10, జూన్ 2023, శనివారం

యోగవాసిష్ఠ రత్నాకరము

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


వైరాగ్య ప్రకరణము

ఒకటవ అధ్యాయము 

రాఘవ వైరాగ్య వర్ణనము


1-101


ఆలోక్యతే చేతనయాఽ నువిద్దా 

పయోలఽ నుబద్ధోఽ స్తనయో నభఃస్థాః, 

పృథగ్విభాగేన పదార్థలక్ష్మ్యా 

ఏతజ్జగన్నేతరదస్తి కించిత్‌.


పంచమహాభూతములగు పృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము లైదును పరస్పరము కలసి గోవు, ఘటము ఇత్యాది నానా పదార్థ జాతము ఏర్పడుచున్నది. కాని అవివేకులిట్టి జడ పదార్థరూపమగు జగత్తును చేతనముగ తలంచుచున్నారు. వివేక దృష్టిచే ఆయా పదార్థములను వేఱు వేఱుగ విభజించి చూచినచో ఈ జగత్తు పంచభూతములకంటె వేఱుగ ఒకింతైనను లేదని తెలియబడగలదు. 


1-102


అద్యాపి యాతేఽ పి చ కల్పనాయా 

ఆకాశవల్లీ ఫలవన్మహత్త్వే 

ఉదేతి నో లోభలవా హతానా 

ముదార వృత్తాంతముయీ కథైవ.


యౌవనావస్థయందు ఆశాలతా ఫలమువలె మిథ్యారూపములగు భోగములందు మహత్త్వము (ఉత్తమ పదార్థము) ను గూర్చిన కల్పన సంభవించుచుండ విషయభోగ, ధనాదిలోభలేశముచే నశించు మనుజుల చిత్తమున 

సర్వోత్కృష్టుడు అగు పరమాత్మ యొక్క వృత్తాంతమయమగు కథకూడ ఉదయించుట (రుచించుట) లేదు. ఇక నిరంతర పరమాత్మ విచారణనుగూర్చి వేఱుగా చెప్పవలయునా? 


1-103


ఆదాతుమిచ్ఛన్పదముత్తమానాం 

స్వచేతపైవాపహతోఽ ద్య లోకః 

పతత్యశఙ్కం పశురద్రికూటా 

దానీలవల్లీ ఫలవాంఛయైవ.


ఉత్తమ భోగములను, రాజ్యధనాదులను సంపాదింప దలంచి వానికొరకై ప్రయత్నించుచు జనులు రాగలోభాది దూషితమగు తమ చిత్తము చేతనే కొట్టబడినవారై (భిన్నులై) పచ్చని తీగయొక్క ఫలమును గూర్చిన కోర్కెచే పర్వతశిఖరమందలి విషమస్థానము నుండి పశువు క్రిందికి పడిపోవునట్లు నిస్సందేహముగ పతనము నొందుచున్నారు.


1-104


యచ్చేదం దృశ్యతే కించిజ్జగత్థ్సావరజంగమమ్‌ 

తత్పర్వ మస్థిరం బ్రహ్మన్స్వప్న సంగమసంవిభమ్‌.


మహాత్మా! ఈ కానివించు స్థావర, జంగమాత్మకమగు (చరాచర) ప్రపంచమంతయు స్వప్నమందలి జనుల కలయికవలె అస్థిరమైనది. 


1-105


యదఙ్గమద్య సంవీతం కౌశేయస్రగ్విగ్విలేపనైః 

దిగంబరం తదేవ శ్వో దూరే విశరతాఽ వటే. 


ఏ శరీరము నేడు పట్టువస్త్రముల చేతను, పుష్పముల చేతను, అనేక సుగంధద్రవ్య లేపనములచేతను జుట్టబడియున్నదో, ఆ శరీరమే రేపు దిగంబరముగ నున్నదై, దూరముగ నున్న ఒకానొక గోతియందు క్రుళ్ళి నశించుచున్నది. 


1-106

యత్రాద్య నగరం దృష్టం విచిత్రాచారచంచలమ్‌ 

తత్రైవోదేతి దివసైః సంశూన్యారణ్యధర్మతా. 


ఎచట నేడు అనేక విచిత్రములగు ఆచారములచేతను, క్రియల చేతను చంచల 

మైనట్టి నగరము గాంచబడినదో, అచటనే కాలక్రమమున శూన్యమగు అరణ్యము ఉదయించుచున్నది. *యోగవాసిష్ఠ రత్నాకరము* 


వైరాగ్య ప్రకరణము

ఒకటవ అధ్యాయము 

రాఘవ వైరాగ్య వర్ణనము


1-107


యం పుమానద్య తేజస్వీ మండలాన్యధితిష్ఠతి 

స భస్మకూటతాం రాజన్దివసై రధిగచ్చతి. 


ఎవడు నేడు గొప్ప తేజస్వియై చక్రవర్తియై రాజ్యమేలు చున్నాడో, ఆతడే కొలది దినములకు బూడిదకుప్ప అగుచున్నాడు. 


1-108


అరణ్యానీ మహాభీమా యా నభోమండలోపమా పతాకాచ్ఛాదితాకాశా సైవ సంపద్యతే పురీ. 


ఎచట ఆకాశసదృశమగు విశాలమైన, మహా భయంకరమైన అరణ్యము నేడు వర్తించుచున్నదో, అచటనే కొలది కాలములో అనేక పతాకములచే ఆకసమును గప్పునట్టి నగరము ఉద్భవించుచున్నది.


1-109


సలిలం స్థలతాం యాతి స్థలీభవతి వారిభూః విపర్యస్యతి పర్వం హి సకాష్ఠాంబుతృణం జగత్‌. 


జలమయస్థానము స్థలమయ మగుచున్నది. స్థలమయముగ నున్నది జలమయ మగుచున్నది. ఈ ప్రకారముగ కాష్ఠ, జల, తృణసహితమగు ఈ జగత్తంతయు విపరీతభావమును బొందుచున్నది.


1-110


అనిత్యం యౌవనం బాల్యం శరీరం ద్రవ్యసంచయాః భావాద్భావాన్తరం యాన్తి తరఙ్గవదనారతమ్‌.


బాల్యము అనిత్యము, యౌవనము అనిత్యము, శరీరము అనిత్యము, పదార్థములన్నియు అనిత్యములే. ఏలయనిన, సమస్త పదార్థములును, తరంగములవలె నిరంతరము తమ పూర్వ స్వభావమును, రూపమును వదలి మఱియొక స్వభావమును బొందుచున్నవి. 


1-111


వాతాన్తర్దీపక శిఖాలోలం జగతి జీవితమ్‌ తడిత్స్ఫురణసంకాశా పదార్థ శ్రీర్జగత్త్రయే.


ఈ ప్రపంచమున జీవితము గాలి మధ్యనుంచబడిన చిన్నదీపము యొక్క కొనవలె చంచలమైనది, ముల్లోకములందలి పదార్థములు మెఱుపుయొక్క వెలుగువలె క్షణభంగురమైనవి. 


1-112


దివసాస్తే మహాన్తస్తే సంపదస్తాః క్రియాశ్చ తాః 

సర్వం స్మృతిపథం యాతం యామో వయమపి క్షణాత్‌.  


ఆ వైభవముతో గూడిన దినములు, ఆ సంపదలు, ఆ క్రియలు అన్నియు గడచిపోయి ఇపుడు స్మరణమాత్రము లాయెను. ఇక మనము గూడ క్షణములో వెడలుచున్నాము.

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


వైరాగ్య ప్రకరణము

ఒకటవ అధ్యాయము 

రాఘవ వైరాగ్య వర్ణనము


1-119


ఘటస్య పటతా దృష్టా పటస్యాసి ఘటస్థితిః 

న తదస్తి న యద్దృష్టం విపర్యస్యతి సంసృతౌ. 


కుండ పగిలి మట్టి కాగా, అది ప్రత్తిచేనులో వేయబడి క్రమముగ ప్రత్తిగాను, దారముగాను, వస్త్రముగాను పరిణతి జెందుట గాంచబడుచున్నది. ఈ ప్రకారముగ కుండ వస్త్ర మగుచున్నది. అట్లే వస్త్ర మున్ను కుండగా మారుచున్నది; వెయ్యేల ఈ ప్రపంచమున పరిణామము నొందని వస్తువే లేదు. 


1-120


తనోత్యుత్పాదయత్యత్తి నిహంత్యాసృజతి క్రమాత్‌ 

సతతం రాత్ర్యహనీవ నివర్తన్తే నరం ప్రతి.


వృద్ధి, విపరిణామ అపక్షయ, వినాశ, పునర్జన్మములను ఈ ఐదు వికారములున్ను క్రమముగ రాత్రింబగళ్ళవలె మనుజుని వద్దకు నిరంతరము వచ్చుచు పోవుచున్నవి.


1-121


బాల్యమల్పదినైరేవ యౌవనశ్రీస్తతో జరా 

దేహేఽప పి నైకరూపత్వం కాస్థా బాహ్యేషు వస్తుషు.


కొలది దినములలో బాల్యము గడచిపోవుచున్నది; ఆ పిదప యౌవనము, ఆ పిమ్మట వార్ధక్యము ఏతెంచి గడచిపోవుచున్నవి. ఈ ప్రకారముగ దేహమందే ఏకరూపత్వము లేకయుండ, ఇక బాహ్య వస్తువులందు ఏకరూపత్వ, స్థిరత్వములగూర్చి విశ్వాసమేమి?!


1-122


సమవిషమవిపాకతో విభిన్నా 

స్త్రిభువనభూతపరంపరాఫలౌఘాః

సమయపవనపాతితాః పతన్తి

ప్రతిదినమాతతసంసృతిద్రుమేభ్యః


కర్మలయొక్క సమ, విషమ పరిపాకముచే విభిన్నరూపులగు ముల్లోకము లందలి ప్రాణికోట్ల యొక్క శరీరములను ఫలసమూహములు, సంసారమను విశాలవృక్షముల నుండి కాలమను వాయువుచే పడగొట్టబడి ప్రతిదినము క్రిందకు పడిపోవుచున్నవి.(కావున నిట్టి సంసారమందు విశ్వాసము గలిగియుండరాదని భావము.) 


1-123


ఇతి మే దోషదావాగ్నిదగ్ధే మహతి చేతసి 

ప్రస్ఫురన్తి న భోగాశా మృగతృష్ణాః సరఃస్వివ. 


ఈ ప్రకారముగ విషయములందలి దోషదర్శనమను దావాగ్నిచే సంసారము నెడల విశ్వాసమగు బీజము దగ్ధము కాగా వివేక యుక్తమగు నా చిత్తమున సరోవరములందు మృగతృష్ణ స్ఫురింపనట్టు భోగాశ స్ఫురింపకున్నది. 


1-124


రాజ్యేభ్యో భోగపూగేభ్యశ్చిన్తావద్భ్యో మునీశ్వర నిరస్తచిన్తాకలితా వరమేకాన్తశీలతా.  


ఓ మునీశ్వరా! చింతాగ్రస్తములగు రాజ్యములకంటెను, భోగసమూహముల కంటెను, చింతారహితమగు ఏకాంతవాసమే ఉత్తమము.

[10/06, 9:36 pm] K Sudhakar Adv Br: *యోగవాసిష్ఠ రత్నాకరము* 


వైరాగ్య ప్రకరణము

ఒకటవ అధ్యాయము 

రాఘవ వైరాగ్య వర్ణనము


1-113


తిర్యక్త్వం పురుషా యాన్తి తిర్యఞ్చో నరతామపి 

దేవాశ్చాదేవతాం యాన్తి కీమివేహ విభో స్థిరమ్‌. 


మహాత్మా! మనుజులు పశుపక్ష్యాది జన్మల నొందుచున్నారు; పశుపక్ష్యాదులు మనుష్యజన్మ నొందుచున్నవి; దేవతలు దేవతా జన్మను వీడి మఱియొక్క జన్మను బొందుచున్నారు; ఇక ఈ ప్రపంచమున స్థిరమైన వస్తువేది? 


1-114


ద్యౌః క్షమావాయురాకాశం పర్వతాః సరితో దిశః 

వినాశవాడవస్యైతత్సర్వం సంశుష్కమింధనమ్‌, 


స్వర్గాది లోకములు, భూమి, వాయువు, ఆకాశము, పర్వతములు, నదులు, దిక్కులు - ఇవి యన్నియు వినాశమను అగ్నికి బాగుగ ఎండినట్టి కట్టెలై పరగుచున్నవి. 


1-115


ధనాని బాన్ధవా భృత్యా మిత్రాణి విభవాశ్చ యే 

వినాశభయభీతస్య సర్వం నీరసతాం గతమ్‌. 


అనేక విధములగు ధనములు, బంధువులు, సేవకులు, మిత్రులు వైభవములు - ఇవి యన్నియు వినాశచింతచే భయభీతుడగు మనుజునకు నీరసములుగా తోచును.


1-116


స్వదన్తే తావదేవైతే భావా జగతి ధీమతే యానత్స్మృతిపథం యాతి న వినాశకురాక్షసః. 


వినాశమను దుష్టరాక్షసుడు జ్ఞాపకము రానంతవఱకే బుద్ధిమంతునకు ప్రపంచమున ఈ ధనాది పదార్థము లన్నియును రుచించును. 


1-117


ఆపదః క్షణమాయాన్తి క్షణమాయాన్తి సంపదః 

క్షణం జన్మ క్షణం మృత్యుర్మునే కిమివ న క్షణమ్‌.


మునీశ్వరా! క్షణములో ఆపదలు అరుదెంచును, మఱల క్షణములో సంపదలు వచ్చును. క్షణములో జన్మ, క్షణములో మృత్యువు, ఇక క్షణికము కానిదెయ్యది? 


1-118


ప్రాగాసీదన్య ఏవేహ జాత స్త్వన్యో నరో దినైః 

సదైకరూపం భగవన్కించిదస్తి న సుస్థిరమ్‌.


మహాత్మా! పూర్వమున్న మనుజుడే కొలది దినములలో ఇపుడు మఱి యొకడైనాడు. (అన్యరూపమును బొందినాడు)! ఈ ప్రపంచమున సదా ఏకరూపము గల్గినట్టియు, సుస్థిర మైనట్టియు పదార్థ మేదియును లేదు.

