3, మే 2022, మంగళవారం

వైశాఖ పురాణం - 3 వ అధ్యాయము

 _*మంగళవారం మే 3, 2022*_


_*🚩వైశాఖ పురాణం - 3 వ అధ్యాయము🚩*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*వివిధ దానములు - వాని మహత్మ్యములు*


☘☘☘☘☘☘☘☘


నారదమహర్షి మాటలను వినిన అంబరీష మాహారాజు నారదమహర్షికి నమస్కరించి మహర్షీ ! వైశాఖమాసమున చేయదగిన దానము లివియేనా ? మరి యింకనూ ఉన్నవా ? అవి యేవి ? వాని ఫలితములను గూడ దయయుంచి వివరింపుమని కోరెను.


అప్పుడు నారదమహర్షి యిట్లనెను. చల్లనిగాలి తగులుచు సుఖనిద్రను కలిగించు పర్యంకమును (మంచమును) సద్బ్రాహ్మణ గృహస్థునకు దానమిచ్చినవారు ధర్మసాధనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండ జీవింతురు. ఎట్టి తాపత్రయములు ఆధివ్యాధులు లేకుండ సుఖముగ జీవింతురు. ఇహలోకసుఖముల ననుభవింతురు. పాపములు లేకుండనుందురు. అంతియేకాదు మహాయోగులు సైతము పొందలేని అఖండమోక్ష సామ్రాజ్యమునందుదురు. వైశాఖమాసపు యెండలకు బాధపడినవారికి బ్రాహ్మణశ్రేష్ఠులకు శ్రమను పోగొట్టునట్టి యుత్తమ పర్యంకమునిచ్చి యిహలోకముననెట్టి బాధను పొందరు. ఆ సత్పురుషుడు  సద్బ్రాహ్మణుడు ఆశయనముపై శయనించినను కూర్చున్నను దాత తెలిసి తెలియక చేసిన సర్వపాపములును అగ్నిచే కర్పూరము దహింపబడినట్లు నశించును. ఇహలోక సుఖములననుభవించి మోక్షమును పొందును. స్నానమాత్రముననే పుణ్యములనిచ్చు వైశాఖమాసమున కశిపును (పరుపు లేక వస్త్రము) మంచముపై మంచి ఆచ్చాదనము గల పరుపును ఉత్తమమైన ఆహారమును దానము చేయువారు చక్రవర్తులై చక్రవర్తి సమానులై తమ వంశము వారితో బాటు శారీరక , మానసిక బాధలు లేకుండ సుఖశాంతులతో అభివృద్ధి నందుదురు. ఆయురారోగ్యములను కీర్తిప్రతిష్ఠలను పొందుదురు. నూరు తరముల వరకు వాని కులమున ధర్మహీనుడు జన్మింపడు. తుదకు ముక్తినందును. శ్రోత్రియుడైన సద్బ్రాహ్మణునకు ఆ మంచముపై పరుపుతోబాటు దిండును గూడ దానమిచ్చినచో సుఖనిద్రకు కారణమైన మంచమును , పరుపును , దిండును యిచ్చుటచే ఆ దాత అందరకు అన్నివిధముల ఉపకారము చేయువాడై ప్రతిజన్మయందును , సుఖవంతుడు , భోగవంతుడు , ధర్మపరాయణుడై అన్నిటా విజయమునందుచు యేడు జన్మల వరకు మహావైభవముగ గడిపి తుదకు ముక్తినందును. తనతోబాటు నేడు తరములవారికిని ముక్తిని కలిగించును. గడ్డి తుంగ మున్నగువానిచే నిర్మితమైన చాపను దానమిచ్చినచో శ్రీమహావిష్ణువు సంప్రీతితో తానే దానియందు శయనించును. ఊర్ణ , ఉన్ని , గొఱ్ఱె బొచ్చు నీటియందు పడినను తడవకనుండునో అట్లే పర్యంక శయ్యా దానము చేసినవారు. సంసారసముద్రములోనున్నను ఆ వికారములంటని స్థితిని పొందుదురు. అట్టి పర్యంక శయ్యాదానమును చేయలేనివారు కట(చాప) దానమును చేయవచ్చును. శక్తియుండి పర్యంక శయ్యాదానము చేసిన వచ్చునట్టి పుణ్యమే అశక్తులై కట శయ్యాదానము చేసినవారికిని వచ్చును. పడుకొనిన వారికి నిద్రచే శ్రమ , దుఃఖము నశించును. అట్టి నిద్రను కలిగించు కటదానము దాతకు సర్వసుఖములనిచ్చును. రాజా ! వైశాఖమాసమున కంబళి దానము చేసినవానికి అపమృత్యువును పోగొట్టి చిరకాలము నిశ్చింతగా సుఖజీవనము కలవానిని గావించును.


