     ఏమండీ గారు*

   (భర్త సహాయం..)


         👩‍❤️‍👨👩‍❤️‍👨👩‍❤️‍👨

        

           ఏమోయ్ ఏమీ చేస్తున్నావు.!!.." ఎప్పుడు చూసినా వంట ఇంటిలో, లేదు మొక్కలు నీళ్ళు పోస్తూ ఉంటావు. కాసేపు ఇలా కూర్చుని టీవీ చూడవు పేపర్ చదవవు."


      "బాగుంది నేను పేపర్ చదువుతూ కూర్చుంటే ఇంట్లో పనులు ఎలా అవుతాయి."


      " సరే నేను ఇప్పుడు రిటైర్ అయ్యాను కదా! రేపు పొద్దున్నుంచి నీకు ఇంటి పనులలో సహాయం చేస్తాను. నువ్వు లేచినప్పుడు నన్ను కూడా లేపు. "


*తర్వాతి రోజు*


         "ఏమండీ లేవండి పొద్దున్నే లేచి నాకు పనులలో సహాయం చేస్తా అన్నారు కదా!!.."


         " అబ్బా రాత్రి క్రికెట్ మ్యాచ్ చూసి లేటుగా పడుకున్నా, ఒక్క గంటలో లేస్తాను."


       ఎవరికి తప్పినా ఇల్లాలికి తప్పదుగా!!... లేచి డికాక్షన్ తీసి పాలు పొయ్యమీద పెట్టి బయట ముగ్గు వేసి వచ్చాను.


        మా ఏమండీ గారు లేచి వచ్చారు. 

       హమ్మయ్య లేచారా రండి రండి మొక్కలకి మీరు నీళ్ళు పొయ్యండి, నేను పూజకు పువ్వులు కోసుకుంటాను. "


          " అబ్బా ముందు నీ చేతితో కాఫీ ఇవ్వవే. కాఫీ పడితేనే మిగతా విషయాలు "


          వరండాలో కూర్చుని కాఫీ తాగుతున్నాము, ఇంతలో పేపర్ బాయ్ మొహం మీద పడేటట్టుగా పేపర్ పడేసి పోయాడు. ఇంక ఏముంది కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టుగా ఏమండీ గారు ఒక గంట వరకూ పిలిచినా పలకరు పేపర్ పట్టుకొని.


           నేను కాస్త మొక్కలకి నీళ్ళు పోసి పువ్వులు కోసుకొని స్నాన పూజాదులు ముగించుకున్నాను.


            వంట ఇంటిలోకి వచ్చాను బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని. వెనకనే ఏమండీగారు వచ్చి" ఏమిటో ఈరోజు ఫలహారం?? "ఓహో ఇడ్లీనా కాస్త పల్లీ పచ్చడి చేద్దు అదీ కారం కారంగా!.. రెండు వెల్లుల్లి కూడవేయి. అంటూ స్నానానికి వెళ్లారు.


            ఏమండీ, సహాయం చేస్తా అన్నారు కదా! కాస్త వాటర్ ఫిల్టర్ నింపండి అన్నాను.

" ఇదిగో టీవీ లో మెయిన్ న్యూస్ చూసి వచ్చేస్తాను "అని వెళ్లారు… రెండుగంటలు ఏమండీగారు మాయం 😂


           బట్టలు వాషింగ్ మిషన్ లో నుంచి తీసి ఏమండిగారికి ఇచ్చాను కాస్త ఆరెయ్యమని " పక్కింటి వాళ్ళు ఎవరన్నా చూస్తే ఆడంగి వాడు అంటారు. నాకు సిగ్గు బాబు అంటూ తప్పించుకున్నారు. "


          "ఏమండీ కాస్త కూరలు తరిగి ఇస్తారా?? కూరలు చేసేస్తాను.."


       అబ్బా కూరగాయలలో పుచ్చులు, చచ్చులు ఉంటాయి నేను కొయ్యలేను బాబు అంటూ టీవీ లో మునిగి పోయారు.


           భోజనానికి వచ్చినప్పుడు టేబుల్ తుడిచి కంచాలు, మంచి నీళ్ళు పెట్టమన్నాను.


         టేబుల్ క్లీన్ గానే ఉంది. మంచినీళ్లు కిందా, మీద పోసాను అంటావు నువ్వే పెట్టేసుకో అంటూ కుర్చీలో ఛతికిల పడ్డారు.


           "అబ్బా ఏమీ రుచిగా చేస్తావో వంట, వద్దన్నా నాలుగు మెతుకులు ఎక్కువెళ్లి పోతాయి. కాస్త కునుకు తీసి వస్తాను."


          వంట ఇల్లు సద్దుకొని అన్ని తుచుడుచుకొని నడుము వాలుద్దాం అనేసరికి ఏమండీగారు లేచి వచ్చి...ఏమోయ్ ఏమిటో మబ్బులు మబ్బులుగా ఉన్నాయి. టీ తో పాటు రెండు ఉల్లి పకోడా వేస్తావేమిటి??


          పకోడీ తిని టీ తాగి "పద కాసేపు అలా నడిచి వద్దాము అన్నారు."


         రాత్రి….. " ఏమిటో నీవంట అమోఘం ఎంత వద్దన్నా  తిండి ఎక్కువ అయిపోతుంది. రాత్రికి కాస్త జావా కాచి దానిలోకి కొబ్బరి పచ్చడి, చిక్కగా చిలక్కోట్టిన మజ్జిగా చాలు."


         అన్ని సద్దుకొని అలసిన నేను పడుక్కోవడానికి వెళ్తుంటే ఏమిటో "ఎప్పుడు చూసినా నిద్ర అంటావు. కాసేపు నాతో టీవీ చూడవు. నాకు కాస్త ఎమన్నా పని చెప్పమంటే చెప్పవు.


       సరేలే నువ్వు వెళ్ళి పడుక్కో నేను ఈ క్రికెట్ మ్యాచ్ చూసి వస్తాను.. రేపటి నుంచి అయినా నాకు కాస్త పని చెప్పు అన్నారు.


       నాకు ఒక మళ్ళీ రేపు ఎలా ఉంటుందో కళ్ళముందు మెదిలింది. 😂😂


*మిత్రులారా చిన్న సూచన*


*ఈ ప్రపంచంలో ఆడ పని, మగ పని లేవు. మంచి‌పని, చెడ్డ పని మాత్రమే ఉన్నాయి. ఆలుమగలు ఒకరికొకరు అన్యోన్యంగా ఇంటి పనులు పంచుకుంటే ఆ గృహమే స్వర్గసీమ.‌*

*ఒక కుటుంబం ఆనందాల హరివిల్లుగా మారాలంటే రెండు చక్రాలు కలిసి ఒకే మాట, ఒక బాటగా నడవడంతో పాటూ పరస్పర సహకారం కూడా అవసరం. మనల్ని చూసే మన పిల్లలు స్త్రీ, పురుష సమానత్వాన్ని, కష్టాన్ని పంచుకునే తత్వాన్ని అలవరచుకుంటారు. ఈ కథ హాస్యానికే రాసినా, మంచి మార్పు సమాజంలో రావడానికి మన ఇంటి నుండే ప్రయత్నం మొదలుపెట్టాలని మిత్రులందరినీ కోరుతున్నాను. ప్రతి దంపతులూ అన్యోన్యంగా ఆనందంగా ఒకరికొకరు తోడూ నీడగా ఆనందంగా ఆరోగ్యంగా జీవన‌ప్రయాణం సాగించాలని, పరస్పరం గౌరవించుకుంటూ, ప్రేమను పంచుకుంటూ జీవిత గమనాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా అందరం "ఇగో"ను వదులుకుంటే మనందరికీ ఆనందాలు సొంతమవుతాయి....*

శ్రీరాఘవాష్టకం

 *శ్రీ ఆదిశంకరచార్య విరచితం శ్రీ రాఘవాష్టకం*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*1) రాఘవం కరుణాకరం ముని-సేవితం సుర-వందితం!*

    

 *జానకీవదనారవింద-దివాకరం గుణభాజనం!*


*వాలిసూను- హితైషిణం హనుమత్ప్రియం కమలేక్షణం!*

   

 *యాతుధాన-భయంకరం ప్రణమామి రాఘవకుంజరం!!*



*2) మైథిలీకుచ- భూషణామల-నీలమౌక్తికమీశ్వరం!*

      *రావణానుజపాలనం రఘుపుంగవం మమ దైవతం!*


*నాగరీ-వనితాననాంబుజ-బోధనీయ-కలేవరం!*

      *సూర్యవంశవివర్ధనం ప్రణమామి రాఘవకుంజరం!!*



*3)హేమకుండల-మండితామల-కంఠదేశమరిందమం!*

    

 *శాతకుంభ-మయూరనేత్ర-విభూషణేన-విభూషితం!*


*చారునూపుర-హార-కౌస్తుభ-కర్ణభూషణ-భూషితం!*

    

 *భానువంశ-వివర్ధనం ప్రణమామి రాఘవకుంజరం!!*



*4) దండకాఖ్యవనే రతామర-సిద్ధయోగి-గణాశ్రయం!*

    

 *శిష్టపాలన-తత్పరం ధృతిశాలిపార్థ-కృతస్తుతిం!*


*కుంభకర్ణ-భుజా భుజంగవికర్తనే సువిశారదం!*

    

 *లక్ష్మణానుజవత్సలం ప్రణమామి రాఘవకుంజరం!!*



*5) కేతకీ-కరవీర- జాతి-సుగంధిమాల్య-సుశోభితం!*


*శ్రీధరం మిథిలాత్మజాకుచ-కుంకుమారుణ-వక్షసం!*


*దేవదేవమశేష భూత-మనోహరం జగతాం పతిం!*

      *దాసభూతభయాపహం ప్రణమామి రాఘవకుంజరం!!*



*6)యాగదాన-సమాధి-హోమ-జపాదికర్మకరైర్ద్విజైః!*

      

*వేదపారగతైరహర్నిశమాదరేణ సుపూజితం!*


*తాటకావధహేతుమంగదతాత-వాలి-నిషూదనం!*

     

*పైతృకోదితపాలకం ప్రణమామి రాఘవకుంజరం!!*



*7) లీలయా ఖరదూషణాది-నిశాచరాశు-వినాశనం!*

      *రావణాంతకమచ్యుతం హరియూథ కోటి-గణాశ్రయం!*


*నీరజాననమంబుజాంఘ్రియుగం హరిం భువనాశ్రయం!*

    

*దేవకార్య-విచక్షణం ప్రణమామి రాఘవకుంజరం!!*



*8) కౌశికేన సుశిక్షితాస్త్ర-కలాపమాయత-లోచనం!*

    

 *చారుహాసమనాథ-బంధుమశేషలోక-నివాసినం!*


*వాసవాది-సురారి-రావణశాసనం చ పరాంగతిం!*

      *నీలమేఘ-నిభాకృతిం ప్రణమామి రాఘవకుంజరం!!*



*9)రాఘవాష్టకమిష్టసిద్ధిదమచ్యుతాశ్రయ-సాధకం!*

    

 *ముక్తి-భుక్తిఫలప్రదం ధన-ధాన్య-సిద్ధి-వివర్ధనం!*


*రామచంద్ర-కృపాకటాక్షదమాదరేణ సదా జపేత్!*


*రామచంద్ర- పదాంబుజద్వయ- సంతతార్పిత- మానసః!!*



*10) రామ రామ నమోఽస్తు తే జయ రామభద్ర నమోఽస్తు తే!*


*రామచంద్ర నమోఽస్తు తే జయ రాఘవాయ నమోఽస్తు తే!*


*దేవదేవ నమోఽస్తు తే జయ దేవరాజ నమోఽస్తు తే!*


*వాసుదేవ నమోఽస్తు తే జయ వీరరాజ నమోఽస్తు తే!!*


      *ఇతి శ్రీరాఘవాష్టకం సంపూర్ణం.*


🕉🌞🌏🌙🌟🚩

Man vs. Woman--+Human Brain Analysis :-

 MUST READ:


Human Brain Analysis :-


Man vs. Woman......!!



1. MULTITASKING:

Women - Multiple process

Women's brains designed to concentrate multiple task at a time.

Women can Watch a TV and Talk over phone and cook.

Men - Single Process

Men's brains designed to concentrate only one work at a time. Men can not watch TV and talk over the phone at the same time. they stop the TV while Talking. They can either watch TV or talk over the phone or cook.


2. LANGUAGE:

Women can easily learn many languages. But can not find solutions to problems. Men can not easily learn languages, they can easily solve problems. That's why in average a 3 years old girl has three times higher vocabulary than a 3 year old boy.


3. ANALYTICAL SKILLS:

Men's brains has a lot of space for handling the analytical process. They can analyze and find the solution for a process and design a map of a building easily. But If a complex map is viewed by women, they can not understand it. Women can not understand the details of a map easily, For them it is just a dump of lines on a paper.