జప మాలలు

 జప మాలలు  -  ఫలితాలు.


 * స్వచ్చమైన స్పటిక మాలతో జపం చెస్తే రాజ్యాధికారం, లభించును. సర్వ భోగములు సిద్ధించును. గుణవంతులైన సంతానం లబించును.

 

 * ముత్యాల మాలతో జపం చేస్తే సర్వ శాస్రములు, సర్వ విద్యలు నాలుక పై తాండవ మాడును.

 

 * పగడ మాలతో జపం చేసిన లోకం లొని సమస్త మానవులు, జంతువులు, పశువులు, క్రూర జంతువులు ను వశీకరణం చేసుకొవచ్చు .

 

 * ఇంద్ర నీల మణుల మాలతో గాని , మరకత మణుల మాలతో కాని జపం చేయడం వలన శత్రు భయంకరులు అవుతారు.

 

 * బంగారు మాలతో జపం చేయడం వలన అష్టైశ్వర్యములు పొందుదురు.

 

 * మాణిక్య మాలతో జపం చేసిన వారు తాను కొరిన కన్యను పొందుదురు.

 

 * పాదరస గులికలతో  కూర్చబడిన మాలతో జపం చేసిన సమస్త ప్రయోజనములు పొందగలుగు శక్తి వంతులగురు .


  

   మరిన్ని అతి సులభ యోగాల కొరకు నా గ్రంథాలను చదవగలరు.


     గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            

సీతారాములకళ్యాణము* (3/4)

 *సీతారాములకళ్యాణము* (3/4)


పుల్లెల శ్రీరామచంద్రుడు వారి వచన రామాయణము బాలకాండము నుండి….


*కుశధ్వజునకు కబురు*

ప్రాతఃకాలమున మహర్షులు కర్తవ్యకర్మ లన్నియు చేయించిన పిమ్మట వాక్యకుశలుడైన జనకుడు పురోహితుడైన శతానందునితో, “మహాతేజశ్చాలి, అతిధార్మికుడు అయిన నా తమ్ముడు కుశధ్వజుడు, ఇక్షుమతీనదీతీరమున నీటిలో పాత ఇనుప శూలములు సరిహద్దుగా గలది, పరిశుద్ధమైనది, పుష్పక విమానమువంటిది అయిన శుభమైన సాంకాశ్యనగరములో నివసించుచున్నాడు. 


అతడు సంభారములను సమకూర్చుట మొదలగు పనుల ద్వారా నాకు యజ్ఞసంరక్షణ చేసినవాడు. అతనిని చూడవలెనని అనుకొనుచున్నాను. ఆ మహాతేజస్వికూడ నాతో ఈ ఆనందమును అనుభవించవలెను. ” అని పలికెను. 

జనకుడు శతానందునితో ఇట్లు చెప్పగా అచటికి శతానందుడు పిలువనంపగా వచ్చిన కొందరు ఉత్సాహవంతు లగు దూతలను జనకు డాజ్ఞుపించెను. ఆ దూతలు జనకుని ఆజ్ఞ ప్రకారము కుశధ్వజుని తీసికొనివచ్చుటకై వేగముగా పరుగెత్తు అశ్వములను అధిరోహించి వెళ్లిరి. 

వారు సాంకాశ్యమునకు వెళ్లి కుశధ్వజుని చూచి, జరిగిన విషయము నంతను తెలిపి జనకుని అభిప్రాయమును నివేదించిరి. కుశధ్వజుడు, ఆ దూతలు చెప్పిన వృత్తాంతమును విని జనకుని ఆజ్ఞ ననుసరించి మిథిలానగరమునకు వచ్చెను. 


* దశరథుని వంశ పూర్వపురుషుల పరిచయము*

ఆ కుశధ్వజుడు, ధర్మనిరతుడును, మహాత్ముడును అగు జనకుని చూచెను. శతానందునకును, ధార్మికుదైన జనకునకును అభివాదనము చేసి, రాజోచితమగు శ్రేష్టమైన ఆసనమును అధిష్టించెను. 

మహాతేజఃశాలులును, వీరులును అగు ఆ సోదరు లిరువురును కూర్చుండి మంత్రులలో శ్రేష్టుడైన సుదామనుని, “మహామంత్రీ! అమితమైన తేజస్సు కల దశరథుని వద్దకు వెళ్లి, పుత్రమంత్రిసమేతముగ అతనిని తీసికొనిరమ్ము.” అని చెప్పి దశరథుని వద్దకు పంపిరి.

ఆతడు విడిదికి వెళ్ళి, అచట రఘువంశవర్ధనుడైన దశరథుని చూచి, తలవంచి నమస్కరించి, “దశరథమహారాజా! మిథిలాధిపతియైన జనకమహారాజు, ఉపాధ్యాయ పురోహితసమేతుడవైన నిన్ను చూడవలెనని అనుకొనుచున్నాడు.” అని చెప్పెను. 

దశరథమహారాజు ఆ మంత్రి మాటలు విని, ఋషులతోను, బంధువులతోను కలిసి జనకుడున్న చోటికి వెళ్లెను. బంధువులతోడను, ఉపాధ్యాయులతోడను కూడినవాడు, మాటలలో నేర్పరి అయిన దశరథుడు జనకునితో,

“మహారాజా! పూజ్యుడైన వసిష్టమహర్షి మా వంశమువారి కందరికిని దేవత అనియు, అన్ని పనులందును మా పక్షమున మాటలాడువా దనియు నీకు తెలియునుగదా? విశ్వామిత్రుని అనుజ్జను, సకలమహర్షుల అనుజ్జ్ఞను పొంది ధర్మాత్ముడైన వసిష్టుడు నా వంశములోని పూర్వపురుషులను గూర్చి యథాక్రమముగా చెప్పగలడు.” అని పలికెను.

అపుడు మాటలలో నేర్చరియగు పూజ్యుడైన వసిష్టమహర్షి పురోహితులతో గూడిన జనకమహారాజుతో ఇట్లనెను.

“అవ్యక్తమునుండి పుట్టినవాడును, ఎల్లప్పుడు ఉండువాడును, నిత్యుడును, వినాశరహితుడును అగు బ్రహ్మదేవునినుండి మరీచియు, మరీచినుండి కాశ్యపు దడనెడు కుమారుడును పుట్టెను. కాశ్యపునకు సూర్యుడు జనించెను. సూర్యుని కుమారుడు మనువు. పూర్వము ప్రజాపతిగ ఉన్న మనువునకు ఇక్ష్వాకువు జనించెను.

ఆ ఇక్షాకువు అయోధ్యలో మొదటి రాజుగా ఉండెను. శ్రీమంతుదగు కుక్షి ఇక్ష్వాకుని పుత్రుడు. పిమ్మట కుక్షికి వికుక్షి అను నతడు కుమారుడుగా పుట్టెను.


వికుక్షి కుమారుడు, మహాలేజఃశాలియు, ప్రతాపవంతుడును అగు బాణుడు. మహాతేజస్వి, ప్రతాపవంతుడు అయిన అనరణ్యుడు బాణుని కుమారుడు. అనరణ్యునకు పృథువు, పృథువునకు త్రిశంకువు కుమారులుగా జన్మించిరి. 

త్రిశంకువునకు దుందుమారుడను గొప్ప కీర్తిగల కుమారుడు పుట్టెను. ఆతనికి యువనాశ్వు దని కూడ పేరు. మాంధాత చక్రవర్తి యువనాశ్వుని కుమారుడు. మాంధాతకు సుసంధియను శ్రీమంతుడగు కుమారుడు జనించెను. ఆతనికి ఢ్రువసంధి, ప్రసేనజిత్‌ అను ఇరువురు కుమారులు జనించిరి. ధ్రువసంధికి కీర్తిమంతుడగు భరతు డను కుమారుడు పుట్టెను. భరతునకు గొప్ప తేజస్సుగల అసితు దను కుమారుడు పుట్టెను. 

హైహయ - తాలజంఘ - శశిబిందు వంశములకు చెందిన రాజులు ఈ అసితునకు శత్రువులైరి. ఆ అసితమహారాజు శత్రువులతో యుద్ధము చేసి, పరాజితుడై రాజ్యభ్రష్టు డయ్యెను. అల్బమైన సైన్యముతోడను, మంత్రులతోడను కలిసి హిమవత్పర్వతమునకు వెళ్లి అచట భృగుప్రస్రవణ మను ప్రదేశమున నివసించెను. 


ఆ సమయమున అతని భార్యలలో ఇద్దరు గర్భవతులై యుండిరి. వారిలో ఒకతె సవతి గర్భము నష్టమగుటకై ఆమెకు విషముతో కూడిన ఆహార మిచ్చినదట. ఆ దివసములలో రమ్యమైన పర్వతశ్రేష్టమునందు అభిరుచి గల భృగువంశ సంజాతుడగు చ్యవనుడు హిమవత్పర్వతమునకు వచ్చెను.

రాజభార్యలలో గొప్ప భాగ్యము కలదియు, పద్మపత్రాక్షియు అగు ఒకతె తనకు కుమారుడు కావలెనని కోరుచు, దేవతలవంటి కాంతిగల ఆ చ్యవనునికి నమస్కరించెను. ఆ సవతికిి విషము పెట్టిన కాళింది కూడ ఆ మునివద్దకు వెళ్లి నమస్కరించెను. చ్యవనుడు పుత్రాభిలాషిణి యగు రాజభార్యతో,

“మహాభాగ్యవంతురాలా! మహాబలుడు, మహావీర్యుడు, మహాతేజస్వియు అగు సుపుత్రుడు నీ గర్భములో ఉన్నాడు. ఐశ్వర్యవంతుడైన ఆ కుమారుడు కొలది కాలములో విషముతో కూడ పుట్టగలడు; దుఃఖింపకుము.” అని పలికెను. 


రాజపుత్రియు, పతివ్రతయు, భర్తమరణముచే దుఃఖితురాలును అగు ఆ రాజమహిషి ఈవిధముగ చ్యవనుని అనుగ్రహముచే పుత్రుని కనెను. గర్భమును నశింపచేయవలెనను అభిప్రాయముతో సవతి ఆమెకు ఇచ్చిన గరళముతో పాటు పుట్టుటచే ఆ పుత్రుడు “సగరుడు” అయ్యెను. 


సగరుని కుమారుడు అసమంజుడు, ఆతని కుమారుడు అంశుమంతుడు. అంశుమంతుని పుత్రుడు దిలీపుడు. అతని కుమారుడు భగీరథుడు. భగీరథునకు కకుళ్హుడును, ఆతనికి రఘువును పుట్టిరి. తేజశ్శాలియగు ప్రవృద్ధుడు రఘువుయొక్క కుమారుడు. ఆతడు వసిష్టుని శాపముచే పురుషాదకుడు (మనుష్యమాంసము తినువాడు) అయ్యెను. అతడు వసిష్టునకు ప్రతిశాప మిచ్చుటకై జలము గ్రహించెను. అపుడు ఆతని భార్య నివారించుటచే ఆ శాపోదకమును తన పాదములపైననే విడచుటచే కల్మాషపాదుడు (కల్మషముతో కూడిన పాదములు కలవాడు) అయ్యెను. 

అతనికి శంఖణుడు పుట్టెను. శంఖణుని కుమారుడు సుదర్శనుడు. సుదర్శనుని కుమారుడు అగ్నివర్దుడు. ఆతని కుమారుడు శీఘ్రగుడు. ఆతని కుమారుడు మరువు. ఆతని కుమారుడు ప్రశుశ్రుకుడు. ప్రశుశ్రుకుని కుమారుడు అంబరీషుడు. 

అంబరీషుని పుత్రుడు నహుషమహారాజు. నహుషునకు యయాతి యను పుత్రుడు జనించెను. ఆతని కుమారుడు నాభాగుడు. 

నాభాగునకు అజుడను కుమారుడు కలిగెను, అజుని కుమారుడు దశరథుడు. ఈ దశరథుని కుమారులే ఈ రామలక్ష్మణులు. 


నరశ్రేష్టుడవైన జనకమహారాజా! ఆదినుండియు పరిశుద్ధమైన వంశము కలవారు, పరమధార్శికులు, వీరులు, సత్యవాదులు అయిన ఇక్ష్వాకుల వంశములో జన్మించిన ఈ రామలక్ష్మణులకొరకై నీ కుమార్తెలను వరించుచున్నారు. ఈ రామలక్ష్మణులు నీ కుమార్తెలకు తగిన వరులు. వీరికి తగిన వధువులైన నీ కుమార్తెలను ఇచ్చి వివాహము చేయుము.” అని ఊరకుండెను.


* జనకుని వంశ పూర్వపురుషుల పరిచయము*

ఈవిధముగ దశరథుని వంశమును వర్ణించి చెప్పిన వసిష్టునితో జనకుడు, చేతులు జోడించి ఇట్లు పలికెను.

“మహామునీ! నీకు మంగళమగుగాక! నా వంశమును గూర్చి చెప్పుచున్నాను. వినుము. సత్కులములో పుట్టినవారు కన్యాదానసమయమున తమ వంశమును గూర్చి పూర్తిగా చెప్పవలెను. అందుచే నేను నా వంశమును గూర్చి చెప్పుచున్నాను. వినుము.

మూడు లోకములందును ప్రసిద్దుడును, పరమధర్శ్మాత్ముడును, బలము కలవా రందరిలోను శ్రేష్టుడును అగు నిమి అను చక్రవర్తి ఉండెను. మిథిలను నిర్మించిన మిథి ఆ నిమిచక్రవర్తి కుమారుడు. ఇతదే మొట్టమొదటి జనకుడు. ఆతని కుమారుడు ఉదావసువు. ఉదావసువుకు నందివర్ధనుడను కుమారుడు కలిగెను. ఆతని కుమారుడు సుకేతువు.

సుకేతువునకు ధర్మాత్ముడును, మహాబలుడును అగు దేవరాతుడు పుట్టెను, రాజర్నియైన దేవరాతునకు బృహద్రథు డను పుత్రుడు జనించెను. బృహద్రథునకు శూరుడును ప్రతాపవంతుడును అగు మహావీరుడు పుట్టెను. మహావీరునకు ధైర్యవంతుడు, సత్యమైన పరాక్రమము కలవాడు అయిన సుధృతి జన్మించెను. 