ఎండచే పీడింపబడినవానికి వస్త్రమును దానము చేసినచో పరిపూర్ణ ఆయుర్దాయమునంది తుదకు ముక్తినందును. లోని తాపమును పోగొట్టి కర్పూరమును దానమిచ్చినచో ముక్తి ఆనందము కలుగును. దుఃఖములు నశించును. ఉత్తమ బ్రాహ్మణునకు పుష్పముల దానమిచ్చినచో సర్వజనులను వశపరచుకొన్న మహారాజై చిరకాలము సుఖించును. కుమారులు , మనుమలు మున్నగువారితో సర్వసౌఖ్యములనంది ముక్తినందును. సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖమాసమున కర్పూర , తాంబూల దానమిచ్చినచో చక్రవర్తియై మోక్షమునందును. చర్మమునకు ఎముకలకు గల సంతాపమును పోగొట్టు చందనమును దానమిచ్చినచో సంసార తాపత్రయమునశించి సుఖించును. దుఃఖములు , పాపములు లేకుండ జీవించి ముక్తి నందును. కస్తూరి మున్నగు సుగంధద్రవ్యముల నిచ్చినచో నెట్టి బాధలు లేకుండ జీవించి మోక్షమునందును. పద్మమాలను గాని అడవిమల్లెల మాలనుగాని దానమిచ్చినచో చక్రవర్తియై సర్వజన మనోహరుడై చిరకాలము జీవించి ముక్తినందును. వైశాఖమున మొగలి , మల్లెపువ్వులు దానమిచ్చినచో మధుసూదనుని యనుగ్రహమున సుఖ భోగములనంది ముక్తి నందును. పోక చెక్కలను , సుగంధద్రవ్యమును , కొబ్బరి కాయలను దానమిచ్చినచో నేడు జన్మలవరకు బ్రాహ్మణుడై జన్మించి వేదపండితుడు , ధనవంతుడై యుండి యేడు తరములవారితో గలసి ముక్తినందును.


సద్బ్రాహ్మణుని యింటిలో విశ్రాంతి మండపమును కట్టించి యిచ్చినచో వాని పుణ్యము యింతయని చెప్పుటకు మాటలకందనిది సుమా. నీడనిచ్చు మండపము , నీడలోనున్న యిసుక తిన్నెలు , చలివేంద్రము వీనిని నిర్మించి బాటసారులకు , జనులకు ఉపకారము చేసినవారు లోకాధిపతులగుదురు.


మార్గమున తోట , చెరువు , నూయి , మండపము, వీనిని నిర్మింపజేసినవానికి పుత్రులు లేకున్నను ధర్మలోపము అందువలని భయము లేదు. నూయి , చెరువు , తోట , విశ్రాంతి మండపము , చలివేంద్రము , పరులకుపయోగించు మంచి పనులు చేయుట , పుత్రుడు యివియేడును సప్తసంతానములని పెద్దలు చెప్పుచున్నారు. వీనిలోనే యొకటి చేయకున్నను మానవునకు పుణ్యలోకప్రాప్తి లేదు.


సచ్చాస్త్రశ్రవణము, తీర్థయాత్ర , సజ్జన సాంగత్యము , జలదానము , అన్నదానము , అశ్వర్థరోపణము (రావి చెట్టును నాటుట)  పుత్రుడు అను నేడును సప్తసంతానములని వేదవేత్తలు చెప్పుచున్నారు. వందలకొలది ధర్మకార్యములను చేసినను సంతానము లేనివానికి పుణ్యలోకప్రాప్తి లేకుండుటచే నతడు పైన చెప్పిన యేడు సంతానములలో యధాశక్తిగ వేనినైనను ఏ ఒకదానినైనను చేసి సంతానవంతుడై పుణ్యలోకములనందవచ్చును. పుణ్యపాప వివేకములేని పశువులు , పక్షులు , మృగములు , వృక్షములు సద్ధర్మాచరణ లేకపోవుటచే పుణ్యలోకప్రాప్తినందవు. కాని పుణ్యపాప వివేచనాశక్తి కలిగిన మానవులి సద్ధర్మముల నాచరింపనిచో వారికి పుణ్యలోకములెట్లు కలుగును.