4. CAR DRIVING.

While driving a car, mans analytical spaces are used in his brain. He can drive a car fast as possible. If he sees an object at long distance, immediately his brain classifies the object (bus or van or car) direction and speed of the object and he drives accordingly. Where woman take a long time to recognize the object direction/ speed. Mans single process mind stops the audio in the car (if any), then concentrates only on driving.


5. LYING

When men lie to women face to face, they get caught easily. Woman's super natural brain observes facial expression 70%, body language 20% and words coming from the mouth 10%. Men's brain does not have this. Women easily lie to men face to face.

So guys, do not lie face to face.


6. PROBLEMS SOLVING

If a man have a lot of problems, his brain clearly classifies the problems and puts them in individual rooms in the brain and then finds the solution one by one. You can see many guys looking at the sky for a long time. If a woman has a lot of problems, her brain can not classify the problems. she wants some one to hear that. After telling everything to a person she goes happily to bed. She does not worry about the problems being solved or not.


7. WHAT THEY WANT

Men want status, success, solutions, big process, etc... But Women want relationship, friends, family, etc...


8. UNHAPPINESS

If women are unhappy with their relations, they can not concentrate on their work. If men are unhappy with their work, they can not concentrate on the relations.


9. SPEECH

Women use indirect language in speech. But Men use direct language.



10. HANDLING EMOTION

Women talk a lot without thinking. Men act a lot without thinking.

know you are rich?*

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*How do you know you are rich?*


Amazing answer by Mr Awadhesh Singh, an ex student of IT-BHU (now IIT-BHU)


When I was doing my B Tech, there was a Professor Das Talukedar who used to teach us ‘Mechanics’.


His lectures used to be very interesting since he had an interesting way to teach and explain the concepts.


One day, in the class, he asked the following questions,


1. What is ZERO?

2.What is INFINITY?

3. Can ZERO and INFINITY be same?


We all thought that we knew the answers and we replied as following,


ZERO means *nothing*

INFINITY means *a number greater than any countable number*

ZERO and INFINITY *are opposite and they can never be same*


He countered us by first talking about infinity and asked, ‘How can there be any number which is greater than any countable number?’


We had no answers.


He then explained the concept of infinity in a very interesting way, which I remember even after more than 35 years.


He said that imagine that there is an illiterate shepherd who can count only upto 20.


Now, if the number of sheep he has less than 20 and you ask him how many sheep he has, he can tell you the precise number (like 3, 5 14 etc.). However, if the number is more than 20, he is likely to say “TOO MANY”.


He then explained that in science infinity means ‘too many’ (and not uncountable) and in the same way zero means ‘too few’ (and not nothing)


As an example, he said that if we take the diameter of the Earth as compared to distance between Earth and Sun, the diameter of earth can be said to zero since it is too small.


However, when we compare the same diameter of earth with the size of a grain, diameter of earth can be said to be infinite.


Hence, he concluded that the same thing can be ZERO and INFINITE at the same time, depending on the context, or your matrix of *comparison.*


The relationship between *richness and poverty* is similar to the relationship between infinity and zero.


It all depends on the scale of comparison with your wants.


If your income is more than your wants, you are *rich.*

If your wants are more than your income, you are *poor.*


I consider myself rich because my wants are far less than my income.


I have become rich not so much by acquiring lots of money, but by progressively *reducing* my wants and having friends like you. 


*If you can reduce your wants, you too can become rich at this very moment.*                                                                          *_Try for the Best_*

13.ఋచీక మహర్షి

 *🙏మహర్షుల దివ్య చరిత్రలు🙏*

*13.ఋచీక మహర్షి* 

 ఆకాలంలో కృతవీర్యుడు అనే మహారాజు భృగువంశంలో బ్రాహ్మణుల్ని కులగురువులుగా పెట్టుకుని వాళ్ళకి చాలా సంపదలిచ్చాడు . ఆయన పిల్లలకి ఈ కారణంగా భృగువంశంలో బ్రాహ్మణుల మీద ఈర్ష్య వుండేది . అందుకని భృగువుల్ని చాలా కష్టాలు పెట్టడం మొదలు పెట్టారు . ఆడవాళ్లని కూడా తరిమి తరిమి కొట్టారు . అప్రవాన మహర్షి భార్య ఋచి గర్భవతి . ఆమె ప్రాణభయంతో పారిపోతూ వున్న సమయంలోనే ఒక గొప్ప తేజస్సునిండిన కొడుకును ప్రసవించింది . ఆ తేజస్సుకి రాజకుమారులకి కళ్లుపోయాయి . వాళ్ళ మీద దయతో వాళ్లకి కళ్ళు వచ్చేలా చెయ్యమని కొడుకుకి చెప్పింది ఋచి . రాజకుమారులు క్షమించమని అడిగి వెళ్ళిపోయారు . పేరు ఔర్వుడు . ఔర్వుడు పెళ్ళి చేసుకోకుండా తన తపశ్శక్తితో ఒక కొడుకుని , ఒక కూతుర్ని పొందాడు . ఆ కొడుకే మన ఋచీక మహర్షి 


ఋచీక మహర్షి బ్రహ్మచారిగా ఉండి గొప్ప తపశ్శక్తిని సంపాదించాడు . ఒకనాడు గాధి అనే రాజు కూతురు సత్యవతిని పెళ్ళి చేసుకునేందుకు నిశ్చయించుకొని గాధి రాజు దగ్గరికి వెళ్ళి తన కోరిక చెప్పాడు . పాపం గాధిరాజుగారికి ఋచీక మహర్షికి తన కూతురు సత్యవతినిచ్చి పెళ్ళి చేయ్యాలంటే బాధగా అనిపించింది . కాని ఏం చేస్తాడు ? మహర్షి అడగడానికి వచ్చాడంటే అదేదో భగవంతుడే సంకల్పించి వుంటాడనుకుని ఎందుకయినా మంచిదని ఒక షరతు పెట్టాడు . మహర్షీ ! నువ్వు వాయువేగంతో సమానమైన వేగం వున్నవీ , నల్లని చెవులు , తెల్లని శరీరాలు వున్న వెయ్యి గుర్రాలు తీసుకురా . అప్పుడు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు . ఋషీక మహర్షి సరేనని వెళ్ళిపోయాడు . ఋచీక మహర్షి ఇలాంటి గుర్రాలు ఎక్కడ ఉంటాయో తెలియక తిరిగి , తిరిగి , అవి వరుణదేవుడి దగ్గర ఉన్నాయని తెలుసుకున్నాడు . వెంటనే తన తపశ్శక్తితో వరుణలోకానికి వెళ్ళి వరుణుడికి వచ్చిన విషయం చెప్పాడు . వరుణదేవుడు ఋచీక మహర్షికి నమస్కారం చేసి , కబురు చేస్తే నేనే పంపించేవాడిని కదా ! అని చెప్పి ' తురంగతీర్థం'లో స్నానం చేయించి వెయ్యి గుర్రాలు ఇచ్చి పంపాడు .  వెయ్యి గుర్రాలు తీసుకుని గాధి మహారాజు కిచ్చి అతని కూతురు సత్యవతిని పెళ్ళి చేసుకున్నాడు ఋచీక మహర్షి .


ఋచీక మహర్షి భార్యను తీసుకుని ఒక ఆశ్రమంలో ఉంటూ సంతానం కలగడానికి వేదమంత్రాలతో అగ్ని దేవుడికి ఆహుతి చెయ్యడానికి తయారు చేసిన అన్నం ఋచీక మహర్షి తన భార్యల చేత తినిపించాలనుకున్నాడు . “ స్వామీ ! నా తల్లికి కూడ ఒక కొడుకుని ప్రసాదించండి అంది సత్యవతి . ఈ అన్నం మేమిద్దరం తింటాము అని చెప్పింది . ఋచీక మహర్షి ఇద్దరికి విడిగా పెట్టి పండ్లు మొదలయినవి తెచ్చుకోడానికి అడవికి వెళ్ళాడు . అప్పుడు సత్యవతి తల్లి సత్యవతితో అంటుంది , అమ్మా ! నీ మొగుడు నీకే మంచి అబ్బాయి పుట్టాలని నీకు ఇచ్చిన అన్నం మీద పవిత్రమయిన మంత్రజలం చల్లాడు . నా అన్నం మీద మామూలు మంత్రజలం చల్లాడు . అందుకే మనం ఇద్దరం మార్చుకుందాం అని అన్నం మార్చుకుని తినేశారు . ఋచీక మహర్షి ఇంటికి వచ్చి జరిగింది తెలుసుకుని భార్యని పిలిచి మంత్రజలం చల్లిన అన్నాన్ని , నేను చెప్పినట్లు కాకుండ మార్చుకుని తిన్నారు . నీకు క్షత్రియ ధర్మాలున్న కొడుకు , నీ తల్లికి వేదాంతవేది , మహాతపస్సంపన్నుడు అయిన కొడుకు పుడతారు అన్నాడు . సత్యవతి భయపడి క్షమించమని భర్తని వేడుకుంది . ఋచీక మహర్షి జరగవల్సింది జరిగిపోతుంది . ఇది దైవ నిర్ణయం ఇంక చెయ్యగలిగింది ఏమీ లేదు అన్నాడు .


కొంతకాలానికి సత్యవతికి జమదగ్ని అనే కొడుకు , ఆమె తల్లికి విశ్వామిత్రుడు అనే కొడుకు పుట్టారు . ఋచీక మహర్షి సంసారం వదిలి పెట్టేసి భగవంతుడిలో చేరిపోవడానికి బయలుదేరాడు . వెడుతూ వెడుతూ సత్యవతికి శాశ్వతంగా నదీరూపంలో ఉండేలా వరం ఇచ్చాడు . ఆ నదే కౌశికీ నది . గొప్ప పుణ్య తీర్థంగా పేరు పొందింది . చదివేశారా .... ఋచీక మహర్షి గురించి ! పెద్దవాళ్ళు చెప్పినట్టు చెయ్యకపోతే ఎన్ని అనర్ధాలు జరిగిపోతాయో చదివారు కదా ! 

*13.ఋచీక మహర్షి*



*Note:- మహర్షుల దివ్య చరిత్రను ఫార్వర్డ్ చేసి ప్రతి ఒక్క హిందూ చేత చదివిద్దాం. ఆ మహర్షుల దివ్య ఆశీస్సులు పొందు దాము*🙏

పురాకృతం

 *పురాకృతం..* *(మొదటి భాగం)*


*ఎవరి ఇంట్లోనైనా చిన్నవాళ్లు మరణించడం కూతుర్లు లేచిపోవడం వ్యాపారంలో నష్టాలు రావడం మొదలైనవి జరిగినప్పుడు మత ప్రచారకులు ఆ ఇంటిని ముట్టడిస్తారు..   "మీ దేవుడు మిమ్ములను సరిగా పట్టించు కోడంలేదు. మామతంలోకి రండి. మేము మీకోసం ప్రార్ధనలు చేస్తాము. మీరేమీ కష్టపడకుండా మాదేముడు అన్నీ సవ్యంగా జరిపే టట్లుగా మేము చూసుకుంటాము" అని చెప్పి మతాలు మార్పిస్తుంటారు... కాస్త పరిశీలిస్తే ఆ మతంలో నైనా ఇవే పరిస్తితు లుంటాయి. ఏదైనా మతం లో మనుషులకు కష్టాలు రావు ..  చావు రాదు .. అనే ఏర్పాటు ఉంటే ప్రచారాలు అర్భాటాలు గట్రా లేకుండా అందరూ పొలో మని ఆ మతంలోకి దూకుతారు కదా. అట్లాటి సమాజమూ అట్లాంటి మతమూ ఎక్కడైనా ఉందా?*


ఒకరి జోలికి సొంటికి పోకుండా శాంతంగా ధర్మంగా బ్రతికే  వాళ్లు,  దరిద్రమూ, కష్టాలూ పడడమూ. వాళ్ళే డబ్బులున్న వాళ్లయితే పిల్లల విషయం లోనో, ఆరోగ్యం విషయం లోనో సమస్యలకు లోనవడమూ ఇట్లాటివి చూస్తుంటాము. చిన్న వాళ్ళు ముందుగా చచ్చి పోవడమూ. వీటి తోపాటు పాపాత్ములు దుర్మార్గులు అని మనం నిర్ణయించు కున్న వాళ్ళు  చాలా సుఖాలు అనుభవిస్తు న్నట్లుగా కనిపించడము చూస్తుంటాము. ఎవడో బాగా తాగి రాంగ్రూట్లో ఎదురుగా వచ్చి గుద్దితే మన కాళ్లు చేతులు విరగడమూ. దేవుడూ ధర్మమూ అని నమ్మ కాలున్న వాళ్లకు ఇవి కొంచం  ఇబ్బంది కలిగించే అనుభవాలు. మిగతా మతాల గురించి నాకు తెలియదు. హిందూమతంలో దీనికి సంబంధించి ఒక వివరణ ఉన్నది అది తెలియజేస్తున్నాను.