ధర్మబుద్ధి కలవాడును, ధర్మాచరణశీలుడును అగు దృష్టకేతువు సుధృతికి కుమారుడుగ జన్మించెను. రాజర్నియెన దృష్టకేతువునకు హర్యశ్వుదడని ప్రసిద్ధుడైన పుత్రుడు జనించెను. హర్యశ్వునకు మరుడు అను పుత్రుడు జనించెను. మరుని పుత్రుడు ప్రతింధకుడు. ధర్మాత్ముడైన కీర్తిరథమహారాజు ప్రతింధకుని కుమారుడు. కీర్తిరథునికి దేవమీధుడు, దేవమీఢునకు విబుధుడు, ఆతనికి మహీధ్రకుడును పుట్టెను. మహీధ్రకునకు మహాబలుడైన కీర్తిరాతు డను కుమారుడు జనించెను. రాజర్నియెన కీర్తిరాతునకు మహారోముడు పుట్టెను. మహారోమునకు ధర్మాత్ముడైన స్వర్హరోముడు పుట్టెను. 


రాజర్షియైన స్వర్ణరోమునకు హ్రస్వరోముడు పుట్టెను. ధర్మము నెరిగిన ఆ మహాత్మునకు ఇద్దరు పుత్రులు జనించిరి. నేను పెద్దవాడను. వీరుడైన కుశధ్వజుడు నా తమ్ముడు.


మా తండ్రియైన హ్రస్వరోమమహారాజు జ్యేష్టుడ నైన నన్ను రాజ్యాభిషిక్తుని చేసి, కుశధ్వజుని పోషణభారమును నాపై ఉంచి వనమునకు పోయెను. వృద్దుదైన తండ్రి స్వర్గస్థుడైన పిమ్మట, దేవసదృ్భశుడైన నా తమ్ముడు కుశధ్వజుని స్నేహముతో చూచుకొనుచు, ధర్మానుసారముగా రాజ్యభారము వపించితిని. 

కొంతకొలమునకు, పరాక్రమవంతుడగు సుధన్వుడను రాజు

సాంకాశ్యపురమునుండి మిథిలపైకి దందెత్తివచ్చెను. 'శ్రేష్టమగు శివధనుస్సును, పద్మపత్రాక్షియగు సీతను నా కిమ్ము.! అని ఆతడు నాకు వార్త పంపెను. 


సీతను, శివధనుస్సును ఇవ్వకపోవుటచే ఆతనికిని నాకును యుద్ధము జరుగగా, రణరంగమున నేనాతనిని వధించితిని. ఆ సుధన్వుని సంహరించి, నా సోదరుడైన ఈ కుశధ్వజుని సాంకాశ్యపురమున రాజ్యాభిషిక్తుని చేసితిని.


*సీత ఊర్మిళలను ఇచ్చెదనని ప్రమాణము*

సోదరులలో నేను పెద్దవాడను. ఇతడు చిన్నవాడు. నా కన్యలిద్దరిని దశరథనందనులకు ఆనందపూర్వకముగ ఇచ్చెదను. సీతను రామునకును, ఊర్మిళను లక్ష్మణునకును ఇచ్చెదను. వీర్యశుల్కయు, దేవకన్యతో సమానురాలును అగు నా పుత్రికయైన సీతను, రెండవ కుమార్తెయైన ఊర్మిళను ఇచ్చెదనని మూడు పర్యాయములు నొక్కి వక్కాణించుచున్నాను. ఈ విషయమున సందేహము లేదు. 


దశరథమహారాజా! ఈ కన్యలను ఆనందపూర్వకముగా ఇచ్చుచున్నాను. రామలక్ష్మణులకు గోదానమును (సమావర్తనవతమును) చేయించుము, నాందీశ్రాద్ధము చేసిన పిమ్మట వివాహము జరిపించుము. 

ఈ దివసమున మఘానక్షత్రము కదా. నేటికి మూడవరోజున, ఉత్తరఫల్లునీ నక్షత్రమునందు వివాహము చేయుము. ముందుగా రామలక్ష్మణుల భావిసుఖ హేతువు అగు గోహిరణ్యభూమ్యాదిదానము కూడ చేయింపవలెను.

సీతారాములకళ్యాణము

 *సీతారాములకళ్యాణము* (4/4)


పుల్లెల శ్రీరామచంద్రుడు వారి వచన రామాయణము బాలకాండము నుండి….


* మాండవీ శ్రుతకీర్తులను భరతశత్రుఘ్నులకు ఇవ్వగోరుట*


విదేహాధివతియగు జనకమహారాజు పలికిన మాటలు విని వసిష్టవిశ్వామిత్రులు ఆతనితో ఇట్లు పలికిరి. 

“జనకమహారాజా! ఇక్షాకువిదేహవంశములు ఊహింపరాని, ఇంత అని చెప్పుటకు శక్యముకాని ప్రభావము కలవి. అట్టి వంశీయులతో సమాను లెవ్వరును లేరు. సీతాఊర్మిళలను రామలక్ష్మణులకిచ్చి వివాహము చేయుట అనునది పరస్పర వంశగొరవాదులకును, (వధూవరుల) రూపసంపదకును తగిన సంబంధము. 

మేము చెప్పదలచిన మాటలను వినుము. 

నీ తమ్ముడైన ఈ కుశధ్వజుడు ధర్మము నెరిగినవాడు. భూలోకమునందు సాటిలేని రూపము గలవాడగు ఈ ధర్మాత్ముని ఇరువురు పుత్రికలను భరతశత్రుఘ్నులకు భార్యలనుగా వరించమనుచున్నాము. 

భరతకుమారుని కొరకును, ధీమంతుడైన శత్రుఘ్నుని కొరకును నీ తమ్ముని కుమార్తెలను కోరుచున్నాము. 

ఈ దశరథకుమారు లందరును రూపయౌవనములతో ప్రకాశించుచున్నవారు. లోకపాలులతో సమానులు. దేవతలవంటి పరాక్రమము గలవారు. పుణ్యకర్మలుగల నీవంశమునకును, ఇక్షాకువంశమునకును ఈ వివాహసంబింధముచే దృఢమైన బంధము ఏర్పడుగాక!”

వసిష్టుని అనుమతి ననుసరించి విశ్వామిత్రుడు పలికిన ఈ మాటలు విని, జనకమహారాజు అంజలి ఘటించి, ఆ వసిష్టవిశ్వామిత్రులతో ఇట్లనెను. 


“మునిశ్రేష్టులైన మీరు మాకు తగిన కులసంబంధమును గూర్చి స్వయముగ ఆజ్ఞాపించుచున్నారు. అందుచే మా వంశము ధన్యమైనది. మీరు చెప్పినట్లే అగుగాక! ఈ కుశధ్వజుని కుమార్తెలగు మాండవీ శ్రుతకీర్తులు, కలిసి సంచరించెడు ఈ భరతశత్రుఘ్నులకు(వరుసగ) భార్యలై వారిని సేవింతురుగాక!

మహామునీ! మహాబలశాలులగు నలుగురు రాజపుత్రులును ఒకే దివసమున నలుగురు రాజపుత్రికలను వివాహమాడుదురుగాక! సంతానదాతయగు భగుడు దేవతగా గల ఉత్తరనక్ష్మత్రముతో కూడిన దివసమున వివాహకృత్యము శ్రేష్టమని బుద్ధిమంతులు చెప్పుదురుకదా?”


జనకమహారాజు ఈవిధముగ సౌమ్యమగు వాక్యము పలికి, లేచి, దోసిలి కట్టి, ఆ మహామును లిరువురితో మరల ఇట్లనెను. 

“మీరు నాకు గొప్ప ధర్మకార్యమును నెరవేర్చినారు. నేను ఎల్లప్పుడును మీ శిష్యుడనే. మునిపుంగవులైన మీ రిరువురును ఈ మూడు సింహాసనములను (జనక -దశరథ -కుశధ్వజుల సింహాసనములను,) అధిష్టింతురుగాక! దశరథునకు మిథిలపై అధికారమున్నట్లే నాకును అయోధ్యపై అధికారమున్నది. అందుచేతనే దశరథుని రాజ్యముపై కూడ మీకు అధికారము నిచ్చుచున్నాను. ప్రభుత్వ విషయమున సందేహములేదు. తగు విధముగ కార్యము నిర్వహింపుడు.”


దశరథమవోరాజు జనకుని మాటలకు సంతసించి ఆతనితో, “మిథిలాధిపతులైన మీ సోదరు లిరువురును ఇన్ని అని చెప్పలేని సద్గుణములు గలవారు. మీ రెందరో బుషులను, రాజులను పూజించి వారినుండి సద్దుణములను అలవరచుకొనినారు. మీకు మేలగుగాక! నేను నా నివాసమునకు వెళ్ళి నాందీముఖశ్రాద్ధాదికర్మలు చేసెదను.” అని పలికెను.


*వివాహ మహోత్సవము*


_స్నాతకము_

మహాయశఃశాలియగు దశరథమహారాజు అపుడు, జనకునివద్ద సెలవు గైకొని వసిష్టవిశ్వామిత్రులతో నిజనివాసమునకు వెళ్లెను. అతడు తన నివాసగృహము చేరి యథాశాస్త్రముగ శ్రాద్ధము చేసి, మరునాడు ప్రాతఃకాలముననే లేచి అపుడు చేయవలసిన స్నాతకవ్రతమును జరిపించెను. ఒక్కొక్కకుమారు నుద్దేశించి ఒక్కొక్క లక్షచొప్పున గోవులను బ్రాహ్మణులకు దానము చేసెను. 


_గోదానవ్రతము_

పురుష శ్రేష్టుడు, పుత్రులయందు అత్యధిక ప్రేమ కలవాడును అగు దశరథమహారాజు లేగదూడలతో కూడినవి, క్షీరసమృద్ధములు అయిన నాలుగు లక్షల గోవులను కొమ్ములకు బంగారు తొడుగులు వేయించి, (పాలు పితుకుటకు) కంచుపాత్రలతో కూడ దానము చేసెను. ఇంకను అత్యధికమైన ఇతర ద్రవ్యమును, పుత్రుల గోదానవ్రతసమయమున బ్రాహ్మణులకు దానము చేసెను.

గోదానవ్రతము పూర్తిచేసికొనిన కుమారులు చుట్టును నిలచియుండగా ఆ దశరథమవోరాజు లోకపాలుల మధ్య నున్న బ్రహ్మవలె ప్రకాశించెను. 


_యుధాజిత్తు_

దశరథమహారాజు కుమారులకు గోదానవ్రతము జరిపించిన దివసముననే భరతుని మేనమామ యగు యుధాజిత్తు మిథిలకు వచ్చెను. కేకయరాజకుమారుడును, భరతుని మేనమామయు అగు ఆ యుధాజిత్తు రాజును చూచి, కుశలప్రశ్న మడిగి ఇట్లు చెప్పెను.

“మహారాజా! కేకయదేశప్రభు వైన మా తండ్రి స్నేహపూర్వకముగ నిన్ను కుశలప్రశ్న చేసినాడు. నీవు ఎవరి కుశలమును కోరుచుందువో వారందరును ఇపుడు ఆరోగ్యముగ నున్నారు. 

మా తండ్రి మా మేనల్లుని చూడవలెనని కోరుటచే అందుకొరకై నేను అయోధ్యానగరమునకు వెళ్లి యుంటిని. నీ కుమారులు వివాహముకొరకై నీతో కలిసి మిథిలకు వెళ్లినారని అయోధ్యలో తెలిసినది. వెంటనే నేను నా సోదరిపుత్రుని చూచుటకై శీఘ్రముగా ఇచటికి వచ్చినాను.”


దశరథుడు పూజార్హుడైన ఆ ప్రియాతిథిని చూచి ఆతనిని అధికసత్కారములతో పూజించెను. 

కర్మవేత్త యైన దశరథుడు మహాత్ములైన పుత్రులతో ఆ రాత్రి గడపి, ప్రాతః కాలమున లేచి, కర్మ లాచరించి, బుషులను ముందిడుకొని యజ్ఞవాటికను చేరెను.

సర్వాలంకారములచే అలంకృతులైన సోదరులతో కూడిన రాముడు విజయ మనెడు యుక్తమైన ముహూర్తమునందు తోరము, బాసికము కట్టుట మొదలగు వివాహమంగళములు జరుపుకొని, వసివ్టాదిమహర్షులను ముందిడుకొని, సోదరసహితుడై తండ్రివద్దకు చేరెను.


వసిష్ట మహాముని జనకుని వద్దకు వెళ్లి “జనకమహారాజా! దశరథమహారాజు కుమారుల కౌతుకమంగళము పూర్తిచేసి కన్యాదాతవైన నీకొరకు ఎదురు చూచుచున్నాడు. ఇట్టి పనులు దాత, ప్రతిగ్రహీత ఇరువురు కలిసినప్పుడే జరుగును. ఉత్తమమైన వివాహమును చేసి స్వధర్మము నాచరించుము.” అని చెప్పెను.


-కన్యాదానము_

పరమౌదార్యవంతుడు, మహాజేజఃశాలి, పరమధర్శవేత్త అయిన జనకుడు వసిష్టుని మాటలు విని, “వసిష్టమునీంద్రా! దశరథుడు లోనికి ఎందుకు రాలేదు? ద్వారమువద్ద ఎవరైనా అడ్డగించినారా? దశరథ మహారాజును అడ్డగించగల ద్వారపాలకుడు ఎవడైనా ఉన్నాడా? లోనికి ఏల రాలేదు? ఎవరి ఆజ్జకై ఎదురుజూచుచున్నారు? స్వగ్భృహములో సంకోచమెందుకు? ఈ రాజ్యము కూడ నీ రాజ్యమువంటిదే కదా!