ఉత్తమములైన పోకచెక్కలు , కర్పూరము మున్నగు సుగంధద్రవ్యములు కల తాంబూలమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారి పాపములన్నియు పోవును. తాంబూల దాత కీర్తిని ధైర్యమును , సంపదను పొందును. నిశ్చయము , రోగియైనవాడు తాంబూల దానము నిచ్చినచో రోగవిముక్తుడగును. ఆరోగ్యము కలవాడు తాంబూల దానమిచ్చినచో ముక్తినందును. వైసాఖమాసమున తాపహారకమైన తక్రమును(మజ్జిగ) దానమిచ్చినవాదు విద్యావంతుడు , ధనవంతుడు నగును. కావున వేసవి కాలమునందు తక్రదానము తప్పక చేయదగినది సుమా. వేసవికాలమున ప్రయాణము చేసి అలసినవానికి మజ్జిగ నిచ్చిన మరింత పుణ్యమును కలిగించును. నిమ్మపండ్ల రసము ఉప్పు కలిపిన మజ్జిగయైన దప్పిక కలవానికి హితకరముగ నుండును. వైశాఖమాసమున దప్పిక తీరుటకై బాటసారులకు సద్బ్రాహ్మణులకు పెరుగు కుండనిచ్చినచో కలుగు పుణ్యమెంతటిదో నేను చెప్పజాలను. అనంత పుణ్యము కలుగునని భావము. లక్ష్మీవల్లభుడైన మధుసూదనునకు ప్రియమైన వైశాఖ మాసమున శ్రేష్ఠమైన బియ్యమును దాన మిచ్చినవారు పూర్ణాయుర్దాయమును , అన్ని యజ్ఞములు చేసిన పుణ్యఫలమునుపొందును. తేజోరూపమైన గోఘ్ర్తమును(ఆవునేయి) సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు అశ్వమేధయాగము పుణ్యమునంది తుదకు విష్ణుపదమును చేరుదురు.


విష్ణుప్రీతికరమైన వైశాఖమాసమున బెల్లమును దోసకాయను దానమిచ్చినవారు సర్వపాపములను పోగొట్టుకొని శ్వేతద్వీపమున వసింతురు. పగటి యెండకు అలసినవానికి సాయంకాలమున చెరకు గడను బ్రాహ్మణునకు దానమిచ్చినచో వానికి గలుగు పుణ్యమనంతము. వైశాఖమాసమున సాయంకాలమున యెండకు అలసిన బ్రాహ్మణునకు పానకమును దానమిచ్చినచో చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరును. పండ్లను పానకమును దానమిచ్చినచో దాత యొక్క పితృదేవతలు అమృతపానము చేసినంత ఆనందమును పొందుదురు. దాతకు వాని పితృదేవతల ఆశీస్సులు లభించును. వైశాఖమాసమున పానకముతో బాటు మామిడి పండ్లను దానమిచ్చినచో సర్వపాపములు హరించును. పుణ్యలోకప్రాప్తి కలుగును. చైత్రమాసమునందలి అమావాస్యయందు పానకము నిండిన కుండను దానమిచ్చినచో గయాక్షేత్రమున నూరుమార్లు పితృశ్రాద్ధము చేసినంత పుణ్యము కలుగును. ఆ పానకమున కస్తూరి కర్పూరము వట్టివేళ్లు మున్నగువానిని కలిపి చైత్రమాసము నందలి అమావాస్యయందు దానమిచ్చినచో వివిధ రీతులలో చేయవలసిన శ్రాద్ధముల నిర్వర్తించిన పుణ్యము కలుగును అని నారదుడు అంబరీష మహారాజునకు వివరించెను.