ప్రతి మనిషికి తన పూర్వ జన్మలో చేసుకున్న శుభాశుభ కర్మల ఫలాలను అంటే పాపము పుణ్యము కలిపి సంచితము (పురాకృతం) అని పిలుస్తారు. పురాకృతం అంటే ఇంతకు మునుపు చేసుకున్నది అని అర్థము. సంచితము అంటే కూడ పెట్టుకొని దాచిపెట్టు కున్నది అని అర్థము. ఈ సంచితాన్ని మొత్తంగా ఒకే జన్మలో అనుభవించడానికి వీలు పడదు. ఇందులో ఒక ఇబ్బంది కూడా ఉంది. పాపాల వల్ల పుణ్యాలు పుణ్యాల వల్ల పాపాలు పరస్పరము రద్దు కావు. చక్కెరవ్యాధి ఉన్నవాడు లడ్డూలు తిని అదే మోతాదులో ఆవకాయ, మిరపకాయ బజ్జీలు తిన్నా అవి రెండూ కడుపులోకి వెళ్లి చెడు చేస్తాయే కానీ పరస్పరం కొట్టుకొని రద్దు కావు. పాపపుణ్యాలు కూడా అలాగే. వేటికవే విడివిడిగా అనుభవించాలి. ఈ కారణం వల్ల మనిషి మళ్లీ మళ్లీ జన్మలెత్తాల్సి వస్తుంది.


మనిషి జన్మ ఎత్తినప్పుడు అతని సంచిత పాప  పుణ్యాలు రెండు భాగాలుగా  అవుతుంది.  ఒక భాగం ఆరబ్దము రెండవది అనారబ్దము. ఆరబ్దము అంటే ఈ జన్మలో ఆ మనిషి అనుభవించ వలసిన పుణ్య పాపాల మొత్తము. యత్నము ప్రయత్నము. మోదము ప్రమోదము. శాంతము ప్రశాంతము.  ఆ పదాల లాగే ఆరబ్దాన్నే ప్రారబ్దము అని కూడా అంటారు. కొన్ని పదాలకు "ప్ర" కలిపితే ఇంకాస్త మరికాస్త అనే అర్థం వస్తుంది. ప్రారబ్దాన్ని కర్మ అదృష్టము అని కూడా అంటారు. చెడ్డ వాటికి కర్మ మంచి వాటికి అదృష్టము అని వాడుతూ ఉంటాము.


ఇక రెండోదయిన అనారబ్దము తర్వాతి జన్మలో అనుభవించడానికి మిగిలిపోతుంది. ఈ జన్మలో మనం చేసే శుభాశుభ కర్మల కు మళ్ళీ కొంత పాపము పుణ్యము ఏర్పడతాయి. ఇలా ఏర్పడిన పాపపుణ్యాలను ఆగామి పాపపుణ్యాలు అంటారు. ఈ ఆగామి వెళ్లి అనారబ్దములో కలుస్తుంది. తర్వాత జన్మకు ఈ రెండూ కలిసిన మొత్తం మళ్ళీ అప్పుడు సంచితం అవుతుంది.


మనం చేసే అన్ని పనులకూ పాపపుణ్యాలు ఏర్పడవు. కర్మలను ఆసక్తితో కానీ కర్తృత్వ భావనతో కానీ చేసినప్పుడే ఆ కర్మలకు ఫలితాలు వస్తాయి. ధర్మబద్ధంగా జీవించడం కోసం చేసే కర్మలకు పాపము రాదు. అధర్మ మైన నిషిద్ధమైన కర్మలకు పాపం వస్తుంది. పుణ్యం కోసం చేసే కర్మలకూ మంచి పనులకూ పుణ్యం వస్తుంది.  ఆసక్తి లేకుండా నేను చేస్తున్నాను అనే భావం లేకుండా కర్మ చేస్తే ఆ కర్మ కు ఫలితాలు రావు. అందువల్ల కర్మలన్నీ ఈశ్వరార్పణం గా అహంకార మమకారాలను వదిలిపెట్టి చేస్తే వాటివల్ల ఏ పాపము అంటదు. 


*పురాకృత మైన కర్మ ఫలితాన్ని రద్దు చేసుకునే అవకాశం మన మతంలో ఉన్నది..* 


అలా కర్మ రద్దు అవ్వడాన్ని కర్మ క్షయము అంటారు. కర్మ క్షయము జరిగితే జన్మ పరంపర నుంచి బయటపడవచ్చు. 


*పవని నాగ ప్రదీప్.*


రుద్ర ప్రశ్న జీవ లక్షణమును

 రుద్ర ప్రశ్న జీవ లక్షణమును ఎక్కడ వుంది అది ఏమిటని సూత్రమును ప్రశ్నించుచూ వివరించుచున్నది. కస్మై దేవాయ హవిషా  విధేమ.ఆత్మను విశ్వ వ్యాప్తిని అది ప్రశీషం యని తెలుపు చున్నది. ప్ర  శీ  ఉషం యని, ప్ర ప్రఙ్ఞానమని అది శివ రూపంలో వుండి మార్పు చెంది న కాంతి సర్వస్వము యని తెలుపు చున్నది. అది ఎలా నున్నదో యనగా మన నీడ లాగా వున్నది.నీ నీడే  మృత్యువులాగ వెన్నంటి రెడీగా వున్నది.  కనుక మృత్యువునుండి అమృతతత్వము యనగా ఎవరికీ తెలియని విడుదల  ప్రవేశము,  అమృతము యని దెలియుట. కస్మై, తస్మై లను పరిశీలించిన తస్మై యను తత్ పరిశీలన నీవే యనగా కస్మై జీవ రూపమని తెలియుచున్నది. తస్మైన్నమః నిన్ను నీవే పూజ చేయుట. అనగా సాధన చేయుట. నీ కొరకు నీవే సాక్షివై సాధన. వేరొకరు కుదరదు. నిన్ను నీవే ప్రకృతి నుండి రక్షించుకొనుట. తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వూందాం.

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*సజీవ సమాధి..మంకుపట్టు..*


1975 వ సంవత్సరం మే నెల ఆఖరివారంలో శ్రీ స్వామివారు తాను సజీవ సమాధి చెందాలని భావిస్తున్నట్లు మా తల్లిదండ్రులైన శ్రీధరరావు నిర్మల ప్రభావతి గార్లతో చెప్పారు..శ్రీ స్వామివారు వెలిబుచ్చిన ఆ అభిప్రాయాన్ని అమ్మా నాన్న ఇద్దరూ తీవ్రంగా వ్యతిరేకించారు..ఆరోజు మొదలు వీలున్నప్పుడల్లా శ్రీ స్వామివారు తన కోరికను బైట పెడుతూనే వున్నారు కానీ..మా తల్లిదండ్రులే కాక, శ్రీ స్వామివారితో అత్యంత సన్నిహితంగా ఉండే శ్రీ చెక్కా కేశవులు గారు..ఆశ్రమం నిర్మించిన శ్రీ మీరాశెట్టి గారు..శ్రీ మెంటా మస్తాన్ రావు గార్లు కూడా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు..


శ్రీ స్వామివారు పదే పదే ఒక మాట అంటుండేవారు.."నాకు సమయం లేదు..నేను వచ్చిన కార్యం పూర్తి కావొస్తోంది..అది పూర్తి అయిన మరుక్షణం నేను ఈ భూమ్మీద ఉండకూడదు..అది దైవ నిర్ణయం..బోధ చేయడానికి నేను సజీవంగా ఉండాల్సిన అవసరం లేదు..నా సమాధి కూడా అనేక సందేహాలను తీరుస్తుంది..నా సమాధి అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుంది.." అని..


వేసవి సెలవులు అయిపోయి మళ్లీ దసరా నాటికి శ్రీ స్వామివారి నిర్ణయం లో మార్పురాలేదు.. సంక్రాంతికి   శ్రీ స్వామివారు తనను సజీవ సమాధి చేయమని వత్తిడి చేయడం ప్రారంభించారు..నా పరోక్షంలో జరిగిన విషయాలను అమ్మా నాన్న గార్ల ద్వారా తెలుసుకుంటూ వున్నాను..1976 వేసవి సెలవులు నాటికి (అప్పటికి నేను ఇంటర్ మీడియేట్ మొదటి సంవత్సరం పరీక్షలు వ్రాసి వున్నాను) శ్రీ స్వామివారి సజీవ సమాధి విషయం సమస్యగా మారి..తీవ్ర రూపం దాల్చి ఉంది..అటు శ్రీ స్వామివారు తానొచ్చిన కార్యం పూర్తి కావొచ్చింది కనుక తనను సజీవ సమాధి చేయమని..ఇటు అమ్మా నాన్న ఆయనను ఆ ప్రయత్నం విరమించుకోమని శతవిధాలా బ్రతిమలాడుతూ వున్నారు..కారణం అంతు పట్టలేదు కానీ..శ్రీ స్వామివారు ఒకరకంగా చెప్పాలంటే మంకుపట్టు పట్టి ఉన్నారేమో అనిపించింది..


1976 ఏప్రిల్ నెల మూడవవారం లో నేను శ్రీ స్వామివారి ఆశ్రమానికి వెళ్ళాను..శ్రీ స్వామివారు ధ్యానం లో ఉన్న కారణంగా సుమారు రెండు గంటల సేపు వేచి చూసాను.కానీ శ్రీ స్వామివారి దర్శనం కాలేదు..ఉసూరుమంటూ వెనక్కు వచ్చేసాను..ఆ ప్రక్కరోజే మాగాణి కి వెళ్లి రమ్మని నాన్నగారు చెప్పడంతో ఉదయాన్నే బయలుదేరాను..శ్రీ స్వామివారి ఆశ్రమం దగ్గరకు వచ్చేసరికి ఆశ్చర్యకరంగా శ్రీ స్వామివారు ఆశ్రమం బైట వైపు నిలబడి వున్నారు..


నేను దగ్గరకు వెళ్ళేసరికి..పరీక్షగా చూసి..

"పొద్దున్నే ఇటొచ్చావు..మాగాణికి పోతున్నావా?.." అన్నారు..


అవునన్నాను.."నిన్న మిమ్మల్ని కలుసుకుండామని ఇక్కడిదాకా వచ్చాను..మీరు ధ్యానంలో ఉన్నట్టు వున్నారు..తిరిగి ఇంటికెళ్లిపోయాను.." అన్నాను..


పెద్దగా నవ్వారు..నవ్వి.."కొద్దిరోజుల్లో రోజూ నన్ను చూడొచ్చు.." అంటూ నా భుజం మీద అనునయంగా తట్టారు...నాకు అర్ధం కాలేదు..


(శ్రీ స్వామివారు ఆనాడు అన్న మాటలకు అర్ధం..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి ధర్మకర్త గా బాధ్యతలు చేపట్టిన రోజు తెలిసింది..శ్రీ స్వామివారి సమాధిని ఎప్పుడూ దర్శించుకుంటూనే వున్నాను..)


వెళ్ళొస్తానని చెప్పి మాగాణికి వెళ్ళిపోయాను..తిరిగి సాయంత్రంగా అదే దారిలో నడచి వస్తుంటే..ఆశ్రమం బైట మళ్లీ శ్రీ స్వామివారు నిలుచుని వున్నారు..నన్ను చూసి దగ్గరకు రమ్మని సైగ చేశారు..వెళ్ళాను..


"ఇంకొక వారం పాటు అమ్మా నాన్నలను గానీ..నువ్వు కానీ నా కోసం రావొద్దు.. ధ్యానం లో వుంటాను..ఇంట్లో చెప్పు.." అన్నారు..సరే అని వచ్చేసాను.. 


మరో వారం తరువాత అమ్మా నాన్న శ్రీ స్వామివారిని కలవడానికి వెళ్ళొచ్చారు..శ్రీ స్వామివారి నిర్ణయం లో ఎటువంటీ మార్పూ లేదని అనుకుంటూ వున్నారు..


ఏప్రిల్ 30 వ తేదీ ఉదయం నాన్నగారు స్వామివారి వద్దకు వెళుతూ..."నువ్వూ వస్తావా?" అని నన్నడిగారు.. "వస్తాను".. అన్నాను ఉత్సాహంగా.. అప్పటికి శ్రీ స్వామివారిని నేను చూసి పదిహేను రోజులవుతున్నది..నాన్నగారితో పాటు ఆశ్రమానికి వెళ్ళాను..