నా కన్యలు కౌతుకమంగళములు పూర్తిచేసికొని, ప్రజ్వలించుచున్న అగ్నిజ్వాలల వలె వేదికసమీపమున చేరియున్నారు. నేను సిద్ధుడనై వేదిదగ్గర ఉండి మీకొరకు ఎదురుచూచుచున్నాను. దశరథమహారాజు విఘ్నము లేవియు లేకుండ శుభకార్యము జరుపుగాక! ఆలస్యమెందులకు?” అనెను.

దశరథుడప్పుడు జనకుని వాక్యము విని, కుమారులను, సకలబుషులను కూడ లోనికి తీసికొనివెళ్లిను. 

పిమ్మట జనకుడు వసిష్టుని, “ధార్మికుడవైన వసిష్టమహామునీ! ఇతర బుషుల సహాయముతో, లోకాభిరాముదైన రాముని వివాహక్రియను జరిపింపుము.” అని (ప్రార్ధించెను.


_అగ్నివేదిక_

వసిష్టమహర్షి “అటులనే చేసెదను.” అని జనకునకు చెప్పి, విశ్వామిత్ర శతానందులను ముందిడుకొని, మండపము మధ్య యథాశాస్త్రముగ అగ్నివేదికను నిర్మించెను. దాని చుట్టును గంధపుష్పములు, బంగారు పాలికలు, అంకురములు గల రంధ్రములతో కూడిన కుంభములు, అంకురములతో నిండిన మూకుళ్లు, ధూపముతో కూడిన ధూపపాత్రలు, శంఖభాకారములైన పాత్రలు, స్రుక్కులు, ్రువములు, అర్హోదకము నింపిన పాత్రలు, పేలాలు నింపిన పాత్రలు, సంస్కరించిన అక్షతలు ఉంచి అలంకరించెను. 

మహాతేజశ్శాలి, పూజ్యుడు అయిన వసిష్టుడు వేదిచుట్టు, యథాశాస్తముగ, మంటత్రపూర్వకముగ, సమములైన దర్భలను పరిచెను. పిమ్మట యథాశాస్త్రముగా, మంత్రపూర్వకముగా వేదియందు అగ్నిని ఉంచి, అగ్నిలో హోమము చేసెను.


_సీతారామకల్యాణమహోత్సవఘట్టము_

పిమ్మట జనకమహారాజు, సర్వాభరణభూషితురా లగు సీతను తీసికొనివచ్చి, అగ్ని సమక్షమున, రామునకు ఎదురుగా నిలబెట్టి, కౌసల్యానందవర్ధనుడగు ఆ రామునితో, “రామా! ఇదిగో ఈమె నా కుమార్తె సీత. ఈమె నీకు సహధర్మచారిణి కాగలదు. ఈమెను స్వీకరింపుము. నీ హస్తముతో ఈమె హస్తమును పట్టుకొనుము (పాణిగ్రహణము చేయుము). మహాభాగ్యవంతురాలగు ఈమె పతివ్రతయై నీడపలె సర్వదా నిన్ను అనుసరించి యుండగలదు.” అని పలికి, మంత్రపూతమైన జలము వదలెను. 


ఆ సమయమున దేవరలును, బుషులును “బాగు బాగు.” అని పలికిరి, దేవదుందుభులు మ్రోగినవి. పుష్పవర్షము కురిసినది. 

జనకమహారాజు మంత్రోదకపూర్వకముగా సీతను ఇచ్చిన పిమ్మట ఆనందముతో నిండినవాడై, 

“లక్ష్మణా! రమ్ము. నీకు క్షేమమగుగాక! _ (నా కుమార్తె) ఊర్శిళను న్వీకరింపుము. ఈమె హస్తమును నీహస్తముతో గ్రహింపుము. ఆలస్యము చేయకుము”. 


లక్ష్మణునితో ఇట్లు పలికి పిదప భరతునితో, “భరతా! మాండవి హస్తమును నీహస్తముతో గ్రహించుము.” అనెను. 

అతడు శత్రుఘ్నునితో కూడ, “ఓ మహాబాహూ! శ్రుతకీర్తి హస్తమును నీహస్తముతో పట్టుకొనుము” అని పలికి,

 “ఓ రామలక్ష్మణభరతశత్రుఘ్నులారా! మీరందరును సౌమ్యులు. అందరును మంచినడవడిక, నియమములు కలవారు. మీ భార్యలను స్వీకరింపుడు. ఆలస్యము చేయవద్దు” అనెను. 


జనకుని వాక్యము విని ఆ నలుగురు రాజకుమారులును, వసిష్టుని అనుమతి పొంది, తమ హస్తములతో ఆ నలుగురు కన్యల హస్తములను గ్రహించిరి. 


మహాత్ములైన ఆ రఘువంశకుమారులు, భార్యాసమేతులై, అగ్నికిని, వేదికకి, జనకమహారాజునకును, బుషులకును, ప్రదక్షిణము చేసి, వసిష్టాదులు చెప్పిన విధమున, యథావిధిగ వివాహము చేసికొనిరి. 


రామలక్ష్మణభరతశత్రుఘ్నులు, సీతా-ఊర్మిళా-మాండవీ - శ్రుతకీర్తుల సుకుమారములైన హస్తములు గ్రహించగనే ఆకాశమునుండి మిక్కిలి ప్రకాశించుచున్న గొప్ప పుష్పవృష్టి కురిసినది. 

రాఘవుల వివాహసమయమున స్వర్గమునందు దుందుభులు మోగినవి. గీతమంగళవాద్యధ్వనులతో అప్సరసలు నాట్యము చేసిరి, గంధర్వులు మధురముగా గానము చేసిది. ఇది అంతయు ఆశ్చర్యకరముగా కనబదెను. ఈవిధముగ తూర్యాదిధ్వని ప్రవర్తిల్లుచుండగా రామలక్ష్మణ భరతశటతుఘ్నులు మూడు పర్యాయములు అగ్నిప్రదక్షిణము చేసి, భార్యలను వివాహమాడిరి. 


పిమ్మట రామలక్ష్మణభరతశత్రుఘ్నులు భార్యలతో గూడి తమ విడిదికి వెళ్లిరి బుషులతోను, బంధువులతోను, కూడిన దశరథుడుకూడ భార్యాసమేతులైన పుత్రులను చూచుకొనుచు వెనుకనే వెళ్లెను. 


రాత్రి గడచిన పిదప విశ్వామిత్ర మహాముని ఆ రాజకుమారులకు అనేకాశీర్వాదముల నిచ్చి, జనకదశరథమహారాజులవద్ద సెలవు గైకొని హీమవత్పర్వతమునకు వెళ్లిపోయెను. 


విశ్వామిత్రుడు వెళ్లిన పిమ్మట దశరథమహరాజు జనకమహారాజు వద్ద సెలవు గైకొని శీఘ్రముగ అయోధ్యకు బయలుదేరెను. 

జనకమహారాజు, ప్రయాణమై వెళ్లుచున్న దశరథమహారాజును అనుసరించి వెళ్లి సాగనంపెను. ఆతడు కుమార్తెలకు అరణముగా అత్యధికమగు ధనము నిచ్చెను. 


ఆ మిథిలేశ్వరుడు లక్షలకొలది ఆవులను, శ్రేష్టమైన కంబళీలను, కోట్లకొలది పట్టువస్తములను, ఏనుగులు, అశ్వములు, రథములు, కాలిబంటులును గల చతురంగసైన్యమును, మంచి సౌందర్యము కలవారు, బాగుగా అలంకరించుకున్నవారు, శ్రేష్టులును అయిన దాసీదాసులను కుమార్తెలకు అరణముగా పంపెను. ఆతడు సంతోషముతో వెండి, బంగారము, ముత్యములు, పగడములు, వీటి రూపములో నున్న అత్యధికమగు కన్యాధనమును ఇచ్చెను. కుమార్తెలకు అత్యధికమైన ధనమునిచ్చి, దశరథమహారాజు వద్ద అనుజ్జ గైకొని తన నివాసస్థాన మగు మిథిలాపురిని ప్రవేశించెను. 

దశరథమహారాజు మహాత్ములైన కుమారులతో కూడి, బుషు లందరిని ముందు ఉంచుకొని, సైన్యము, అనుచరులు వెంట రాగా, అయోధ్యకు బయలుదేరెను. 

🙏

మౌనం


                  *మౌనం*


వాక్కును నియంత్రించడమే మౌనం. ఇదొక అద్భుతమైన తపస్సు. మాటలను వృథాగా వినియోగించకుండా అవసరం మేరకే వినేవారికి ఇంపుగా, హితంగా, మితంగా మాట్లాడాలని, అలా చేతకానప్పుడు మౌనమే మేలని విదురనీతి వివరిస్తోంది.


అయిదు విధాల ‘శాంతి’ లలో మౌనం ముఖ్యమైనదిగా చెబుతారు.


‘మాట వెండి, మౌనం బంగారం’ అని సామెత.   ‘మాట్లాడటం ద్వారా శక్తిని వృధా చేసుకునేకంటే మౌనంగా ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు’ అన్నారు స్వామి వివేకానంద.


మౌనం మూడు రకాలు.

     

1. ఒకటవది: వాక్‌మౌనం. వాక్కును నిరోధించడమే వాక్‌మౌనం. దీనినే మౌనవ్రతం అంటారు. ఇలాంటి మౌనం వల్ల పరుష వచనాలు పలకడం, అబద్ధాలాడటం, ఇతరులపై చాడీలు చెప్పడం, అసందర్భ ప్రలాపాలు అనే నాలుగు వాగ్దోషాలు హరిస్తాయి.


2. రెండోది అక్షమౌనం. అంటే ఇంద్రియాలను నిగ్రహించడం.


3. మూడోది కాష్ఠమౌనం. దీనినే ‘మానసిక మౌనం’ అంటారు. మౌనధారణలోనూ మనసు అనేక మార్గాల్లో పయనిస్తుంది. దాన్నీ అరికట్టినప్పుడే కాష్ఠమౌనం సాధ్యపడుతుంది. 


మౌనం ఆరోగ్య వృద్ధికి తోడ్పడుతుంది. దీనివల్ల దివ్యశక్తి ఆవిర్భవిస్తుంది. బాహ్య, అంతర సౌందర్యాలను పెంచుతుంది. మనోశక్తులు వికసిస్తాయి. ఎదుటివారిలో  పరివర్తన  తెస్తుంది. ఆధ్యాత్మిక శక్తి ఉత్పన్నమై ఆత్మకు శాంతి లభిస్తుంది. సమయం సద్వినియోగ మవుతుంది. పతంజలి మహర్షి తన యోగ సిద్ధాంతంలో మౌనానికి ప్రాధాన్యమిచ్చారు.


మౌనాన్ని అవలంబించిన మహాత్ముల్లో కంచి పరమాచార్య, రమణ మహర్షి, శ్రీరామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వంటి వారెందరో ఉన్నారు.


ధ్యానానికి మౌనమే పునాది. బహిర్గతంగానే కాదు, అంతర్గతంగానూ మౌనం పాటించనిదే ధ్యానం చేయడం అసాధ్యం. నిరంతర యోగసాధకులైన మహర్షులు మౌనంగా ధ్యానం కొనసాగిస్తారు.


రోజూ అరగంట మౌనంగా ఉంటే శారీరక, మానసిక ఆరోగ్యం సిద్ధించడంతో పాటు ఆశలు, ఆశయాలు, కలలు, కోరికలు నెరవేరతాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. మౌనంగా ఉండటమంటే ఇంట్లో పనులు చేస్తూ,  టీవీ కార్యక్రమాలు చూస్తూ, కంప్యూటర్‌ ముందు కూర్చుని అంతర్జాలం చూడటం కాదు. కళ్లు మూసుకుని మాటను, మనసును మౌనంలోకి జార్చేస్తే మనసు తేలిగ్గా ఉంటుంది. ఎంతో మంది అనుభవపూర్వకంగా చెబుతున్న విలువైన మాట ఇది.


ఆచి తూచి మాట్లాడటం చేతకానితనం కానేకాదు. తనపై తన ఆలోచనలపై తనకున్న పట్టును అది తెలియజేస్తుంది. ‘చేజారిన కాలం, పెదవి దాటిన పలుకు’ వెనక్కి రావు. అందుకే వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో తెలిసి తీరాలి.


ప్రతి రోజూ ఎన్నో రకాల ఆలోచనలు మనల్ని పట్టి పీడిస్తుంటాయి. వాటి ప్రభావం మన మాటలపై, చేతలపై పడుతుంది. అవి ఓ చక్రం తిరిగినట్టు తిరుగుతాయి. ఆ చక్రాన్ని ఆపే శక్తే…‘మౌనం’.


ఏ సాధన అయినా మౌనం వల్లనే సాధ్యమవుతుంది.   భగవంతుడి సాన్నిధ్యానికి చేర్చే అసలైన సాధనం మౌనమే. 

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

మా నాన్న కూడా ఇదే చెప్పారు

 మా నాన్న కూడా ఇదే చెప్పారు


ఒకసారి పరమాచార్య స్వామివారి దర్శనానికి ఒక ధనికుడు వచ్చాడు. స్వామివారు ఆజ్ఞాపిస్తే ఎడియానా ధార్మిక కార్యక్రమానికి తను ధనం ఇవ్వడానికి సిద్ధం అని తెలిపాడు.


అందుకు స్వామివారు, “ఇంట్లోని పెద్దలతో మంచిగా ప్రవర్తించు, నీ భార్యను ప్రేమించు, సాధ్యమైనంత వరకు చెడ్డ పనులు చెయ్యొద్దు. అది చాలు” అన్నారు.


శ్రీమఠానికి ధనం ఇవ్వమని చెబుతారేమో స్వామివారు అనుకుంటున్న ఆ ధనికుడు, స్వామివారు మాటలు విని ఆశ్చర్యపోయాడు. మఠానికి ఏమీ కోరకుండా పూర్తిగా వేరే విషయాన్ని చెప్పారు. ‘నేను స్వామివారితోనే ఉండి నా నుండి స్వామివారు ఏదైనా అడిగేలా చెయ్యాలి’ అని మనసులో అనుకున్నాడు.