*వైశాఖపురాణం మూడవ అధ్యాయం  సంపూర్ణం*


        🌷 *సేకరణ*🌷

      🌹🌷🌞🌞🌷🌹

            *న్యాయపతి*

        *నరసింహా రావు*


🙏🌞🙏🌞🙏🌞🙏🌞🙏🌞🙏

గుబులు

 గుబులు

------- 


యవ్వనంతో పాటు 

ఒంట్లోకి అడుగుపెట్టింది అందం

అద్దెవాటాలోనే అలా ఒదిగి ఉండిపోలేక

అదేం చనువో, 

ఒళ్ళంతా అల్లుకుపోయింది

ఇక నాకూ తనకూ ఒకే లోకమైపోయింది 


వీథుల్లో అలా వెళ్ళిపోయే కళ్ళు

వెనుదిరిగి చూడటం నేర్చుకున్నాయి

వీథుల్లో వెడుతుంటే వెంటాడటమూ మొదలెట్టాయి

కోరికలు, మోహాలు నామీదే దృష్టి పెడుతుంటే

ఆప్యాయతలు మాత్రం

అస్తమానం ఇంట్లో దిష్టి తీయడాలు చేస్తుండేవి 


అందం అజమాయిషీలో

బంధాలూ బంధుత్వాలూ

ఇబ్బడిముబ్బడిగా ముడిపడిపోయాయి

ఆస్తులు...

ఎన్ని అంతస్తులు దిగొచ్చాయో గానీ

పరపతితో కూడిన ప్రపంచాన్ని 

బహుమతిగా తెచ్చి నా ముందు పడేసాయి 


ఒంటి చుట్టూ ఉన్న మైదానంలో

కొంటెచూపుల కాలం పరుగులు తీస్తుంటే

ఏ చికాకు వేసిందో ఏమో

అద్దెవాటా ఖాళీ చేసేసి యవ్వనం

చెప్పాపెట్టకుండా ఒంటరిగా వెళ్ళిపోయింది

వెళ్ళనా ? వద్దా ?? అంటూ వెనుకాడుతున్న

అందాన్ని నా ఒంట్లోనే వదిలేసి 


ఎంతకాలంగా వేచిచూస్తోందో ఏమో

'నడివయసు' చల్లగా నడిచొచ్చేసింది

యవ్వనం ఖాళీ చేసేసిన ఆ వాటాలోకి 


పెరుగుతున్న బరువులు

అక్కడక్కడా కూడుకుంటున్న కొవ్వులు

నెరుస్తున్న వెంట్రుకలు

మొహం పైని సన్నని గీతలు ముడుతలు

కళ్ళు కింది నల్లని వలయాలు

అందం ముందుకొచ్చి అద్దం చూపిస్తూ 

'బస్తీ మే సవాల్' అంటూ అరవడం మొదలెట్టాయి 


వంటింట్లో కొవ్వు లేని వంటలు

నట్టింట్లో కొవ్వును కరిగించే వర్కౌట్‌లు 

ఆలస్యం లేకుండా అట్టే మొదలయ్యాయి

పైపై పూసే పూతలు... ప్రకృతి చికిత్సలు

ఫలితం ఏమొస్తుందో తెలియని

ప్రయోగాలు ఎన్నెన్నో చోటుచేసుకున్నాయి 


ఎప్పుడు అంటిపెట్టుకొని ఉండే అందం 

ఈమధ్య ఎడమొహం పెడమొహంగా ఉంటోంది

ఎపుడెళ్ళిపోతానంటుందో అని 

నాకేదో తెలిసీ తెలియని గుబులుగా ఉంది 


అందంతో జీవితం ఇక ఇంతేనా..?

అందంతో సాన్నిహిత్యం అశాశ్వతమేనా...??


          .... శ్రీధర్ చౌడారపు (03.05.2022)

మనకే తెలియదు

 మనకు ఏం కావాలో మనకే తెలియదు. 


*ఒక చిన్న కథ*ద్వారా తెలుసుకుందాం. 


ఒక రోజు భక్తుడు: నేను ఇంటికెళ్లే రోడ్డు మీద బంగారం దొరికేలా ఆశీర్వదించండి స్వామి!! అని అడిగాడు. 


స్వామిజీ:   ఎవరిని కొరుకుంటున్నావురా అబ్బాయ్ దేవుడి నేనా?


భక్తుడు: అవును బాబాయ్ , దొరికితే చాలా బాగుండు!