నాన్నగారు, నేను శ్రీ స్వామివారు ధ్యానం చేసుకునే గది బైట నిలుచున్నాము..మరో ఐదు నిమిషాల్లోనే శ్రీ స్వామివారు గది తలుపులు తీసుకొని బైటకు వచ్చారు..శ్రీ స్వామివారిని చూసి నేను అవాక్కయ్యాను..ఎందుకంటే..శ్రీ స్వామివారు బాగా చిక్కిపోయివున్నారు..ప్రశాంతంగా.. చిరునవ్వుతో... వున్న  శ్రీ స్వామివారి ముఖంలో ఏదో తెలియని అద్భుత వెలుగు కనబడుతోంది..అప్రయత్నంగానే చేతులు జోడించి నమస్కారం చేసాను..


సజీవ సమాధి గురించి శ్రీ స్వామివారితో నాన్నగారి సంభాషణ..పర్యవసానం..రేపు చదువుకుందాము..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ :523114..సెల్..94402 66380 & 99089 73699).

షట్కర్మచన్ద్రికాయాం

 ....షట్కర్మచన్ద్రికాయాం...

బ్రాహ్మే ముహూర్త ఉత్థాయ 

ధర్మమర్థంచ చిన్తయేత్।

విష్ణుంచచిన్తయేద్ధీమాన్

సగుణం నిర్గుణంతువా।।

శివంవాచిన్తయేన్మన్త్రం

జపేత్పఞ్చదశాక్షరం।

ఆదౌతుశివరామేతి

గోవిన్దేతితతఃపరమ్।।

నారాయణమహాదేవేత్యేషా

పఞ్చదశాక్షరీ।

"శివరామగోవిన్దనారాయణమహాదేవ"

ఇతి శ్రుతేః।।

సాష్టాంగ నమస్కారము

 ❤️అష్టాంగ నమస్కారమునే సాష్టాంగ నమస్కారము అని అంటాం.

సాష్టాంగ నమస్కారము అంటే ఎనిమిది అంగాలతో నమస్కారము చేయడం.


💕ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాబ్యామ్ ప్రణామో ష్టాంగ ఈరితః...


💕అష్టాంగాలు అంటే...


"ఉరసా" అంటే తొడలు,

"శిరసా" అంటే తల,

"దృష్ట్యా" అనగా కళ్ళు,

"మనసా" అనగా హృదయం,

"వచసా" అనగా నోరు,

"పద్భ్యాం" అనగా పాదములు,

"కరాభ్యాం" అనగా చేతులు,

"కర్ణాభ్యాం" అంటే చెవులు.


ఇలా "8 అంగములతో కూడిన నమస్కారం" చేయాలి.


💕మనిషి సహజంగా ఈ ఎనిమిది అంగాలతో తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని దేవునికి నమస్కరించి ఆయా అంగములు నేలకు తగిలించాలి.


💕ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికీ ధ్వజ స్తంభానికీ మధ్యలో కాకుండా 

ధ్వజ స్తంభం వెనుక వుండి చేయాలి.


1) ఉరస్సుతో నమస్కారం అనగా నమస్కారము చేసేటపుడు ఛాతీ నేలకు తగలాలి.


2) శిరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు తాకాలి.


3) దృష్టితో నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ దేవునకు నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి.


4) మనస్సుతో నమస్కారం అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మన:స్పూర్తిగా చేయాలి.


5) వచసా నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం.. అంటే.. నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్ట దైవాన్ని స్మరించాలి.


అంటే  "ఓం శ్రీ వేంకటేశాయ నమః”(ఇలా ఆయా దేవుళ్లను స్మరించుకోవాలి) అని అంటూ నమస్కారం చేయాలి.

*ప్రతీరోజూ రోజుకు నాలుగైదు ఆధ్యాత్మిక / వ్యక్తిత్వవికాస సంబంధమైన  విషయాలను తెలుసుకోగోరే జిజ్ఞాసువులు లింకు ద్వారా సత్సంగ సమూహములో చేరండి. మీ బంధుమిత్రులకూ, అన్ని What’s app, Facebook, Telegram గ్రూపులకూ forward చేయండి:-*

https://t.me/joinchat/TIg_72gwkenxfdct

~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి

6) పద్భ్యాం నమస్కారం అంటే నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి.


7) కరాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి.


8) కర్ణాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు చెవులను కూడా నేలకు తగులించాలి.


స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఆడవాళ్లు పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి. అంటే కాళ్లు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చెయ్యాలని శాస్త్రం చెబుతుంది.


పూజ పూర్తయిన తరువాత మంత్ర పుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్బంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చెయ్యాలి. దైవానికి, గురువులకు, యతులకు వారు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి.


నూరు యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టంగ నమస్కారం చేసేవాళ్లు పొందుతారని శాస్త్రవచనం.

~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి

శ్రీ మల్లికార్జున స్వామియే

 ఓం శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామియే నమః


ఇది హిమాచలప్రదేశ్ లోని జ్వాలముఖి దేవి ఆలయం... అష్టాదశ శక్తి పీఠాలలో ఒక అత్యంత ప్రముఖమైనది...ఈ గుడిలో 9 దీపాలు అమ్మవారి 9 రూపాలుగా భావిస్తారు. ఇక్కడ ఎటువంటి విగ్రహం ఉండదు. ఇవి ఏ విధంగా వెలుగుతున్నాయో అని చాలా మంది పరిశోధనలు చేశారు.. కానీ ఇప్పటికీ ఎటువంటి సమాధానం కనుక్కోలేకపోయారు....


ఈ వీడియో చుసిన భక్తులకి సమయం ఉంటే "శ్రీ మాత్రే నమః" అని కామెంట్ లో పెట్టండి


ఓం శ్రీ వీరధర్మజ మాత్రే నమః


ఓం గురుభ్యో నమః

పదాలను కనుక్కోండి అన్ని "ణి " అనే అక్షరంతోటె అంతమౌతాయి

 ప్రశ్న పత్రం సంఖ్య: 2.                                కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

ఈ క్రింది పదాలను కనుక్కోండి అన్ని "ణి " అనే అక్షరంతోటె అంతమౌతాయి 

1చదువుల తల్లి 

2. రాజుగారి పత్ని 

3. మొదటి కొనుగోలు 

4. చీరలో సగం 

5. కాళ్లకు పెట్టేది 

6. పావడ 

7. మునులు నిప్పు పుట్టెంచే సాధనం 

8. కుంకుమ ఉంచేది 

9. ఎండలు బాగా వుండే కార్తీ 

10 సీతమ్మ వారు హనుమంతుని కిచ్చిన నగ.

11. కాళ్ళకూరి నారాయణ రావు గారి ప్రసిద్ధ తెలుగు నాటకం

12. శంకరాచార్యుల ఒక  రచించిన 

13 శ్రీరామ చంద్రుడు

14. అన్నం, గంజి పులియ బెట్టి చేసే పదార్ధం.

15.  నరకం లోని ఏరు

16.  శ్రీ మహా విష్ణువు

17. దుర్గా మాత రెండవ అవతారం: 

18. ఇల్లాలు 

19. ధూప ద్రవ్య విశేషం

20. తుమ్మెద రెక్కల లాంటి వెంట్రుకలున్న స్త్రీ.

21. శ్రీ కృష్ణుని ఒక పత్ని 

22. భూతద్దం 

22. ఒక రాగం 

23. మంచి పలుకులు పలికే స్త్రీ 

24. పార్వతి దేవి ఒక పేరు 

25. నీ పద్దతి మార్చుకోవా లో పద్దతి 

26. భూమి 


పదాలను కనుక్కోండి అన్ని "ణి " అనే

ప్రశ్న పత్రం సంఖ్య: 2.                                కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

ఈ క్రింది పదాలను కనుక్కోండి అన్ని "ణి " అనే అక్షరంతోటె అంతమౌతాయి 

1చదువుల తల్లి 

2. రాజుగారి పత్ని 

3. మొదటి కొనుగోలు 

4. చీరలో సగం 

5. కాళ్లకు పెట్టేది 

6. పావడ 

7. మునులు నిప్పు పుట్టెంచే సాధనం 

8. కుంకుమ ఉంచేది 

9. ఎండలు బాగా వుండే కార్తీ 

10 సీతమ్మ వారు హనుమంతుని కిచ్చిన నగ.

11. కాళ్ళకూరి నారాయణ రావు గారి ప్రసిద్ధ తెలుగు నాటకం

12. శంకరాచార్యుల ఒక  రచించిన 

13 శ్రీరామ చంద్రుడు

14. అన్నం, గంజి పులియ బెట్టి చేసే పదార్ధం.

15.  నరకం లోని ఏరు

16.  శ్రీ మహా విష్ణువు

17. దుర్గా మాత రెండవ అవతారం: 

18. ఇల్లాలు 

19. ధూప ద్రవ్య విశేషం

20. తుమ్మెద రెక్కల లాంటి వెంట్రుకలున్న స్త్రీ.

21. శ్రీ కృష్ణుని ఒక పత్ని 

22. భూతద్దం 

22. ఒక రాగం 

23. మంచి పలుకులు పలికే స్త్రీ 

24. పార్వతి దేవి ఒక పేరు 

25. నీ పద్దతి మార్చుకోవా లో పద్దతి 

26. భూమి 


వాణి 

రాణి 

బోణి 

వోణీ 

పరికిణి 

పారాణి 

కాణి  

కాణిపాకం 

అరణి 

భరణి 

రోహిణి 

చూడా మణి : సీతమ్మవారు హనుమకు ఇచ్చిన నాగ 

చింతామణి : కాళ్ళూరి నారాయన రావు గారి నాటకం 


2. 
3. తమిళనాట మురుగన్ ఆలయం ఉన్న ఒక ఊరు.
4. .
5. చిరుగంట
6.
7.
8. 
9. 
10. : వైతరణి 
11. పార్వతి : 
12. సరస్వతి: వాణి 
13. శ్రీ మహాలక్ష్మి 
14. యముడు
15. ఒక రాగం
16. ఒక నక్షత్రం
17. భార్య: అలివేణి 
18. 
19. తలమానికం
20.  :  సాంబ్రాణి 
21. భూతద్దం : దుర్భిణి 
22. కోనేరు: పుష్కరణి 
23. సారాయి: వారుణి 
24. మంచి మాటలు మాట్లాడే స్త్రీ: సుభాషిణి 
25. పద్ధతి
26. తెలుగు వారి ఒక ప్రాచీన నృత్యం.: కొంకణి 
27. పావడ
28. చెల్లుబాటు 
29. నిలువు బొట్టు
30. సూర్యుడు.​

ఇచ్చిన ప్రశ్నలకు 'ణి' తో అంతమయ్యే జవాబులు .

1. సీతమ్మ వారు హనుమంతుని కిచ్చిన నగ. :- చూడామణి

2. కాళ్ళకూరి నారాయణ రావు గారి ప్రసిద్ధ తెలుగు నాటకం :- చింతామణి

3. తమిళనాట మురుగన్ ఆలయం ఉన్న ఒక ఊరు. :- పళణి, తిరుత్తణి

4. శంకరాచార్యులు రచించిన తత్వశాస్త్రం. :- వివేకచూడామణి

5. చిరుగంట :-  కింకిణి

6. శ్రీరామ చంద్రుడు :- కోదండపాణి

7. శ్రీ మహా విష్ణువు :- మోహిణి

8. అన్నం, గంజి పులియ బెట్టి చేసే పదార్ధం. :- తరవాణి

9. తుమ్మెద రెక్కల లాంటి వెంట్రుకలున్న స్త్రీ. :- నీలవేణి

10. నరకం లోని ఏరు :- వైతరణి

11. పార్వతి :- శర్వాణి, బ్రహ్మచారిణి, కళ్యాణి, వరుణి, స్వరూపిణి

12. సరస్వతి :- వాణి

13. శ్రీ మహాలక్ష్మి :- శ్రావణి, రుక్మిణి

14. యముడు :- దక్షిణాణి

15. ఒక రాగం :- కళ్యాణి, కీరవాణి

16. ఒక నక్షత్రం  :- భరణి

17. భార్య  :- సతీమణి, గృహిణి

18. దుర్గా మాత రెండవ అవతారం  :- కాత్యాయిణి

19. తలమానికం  :- శిరోమణి

20. ధూప ద్రవ్య విశేషం  :- సాంబ్రాణి

21. భూతద్దం  :- దర్శిణి

22. కోనేరు  :- పుష్కరిణి

23. సారాయి  :- మత్తుద్రావణి

24. మంచి మాటలు మాట్లాడే స్త్రీ  :- పద్మిణి

25. పద్ధతి  :- ధోరణి

26. తెలుగు వారి ఒక ప్రాచీన నృత్యం :- పేరిణి

27. పావడ  : పరికిణి

28. చెల్లుబాటు  :- చెలామణి

29. నిలువు బొట్టు  :-  నారాయణి

30. సూర్యుడు :- ద్యుమణి



29, జూన్ 2021, మంగళవారం

శరీర విజ్ఞాన పరీక్ష - శస్త్ర చికిత్స

 . పురాతన శరీర విజ్ఞాన పరీక్ష - శస్త్ర చికిత్స .