“నేను స్వామివారు చెప్పినట్లే చేస్తున్నాను; ఇకముందు కూడా అలాగే చేస్తాను. మీరు ఇంకా ఏదైనా చెయ్యమని చెప్పినా, దాన్ని కూడా చెయ్యడానికి సిద్ధం”


కొద్దిసేపు మౌనం తరువాత, “మీకందరకూ ‘అయ్యనార్’ కులదైవం. దేవాలయం ముందర ఉన్న సిమెంటు గుర్రపుబొమ్మ పాతదైపోయింది. దాన్ని బాగుచేయించి, రంగులు వేయించి తరువాత దేవాలయానికి కుంభాభిషేకం చేయించు”.

ఆ భక్తుడు ఆశ్చర్యపోయాడు.


“అవును స్వామి, చనిపోయే ముందు మా నాన్న సరిగ్గా ఇదే పని చెయ్యమని చెప్పారు. దాని గురించి నేను పూర్తిగా మర్చిపోయాను. మా నాన్న ఏం చెప్పారో స్వామివారి కూడా సరిగ్గా అదే చెప్పారు, ఇది ఎలా సాధ్యం?”


అవును, అది నిజం. మరి ఎలా?


బహుశా అతని తండ్రి స్వర్గానికి వెళ్లిపోయే ముందు స్వామివారికి చెప్పాడేమో!


ఎంతో ఆనందంతో ఆ ధనవంతుడు స్వామివారి ఆజ్ఞని పాటించాడానికి వెళ్లిపోయాడు.


--- శ్రీమఠం బాలు మామ.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

దేవుడంటే ఏంటి

 దేవుడంటే ఏంటి? పూజ చేయకపోతే ఏమవుతుంది? అని...

చిన్నపిల్లలే కాదు ..నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా అడిగే ప్రశ్న ఇది.


పూజ అనేది కూడా ఒక యోగ ప్రక్రియ, . మనసుతో చేసే వ్యాయామం.

మన తెలివితేటలు, జ్ఞానం పెరగడానికి ....మన మెదడుని మనమే ట్యూన్‌ చేసుకునే ప్రక్రియ.

దీప ప్రజ్వలనం అనేది..... త్రాటకం అనే యోగ ప్రక్రియ.

రోజూ ఓ మూడు నిమిషాలు నూనె దీపాన్ని తదేకంగా చూస్తే.... కంటి జబ్బులను అరికట్టవచ్చు అని పెద్దలు చెప్పిన మాట.

ఏదైనా కష్టమైన మంత్రాన్ని ఓ 11 సార్లు జపిస్తే.. నాలిక మొద్దుబారదు.

అది నాలికకు ఎక్సర్‌సైజ్‌. అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా పలకగలిగే శక్తి వస్తుంది.

ధారణ శక్తి పెరుగుతుంది. భాష మీద పట్టు పెరిగితే...స్టేజ్‌ ఫియర్ కూడా‌ పోతుంది.


పూజ అంటే చాదస్తం కాదు .మన ఆరోగ్యం, మన జ్ఞానానికి సంబంధించిన విషయమని చెప్పండి.

మన హిందూ ధర్మాన్ని ప్రోత్సహించండి.

అదే సమయంలొ మూడ విశ్వాసాలకు దూరం గా ఉండే విధంగా పిల్లలను తయారు చేయాల్సిన భాద్యత కూడా పెద్దవారిపై ఉంది.....


1. మూలవిరాట్ 🚩 భూమిలో ఎక్కడైయితే electronic & magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు catalyst గా పని చేస్తాయి.


2. ప్రదక్షిణ 🚩 మనం గుడి చుట్టు clockwise direction లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన.. ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు vedic architecture మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరం లోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి.


3. ఆభరణాలతో దర్శనం 🚩 ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని.


4. కొబ్బరి కాయ 🚩 ఇది స్వచ్ఛతకు గుర్తు. పై టెంక మన అహంకారాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును.. అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం.


5.మంత్రాలు 🚩 ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96.. 26.. అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం.. అంటే మనకి తెలియకుండానే neurons ని ఆక్టివేట్ చేసి డేటా ని దాస్తున్నాం.. అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర  నియమంతో ఒక లయను కల్గి neuron లను ఉత్తేజపరువస్తాయి.


6. గర్భగుడి 🚩 గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు.


7. అభిషేకం 🚩 విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి.. వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. అంతేగాని సినీ కటౌట్ లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం.


8. హారతి 🚩 పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు.. హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి.. దీనికి ఆయుర్వేద పరిభాష లో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు.


9. తీర్థం 🚩 ఇందులో పచ్చ కర్పూరం.. తులసి.. లవంగాలు ఇలా ఎన్నో.. పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థం గా ఇస్తారు._


10. మడి 🚩 తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది.. అందుకే మడి..!


 లోకాః సమస్తాః సుఖినోభవంతు


     🙏🙏జై శ్రీ రామ్ 🙏🙏

కేశవ నామాలు

 #కేశవ నామాలు-గణిత భూమిక ...


విష్ణుమూర్తికి 24 పేర్లున్నాయి.వాటిని కేశవనామాలంటారని మనకు తెలుసు.


ఇవి 24మాత్రమే ఎందుకు ఉన్నాయి? వీటికి కాలచక్రానికి,గణితానికి ఏమైనా సంబంధం వున్నదా?


ఈ 24 కు గణిత పరమైన భూమిక ఏమిటి?

చూద్దాం.


విష్ణుమూర్తిని చతుర్భుజుడు అంటాం. అంటే నాలుగు చేతులు గలవాడని కదా?

ఈ నాలుగు చేతుల్లో శంఖం,చక్రం, గద,పద్మాలను ధరించి మనకు దర్శనమిస్తాడు.


నిశితంగా పరిశీలిస్తే, ఈ నాలుగు ఆయుధాల యొక్క అమరికలలో వచ్చే మార్పుల వల్ల ఖచ్చితంగా 24 వేరువేరు రూపాలు విష్ణువునకు ఏర్పడతాయి. 

ఈ 24 రూపాలనే కేశవనామాలంటారు.


1.కేశవ నామాలలో మొదటి నామం కేశవ.


కేశవ రూపంలో స్వామి కుడివైపు ఉన్న రెండు చేతులతో 

పద్మము, శంఖము

ధరించి ఎడమ వైపు ఉన్న రెండు చేతులతో 

గద,చక్రం ధరించి ఉంటాడు.


2.విష్ణువు యొక్క మరొక నామము మాధవ.


ఈ రూపంలో కుడి వైపు రెండు చేతులతో

గద,చక్రం ధరించి,ఎడమవైపు ఉన్న రెండు చేతులతో

పద్మము,శంఖము ధరించి ఉంటాడు.


3.మధుసూధన రూపంలో


కుడివైపు చేతులతో చక్రం, శంఖము

మరియు ఎడమవైపు చేతులతో

గద,పద్మము ధరించి ఉంటాడు.


ఈవిధంగా ప్రతి పదిహేను రోజులకు (పక్షానికొకసారి) 


పౌర్ణమికి, అమావాస్య కు తన ఆయుధాలను చేతులు మార్చుకుంటూ ఉంటాడు శ్రీ మహా విష్ణువు.


ఈ మార్పులు లేదా అమరికలను మనం గణిత శాస్త్ర పరిభాషలో ప్రస్తారాలు(permutations) అంటాం.

అనగా 4 వస్తువులను 4! 

(4 factorial) విధాలుగా అమర్చవచ్చు.


4! = 4×3×2×1=24


శంఖాన్ని 'శ' తోను,

చక్రాన్ని 'చ' తోను,

గదను 'గ' తోను,

పద్మాన్ని ' ప'తోను సూచిస్తే,


ఆ 24 అమరికలు క్రింది విధంగా వుంటాయి.


1) శచగప 2) శచపగ

3) శపచగ 4) శపగచ

5)శగచప 6)శగపచ

7)చపగశ 8)చపశగ

9)చగపశ 10)చగశప

11)చశగప 12)చశపగ

13)గపశచ 14)గపచశ

15)గచశప 16)గచపశ

17)గశపచ 18)గశచప

19)పచగశ 20)పతశగ

21)పశగచ 22)పశచగ

23)పగశచ 24)పగచశ.


[పైవన్నీ ఒక క్రమంలో ఉన్నట్లు పరిశీలించి ఉంటారు.]


ఈ 24 నామాలు పెద్దలందరికీ తెలిసినా‌...


మరోసారి క్రింద ఉదహరిస్తున్నాను.

      

కేశవ,నారాయణ

మాధవ,గోవింద

విష్ణు,మధుసూధన

త్రివిక్రమ,వామన

శ్రీధర,హృషీకేశ

పద్మనాభ,దామోదర

సంకర్షణ,వాసుదేవ

అనిరుధ్ధ,ప్రద్యుమ్న,

పురుషోత్తమ,అధోక్షజ

నారసింహ,అచ్యుత

జనార్ధన,ఉపేంద్ర

హరి శ్రీకృష్ణ.


ఈ నాలుగు ఆయుధాలను అన్ని విధాలుగాను మార్చుకోవటానికి 

24 పక్షాలు అంటే

12 నెలలు

అనగా ఒక సంవత్సరం పడుతుంది.

పురాతన క్షేత్రం

 తిరుపతి అనగానే మనకు గుర్తుకువచ్చేది తిరుపతి జిల్లాలోని తిరుమల తిరుపతి తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల. వీటిని భక్తులు పెద్ద తిరుపతి చిన్న తిరుపతిగా పిలుచుకుంటూ శ్రీవారిని భక్తు శ్రద్దలతో కొలుస్తున్నారు. 


అయితే తిరుమల తిరుపతి కంటే ఇంకా చెప్పాలంటే పురాతన క్షేత్రంగా భావిస్తున్న సింహాచలం కంటే అత్యంత పురాతన క్షేత్రం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ప్రభుత్వాలు శ్రద్ధపెట్టని ఈ స్వయంభూ క్షేత్రం గురించి ఆలయ విశిష్టత గురించి అనేక కధనాలు ఉన్నాయి.


తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురంకు దగ్గరగా ఉన్న తిరుపతిని తొలి తిరుపతి అని పిలుస్తారు. 6వేల ఏళ్ళున్న తిరుమల కంటే 8 వేల ఏళ్ల చరిత్ర కలిగిన సింహాచలం కంటే అతి పురాతనమైన క్షేత్రం. ఇంకా చెప్పాలంటే దేశంలోని ఇతర ప్రసిద్ది చెందిన నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాల కంటే మిక్కిలి పురాతనమైంది. 


పరమ పవిత్రమైన చిరుమందహాస చిద్విలాస శ్రీ శృంగార వల్లభ స్వామి శోభాయమానంగా స్వయంభువుగా దివిలి సమీపంలో కొలువుదీరిన దేవాలయానికి 9000 చరిత్ర వుంది. విష్ణుమూర్తి శిలా రూపంలో మొదట ఇక్కడే వెలసినందున ఈ ప్రాంతాన్ని తొలి తిరుపతి అని పిలుస్తారు. స్వయంభువుగా స్వామివారు వెలసిన ప్రతి ఆలయంలోనూ ఆళ్వారులు కొలువుదీరి ఉంటారు. అదే రీతిలో ఇక్కడ గర్బాలయం పక్కన ఎడమ వైపు ఆళ్వారుల విగ్రహాలు వున్నాయి.


మహావిష్ణువు ఇక్కడ స్వయంభువుగా కొలువుదీరడానికి ధ్రువుడు కారణం అంటూ స్థానికుల కథనం. ఇప్పుడు తొలి తిరుపతి ఉన్న గ్రామమంతా ఒకానొకప్పుడు కీకారణ్యం. 


ధృవుని సవతి తల్లి అయిన సురుచి ధృవునికి సింహాసనం దక్కకుండా కుతంత్రాలు పన్నుతున్న సమయంలో ధృవుని తల్లి సునీతి నువ్వు సింహాసనం అధిష్టించి రాజ్యపాలన చేయాలంటే శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోమని చెప్పింది. అప్పుడు ధృవుడు తపస్సు చేయడానికి ఈ కీకారణ్యం చేరుకున్నాడట. అదే సమయంలో అక్కడ శాండిల్య మహాముని ఆశ్రమం ఉందట అప్పుడు ధృవుడు శాండిల్య మహాముని దర్శనం చేసుకుని శ్రీ మహా విష్ణువు యొక్క తపస్సు విధానం అడగగా ఆ ముని, “నాయనా విష్ణుమూర్తి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని తలుచుకుంటూ తపస్సు చేయి” స్వామి ప్రత్యక్షమై నీ కోరిక నేరవేరుస్తాడు అని చెప్పి తపస్సుకి కావాల్సిన ఏర్పాటు చేశాడని పూర్వీకుల కథనం


ఆ మహాముని చెప్పినట్లే “దివ్య కాంతులతో శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడట” అయితే, ఆ కాంతిని చూడలేక ధృవుడు భయపడ్డాడట. అప్పుడు విష్ణుమూర్తి నాయనా! భయమెందుకు నేనూ నీ అంతే వున్నాను కదా అని నవ్వుతూ ధృవుని తలనిమిరి అతని భయాన్ని పోగొట్టాడట. ఆ తరువాత స్వామి ధృవునికి దర్శనమిచ్చిన చోటే శిలా రూపంలో వెలిసాడట. 


స్వామి నీ అంతే వున్నాను కదా అని చెప్పినందుకు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గచ్చు మీద ఉన్న పుష్పం పై నుంచుని చూసిన వాళ్ళు ఎంత ఎత్తులో వుండి చూస్తే అంత ఎత్తులోనే దర్శనమిస్తాడు అంటే స్వామి వారు చిన్న వాళ్లకు చిన్నవాడిగా పెద్దవాళ్ళకు పెద్ద వాడిగా దర్శనమిస్తారు. 


ఆ అరణ్య ప్రాంతంలో వెలిసిన స్వామి ఎండకు ఎండి వానకు తడవడం చూసి దేవతలే స్వయంగా స్వామికి ఆలయాన్ని నిర్మించారని స్థానికులు తమ పూర్వికులు చెప్పారని అంటారు. స్వామి వారు ఒంటరిగా ఉంటున్నారని దేవేరి ఐన లక్ష్మీ దేవిని నారద మహర్షి ప్రతిష్టించారనే కథనం. వెంకన్న భక్తుడైన శ్రీ కృష్ణ దేవరాయల ఈ ఆలయాన్ని సందర్శించి భూదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ ఆలయ విశిష్టతను తెలుపుతూ నేటికీ అక్కడ శిలా శాసనాలు దర్శనమిస్తాయి.