స్వామిజీ:  దొరికితే ఎం చేస్తావ్?


భక్తుడు: అమ్మితే డబ్బులు వస్తాయ్, హాయిగ ఖర్చు పెట్టుకోవచ్చు.


స్వామిజీ:  ఎలాగు దేవుడినే కదా కొరుకునేది..అదేదొ డబ్బులే దొరకాలి అని కొరుకోవచ్చు కద..


భక్తుడు: అవును ..నువ్వు చెప్పిందే కరెక్ట్, ఇప్పుడు బంగారం దొరికి దాన్ని అమ్మడం..! ఇదంత టైం వేస్ట్... నాకు డబ్బు దొరకాలి.


స్వామిజీ:  ఎంత?


భక్తుడు: ఒక 100 కొట్లు.


స్వామిజీ:   ఎలాగు దేవుడినే కదా కొరుకునేది..అదేదొ లక్ష కోట్లు కొరుకోవచ్చు కదా..


భక్తుడు: అవును లే, ..ఎలాగు దేవుడినే కదా.. సరే లక్ష కొట్లు కోరుకుంటా..


స్వామిజీ:  ఎం చెస్తావేంటి, లక్ష కోట్లతొ?


భక్తుడు: బిల్డింగులు, కార్లు కొంటాను!


స్వామిజీ:  పిచ్చోడ!  దేవుడిని, అవే కోరుకోవచ్చు కద! సరే అవన్ని కొంటే???


భక్తుడు: ఇంకేముంది సుఖ సంతోషాలతో ఆనందంగా  ఉండొచ్చు


స్వామిజీ:  పిచ్చివాడా, అదేదొ దేవుడిని సంతోషం కావాలని కోరుకోవచ్చు కదా..?? 


భక్తుడు :నిజమే స్వామి 🙂😐😶😑


మిత్రులారా! మనకు ఏం కావాలో, మనకు తెలియదు...

మనకు ఏమి అర్హత కలదో, ఈశ్వరునికి తెలుసు 

అందుకే ఈశ్వరునికి సంతోషము కలిగించే పనులు చేస్తే, ఈశ్వరుడు మన అర్హతను బట్టి, మనకు కావలసినవి, దానితో పాటు మనకు సంతోషం,సంతృప్తి  ఇస్తాడు.

అహం బ్రహ్మాస్మి

 శ్లోకం:☝️ఆత్మబోధ - 37

*ఏవం నిరంతరాభ్యస్తా*

    *బ్రహ్మైవాస్మీతి వాసనా l*

*హరత్యవిద్యావిక్షేపాన్*

    *రోగానివ రసాయనం ll*


భావం: "అహం బ్రహ్మాస్మి" అన్న భావన నిరంతరము చేయుట వలన అవిద్యా విక్షేపములను హరించును. ఔషధము రోగములను నిర్మూలించినట్లు.🙏

*స్మశాన నారాయణస్వామి

 *స్మశాన నారాయణస్వామి* *ఆలయం,*

*ఆలంపుర్*


పితృ దోషము నుండి బయటపడే 

సులువైన పరిష్కారం..


#పితృదోషం మన తాతలు తండ్రులు 

సంపాదించిన ఆస్తిపాస్తులను 

వంశపారంపర్యంగా అనుభవించటానికి 

మనం ఎలాగ హక్కు అర్హత పొందుతామో ...

అలాగే... 

తాతలు తండ్రులు చేసిన 

పాపపుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి.

మన పెద్దలు పుణ్యాలు మంచిపనులు చేస్తూ ఉంటే వారి వంశం సుఖ సంతోషాలతో ఉంటుంది.

అలాగే అదే పూర్వికులు పాపాలు గనుక చేసి ఉంటే అది తెలుసు కావచ్చు తెలియక కావచ్చు ఏదైనా గాని వారు చేసిన పాప కర్మలు ఆ వంశపారంపర్యంగా ఆ కుటుంబంలోని వారు అనుభవించక తప్పదు..


మేము తెలిసి తెలియక ఏ తప్పు చేయలేదు కానీ బాధలను కర్మలను అనుభవిస్తున్నాను అనే బాధ పడేవారు ముఖ్యంగా తెలుసుకోవలసినది ముఖ్యమైనది ఒక్కటే. అదే #పితృదోషం


ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయం.