  భారతీయ పురాతన ఆయుర్వేద నిపుణులు , మహర్షులు మానవ శరీర నిర్మాణమును తెలుసుకొనుటకు వారి వారి ఆశ్రమాలలో శవాలను తీసుకొచ్చి వాటిని కోసి పుర్తిగా పరీక్షించే వారు . 


         సుశ్రుతములో శరీర పరీక్ష గురించి కొంత వివరణ ఇవ్వబడింది. ఇప్పుడు దాని గురించి మీకు తెలియజేస్తాను. మొదట శరీర స్థానం నందు పూర్తి పరిజ్ఞానం తెలుసుకొవలెను. అటు మనిషుని యెక్క శరీరమును "ద్రుష్ట కర్మం" ( Dissection) కు సిద్దం చేసి ప్రతి అవయవ భాగం ను ప్రత్యక్షం గా పరీక్షించ వలెను.


 పరీక్షార్ధం నిర్దిష్టమైన మృత కళేబరం తీసుకొనవలెను. వ్రుద్దునిది, ధీర్గకాల రోగ పీడితునది , విషాదుల చేత మృతి నొందినది కాక సర్వాయవ స్పూర్తి నొందినది కలిగి ఉండవలెను. ముందు మృత కళేబరం నందు ఉండు వ్యర్ధములను " వస్థి కర్మం " ( enema) చేత బయటకి వెడలించి శోధనం చేయవలెను . పిదప ముంజ గడ్డి , దర్భ, నార మొదలగు వాని చేత అన్ని అవయవములను బాగుగా కట్టి చేపలు మొదలగు   నీటి జంతువులు తినకుండా ప్రవాహం నందు కొట్టుకొని పోకుండా పంజరస్థం గావించి నిలువయున్న నీటిలో వాగునందు కుళ్లే విదంగా ఉంచవలెను. అలా 7 దినములు నీటిలో ఉంచవలెను. 7 దినములు అయిన తరువాత బాగుగా కుళ్ళిన శరీరమును పైకి దీసి దర్భ, గడ్డి వీని వేళ్ళతో చేసిన కుంచెను గాని , వెదురు కుంచెతో గాని చర్మం , మాంస కండరములు , సిరలు , నరములు , ధమనులు, ఆంత్రము ( Intestines) , యక్రుత్తు ( Liver) , ప్లీహము (spleen) , హృదయము (Heart) , వ్రుక్కములు ( kidneys) , పుప్పుసము ( Lungs) , క్లోమము ( pancreas) మొదలగు అవయవములును , అస్తులు (Bones) ,అస్థి సంధులు (Joints) . మొదలగు చర్మ బాహ్య,అంతర అవయవాలను విభజించి బాగుగా పరీక్షించ వలెను.ఈ రీతి శరీర శాస్త్రమును చక్కగా అభ్యసించవలెను .


 శరీర పరీక్ష నేర్చుకునే విదానము.-

       

         పలుమార్లు శిష్యునకు శవ పరీక్షా విదానం చేసే విదానం చూపించిన తరువాత శిష్యుని చేత స్వయంగా పరీక్ష చేయించవలెను. 


 చేదన కర్మం - 

  

        సోరపుచ్చ, నూగు దోస , బుడమ, పెద్ద దోస , మొదలగు కాయలను కోసి చూపవలెను .అదే విదంగా ఉత్కర్థానము (పైకి కోయుట ), పరికర్థనము (ధిగువకు కొయుట ).మొదలుగునవి కుడా బోధిం పవలెను .


 బేధ్య కర్మం - 


         నీరు నింపిన తిత్తులు గాని , మృతి చెందిన జంతువుల మూత్ర కోశములు గాని , జిగురు వస్తువులలో , లేక పలుచనైన బురదతో నింపిన తోలుతిత్తులను గాని చీల్చి చూపవలెను .


 లేఖ్య కర్మం - 


          రోమయుక్తమగు చర్మమును పైన , లొపల బేదములు ను చూపవలెను .


 వేద్య కర్మం - 


           మృత జంతువులు యెక్క సిరలును కలువ కాడలును , మొదలగువానిని వేధించి చూపవలెను . ఇయ్యది కేవలం జలోదరం, మూత్ర వృద్ది మొదలగు వాని యందు ఉపయోగించవచ్చు .


 ఏష్య కర్మం - 


          పురుగు తినిపోయిన బెజ్జములు గల కొయ్య కర్రల యందు , వెదురు గోట్టములు , తుటి కాడలు, తామర కాడలు, ఎండిపొయిన సొరకాయలు, మొదలగు వానిని ముఖ ములములందు చేయవలసిన శస్త్ర చికిత్సకు ఉదాహరణగా చూపించ వచ్చు. దీనిని ఏషిని అను శలాకమ్ ఉపయొగించి నేర్పించవలెను .


 ఆహార కర్మం - 


         పనస, మారేడు, దొండ, మొదలగు ఫలముల నుండి గింజలు బయటకు తీయు విద్యను అభ్యసించవలెను. ఈ విదానం నోటిలోని దంతము లను ఉడ దీయుటకు ఉపయొగించ వలెను.


 విశ్రావ్య కర్మం - 


          విశ్రావ్య కర్మను శాల్మలి ఫలకం నందు మైనం పూసి ప్రతిమలు చేసీ ఆయా ప్రదేశం నందు చీము మొదలగు వానిని స్రవింప జేయవలెను .


 సీస కర్మం - 


          మృదువగు వస్త్రములును చర్మం మొదలగు వాని ఎందు యుంచి కుట్టి సేవన కర్మం చేయవలెను . 


 స్థల బేధమున శస్త్ర ఉపయోగ బేదములు - 


      కనుబొమ్మ, కణత , నొసలు, గండ భాగము, కనురెప్ప, క్రింద పెదవి, పంటి చిగురు, చంక, కటి, బోడ్డు , గజ్జ, వీని యందు దిర్యక్చేధనం చేయవలెను .అరిచేయి , అరికాలు, వీనీ యందు జంద్ర మండలాక్రుతి గా ( గుండ్రముగా ) కోయవలెను. గుదము, మేడ్రము వీని యందు అర్థ చంద్రాక్రుతిలో కొయవలెను లేనిచో సిరలు (venis) , ధమనులు తెగిపోయి మిగుల బాధను కలిగించును. అలగే మానుట చాలా కష్టం. అలానే ఉంటే ఆ గాయం గ్రందిలా తయారగును. కనుక జాగ్రత్త వహించవలెను.


 శస్త్ర చికిత్స చేయు విదానం - 


         శస్త్ర చికిత్స చేయుటకు పూర్వం రోగి కి చాలా తక్కువ ఆహారం ఇవ్వవలెను. శస్త్ర చికిత్స బాధలు తెలియకుండా ఉండుటకు బాగా మత్తుగా ఉండు మధ్యములను త్రాగిపించవలెను . శస్త్ర చికిత్స ముందు భుజించడం మూలాన "మూర్చ " మొదలగునవి కలవు. మద్య ద్రవ్యములను ఉపయోగించుట చేత బాద తెలియకుండును.

 

   శస్త్ర చికిత్సకు కావలిసిన వస్తువులు.- 


   * శస్త్రములు - ( Inustruments , Lancet etc .)

   * యంత్రములు - ( surgical అప్ప్లైంచెస్)

   * క్షారము  - ( Alkali) .

   * అగ్ని  -  ( Fire for cauterisation) .

   * జలూక  - ( Leeches) .

   * శలాక  -  ( Probe or direetor ).

   * జాంబ వోష్ణము -( Cavtersing 

                                Inusruments) .

   * పిచువు -  (Cotton) .

   * ప్లోతము - ( Lint) .

   * సూత్రము - (Thread) .

   * పట్టము - ( Tow ).

   * తేనే       - ( Honey) .

   * నెయ్యి   - ( Ghee) .

   * కొవ్వు.

   * పాలు.

   * నూనే .

   * తర్పణం - ( powederd wheat soaked in 

                      water ) .

   * కషాయం - ( Decoctions) .

   * అలేపము - ( Medicated Plasters) .

   * కల్కము  -  ( Paste) .

   * చన్నీళ్ళు.

   * వేడి నీళ్ళు .

   * కవలిక   -  ( Splints) .

   * వెదురు వేళ్ళు  - ( Skin of Bamboos ).

   * స్పటికం  -  ( Lens) .

   * కురువింద రాళ్ళు .

   * అయస్కాన్థములు .

   * గాజు తునకలు.

   * టేకు ఆకులు. మరియు మత్తు కలగ చెయు పదార్దం.  


           పైన చెప్పిన విధముగా రకరకాల పరికరాలు ఉపయోగించి అత్యంత నైపుణ్యతతో మన పూర్వికులు శస్త్రచికిత్సలు చేసెడివారు . 


     గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

కాశీ కి వెళితే

 🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹

కాశీ కి వెళితే...కాయో పండో వదిలేయాలి అని పెద్దలు అంటారు.... అందులో మర్మమేమిటి ??


అసలు శాస్త్రం లో ఎక్కడ కూడా.. కాశీ కి వెళితే కాయో, పండో వదిలేయాలి అని చెప్పలేదు..


శాస్త్రం చెప్పిన విషయాన్ని.. కొందరు తెలిసీ తెలియని విషయ పరిజ్ఞానం తో కొంచం వాళ్లకు అనుకూలంగా మార్చుకున్నారు.


కాశీ క్షేత్రం విషయంలో శాస్త్రము చెప్తున్నది ఏమిటి అంటే... కాశీ వెళ్లి గంగ లో స్నానం చేసి " కాయాపేక్ష మరియు ఫలాపేక్ష" ను గంగలో వదిలి, ఆ విశ్వనాథ దర్శనం చేసుకొని ఎవరి ఇళ్ళకు వాళ్ళు తిరిగి వెళ్ళాలి అని.


ఇక్కడ కాయాపేక్షా, ఫలాపేక్ష అన్నారు...అంటే...ఈ కాయము పై ( శరీరము పై అపేక్ష ని ) , ఫలాపేక్షా ( కర్మ ఫలము పై అపేక్ష ని) పూర్తిగా వదులుకొని...కేవలం నిజమైన భక్తితో ఆ ఈశ్వర చింతన కలిగి ఉండమని పెద్దలు చెప్పారు.


కాలక్రమేణా...అది కాస్తా కాయ, పండు గా మారిపోయింది.


అంతే కానీ...  కాశీ వెళ్లి ఇష్టమైన కాయగూరలు, తిండి పదార్థాలు గంగ లో వదిలేస్తే...మనకు వచ్చు భక్తి కానీ, అందులో నిజమైన పుణ్యం ఎం ఉంటుంది.


కనుక.... శాస్త్రం నిజంగా ఎలా చెప్తుందో అర్థం చేసుకొని... ఆ క్షేత్ర దర్శనము, ఆ సంప్రదాయం పాటిస్తే..నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం వస్తుంది... అంతే కాని మామిడి పండుని,  వంకాయ ని గంగలో వదిలేస్తే వచ్చే ఉపయోగం ఏమి ఉండదు.


కనుక...ఈసారి మీరు కాశీ వెళితే....మనకి శత్రువులు అయిన ఈ శరీరం పై ఎక్కువ ప్రేమని, మనం చేసే కర్మల మీద లేనిపోని కర్మఫలం అపేక్ష ని మాత్రమే వదులుకొని....ఆ విశ్వనాథ దర్శనం చేసి, నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం కలగాలి అని ప్రార్థిద్దాం.

🙏 జై శ్రీరామ్ శుభోదయం.

నారాయణాయ

 _*నారాయణ నారాయణ*_


ఒక అవ్వ ఎప్పుడూ- కూర్చున్నప్పుడూ, వంగినప్పుడూ, పైకి లేచినప్పుడూ కూడా "నారాయణ, నారాయణ" అంటూండేది. ఆమె మనవడు విష్ణు ఒకసారి "ఎందుకవ్వా! నువ్వు ఎప్పుడూ `నారాయణ, నారాయణ' అంటుంటావు? ఆ నారాయణుణ్ని ఓసారి నాకు చూపించు" అని అడిగాడు."నారాయణుడు ఉన్నాడు; కానీ ఆయన మనకు కనిపించడు రా నాయనా!" అని చెప్పింది అవ్వ.


"అదేంటవ్వా? దేవుడున్నాడంటావు, కానీ కనిపించడంటావు నువ్వు? ఉన్నవాడు కనిపించాలిగా మరి? ఏమో! నేను మాత్రం దేవుణ్ని చూడాల్సిందే. రేపు నన్ను తొందరగా లేపవ్వా! ఇక్కడ కనబడని దేవుడు మరెక్కడైనా కనిపిస్తాడేమో చూసి వస్తాను నేను!" అని చెప్పి పడుకున్నాడు వాడు.