శ్రీ శృంగార వల్లభ స్వామి ఆలయం విశిష్టత గురించి ఎంత చెప్పినా తక్కువే. విష్ణువు రూపంలో చిద్విలాసంగా నవ్వుతు ఉండే వేంకటేశ్వరుడు విగ్రహం, ఆ విగ్రహం ఎంత ఎత్తులో ఉండేవారికి అంతే ఎత్తులో కన్పిస్తుంది. తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని విగ్రహానికి పూర్తి విభిన్నంగా శంఖ, చక్రాల స్థానం మారి వుంటాయి. ఆలయ ప్రాంగణంలోనే శివాలయం వైష్ణవాలయం రెండూ వున్నాయి. సంతానం లేని దంపతులు ఆలయం వద్ద నూతిలో స్నానం చేస్తే సంతాన ప్రాప్తి లబిస్తుంది భక్తుల నమ్మకం. ఈ ప్రధాన ఆలయంలోని ఏకశిలా కళా ఖండాలు, విగ్రహమూర్తి, ఉత్సవ మూర్తి, ప్రదాన ఆకర్షణగా నిలుస్తాయి.


శ్రీరామ నవమి తరువాత వచ్చే మొదటి ఏకాదశి అనగా చైత్ర శుద్ద ఏకాదశి రోజు స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా ప్రారంభిస్తారు, ఆరోజు నుంచీ ఆరు రోజులపాటూ ఉత్సవాలు జరుపుతారు. ఇక ధనుర్మాసంలో నెల రోజుల పాటూ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఆలయం ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నప్పటికీ యాత్రికులకి దర్శనానానికి, బసకి సరైన సదుపాయాలు లేవు అని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఎంతో ప్రాశస్యం కలిగిన ఈ ప్రాంతం అభివృద్ధిపై ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

మూత్ర పిండాల వాపు

 మూత్ర పిండాల వాపు , పుండు నివారణ - 


     కామంచి పువ్వులను తగుమాత్రంగా రెండు పూటలా ఆహారానికి గంట ముందు ఒకటి లేక రెండు గ్రాములు తింటూ ఉంటే మూత్రం ధారాళంగా విడుదల అవ్వడమే కాకుండా మూత్రకోశంలో పుండు , మూత్రపిండాల వాపు తగ్గిపోతాయి.


             ఈ కామంచి చెట్లు రహదారుల పక్కన ఉంటాయి. 


   మరిన్ని అతి సులభ యోగాల కొరకు నా గ్రంథాలను చదవగలరు.


     గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            

జీవితం కూడా అంతే

 🙏 *

                  *విత్తనం తినాలని*

                 *చీమలు చూస్తాయ్*..

                *మొలకలు తినాలని*

                 *పక్షులు చూస్తాయ్*..

           

                 *మొక్కని తినాలని*

                *పశువులు చూస్తాయ్*


                 *అన్ని తప్పించుకుని*

             *ఆ విత్తనం వృక్షమైనపుడు*..


            *చీమలు, పక్షులు, పశువులు*..

         *ఆ చెట్టుకిందకే నీడ కోసం వస్తాయ్*....


            *జీవితం కూడా అంతే TIME*

          *వచ్చే వరకు వేచివుండాల్సిందే*

          *దానికి కావాల్సింది ఓపిక మాత్రమే*.....        


               *లైఫ్ లో వదిలి వెళ్ళిన*

           *వాళ్ళ గురించి ఆలోచించకు*..


              *జీవితంలో ఉన్న వాళ్ళు*

              *శాశ్వతం అని భావించకు*..


           *ఎవరో వచ్చి నీ బాధను అర్థం*

           *చేసుకుంటారని ఊహించకు*...


              *నీకు నీవే ధైర్యం కావాలి*.....

          *నీకు నువ్వే తోడుగా నిలబడాలి*...


                  *లోకులు కాకులు,*

                 *మనిషిని చూడరు*,

              *మనస్సును చూడరు,*

              *వ్యక్తిత్వాన్ని చూడరు.*


                     *కనిపించింది,*

            *వినిపించింది నమ్మేస్తారు*,

                 *మాట అనేస్తారు,*


                 *ఒక్కోసారి మన కళ్ళే*

              *మనల్ని మోసం చేస్తాయి.*


           *మరొకసారి చెప్పుడు మాటలు*

                        *జీవితాలను*

                  *తలకిందులు చేస్తాయి*


             *అబద్దాలతో, మోసాలతో*

                   *కీర్తి, ప్రతిష్టలను*

         *ఎంత గొప్పగా నిర్మించుకొన్నా*..

          *అవి కుప్పకూలి పోవడానికి*

               *ఒక్క "నిజం"చాలు*.

             *అందుకే కష్టమైనా సరే*

          *నీతిగా బ్రతకడమే మనిషికి*

                  *ఉత్తమ మార్గం.*

         

                *ఒక చిన్న మొక్కనాటి*

      *ప్రతిరోజూ వచ్చి కాయకాసిందా అని*      

                   *చూడకూడదు.*


             *ఎందుకంటే అది పెరగాలి*

                *మొక్క వృక్షం కావాలి*

          *పుష్పించాలి, పిందెలు రావాలి*

         *అవి కాయలై , పండితే తినగలం.*


              *అలాగే నేను ఇది కావాలి*

              *అనే కోరిక కూడా మొలకై*

       *వృక్షమై ఫలవంతం ఔతుందని తెలిసి*    

         *మసలుకోండి*


               *జీవితంలో కష్టము,*

             *కన్నీళ్ళు, సంతోషము,*

        *భాధ ఏవి శాశ్వతంగా ఉండవు*,


     *కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు.*

       *ఆనందం, ఆవేదన కూడా అంతే.*


              *నవ్వులూ, కన్నీళ్ళూ*

              *కలగలసినదే జీవితం*


             *కష్టమూ శాశ్వతం కాదు,*

       *సంతోషమూ శాశ్వతమూ కాదు.*


                   

    


                      *ఓడిపోతే*

            *గెలవడం నేర్చుకోవాలి*,


                     *మోసపోతే*

       *జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి*


                  *చెడిపోతే ఎలా*

           *బాగుపడలో నేర్చుకోవాలి,*


         *గెలుపును ఎలా పట్టుకోవాలో*

                *తెలిసిన వాడికంటే*

                   *ఓటమిని ఎలా*

          *తట్టుకోవాలో తెలిసిన వారే*

               *గొప్ప వారు నేస్తమా* !


              *దెబ్బలు తిన్న రాయి*

            *విగ్రహంగా మారుతుంది*


              *కానీ దెబ్బలు కొట్టిన*

             *సుత్తి మాత్రం ఎప్పటికీ*

          *సుత్తిగానే మిగిలిపోతుంది*....


          *ఎదురు దెబ్బలు తిన్నవాడు*,

         *నొప్పి విలువ తెలిసిన వాడు*

          *మహనీయుడు అవుతాడు*...


       *ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు*

    *ఎప్పటికీ ఉన్నదగ్గరే ఉండిపోతాడు*...

    

         

  


                 *డబ్బుతో ఏమైనా*

           *కొనగలమనుకుంటున్నారా*

             *అయితే కొనలేనివి ఇవిగో*


            *మంచం పరుపు కొనవచ్చు*

                    *కానీ నిద్ర కాదు*


                 *గడియారం కొనవచ్చు*

                    *కానీ కాలం కాదు*


                  *మందులు కొనవచ్చు*

                   *కానీ ఆరోగ్యం కాదు*


                  *భవంతులు కొనవచ్చు* 

                   *కానీ ఆత్మేయిత కాదు*


                   *పుస్తకాలు కొనవచ్చు*

                      *కానీ జ్ఞానం కాదు*


          *పంచభక్ష పరమాన్నాలు కొనవచ్చు*

                     *కానీ జీర్ణశక్తిని కాదు*

                    

      


        *ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తే*

      *అందరి కన్నా ముందు మేకలే జ్ఞానులు*

                          *కావాలి,*


       *స్నానాలతోనే పాపాలు పోతే ముందు*

           *చేపలే పాప విముక్తులు కావాలి,*


           *తలక్రిందులుగా తపస్సు చేస్తేనే*

          *పరమాత్మ ప్రత్యక్షమైతే ముందు*

             *గబ్బిలాలకే ఆ వరం దక్కాలి,*


           *ఈ విశ్వమంతా ఆత్మలో ఉంది*

  *నీలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ*

       *పరుగులు పెడితే ప్రయోజనమే లేదు*,


             *నీలో లేనిది బయటేమీ లేదు* 

          *బయటఉన్నదంతా నీలోనూ ఉంది*


        *తెలిసి మసులుకో  --  కలిసి జీవించు.....*

             *సర్వే జనా సుఖినోభవంతు*

♦️ *ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 86*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 86*


పర్వతకుడు మరణించాడు. 


విషకన్య పొందు అనుభవించిన పర్వతకుడు తెల్లవారేసరికి శయనమందిరంలో శవమై కనిపించాడు. అతడితో పాటు విషకన్య మదుశాలిని కూడా మరణించింది. 


రాజలోకంలో ఈ దుర్వార్త కారుచిచ్చులా వ్యాపించింది. పర్వతకుని భటులు ప్రతీకారంతో రగిలిపోతూ విధ్వంసాలకి పూనుకున్నారు. అందుకు ప్రతిగా రాక్షసామాత్యుని అభిమానులమని చెప్పుకుంటూ కొందరు సైనికులు పర్వతక భటులను ముందు, వెనకాలనుంచి దాడి చేసి రెప్పపాటులో ఊతకోతకోశారు. మిగిలివున్న పర్వతకసైన్యాలు ఆ విధంగా నాశనమయ్యాయి. 


భద్రతా కారణాల సాకుతో పర్వతకుని సోదరుడు వైరోచనుడు, కుమారుడు మలయకేతు వారివారి అతిథి గృహాల్లోనే గృహనిర్బంధంలో ఉంచబడ్డారు. తాము గృహ నిర్బంధంలో ఉన్నామని తెలుసుకున్న వాళ్ళిద్దరూ ఒకరినొకరు సంప్రదించుకునే అవకాశం లేక, ఆ నిర్బంధంలోంచి బయటపడే మార్గం కానక లోలోపలే పగతో రగిలిపోసాగారు. 'పర్వతకుని మరణానికి రాక్షసామాత్యుడే కారకుడు' అన్న వార్త క్షణాల్లో నగరం అంతటా వ్యాపించింది. ఆవేశపరులు కొందరు రాక్షసుని నివాసం మీద దాడి చేశారు. కానీ, అప్పటికే అమాత్యుడు భార్యబిడ్డలతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 


"పర్వతకునిది అదృష్టమో, దురదృష్టమో... ఇప్పుడు తెలిసిందా ?" నవ్వుతూ ప్రశ్నించాడు చాణక్యుడు. 


ఆయనే అడ్డుపడక పోయి ఉంటే పర్వతకునికి పట్టిన దుర్గతి తనకే పట్టి ఉండేదని అర్థం చేసుకున్న చంద్రుడు కృతజ్ఞతతో ఆర్యునికి నమస్కరించాడు. అంతలో సేనాని బాగురాయణుడు వచ్చి పరిస్థితులను వివరించాడు. చాణక్యుడు అతనితో కాసేపు గుసగుసలాడాడు. బాగురాయణుడి మొహంలో ఆశ్చర్యంతో రంగులు మారిపోయాయి. ఆర్యుని ఆలోచనా పటిమకు అచ్చెరువొందుతూ, ఆయనకి నమస్కరించి, కార్యార్థియై బయలుదేరాడు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారని చంద్రుడు అడగలేదు. చెప్పవలసిన విషయాన్ని చెప్పవలసిన తరుణంలో ఆర్యుడే చెబుతాడని చంద్రుడికి చాణక్యునిపై గట్టి నమ్మకం. అందుకే మౌనం వహించాడు. 


బాగురాయణుడు సరాసరి వెళ్లి గృహనిర్బంధంలో ఉన్న పర్వతక కుమారుడు మలయకేతుని దర్శించాడు. అతడు ఆగ్రహావేశాలతో మండిపడుతూ "భద్రతా కారణాలు సాకుగా చూపుతూ మమ్మల్ని బయటికి వెళ్ళనివ్వడం లేదు. బయట అసలేం జరుగుతున్నదో మాకు తెలియడం లేదు. కనీసం మా తండ్రిగారి శవాన్ని చూసే అవకాశం కూడా మాకు లేకుండా చేశారు. ఇది నిజంగా భద్రతా కారణమా ? లేక గృహ నిర్బంధమా ?" అని అరిచాడు ఆగ్రహావేశాలతో. 


"మీరు ఎలా అనుకుంటే అలా....?" అన్నాడు బాగురాయణుడు నెమ్మదిగా. 


మలయకేతు అదిరిపడుతూ "అంటే....? రాక్షసామాత్యుడు స్నేహధర్మాన్ని విస్మరించి మా మీద ఇంత కుట్ర చేస్తాడా ?" అడిగాడు విస్మయంగా. 


బాగురాయణుడు నవ్వి "పాపం అమాత్యుడు అమాయకుడు. నల్లనివన్నీ నీళ్లు తెల్లని వన్నీ పాలు అని నమ్మే మహానుభావుడు. చాణక్యుడు నమ్మించాడు. నమ్మి, విషకన్య అని తెలియక ఆమెని చంద్రగుప్తునికి సమర్పించాడు. చాణక్యుడు తెలివిగా తాననుకున్న పథకం ప్రకారం ఆ విషకన్యని మీ తండ్రిగారికి సమర్పించి ఆయన ప్రాణాలు హరించాడు. పాపం చెడ్డపేరు రాక్షసునికి.... ప్రతిఫలం చాణక్యునికి..." చెప్పాడు తగ్గు స్వరంతో. 