అందుకే ఈ పోస్టు పెడుతున్నాను.

పితృ దోషం ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాప కర్మలను చేయకపోయినా కుటుంబం ఇబ్బందులపాలు అవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది.


ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు.

వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా కచ్చితంగా పంచుకొని తీరవలసిందే.

పితృదోష వలన కలిగే దుష్పరిణామాలు కొన్ని చర్చించుకుందాము...


🔻 చిన్న వారు అకాలమరణం పొందడం 


🔻 శరీరంలోని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి ఆస్పత్రి పాలవడం.


🔻 అప్పులపాలు అవ్వడం లేనిపోని అపనిందల పాలు అవ్వడం.


🔻 మన ప్రమేయం లేకుండా ప్రమాదాలకు గురయ్యే జీవితాంతం కర్మలను అనుభవించడం.


🔻 మన కళ్ళ ముందు మన పిల్లలు చెడు వ్యసనాలకు బానిస అయ్యి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించడం


ఇలా వీటన్నిటికీ కారణం పితృ దోషం కారణం

దీని నుండి విముక్తి పొందడానికి ఏకైక పరిష్కారం.

స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకోవడమే ...

అయితే ఈ స్మశాన నారాయణుడి ఆలయాలు ఈ భారతదేశంలో రెండే రెండు ఉన్నాయి.


1. కాశీ

2. పాపనాశి  ( అలంపురం 'జోగుళాంబ గద్వాల జిల్లా)


అలంపురంలోని ఈ స్మశాన నారాయణుడి ఆలయం గురించి కేరళ తాంత్రిక శాస్త్రంలో చెప్పడం జరిగింది.


విచిత్రం ఏమిటంటే ఈ స్మశాన నారాయణ ఆలయం అలంపురంలో ఉన్నదన్న విషయం ఎవరికీ తెలియదు .

అయితే ఈ స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకుని మన బాధల నుండి విముక్తి పొందాలంటే ఏమి చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం.


స్మశాన నారాయణుని ప్రసన్నం చేసుకోవాలంటే....

పాలు అన్నముతో చేసిన పాయసం, అన్నము, ముద్దపప్పు, నేయి, వడ ఇవి నైవేద్యంగా పెట్టాలి ! ఈ విధంగా స్మశాన నారాయణుడికి నైవేద్యం పెడతారో ఆ ప్రసాదాన్ని వారి ఇంటి పేరు గల వంశస్థులు మాత్రమే దానిని  స్వీకరించాలి. ఇతరులకు ఇవ్వరాదు . 

స్వామికి తెల్లటి కండువా అలంకరించాలి.

ఈ వంటలను స్వయంగా వండుకొని తీసుకొని వెళ్ళి నివేదన చేయాలి లేదా ( వెళ్ళడానికి వీలు లేనివారు ఖర్చులను ఇచ్చి అక్కడి పూజారి చే చేయించ వచ్చును ) 

అలంపురం తెల్లవారుజామునే వెళ్లి తుంగభద్రా నదీ స్నానం చేసి అమ్మవారిని అయ్యవార్ల ను దర్శనం చేసుకున్న తరువాత ఈ  స్మశాన నారాయణుడిని సేవించుకొని ఇంక వేరే చోటకి వెళ్లకుండా ఇంటికి చేరుకోవాలి.


ఈ ఆలయ ప్రాముఖ్యము  తంత్ర గురు "వేణు మాధవ నంబూద్రి " ద్వారా తెలుసుకోవడం జరిగింది ' ఈ అలంపుర స్మశాన నారాయణుడి దాని ప్రాముఖ్యము కేరళ తంత్ర శాస్త్రంలో లిఖించబడి ఉన్నదట !

ఎంతోమంది పితృదోషం తో బాధపడే వారు ఉన్నారు . అలాంటివారికి ఈ విషయం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం..