మరుసటి రోజు ప్రొద్దున్నే అవ్వ విష్ణును లేపగానే, వాడు లేచి, దేవుణ్ని వెతుక్కుంటూ నిజంగానే అడవిలోకి బయలుదేరాడు. నడిచీ, నడిచీ, కొంతకాలానికి అడవిని దాటి ఒక రాజ్యం చేరుకున్నాడు. అక్కడి రాజుగారింటికి వెళ్లి "రాజాగారూ! రాజాగారూ! నేను నారాయణుని దగ్గరకు వెళ్తున్నాను. మీకు ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పండి. దానికి పరిష్కారం కనుక్కుని వస్తాను నేను" అన్నాడు.


ఆ మాటలకు రాజుగారు "చూడు బాబూ! నేను చాలా సంవత్సరాల క్రితమే ఒక చెరువును తవ్వించాను. నీటితో నిండి, పదిమందికీ ఉపయోగపడాల్సిన ఆ చెరువు, ప్రతి సంవత్సరమూ తెగిపోయి, నిరుపయోగమయి పోతున్నది. ఎన్నిసార్లు మరమ్మత్తులు చేయించినా ఫలితం లేకుండా పోతున్నది. ఎందుకలా అవుతున్నదో అర్థం కావటం లేదు. అదేంచేస్తే బాగౌతుందో నారాయణుణ్ని అడిగి తెలుసుకురా" అని చెప్పాడు. "సరే" అని విష్ణు ముందుకు సాగిపోయాడు.


అలా వెళుతున్న విష్ణుకు దారిలో ఒక పెద్ద పాము కనబడింది. "బాబూ! నువ్వు నారాయణుని దగ్గరికి వెళ్తున్నావని తెలిసింది. చాలా కాలం నుండి నా తల మీద ఒక పుండు ఉన్నది. అది ఎంతకీ నయం అవ్వట్లేదు. అది బాగవ్వాలంటే ఏం చేయాలో కాస్త కనుక్కొని రావా?" అని అడిగింది.


"ఓ! సరేలే! దానిదేముంది? తప్పకుండా కనుక్కుని వస్తాను" అని ముందుకు సాగాడు విష్ణు.అలా చాలా దూరం నడిచిన తరువాత, విశ్రాంతి తీసుకుందామనుకొని, విష్ణు ఒక చెట్టు కింద ఆగాడు. అది ఒక మామిడిచెట్టు. ఆ చెట్టు నిండా నోరూరించే మామిడి పళ్లు! 'ఒక్క పండు తిందాం' అనుకొని విష్ణు ఒక పండుని కోసి, రుచిచూశాడు. కానీ ఆ పండు చేదుగా ఉన్నది! మరో పండును కోసి చూస్తే, అది కూడా చేదే! "ఏమిటిది! మామిడిపళ్ళు చేదుగా ఉంటాయా?" అని పైకే గట్టిగా అన్నాడు విష్ణు.


అప్పుడు ఆ మామిడిచెట్టు మాట్లాడింది: "చూడు బాబూ! నువ్వు 'నారాయణ స్వామి' దగ్గరకు వెళ్తున్నావని తెలిసింది. నాకో సాయం చేసి పెట్టు. ప్రతి సంవత్సరమూ నేను చాలా కాయలు కాస్తాను. కానీ నా పండ్లన్నీ చేదుగా ఉంటున్నాయి. ఎవ్వరూ వాటిని ఇష్టపడటంలేదు. ఏం చేస్తే నా బాధ తీరుతుందో ఆ స్వామిని కాస్త అడిగిరా బాబూ!" అన్నదది. 'సరే' అని విష్ణు ముందుకు సాగాడు.


ఇంకొంత ముందుకు పోయాక, అతనికి విరగబూసిన మల్లె చెట్టు ఒకటి కనిపించింది. 'ఎంత అందంగా ఉన్నది, ఈ మల్లెచెట్టు!' అని దాని దగ్గరకు వెళ్ళాడు విష్ణు. అంతలో ఆ మల్లెచెట్టు అన్నది: "బాబూ! నేను ఇన్ని పూలు పూస్తాను కదా! ఎవ్వరూ నా పూలకోసం రావటమే లేదు. ఈ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను. నువ్వు నారాయణుని దగ్గరకు వెళ్తున్నావల్లే ఉంది. ఏం చేస్తే నా యీ బాధ దూరమౌతుందో కాస్త ఆ నారాయణున్ని అడిగి కనుక్కుని రావా?" అని. విష్ణు అందుకు ఒప్పుకుని ముందుకు నడిచాడు.


ఆ తరువాత అతను "నారాయణ, నారాయణ" అనుకుంటూ ముందుకు సాగాడు. ఎంతో అలసిపోయాడు- కానీ తన ప్రయత్నాన్ని మాత్రం వదలలేదు. వెనకడుగు వేయలేదు. అలా పోతున్న విష్ణుకి ఒకనాడు ఒక ముసలాయన కనిపించాడు. ఆ తాత విష్ణుని దగ్గరకు పిలిచి "బాబూ! నాకు చాలా దాహం వేస్తోంది. తాగడానికి కొన్ని నీళ్లు తెచ్చి ఇవ్వు నాయనా!" అని అడిగాడు.


'సరే' అని విష్ణు నీళ్లకోసం వెతికాడు. దగ్గరలోనే ఒక చిన్న నీళ్లగుంత కనిపించింది అతనికి. కానీ నీళ్లను తీసుకెళ్ళేందుకు పాత్ర ఏదీ లేదే!? కొంచెం ఆలోచించిన మీదట, విష్ణు తన కండువాను ఆ నీళ్లలో తడిపి, తాత దగ్గరికి తీసుకెళ్ళి, "తాతా! దీన్ని పిండు. నీళ్ళు వస్తాయి" అని చెప్పాడు. విష్ణు తెలివితేటలను మెచ్చుకొన్న తాత "మనవడా! నువ్వెవరు? ఎక్కడికెళ్తున్నావు?" అని అడిగాడు.

"నారాయణుణ్ని చూసేందుకు" అన్నాడు విష్ణు.


"నారాయణుణ్ని చూడాలని ఎందుకు అనుకుంటున్నావు?" అని అడిగాడు తాత.


"మా అవ్వ ఎప్పుడూ 'నారాయణ, నారాయణ' అంటూ ఉంటుంది. కానీ ఆమెకు ఎన్నడూ ఆ నారాయణుడు కనిపించలేదు. నేనైనా ఆవిడ కోరిక తీరుద్దామనుకున్నాను.,ఆ నారాయణుడి కోసం వెతుక్కుంటూ పోతున్నాను" అని చెప్పాడు విష్ణు. ఆపైన తను దారిలో కలిసిన వాళ్లందరి సమస్యల గురించి కూడా చెప్పాడు.


తాత అన్నాడు: "నారాయణుని గురించైతే నేనేమీ చెప్పలేను; కానీ మిగిలినవాళ్ళ సమస్యల్ని మాత్రం తీర్చగలను. గత జన్మలో ఆ మల్లెచెట్టు ఒక అమ్మాయిగా పుట్టింది. అప్పుడు ఆ పిల్ల చాలా పూలనూ, పూతీగలనూ కాళ్లతో అదేపనిగా తొక్కుకుంటూ పోయేది. అందుకే ఈ జన్మలో ఆమెకు ఇలా జరుగుతున్నది" అని."మరి, దానికి ఏమీ పరిష్కారం లేదా, తాతా?" అని అడిగాడు విష్ణు.

"లేకేమి? ఉంది! ఆ చెట్టు పువ్వులను ఎవరైనా ఒక రాణి తన తలలో ముడుచుకుంటే, ఆ తరువాత ఆ చెట్టు పూలను అందరూ వాడతారు" అన్నాడు తాత.


తర్వాత మామిడి చెట్టు గురించి అడిగాడు విష్ణు.


ఆ మామిడి చెట్టు కింద బిందెడు బంగారం ఉంది. దానిని దోవలో పోయే దాసప్పకి ఇస్తే, ఆ మామిడి కాయలు తియ్యగా పండుతాయి" అన్నాడు తాత.

'సరే'నని పాము గురించి అడిగాడు విష్ణు.

"ఆ పాము పుట్టలో ఒక వజ్రాల హారం ఉంది. దానిని దోవలో పోయే దాసప్పకు ఇస్తే, ఆ పాముకు పుండు మేలవుతుంది" అని చెప్పాడు తాత.

ఇక రాజుగారి గురించి అడిగాడు విష్ణు. "రాజు దోవలో పోయే దాసప్పను తెచ్చి, ఇంట్లో పెట్టుకొని, చదివించి, రాజును చేస్తే అతనికి మేలు జరుగుతుంది. సమస్యలన్నీ తీరిపోతాయి" అని చెప్పాడు తాత.

తన మాట ఎలా ఉన్నా మిగిలిన వారందరి సమస్యలకూ పరిష్కారం దొరికిందన్న సంతోషంతో వెనక్కి తిరిగాడు విష్ణు.


తొలుత ఎదురైన మల్లెచెట్టుతో, దాని సమస్యకు పరిష్కారం చెప్పాడు. అప్పుడా మల్లెచెట్టు "వేరే ఎవరో ఎందుకుగాని, నువ్వే నా పువ్వులను కోసుకెళ్లి రాణిగారికి ఇవ్వరాదూ?" అన్నది.


"సరే"నని, కొన్ని పువ్వులను కోసుకుని ముందుకు పోతూ, ఆ తర్వాత ఎదురైన మామిడి చెట్టుతో దాని సమస్య ఎలా తీరగలదో చెప్పాడు విష్ణు.


అప్పుడా మామిడిచెట్టు "వేరే ఎవరున్నారు ఇక్కడ? నువ్వే తీసుకో, ఆ బిందెడు బంగారాన్నీ!" అన్నది.


"సరే"నని ఆ బంగారం తీసుకొని ముందుకు సాగాడు విష్ణు.

ఆ తరువాత ఎదురైన పాముకు కూడా పరిష్కారం చెప్పాడు. ఆ పాము తన పుట్టలో పడిఉన్న రత్నాలహారాన్ని తెచ్చి, విష్ణుకే ఇచ్చింది.చివరకు రాజుని కలిసి అతని సమస్యకూ పరిష్కారం చెప్పాడు విష్ణు.


"ఎవరినో తెచ్చి ఇంట్లో పెట్టుకునేదెందుకు? నువ్వే ఉండు!" అని, రాజుగారు విష్ణుకు అర్ధరాజ్యమిచ్చి, విష్ణును, అవ్వనూ తనతోబాటే ఉంచుకున్నారు.


అంతలోనే విష్ణుకు తను నారాయణుణ్ని కలుసుకోలేదని గుర్తుకువచ్చింది. 

తన మతిమరుపుకు బాధపడుతున్న విష్ణుతో అవ్వ అన్నది: "దేవుడు ఏ రూపంలోనైనా ఉంటాడు - ఎక్కడైనా ఉంటాడు విష్ణూ! కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేస్తే ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు, కనికరిస్తాడు. నువ్వు నారాయణుణ్ని చూడలేదని బాధ పడవలసిన అవసరం లేదు. నీకు కనిపించిన ఆ ముసలాయన ఎవరనుకుంటున్నావు? ఇంకా అర్ధంకాలేదా? ఆ నారాయణుడే!" అని.


🕉️ ఓం నమో నారాయణాయ 🙏

కోవిడ్ 19 రెండవ వేవ్ గురించి

 ఇప్పుడు మన ప్రజల మనస్తత్వం మారవలసిన అవసరం ఎందుకు?


" ఇది అతనిని ఖచ్చితంగా కట్టి పడేస్తుంది.  అతను చాలా వివరణలు ఇచ్చుకోవలసి ఉంటుంది. " 


కోవిడ్ 19 రెండవ వేవ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రొఫెసర్ మరియూ నా స్నేహితురాలు గొంతులో ఆనందం స్పష్టంగా కనిపించింది. మోడీకి ఇబ్బంది పెరిగిందని ఆమె తన ఆనందం దాచుకోలేకపోతోంది. ఇందులో ఆమె ఒంటరిగా లేదు. మహమ్మారి ఎక్కువ వ్యాప్తిపై భయం కంటే ఇది మోడీకి ఎంత ఎక్కువ ఇబ్బంది తెస్తుందనే దాని మీద లెక్కలు వేస్తున్నవారు చాలా మంది ఉన్నారు.


దేశం ఎదుర్కొంటున్న ఒక సంక్షోభం తరువాత మరో సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి అతను ప్రయత్నిస్తూ, ప్రతి ఒక్కరిని లేచి పోరాడమని ప్రోత్సహిస్తున్నప్పుడు ఒక మనిషి పట్ల ఇంత ఈ ద్వేషపూరిత ద్వేషానికి కారణం మరియు మూలం ఏమిటి? 