ఆ కథ విని నిర్ధాంతపోయాడు మలయకేతు. తనంత దూరం ఆలోచించలేకపోయినందుకు తిట్టుకున్నాడు. 'నిజమే ! తన తండ్రిని హత్య చేయిస్తే రాక్షసునికి ఏం వొరుగుతుంది ? అర్ధరాజ్యం ఇవ్వకుండా ఎగగొట్టడానికి చాణక్యుడు ఈ నాటకం ఆడి ఉంటాడు. దుష్టపన్నాగంతో తన తండ్రిని తనకి లేకుండా చేశాడు. దుర్మార్గుడు.' 


"ఆ చాణక్యుడిని...." అంటున్నాడు మలయకేతు ఆవేశంతో. 


"ఏమీ చెయ్యలేరు...." అంటూ బాగురాయణుడు అడ్డుపడి "రాక్షస అనుచరుల పేరుతో చాణక్యుడే మీ మిగిలిన సైనికులనందరినీ ఊచకోత కోయించాడు. ఇక్కడ మిమ్మల్ని, అక్కడ మీ పినతండ్రి వైరోచనుల వారిని భద్రత పేరుతో గృహనిర్బంధంలో ఇరికించాడు. ఇక ఏ నిమిషంలోనైనా 'తిరుగుబాటు దార్లు' అన్న పేరు ఎవరికో అంటగట్టి మిమ్మల్ని కూడా...." అని అసంపూర్తిగా వాక్యాన్ని వదిలేశాడు. 


మలయకేతు గొంతులో తడారిపోయింది. ఆవేశం చప్పగా చల్లారిపోయింది. ఎలాగైనా ప్రాణాలతో అక్కడినుంచి పారిపోతే చాలనిపించింది. 


"ఇప్పుడెలా....?" దీనంగా బాగురాయణుడిని ప్రశ్నించాడు మలయకేతు. 


బాగురాయణుడు అతడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ "చాణక్యుడితో నాకు సరిపడదు. అందుకే నిజం చెప్పి ఎలాగైనా మిమ్మల్ని తప్పించాలన్న ఉద్దేశ్యంతో ఇక్కడికొచ్చాను. ఇక్కడి కాపలాదారులు కొందరు నాకు నమ్మకస్తులు, మీరు మీ దుస్తులు వదిలేసి సాధారణ సైనికుడి దుస్తులు ధరించండి. నా మనుషులు మిమ్మల్ని తీసుకెళ్లి ఎలాగోలా కోట దాటిస్తారు. కోట బయట మీ కోసం ఒక అశ్వం సిద్ధంగా ఉంటుంది. పారిపోండి. సురక్షితంగా మీ రాజ్యానికి చేరుకోండి. అదృష్టం బాగుంటే మళ్ళీ కలుసుకుందాం..." అని చెప్పాడు. 


బాగురాయణుడి సలహాలు పాటించి సైనిక దుస్తుల్లో కోటదాటి ప్రాణభీతితో పారిపోయాడు మలయకేతు.


మలయకేతు పలాయన వార్త విన్న పర్వతక సోదరుడు వైరోచనుడికి కావాలి భటుల ద్వారా తెలిసింది. అయితే అతడు మలయకేతులాగా భయపడి పారిపోయే ప్రయత్నం గురించి ఏమాత్రం యోచించలేదు. ఆ విషయం చారుల ద్వారా చాణక్యునికి తెలియజేయబడింది. 


ఇక పట్టాభిషేకమునకు శుభముహూర్తం నిర్ణయం చేయించిన చాణక్యుడు స్వయంగా వచ్చి వైరోచనుడిని కలుసుకున్నాడు. కొద్దిసేపు ఇద్దరి మధ్యా ముభావం చోటుచేసుకుంది. 


చాణక్యుడే కల్పించుకుని "విషకన్యను బహిరంగంగా సమర్పించిన వాడు రాక్షసుడు. అందులో నా ప్రమేయం ఏముంది ? కుమార మలయకేతు అపార్థం చేసుకుని మాట మాత్రం చెప్పకుండా వెళ్ళిపోయాడు. అయినా మేము మాటంటే మాటే ! మీ అన్నగారికి వాగ్దానం చేసిన అర్థరాజ్యాన్ని మీకు కట్టబెట్టాలని నిశ్చయించాం. పట్టాభిషేకానికి రేపే ముహూర్తం..." అని చెప్పాడు. 


అర్ధ రాజ్యాభిషేకం తనకి చేస్తారనగానే వైరోచనుడు సంబరపడిపోతూ "అయ్యో..! మీ మంచితనం నాకు తెలియదా ? మీ అభీష్ట ప్రకారం కానివ్వండి" అని చెప్పాడు. 


చాణక్యుని అభ్యర్థన మేరకు వైరోచనుడే పర్వతకునికి అంత్యక్రియలు జరిపించాడు. ఆ చర్యతో అతనికి చాణక్యుని మీద మరింత నమ్మకం ఏర్పడింది. 


చంద్రగుప్తుని పట్టాభిషేక మహోత్సవం గురించి పాటలీపుత్ర నగరం అంతటా దండోరా వెయ్యబడింది. 


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

ఈ రోజు పద్యము

 186వ రోజు: (స్ధిర వారము) 10-06-2023

మన మాతృ భాష సేవలో ఈ రోజు పద్యము:


వగవకు గడచిన దానికి 

బొగడకు దురాత్ములనెపుడు పొసగని పనికై 

యెగి దీనత నొందకుమీ 

తగ దైవగతిం బొసంగు ధరను కుమారా!


 ఓ కుమారా! అయిపోయిన పనిని గురించి చింతించవద్దు. దుష్టులను మెచ్చుకొనవద్దు. నీకు సాధ్యము కాని దానిని పొందలేకపోతినని చింతించుట పనికిరాదు. భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి చెందుము. 

 

ఈ రోజు పదము. 

మేక (Goat): అజ, అమేఢ,ఇడిక్కము, గళస్తని, చింబు,చుచ్చు,ఛగలి,ఛాగి, మేకము, సర్వభక్ష, హృద్య.

భజగోవిందం

 ॐ                 भज गोविन्दं

                    భజగోవిందం 

                 (మోహముద్గరః) 

            BHAJA GOVNDAM   

 

      (श्रीमच्छंकरभगवतः कृतौ 

       శ్రీమచ్ఛంకరభగవత్పాద కృతం 

           BY SRI ADI SANKARA)


                           శ్లోకం :18/31

                   SLOKAM :18/31

                    

శ్రీ సురేశ్వరాచార్యులు


सुरमंदिर तरुमूल निवासः,

शय्या भूतल मजिनं वासः।

सर्व परिग्रह भोग त्यागः,

कस्य सुखं न करोति विरागः॥१८॥

                    ॥भज गोविन्दं॥ 


సురమందిర తరుమూల నివాసః

శయ్యా భూతలమజినం వాసః |

సర్వ పరిగ్రహ భోగ త్యాగః 

కస్య సుఖం న కరోతి విరాగః ||18||

                    ॥భజ గోవిందం॥ 


    దేవాలయాల్లోనూ, చెట్ల మొదళ్ళలోనూ నివసిస్తూ; 

    కటిక నేల మీద నిద్రిస్తూ; 

    చర్మాన్ని వస్త్రంగా ధరిస్తూ; దేనినీ గ్రహించకుండా - ఏమీ కావాలని కోరుకోకుండా, 

    అన్ని భోగాలను విడిచిపెట్టిన ఏ విరాగికి సుఖం లభించదు? 

    తప్పక లభిస్తుంది.


అనువాదం 


ఎవడు మందిరముల 

               వృక్షఛాయల నుండు 

నేల పాన్పుపైన చర్మము బట్టగ గట్టి 

సర్వసంగ పరిత్యాగియై విరాగమున 

నట్టి యోగి కబ్బని సుఖశాంతులుండునే! 


    देव मंदिर या पेड़ के नीचे निवास, 

    पृथ्वी जैसी शय्या, 

    अकेले ही रहने वाले, 

    सभी संग्रहों और सुखों का त्याग करने वाले वैराग्य से 

    किसको आनंद की प्राप्ति नहीं होगी॥१८॥


    Reside in a temple or below a tree, 

    sleep on mother earth as your bed, 

    stay alone, 

    leave all the belongings and comforts, 

such renunciation can give all the pleasures to anybody. 


https://youtu.be/ImWKhB_PMiw 


                          కొనసాగింపు 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

            భద్రాచలం

కార్తెఅంటే

 *కాలములో- కార్తెఅంటే!ఏమిటి?* 

>>>>>>>>>>>>>ॐ<<<<<<<<<<<<<<<<<<<<                                       జోతిష్కులు 27 నక్షత్రాల ఆధారం గా జాతకాలు, పంచాంగాలు తయా రు చేశారు. సూర్యోదయమప్పుడు ఏ చుక్క (నక్షత్రం) చంద్రుడికి దగ్గర గా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం పేరు పెట్టారు. పున్నమి రోజు చంద్రుడుఏ చుక్కతో ఉంటే ఆ నెలకు ఆ పేరుపె  ట్టారు. కానీ తెలుగు రైతులుమాత్రం ఇవే నక్షత్రాలతో తమ అనుభవాల ఆధారంగావ్యవసాయపంచాంగాలు తయారుచేసుకున్నారు. 

ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలిచా రు. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గర గా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు. సంవత్సరానికి 27 కార్తెలు.  


ఉగాది మొదలుకొని ప్రతి పదమూ డున్నర రోజులకొకసారి సూర్యుడు ఒక్కో నక్షత్రంలో ప్రవేశిస్తాడు.

 ఆ కార్తెను ఆ నక్షత్రం పేరుతో పిలు స్తారు. ఆప్రకారం సంవత్సరానికి 27 కార్తెలు. 

ఉదా:-సూర్యుడు,మృగశిరనక్షత్రంలో ప్రవేశించడమే మృగశిర కార్తె. తె లుగు ప్రజానీకం చంద్ర మానాన్ని పా టిస్తుంటే తమిళులు సౌర మానాన్ని పాటిస్తున్నారు.తెలుగు రైతులు తర తరాలుగాతమఅనుభవాలలోనుంచి సంపాదించుకున్నవ్యవసాయవా తావరణ విజ్ఞానాన్ని 'కార్తెలు', వాటి పై సామెతల రూపంలో ప్రచారం చే శారు. ఆయా కార్తెలు నెలలు రాశు లు వారీగా పైరులకు వాతావరణం ఎలాఉంటుందోఅందరికీఅర్ధమయ్యే లా సామెతలలో చెప్పుకునే వారు .

రోహిణిలో రోళ్లు బద్దలవ్వడం,మృగ శిరలో ముసలిఎద్దు రంకెవేయడం. మొదలైన వాటి ద్వారా ఆయాకాలా లు ఎలా ఉంటాయో తర్వాతతరాల కు చెప్పేవారు.



        *సర్వేషాంశాన్తిర్భవతు.*

స్వామివారు స్పెయిన్ వచ్చారా?

 స్వామివారు స్పెయిన్ వచ్చారా?


“వారు భగవంతుని యొక్క కలియుగ అవతారం” స్పెయిన్ సందర్శకుడు.


స్పెయిన్ దేశపు రాజకుటుంబానికి చెందిన ఒక ప్రముఖ వ్యక్తి పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చారు. ఆయన స్పానిష్ ప్రసంగాన్ని ఒకతను స్వామివారికి తర్జుమా చేస్తున్నారు.


స్పెయిన్ రాష్ట్రపతి గురించో అక్కడి వాతావరణం గురించో స్వామివారు అడిగి ఉండవచ్చు. లేదా అక్కడి ప్రజల అలవాట్లు, పద్ధతుల గురించో అడగొచ్చు. ఎన్నో పత్రికలు, మాధ్యమాల వల్ల ఇప్పటికే అందరికీ అటువంటి విషయాలు తెలిసివుంటాయి.


కానీ స్వామివారు ఆ స్పానిష్ రాజప్రతినిధిని ఇవేవీ అడగలేదు. స్వామివారు ఏమి అడిగారో చూద్దాం.


“మీ రాజప్రాసాదంలో పాత ప్రాసాదము, కొత్త ప్రాసాదము అని రెండు ప్రాసాదాలు ఉన్నాయా?”


“అవును”


“ఇప్పుడు మీరు ఏ ప్రాసాదంలో ఉంటున్నారు?”


“కొత్త ప్రాసాదం” అని బదులిచ్చారు ఆ సందర్శకుడు.


“అక్కడ మీకు నీరు మొదలైన ఇతర సౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయా?”


“అవును, కొత్త ప్రాసాదం చాలా సౌకర్యవంతంగా ఉండడం వల్ల అక్కడే ఉంటున్నాము”


తరువాత స్వామివారు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు.


అయితే, మీరు నిరుపయోగంగా ఉన్న ఆ పాత రాజప్రాసాదాన్ని ఒక తోటగా మార్చేయండి. మహాస్వామివారి మాటలను విన్న ఆ స్పానిష్ దౌత్యవేత్తకి మనస్సులో పెద్ద అనుమానం వచ్చింది.


తనదేశంలో ఉన్న ఒక చోటు గురించి, దానికి చెయ్యాల్సిన మార్పుల గురించి ఎలా ఈ మహాత్ములకు తెలిసింది అని ఆలోచిస్తున్నారు? “స్వామివారు స్పెయిన్ దేశానికి ఎప్పుడు వచ్చారు?” అని ద్విభాశిని అడిగారు.


ఆ ద్విభాషి ఆ విషయాన్ని స్వామివారికి చెప్పేలోపలే మహాస్వామివారు ఆ స్పానిష్ దౌత్యవేత్తకి కేవలం సంజ్ఞ ద్వారా సమాధానం తెలిపారు. స్వామివారు తమ అమృత హస్తాలతో గాలిలో గుండ్రంగా వేలితో చూపించి, కారుణాపూరితమైన మందహాసం చేసి ఆ స్పానిష్ వ్యక్తివైపు చూశారు.


“మహాస్వామి వారు భగవంతుని యొక్క కలియుగ అవతారం” అని స్పెయిన్ సందర్శకుడు తెలుసుకున్న తరువాత స్వామివారి దివ్యా చరణాలకు సాష్టాంగ వందనం చేసి ఆశీస్సులను అందుకున్నాడు.