చేరుకొనే విధానం:


అలంపూర్ "హరిత హోటల్ " కు ప్రక్కన ఒక చిన్న దారి ఉంటుంది . ఆ చిన్న దారి ఎడమవైపున 1.2 కిలోమీటర్ల దూరంలో పాపనాశేశ్వర ఆలయ సముదాయం ఉంటుంది . ఆలయ సముదాయంలో ఒక ప్రత్యేక ఆలయం "స్మశాన నారాయణుని ఆలయం "


ఇంకొక ముఖ్య విషయం : స్మశాన నారాయణుడి ఆలయ సమూహాలలో ప్రధాన దైవం శ్రీ పాపనాశేశ్వరుడు ' 7వ శతాబ్దం నాటి అతి పురాతన ' అతిపెద్ద మరకత లింగం ' దక్షిణ కాశి అంటారు . ఈ స్వామిని దర్శించుకున్న నంతనే పాపాలు నాశనం అవుతాయని ప్రతీతి!


దయవుంచి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి.


    🙏 సర్వేజనా సుఖినోభవంతు 🙏

Supreme Court of India,

 *Dear CJI* & fellow Justices of Supreme  Court of India,


 1. A party Wins Lok Sabha elections, gets 303 seats with massive 46% vote share.


2. Then it wins state after state to get majority in Rajya Sabha. 


3. It passes Kisan Bills in both the Houses, gets President's approval & the Bills become  Laws.


4. Some 20-25 K of 1 state sits on road for a month, then you stay the LAWs. 


5. What a mockery of the democratic process..!!! 


6. Where are our protectors of democracy now ?? Those who were screaming that democracy is being murdered, not so long ago ?? 


7. The Supreme Court today said, "We are trying to solve the problem in accordance with the Law."


8. Hello Sir ji..! Your job is not to solve a problem (but to judicially decide a case on merits). That would mean you don't want to annoy any party. You want to please everyone. Sorry! you are not here to please people. You are here to interpret existing Laws and pronounce a judgment.


 9. Your job is to say who is right and who is wrong. That's all. Nothing more. Nothing less.


10. But you didn't do that. What do you do? From this country of 130 crore people, you hand pick four people and ask them to tell you what is their opinion about these Laws. And then you would ask the Govt to implement their opinion. 


11. You would ask the Govt elected by 130 crore people to implement the opinion of four people. The wish of 130 crore people expressed through their representatives in the Parliament is insignificant for you. 


*Dear Supreme Court* ! 


12. If a Committee can decide how this country should be governed, why bother about an Election Commission and why should millions of voters vote ? Scrap the Parliament and save hundreds of crores ! And then form various Committees of Experts who will tell you how this country should be governed.


13. Or, you can ask the Government that before they introduce a bill in the Parliament, they must first bring it before you, and seek your pre-approval. Only after that - you or a Committee formed by you have approved it -  it can be taken to the Parliament for vote. That will save time and effort of a lot of people.


14. But you won't do that. You want to take over the power of the Parliament. But obviously, you don't want to be seen doing it.


15. By the way, yesterday, you said that you have received many petitions against the Farm Laws, but you haven't received a single petition supporting the Laws. I would hold it as the most stupid argument ever made by the Apex Court in its entire history.


15. I mean, what kind of an idiotic argument is this? Let me ask you. The population of this country is 130 crore. We have seen only a few lakh protesting against the Laws at Delhi borders. Even if we take the number of people we have seen participate in various dharna, pradarshans across the country as 1 crore, there are still 129 crore people in this country whom we never saw taking part in these protests. 


16. So can we say that 129 crore people are supporting these Laws? Can we? No, we can't. That will be a silly argument.


*So, dear Supreme Court* !


17. Please don't allow people to make a mockery of yourself. I hope, you know that the protestors have rejected your verdict even before you have given it. 


18. You know it very well. These people don't believe in Courts. Didn't you hear the same people say at Shaheen Bagh last year that they don't believe in Supreme Court and they would take over public place to bring the Government to its knees? Don't you remember that? You certainly do. 


19. Then why don't you pass judgments? Why do you dilly dally and let people openly disobey you? 


19. Please do what you are supposed to do. Don't do things that you are not supposed to do.


20. Your job is not to solve a problem to everyone's satisfaction. Your job is to pass judgments, interpret the Laws, not stay them..! So just do that. 


21. You have no business forming a Committee to approve or reject a Legislation passed by the Legislative Assembly.

Nor are you God !!


22. Thanks for going through the write up patiently. *Please share it with others... only if you agree....*


*Good judges make the Law; bad judges kill a good Law... 😔*.