కోవిడ్ 19 మహమ్మారి మనలను కదిలించింది, మన ఉనికినే బెదిరిస్తున్నాది కానీ ఆ వ్యక్తి మీద ద్వేషంతో దీనిని పోల్చితే మరియు,  నా స్నేహితులలాంటి వ్యక్తులు మోడీ ఇబ్బందుల్లో ఉన్నాడని అతని కష్టాలను కోవిడ్ ఎలా పెంచుతుందో  ఆనందాన్ని వ్యక్తం చేయడంతోనూ పోలిస్తే కోవిద్ చిన్నది లాగే కనిపిస్తుంది. అతను వారికి ఏమి హాని చేయనప్పటికి మన సమాజంలో ఒక వర్గం అతని మీద అంతటి శత్రుత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నాదో మనలని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.


నేను ఈ వ్యాసం రాస్తున్నప్పుడు, మోడీ టీవీ/ రేడియో ప్రసంగం తర్వాత ఒక సందేశం చక్కర్లు వేయడం ప్రారంభమైంది. అది ఏమిటంటే " మీ  అవసరాలను మీరే చూసుకోవడం అంతే కాని సహాయం కోసం ప్రభుత్వం వైపు తిరగడం కాదు"

 "అందుకే అలాంటి ప్రభుత్వంలో జీవించడం నేర్చుకోండి, దేవుడే మనకు సహాయం చేస్తాడు ” అనే వ్యంగ్య సందేశం ఒక మేధావి నుండి వచ్చింది.


లేచి పోరాడమని మనకు  సూచించే మోడీ సందేశం అలాంటి వ్యంగ్య వ్యాఖ్యలను ఎందుకు ఆహ్వానిస్తోంది?


కారణం,   గతంలో భారతీయ నాయకులు తమ ప్రజలతో ఈ భాషలో చాలా అరుదుగా మాట్లాడేవారు. మన చీకటి రోజుల్లో ఆశ యొక్క చిహ్నంగా మనం పిలుచుకునే వారు ఎవరూ లేరు. వారు సంక్షోభ నిర్వాహకులుగా ఎక్కడా నిలబడి లేరు. గాంధీ నిశ్శబ్దంగా ఉపసంహరించుకునేవారు. అంతే కాదు సంక్షోభాన్ని ఎదుర్కొ వలసివచ్చినపుడు ప్రజలను సొంతంగా గాలికి వదిలివేసే సమాధానాల కోసం తన చక్రం తిప్పడం ప్రారంభించే వారు. అతని బెట్ నోయిర్ నెహ్రూ విభజన సమయంలో కూడ ఇలాగే ఉండేవారు.  చైనీయుల దండయాత్ర సమయంలో, అతను తన ప్రజలను జాగృతపర్చడానికి గుర్తుంచుకోవలసిన పదం ఎప్పుడైనా చెప్పాడా అని నేను ఆశ్చర్యపోతుంటాను. తరచుగా అతను తన  చేతుల మధ్య తల ఉంచి ఆలోచనలో మునిగిపోతూ కూర్చునేవాడు. శతాబ్దాల బానిసత్వం మరియు వలసవాదం నుండి బయటికి వచ్చిన తరువాత మన నాయకులు చాలా మంది ఈ విషయంలో విఫలమయ్యారు. విచిత్రం ఏమిటంటే మన నాయకులలోని వారి నిష్క్రియాత్మకతను మనం సహజంగా అంగీకరించాము. 


బంగ్లాదేశ్ యుద్ధంలో ఇందిరా గాంధీ చాలా అరుదుగా ప్రజలు ఏదో సందేశం చెప్పేవారు. అలా చెప్పడం మానేక్షా వంటి జనరల్స్ కు వదిలివేయబడింది. ఆమె అత్యవసర పరిస్థితిని ప్రకటించి వేలాది మందిని జైలు శిక్ష మొ. వాటితో హింసించింది. ఆమె హత్య తర్వాత జరిగిన దారుణానికి బాధ్యత స్వీకరించడానికి బదులుగా ఆమె కుమారుడు రాజీవ్ ఒక పెద్ద చెట్టు పడిపోయినప్పుడు భూమిలో చీలికను సృష్టిస్తుందని చెప్పారు. బొంబాయిలో ఉగ్రవాద దాడి తరువాత మన్మోహన్ సింగ్ ‘హిందూ టెర్రర్’ అనే పదాన్ని అనుమతించేంతవరకు వెళ్ళారు. గత విధానం ఏమిటంటే  ' వేచి ఉండి ఏమీ చేయకూడదు' అని.   జ్ఞాపకశక్తి యొక్క చివరి నిమిషం మసకబారే వరకు నిష్క్రియాత్మకతను కొనసాగించండి అనేదే గత అనుభవం.


అటువంటి భాషలో మాట్లాడని మొదటి నాయకుడు నరేంద్ర మోడీ. బానిసత్వం లేని మనస్తత్వం ఉన్న స్వతంత్ర భారతదేశపు మొదటి నాయకుడిగా చరిత్రకారులు ఒకరోజు ఆయనను వర్ణించవచ్చు. అతను ఒక సంక్షోభ నిర్వాహకుడు, అతను ఆర్టికల్ 370 రద్దు చేయడం లేదా రామ ఆలయాన్ని వంటి గత సమస్యలను పూర్తి చేయడానికి ప్రశాంతంగా  చర్యలు తీసుకుంటాడు. భారతదేశానికి చెందిన హిందూ నాయకుడిని చూడటం ప్రపంచానికి అలవాటు లేదు, అతను నెహ్రూ లాగా వేడుకోడు, విజ్ఞప్తి చేయడు లేదా మన్మోహన్ సింగ్ లాగా ముడుచుకున్న చేతులతో నిలబడడు. అతను ప్రతి గాయం లేదా ప్రతి గాయం యొక్క అనవాలును గుర్తుంచుకొని రక్షణాత్మకంగా మిగిలిపోకుండా తన భాషలో తిరిగి సమాధానం ఇస్తాడు. గతంలోని హిందువులు ఆయన లాగ ఆత్మవిశ్వాసంతో సంక్షోభం లేదా విపత్తుతో వ్యవహరించలేదు. మనం దీనిని గ్రహిస్తే, మన నిష్క్రియాత్మకత లక్షణం తరువాతి తరానికి చనిపోతుంది.


బ్రిటిష్ వారి గురించి ఒక పాత సామెత నాకు గుర్తుంది, "శాంతి కాలంలో వారిని నిర్వహించడం అసాధ్యం కాని సంక్షోభంలో వారు ఐక్యమై అన్ని తేడాలను విడిచిపెడతారు." కానీ భారతీయులైన మనం, ఒక సంక్షోభంలో ఒకరికొకరు శత్రువులుగా మారి, మనకు సహాయం చేయమని మన బాహ్య శత్రువును వేడుకుంటున్నారు. మనం ఒకరినొకరు నిందించుకుంటాము. భారతదేశంలోని ప్రతి శత్రువు అంటే అలెగ్జాండర్, మొహమ్మద్ ఘోరి నుండి బ్రిటిష్ వారి వరకు ఇది తెలుసు. ఇది మారితేనే, మనం మరలా బానిసలుగా మారము. మోడీ ప్రసంగాలు మనకు ఈ మార్పు తేగలవు అని నేను నమ్ముతున్నాను.


ఇది సరిదిద్దలేని మన జన్యువులలోని దోషమా లేదా మనలని జాతీయ స్థాయిలో  సరిదిద్దగల నాయకత్వం విఫలమా? వలసవాద సంప్రదాయంలో విద్యావంతులైన ప్రతి ఇతర ఉదారవాద మరియు మేధావులచే మోడీ పట్ల ఈ ద్వేషానికి ఒక కారణం ఆయన నాయకత్వం ఆ లోపాన్ని మనకు ఎత్తి చూపుతున్నాది అని నేను నమ్ముతున్నాను.


దేశానికి ఆయన ఇస్తున్న ఉపన్యాసాలు భవిష్యత్తులో ఎలా మదింపు చేయబడతాయి? సామాన్య ప్రజల గుండె లోతులను తట్టి లేపుతున్నాయి. దేశంలో మరే ఇతర భారత నాయకుడూ ప్రయత్నించని ప్రారంభం ఇదేనని నేను నమ్ముతున్నాను. ప్రస్తుత పరిస్థితులలో నేను నెహ్రూ, గాంధీని దృశ్యమానం చేస్తే దిశ లేకపోవడం, అసమర్థత మరియు నిస్సహాయతను అభ్యర్ధించడం తప్ప మరేమీ చూడలేను.


ప్రత్యర్థి శక్తులతో వ్యవహరించే మోడీ శైలి ఇతర నాయకుల మాదిరిగా కాకుండా వారి స్వంత వైరుధ్యాల బరువుతోనే వారిని విచ్ఛిన్నం చేయడం. అతని పద్ధతులు రక్షణాత్మకమైనవి కావు, శత్రువుపై దాడి చేస్తాయి. అందువల్ల అతనిని దూకుడు అని పిలుస్తారు. అతని ప్రతి విరోధికి ఇది తెలుసునని నేను నమ్ముతున్నాను అందుకే అతను అలాంటి వారికి ముప్పు.


చరిత్ర యొక్క గొప్ప నాయకులు వారి ప్రజలను వారి నిష్క్రియాత్మకతను వదిలించి, ఎదగాలని ప్రోత్సహిస్తారు. వారు ఉచితాలు వాగ్దానం చేయరు,  దేశం కోసం లేదా అంతకంటే గొప్ప కారణం కోసం ఎదగాలని, ప్రజలు త్యాగాలు చేయమని అడుగుతారు.


ఐసన్‌హోవర్, విన్‌స్టన్ చర్చిల్, బిస్మార్క్, కెన్నెడీ సంక్షోభ సమయంలో గొప్ప నాయకులు అయ్యారు. రెండవ ప్రపంచ యుద్ధంలో చర్చిల్ బ్రిటిష్ వారిని నడిపించాడు. దేశంలో వస్తువుల కొరత గురించి ఫిర్యాదు చేయవద్దని ఆయన ముందుగా కోరిన తరువాత మన విజయానికి ప్రజల అనేక త్యాగాలకు సిద్ధపడమని చెప్పాడు. వారి ప్రసంగాలు ప్రజలకు వాగ్దానాలు చేయలేదు, ప్రజాలనుండి పోరాటం, ధైర్యం  కోరాయి.  మోడీ కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు. బహుశా అందుకే, మోడిని తొలగించాలనే కోరిక అతని విరోధులచే అన్ని నిబంధనలను దాటివేయిస్తున్నాది. మోడీ విరోధులు భారతదేశ వలస చరిత్రను మరచిపోయి పాకిస్తాన్, చైనా మరియు అమెరికా నుండి సహాయం కోసం కూడా అడుగుతున్నారు.


చరిత్రలో నరేంద్ర మోడీ ఎలా గుర్తుకు వస్తారు? ఆయనకు ముందు భారతదేశంలో ఏ నాయకుడూ  ప్రయత్నించని అదే తన ప్రజలను నిద్రలో నుండి మేల్కొల్పిన నాయకుడిగా,  వ్యక్తిగా ఆయన జ్ఞాపకం అవుతారా? దేశంలో ఆయన మార్పులను తీసుకురావడానికి ప్రయత్నించిన ప్రతిసారీ అతను ఎదుర్కొంటున్న ఎగతాళి, వ్యంగ్యం చరిత్ర ద్వారా ఎలా కనిపిస్తుంది? అతను  వెయ్యి సంవత్సరాల బానిసత్వ ఆలోచనలుతో ఉన్న గొలుసుల నుండి ప్రజలకు విముక్తి కల్పించడానికి ప్రయత్నించిన ప్రతీసారీ హేళనకు గురి అవుతునే ఉన్నాడు.


ఇది రజిత్ మిత్ర, సైకాలాజిస్టు మరియు

'ఇన్ఫీడెల్ నెక్స్ట్ డోర్' పుస్తక రచయిత

రాసిన ఒక పెద్ద ఆర్టికల్ కి సంక్షిప్త స్వేచ్చానువాదం.


...చాడా శాస్త్రి...


సంస్కృత మహాభాగవతం

 *29.06.2021  ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - ఉత్తరార్ధము -  డెబ్బది నాలుగవ అధ్యాయము*


*శ్రీకృష్ణభగవానుని అగ్రపూజ శిశుపాలుని ఉద్ధారము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*74.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*తత్పాదావవనిజ్యాపః శిరసా లోకపావనీః|*


*సభార్యః సానుజామాత్యః సకుటుంబోఽవహన్ముదా॥11382॥* 


పిదప ధర్మరాజు పత్నీసహితుడై నిర్మలజలములతో ఆ పరమపురుషుని పాదపద్మములను  కడిగెను. లోకములను పునీతమొనర్చునట్టి, ఆ శ్రీపాద తీర్థమును ఆ మహారాజు భార్యాసహితుడై తన శిరస్సున దాల్చెను. పిమ్మట ఆయన సోదరులను, అమాత్యులను, బంధుమిత్రులను ఆ తీర్థజలములను తమ శిరస్సులపై చల్లుకొనిరి.


*74.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*వాసోభిః పీతకౌశేయైర్భూషణైశ్చ మహాధనైః|*


*అర్హయిత్వాశ్రుపూర్ణాక్షో నాశకత్సమవేక్షితుమ్॥11383॥*


అనంతరము యుధిష్ఠిరుడు కృష్ణప్రభువునకు పట్టుపీతాంబరములను, అమూల్యమైన ఆభరణములను, సంపదలను సమర్పించెను. నేత్రములు ఆనందాశ్రువులతో నిండియుండుటవలన ధర్మరాజు ఆ పురుషోత్తముని చక్కగా దర్శింపలేకపోయెను.


*74.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*


*ఇత్థం సభాజితం వీక్ష్య సర్వే ప్రాంజలయో జనాః|*


*నమో జయేతి నేముస్తం నిపేతుః పుష్పవృష్టయః॥11384॥*


నిండుసభలో శ్రీకృష్ణుడు అగ్రపూజను అందుకొనుటను జూచి, సదస్యులెల్లరును జయజయ ధ్వనులను గావించుచు ఆ ప్రభువుయొక్క పాదములకు ప్రణమిల్లిరి. ఆకాశమునుండి పుష్పవర్షములు కురిసెను.


*74.30 (ముప్పదియవ శ్లోకము)*


*ఇత్థం నిశమ్య దమఘోషసుతః స్వపీఠాదుత్థాయ  కృష్ణగుణవర్ణనజాతమన్యుః|*


*ఉత్ క్షిప్య బాహుమిదమాహ సదస్యమర్షీ సంశ్రావయన్ భగవతే పరుషాణ్యభీతః॥11385॥*


ధర్మరాజు శ్రీకృష్ణునకు అగ్రపూజచేయుటను, దానిని సదస్యులు ఎల్లరును సమర్థించుటను శిశుపాలుడు గమనించుచునేయుండెను. అందఱును శ్రీకృష్ణుని గుణములను ప్రశంసించుచుండుటవలన అసూయపరుడైన అతనిలో కోపము కట్టలు తెంచుకొనెను. వెంటనే అతడు తన ఆసనమునుండి దిగ్గున లేచి అసహనముతో ఊగిపోవుచు చేతిని పైకెత్తి, జంకుగొంకులేక నిండుసభలో కృష్ణప్రభువునకు వినబడునట్లుగా ఇట్లు పరుషవచనములను పలికెను.


*74.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*ఈశో దురత్యయః కాల ఇతి సత్యవతీ శ్రుతిః|*


*వృద్ధానామపి యద్బుద్ధిర్బాలవాక్యైర్విభిద్యతే॥11386॥*


"సదస్యులారా! 'సర్వమును శాసించే కాలమును ఎవ్వరునూ ఉల్లఘింపజాలరు' అని శ్రుతివాక్యము వాస్తవమే అనిపించుచున్నది. ప్రస్తుతము మూర్ఖుడైన ఒక బాలుని వచనములముందు జ్ఞానవృద్ధుల, వయొవృద్ధుల బుద్ధులుగూడ పనిచేయకుండుటయే అందులకు ప్రత్యక్ష నిదర్శనము.


*74.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*యూయం పాత్రవిదాం శ్రేష్ఠా మా మంధ్వం బాలభాషీతమ్|*


*సదసస్పతయః సర్వే కృష్ణో యత్సమ్మతోఽర్హణే॥11387॥*


ఈ సభలో అగ్రపూజకు అర్హులైన వారిని నిర్ణయించుటలో మీరు సర్వసమర్థులే. అందువలన 'అగ్రపూజకు శ్రీకృష్ణుడే అర్హుడు' అను బాలుడగు సహదేవుని వచనములకు మీరు సమ్మతింపవద్దు.


*74.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*తపోవిద్యావ్రతధరాన్ జ్ఞానవిధ్వస్తకల్మషాన్|*


*పరమఋషీన్ బ్రహ్మనిష్ఠాంల్లోకపాలైశ్చ పూజితాన్॥11388*


*74.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*సదస్పతీనతిక్రమ్య గోపాలః కులపాంసనః|*


*యథా కాకః పురోడాశం సపర్యాం కథమర్హతి॥11389॥*


ప్రస్తుతము ఈ సభలో గొప్ప తపస్సంపన్సులు, మహావిధ్వాంసులు, వ్రతనిష్ఠాగరిష్ఠులు, తత్త్వజ్ఞానముతో పాపతాపములను అధిగమించినవారు (తత్త్వవేత్తలు), మహర్షులు, లోకపాలురచే గూడ పూజలను అందుకొనునట్టి బ్రహ్మనిష్ఠాపరులు మొదలగువారు ఎందఱో గలరు. వారిని అందఱిని కాదని అగ్రపూజను పొందుటకు కులాధముడైన ఈ ఆలకాపరి ఎంతవఱకు అర్హుడు? పురోదాశమునకు (యజ్ఞపూతమైన అపూపమునకు) కాకి ఎట్లు యోగ్యమగును?


*74.35 (ముప్పది ఐదవ శ్లోకము)*


*వర్ణాశ్రమకులాపేతః సర్వధర్మబహిష్కృతః|*


*స్వైరవర్తీ గుణైర్హీనః సపర్యాం కథమర్హతి॥11390॥*


ఈ గోపాలుడు జాతీ, నీతీ లేనివాడు సమాజములో ఒకస్థాయిలేనివాడు. సద్వంశములో జన్మించినవాడు కాదు. సకల ధర్మములను వదలిపెట్టినవాడు. వేదశాస్త్రమార్గములను, లోకమర్యాదలను ఉల్లంఘించి, విశృంఖలముగా ప్రవర్తించువాడు, ఎట్టి గుణములను లేనివాడు ఇట్టి అవలక్షణములుగల ఈతడు పూజకు ఎట్లు అర్హుడగును?


*74.36 (ముప్పది ఆరవ శ్లోకము)*


*యయాతినైషాం హి కులం శప్తం సద్భిర్బహిష్కృతమ్|*


*వృథాపానరతం శశ్వత్సపర్యాం కథమర్హతి॥11391॥* 


మునుపు ఈతని వంశము యయాతి శాపమునకు గుఱియయ్యెను. అందువలన సత్పురుషులు ఇతని వంశమును బహిష్కరించిరి. ఈ విషయమును మీరును ఎఱుగుదురు. ఈతని కులమువారు ఎల్లప్పుడును మధుపానమునందే మునిగియుందురు. అట్టివంశమునకు చెందిన ఈతడు పూజకు ఎట్లు అర్హుడగును?


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి డెబ్బది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

సంస్కృత మహాభాగవతం*

*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - ఉత్తరార్ధము -  డెబ్బది నాలుగవ అధ్యాయము*


*శ్రీకృష్ణభగవానుని అగ్రపూజ శిశుపాలుని ఉద్ధారము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*74.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*సదస్యాగ్ర్యార్హణార్హం వై విమృశంతః సభాసదః|*


*నాధ్యగచ్ఛన్ననైకాంత్యాత్సహదేవస్తదాబ్రవీత్॥11373॥*


సదస్యులలో అగ్రపూజకు అర్హులైన విషయమున ఏకాభిప్రాయము కుదరకుండెను. అచటనున్నవారు ఎవరికివారు తమ అభిప్రాయములను వేర్వేరుగా తెలిపిరి. అప్పుడు మాద్రిపుత్రుడగు సహదేవుడు ఇట్లు వచించెను-


*74.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*అర్హతి హ్యచ్యుతః శ్రైష్ఠ్యం భగవాన్ సాత్వతాంపతిః|*


*ఏష వై దేవతాః సర్వా దేశకాలధనాదయః॥11374॥*


"సభాసదులారా! యదువంశ శిరోమణియగు శ్రీకృష్ణభగవానుడే సదస్యులందఱిలో శ్రేష్ఠుడు. అందువలన అతడే అగ్రపూజకు అర్హుడు, సకలదేవతాస్వరూపుడు. అంతేగాదు, దేశకాలధనాది వస్తువులు అన్నియును ఆయన రూపములే.


*74.20 (ఇరువదియవ శ్లోకము)*


*యదాత్మకమిదం విశ్వం క్రతవశ్చ యదాత్మకాః|*


*అగ్నిరాహుతయో మంత్రాః సాంఖ్యం యోగశ్చ యత్పరః॥11375॥*


ఈ విశ్వమంతయును శ్రీకృష్ణుని రూపమే. సకల యజ్ఞములును శ్రీకృష్ణుని స్వరూపములే. ఆ మహాత్ముడే అగ్నిగా, ఆహుతులుగా, మంత్రములుగా విలసిల్లుచున్నాడు. జ్ఞాన, కర్మ యోగములు ఆ ప్రభువును చేరెడి మార్గములు.


*74.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*ఏక ఏవాద్వితీయోఽసావైతదాత్మ్యమిదం జగత్|*


*ఆత్మనాఽఽత్మాశ్రయః సభ్యాః సృజత్యవతి హంత్యజః॥11376॥*


సదస్యులారా! శ్రీకృష్ణుడు ఒక్కడే అద్వితీయుడైన పరబ్రహ్మము. చిదచిదాత్మకమైన ఈ సంపూర్ణజగత్తు ఆ స్వామి రూపమే. సమస్త జగత్తునకు అతడే ఆధారము. అతనికి వేఱొకటి ఆధారము కాదు. ఈ లోకములను అన్నింటిని తన సంకల్ప మాత్రమున అతడు సృష్టించును, పాలించును, లయమొనర్చును, అతడు జన్మాది షడ్వికారములు లేనివాడు.


*74.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*వివిధానీహ కర్మాణి జనయన్ యదవేక్షయా|*


*ఈహతే యదయం సర్వః శ్రేయో ధర్మాదిలక్షణమ్॥11377॥*


ఈ జగత్తులోని జనులు అందఱును శ్రీకృష్ణుని అనుగ్రహముచేతనే అనేక విధములైన కర్మలను అనుష్ఠించుచు *ధర్మార్థకామమోక్షములు* అను చతుర్విధ పురుషార్థఫలములను పొందుచున్నారు.


*74.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*తస్మాత్కృష్ణాయ మహతే దీయతాం పరమార్హణమ్|*


*ఏవం చేత్సర్వభూతానామాత్మనశ్చార్హణం భవేత్॥11378॥*


అందువలన మహాత్ముడైన శ్రీకృష్ణునకే అగ్రపూజను సమర్పింపవలయును. ఆ స్వామిని పూజించినచో సకలప్రాణులను పూజించినట్లేయగును. అంతేగాక, మనలను మనము గౌరవించుకొనినట్లు కాగలదు.


*74.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*సర్వభూతాత్మభూతాయ కృష్ణాయానన్యదర్శినే|*


*దేయం శాంతాయ పూర్ణాయ దత్తస్యానంత్యమిచ్ఛతా॥11379॥*


శ్రీకృష్ణుడు సకలప్రాణులలో అంతర్యామియై విలసిల్లువాడు. భేదబుద్ధిరహితుడు, శాంతుడు (రాగద్వేషములు లేనివాడు),  పరిపూర్ణుడు.అట్టి శ్రీకృష్ణునకు దానము చేయుట (అగ్రపూజచేయుట) యుక్తము. అట్లొనర్చుటవలన అక్షయత్వము సిద్ధించును".


*74.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*ఇత్యుక్త్వా సహదేవోఽభూత్తూష్ణీం కృష్ణానుభావవిత్|*


*తచ్ఛ్రుత్వా తుష్టువుః సర్వే సాధు సాధ్వితి సత్తమాః॥11380॥*


*74.26 (ఇరువది ఆరవ శ్లోకము)*


*శ్రుత్వా ద్విజేరితం రాజా జ్ఞాత్వా హార్దం సభాసదామ్|*


*సమర్హయద్ధృషీకేశం ప్రీతః ప్రణయవిహ్వలః॥11381॥*


శ్రీకృష్ణుని మహిమను, ప్రభావమును బాగుగా ఎఱిగిన సహదేవుడు ఇట్లు పలికి మిన్నకుండెను. ధర్మరాజు యొక్క యజ్ఞసభలోనున్న సత్పురుషులు అందఱును ఆ మాటలను విని సంతసించుచు 'బాగు బాగు' అనుచు ముక్తకంఠముతో తమ ఆమోదమును తెలిపిరి. అంతట సదస్యుల అభిప్రాయములను ఎఱింగి, ధర్మరాజు పరమానందభరితుడయ్యెను. బ్రాహ్మణోత్తముల ఆజ్ఞను గైకొని భక్తిపరవశుడై జితేంద్రియుడగు కృష్ణపరమాత్మను చక్కగా పూజించెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి డెబ్బది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235