--- రా. వేంకటస్వామి. “కంచి మహనిన్ కరునై ఉళ్ళమ్” పుస్తకం నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

ఆశలమధ్య బంధింపబడుతూ

 *🕉️🕉️ఓం నమో భగవతే వాసుదేవాయ🕉️🕉️* 

ఆశాపాశ శతాబద్ధాః

వాసనా భావధారిణఃl

కాయాత్కాయ ముపాయన్తి

వృక్షాత్ వృక్షమివాణ్డజాఃll


ఎట్లయితే పక్షులు ఒక చెట్టునుండి మరొక చెట్టుకు నివాసం మారుస్తూ ఉంటాయో

ఆ విధంగానే  *మానవులు కూడా నిత్యం వందలాది ఆశలమధ్య బంధింపబడుతూ అనేకానేక జన్మలవాసనలచే వివిధ శరీరాలను ధరిస్తూ ఒక జన్మ నుండి మరో జన్మ పొందుచున్నారు*


*🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు 🙏🙏*

సంధ్యావందనఆవశ్యకత

 🌱సంధ్యావందనఆవశ్యకత 

"అహరహస్సంధ్యాముపాసీత"శృంగేరి శారదా దేవ్యై నమః.............

బ్రాహ్మణుడికి సంధ్యావందనము అనేది

" మాయ" నుండి కాపాడుటకు "ఆయుధము"

వలె ఉపయోగపడి క్రమముగ అరిషడ్వర్గముల బారి నుండి "ఆత్మరక్షణ" గావించి పురుషార్థములలో విజయమును చేకూరుస్తూ బ్రహ్మమును గురించి "ఆలోచన" చెయింపచేసి కైవల్యమును పొందుటకు కావలసిన "ఆత్మశిక్షణ"ను ఇవ్వగలిగిన సామర్థ్యము కలిగియున్నది. కనుక 

ఓవిప్రులార!

"ద్రుపదాదివముంచతు" ఇట్టి మంత్రముల పఠనముల వలన లొకంలో తప్పు చేయడం వలన "దోషి" కాళ్ళకు కట్టబడిన శృంఖలాల చేత ఏవిధముగఅయితే నడుచుటకు ఇబ్బంది పడుచుంటాడొ. అలాగే పాపకృత్యుడు కూడ పాపందొషం నుండి విడువబడని వాడు కూడ జ్ఞానమును పొందలేక అలాగే ఇబ్బంది పడతాడు.పాపజాతం నుండి విడువబడితేనే 

కానీ. పుణ్యవంతుడు అవలేడు ఆతరవాతనే జ్ఞానార్హుడు అవగలడు.

అట్టిజ్ఞానికే కైవల్యం లభిస్తుంది.

"యాగ్ంసదాసర్వభూతానిచరాణిస్థావరాణిచ."

అనుట వలన బ్రహ్మచేత సృజింపబడిన ప్రతిపదార్థము కూడ సంధ్యాకాలం సంప్రాప్త మవగానే వాటివాటికి లభించిన మౌలిక సదుపాయములతో "సంధ్యను"ఆచరిస్తున్నాయి. "ఓంనమొభగవతెవాసుదేవాయ"

అనుటచెత 

"కలౌనామస్మరణాత్ ముక్తిః"

అని శాస్త్రవచనానుసారం.

 నామ సంకీర్తనం కూడ జరుగుచున్నది. 

"ఆకాశాత్ పతితం తోయం యథాగఛ్ఛథిసాగరం.

సర్వదేవనమస్కారఃకేశవంప్రతిగఛ్ఛతి",

ఆకాశం నుండి జాలువారిన నీళ్ళు 

సముద్రంలోకి చేరినట్లుగ .

ఎదేవతకి నమస్కారం చేసిన అది కేశవునకేచెందుతుంది.అనే ఆధ్యాత్మ విషయవిచారణ కూడ ప్రతినిత్యంఅభ్యాసంలొకివస్తూంటుంది.

ఈవిధమైన కర్మ,భక్తి,జ్ఞాన, విషయక మంత్ర సముచ్చయమైన  సంధ్యావందనమును సకాలములో చేయుటకు ప్రయత్నించండి. మంత్రమును మననం చేస్తే అది మనలను (సృష్టినికూడ) రక్షిస్తుంది. ఇట్టి మహిమాతిశయ సమూహముతొ కూడియున్న సంధ్యావందనమును కనీసం అకాలమునందైననూ ప్రాయశ్చిత్త పూర్వకముగ అనుష్ఠానం చేసి జన్మసాఫల్యతను పొందవలెను..

కలియుగములో "ఆత్మోధ్ధరణం"

కావించుకొనుటకు ఇంతకంటే సులభమైన పరమధర్మము మరొకటిలేదు. శ్రౌత,స్మార్త,ఆగమాదులలో చెప్పినటువంటి ఏధర్మములను ఆచరించాలన్నా

 "అర్హత" కల్పించి సార్థకత చేకూర్చగలిగేది

మనముందు ఉన్న సంధ్యావందనము 

మాత్రమే అనిగుర్తించాలి...

....ముగింపు...

"సంధ్యాహీనోశుచిర్నిత్యఃఅనర్హఃసర్వకర్మసు"

సంధ్యావందనము చేయనివారికి అంతశ్శౌచం మరియు బహిఃశౌచం కూడ లేక పొవుట  వలన అట్టివారు వైదిక మరియులౌకికకార్యములు రెండూకూడనిర్వర్తించుటకుఅనర్హులు.

...స్వస్తి.....

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.......

మూఢం అంటే

 *మూఢం అంటే ఏమిటో తెలుసా? ఎందుకు మూఢం లో శుభ కార్యాలు చెయ్య కూడదు?!!*🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. వీటిలో భూమికూడా ఓ గ్రహమే! భూమి, సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమ్మీద ఉన్నవారికి కనపడదు. దీన్నే *అస్తంగత్వం* లేదా మూఢం అంటారు. గ్రహాలకు రాజు సూర్యుడు. అంటే సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది. అలా గురువు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురు మౌఢ్యం, శుక్రడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యం వస్తుంటాయి. ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతుంటాయి. అందుకే దీనికి *మూఢం* అనే పేరు పెట్టి శుభ కార్యాలకు దూరంగా ఉండమని పండితులు చెబుతుంటారు. ఈ మూఢం అనేది ఆ గ్రహం సూర్యునికి ఎంత దగ్గరలో ఉందనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే శుభ గ్రహాలైన గురువు, శుక్రునకు శక్తి హీనత మాత్రమే దోషంగా పరిగణిస్తుంది.గురు, శుక్రులు సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూఢాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి శుభ కార్యాలు చేయకూడదు అని చెబుతారు. ఏ శుభ కార్యక్రమానికైనా గురు శుక్రులు బాగుండాలని, శక్తివంతంగా ఉంటే శుభం జరుగుతుందని విశ్వసిస్తారు. మూఢం సమయంలో ఏదైనా శుభకార్యం చేసినా అశుభం జరుగుతుందని. కష్టం కలుగుతుందని, నష్టం వాటిల్లుతుందని జ్యోతిషశాస్త్రం ద్వారా తెలుస్తున్నది!! 👍👍👍👍👍👍 *మూఢంలో చేయతగినవి*

👍👍👍👍👍👍👍✊

అన్నప్రాసన చేసుకోవచ్చును.


ప్రయాణాలు చేయవచ్చును.



ఇంటి మరమ్మత్తులు చేసుకోవచ్చును.


భూములు కొనుగోలు, అమ్మకాలు, అగ్రిమెంట్లు చేసుకోవచ్చును.


నూతన ఉద్యోగాల్లో చేరవచ్చును. విదేశాల్లో విద్య / ఉద్యోగం కోసం వెళ్ళవచ్చును.



నూతన వాహనాలు, వస్త్రాలు కొనవచ్చును.


జాతకర్మ, జాతకం రాయించుకోవడం, నవగ్రహ శాంతులు, జప, హోమాది శాంతులు, గండనక్షత్ర శాంతులు ఉత్సవాలు చేయవచ్చును.


సీమంతం, నామకరణం, అన్నప్రాసనాది కార్యక్రమాలు చేయవచ్చును. గర్భిని స్త్రీలు , బాలింతలు తప్పనిసరి పరిస్థితితులలో ప్రయాణం చేయాల్సి వస్తే శుభ తిథులలో అశ్విని , రేవతి నక్షత్రాలలో శుభ హోరలో భర్తతో కలిసి ప్రయాణం చేస్తే శుక్రదోషం వర్తించదని శాస్త్రం సూచిస్తుంది.👍👍👍👍👍👍👍👍👍👍👍

*మూఢంలో చేయకూడని పనులు!!*


వివాహాది శుభకార్యాలు జరుపకూడదు.


లగ్నపత్రిక రాసుకోకూడదు. వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోరాదు.


పుట్టు వెంట్రుకలు తీయించరాదు.


గృహ శంకుస్థాపనలు చేయరాదు.


ఉపనయనం చేయకూడదు.


యజ్ఞాలు, మంత్రానుష్టానం, విగ్రహా ప్రతిష్టలు , వ్రతాలు చేయకూడదు.


నూతన వధువు ప్రవేశం , నూతన వాహనం కొనుట పనికిరాదు.


బావులు , బోరింగులు ,   తవ్వించకూడదు.

మధురంగా మాట్లాడు!

!


మధురంగా మాట్లాడు!


"కాకేమి తన్నుతిట్టెనె?

కోకిల తన్నేమి ధనము కోకొమ్మనెనే?

లోకము పగయగు పరుసని

వాకున,జుట్టమగు,మధురవాక్యమువలనన్"


        సంకుసాలనృసింహకవి-కవికర్ణరసాయనము.


          రాయలకాలంలపు నృసింహకవి ప్రబంధకవులకు దీటైనవాడు.అతడు మాంధాతృచరిత్రమును కవికర్ణరసాయనమను పేర మహాప్రబంధమును రచించి రాయలకంకిత మీయ విజయ నగరమునకరుదెంచెను.కారణమేమైననేమి?ఆమహాకవికి రాయలదర్శనము లభింపలేదు.నిరాశనిస్పృ హలేమిగిలినవి.

           ప్రస్తుత పద్యము మానవాళికి మంచిసందేశమందించు చున్నది.

కాకి కొట్టిందా?కోకిలపెట్టిందా?కాకికూతకు తిట్టుకుంటాం.కోకిలకూతను మెచ్చుకుంటాం.కారణం?

"పరషంగామాటలాడితే లోకమంతా పగయౌతుంది(అందరకూదూరమౌతావు) తీయగా మాటలాడితే అందరికీ చుట్టంగా మారుతావు.కనక,


" మధురంగా మాటలాడటం నేర్చుకో!"

మానవత్వానికి చేరువగా ఉండటం అలవరచుకో!"-అని;

                                       స్వస్తి!🙏🙏🌷🌷🌷🙏🙏🌷🌷🌷🌷👌

పుష్పం అంటే లక్ష్మి

 🕉️పుష్పం అంటే లక్ష్మి, పువ్వంటే జ్ఞానం, సరస్వతి. పువ్వంత కోమలమైనది, పరిమళంతో కూడుకున్నది, మంగళప్రదమైనది లోకంలో లేదు. 


అందులో ఎర్రటి పువ్వు కానీ నేలమీద పడి ఉంటే ఎవరైనా సరే దానిని తీసేయాలి ముందు. అది క్రింద ఉండకూడదు. ఎర్రపువ్వు క్రింద పడి సువాసిని కానీ, ఎవరు కానీ తొక్కకూడదు. సువాసిని ప్రత్యేకించి తొక్కకూడదు. ఎందుకంటే అది సౌభాగ్య వస్తువు. ఎవరైనా తొక్కుతారు అని వెంటనే తీసి ఏ చెట్టు మొదట్లోనో పెట్టేయాలి. అంత పరమ పవిత్రమైన పువ్వులు పూజ చేయడానికి నీ దగ్గర సరిపోయినన్ని లేకపోతే ఒక్క పువ్వు ఉంటే ఆ ఒక్క పువ్వే వేసి మిగిలినది పూజలో ఏ పదార్థం లోటు వచ్చినా అక్షతలతో పూరణ చేస్తారు. 


నిజానికి పూజలో మనం చాలా ఇవ్వనే ఇవ్వం. మంత్రం ఒకలా ఉంటుంది. మనం అక్కడ ఇచ్చేది ఏమీ ఉండదు. సింహాసనం సమర్పయామి అంటారు. రోజూ పట్టుకువచ్చి సింహాసనం వేస్తున్నామా? అక్షతలు వేస్తారు. మనసులో భావన చేయాలి. ఎర్రటి మెత్తటి పరుపులు, పాదపీఠం, సింహం ముఖం తీసుకువచ్చి అక్కడ వేస్తే దానిమీద ఆయన కూర్చున్నట్లు భావిస్తాం.


 ’క్షతము’ అంటే విరిగిపోవడం; ’అక్షత’ నడుము విరగని పసుపు కలిపిన బియ్యం. అవి వేస్తే అందులోకి వచ్చేస్తుంది పదార్థం. ఈశ్వరుడికి అందిపోతుంది. అలాగే తాంబూలం. మనం నిజానికి ఏం చెప్తాం అంటే ఒక మాట చెప్తాం ’ముక్తాచూర్ణేన సంయుక్తే తాంబూలం ప్రతిగృహ్యతామ్’ – అసలు మంచి ముత్యం తీసుకువచ్చి కాలుస్తారు. దాని బూడిద ఒక సూది మొన పెట్టి తీస్తే ఎంత వస్తుందో అంత వేయాలి. అది కానీ ఎక్కువ అయితే నోరు అంతా పొక్కిపోయి బొబ్బలు వచ్చేస్తుంది. ముత్యపుగుండ అంత శక్తివంతం. తృణం వేస్తే చాలు నోరంతా ఎంత ఎర్రగా పండుతుందో! తాంబూలం ఐదోతనానికి గుర్తు. అందుకే భర్త తాంబూలం పూజలో పెడితే దానిని మధ్యాహ్నం భార్య వేసుకోవాలి. ఆమె తాంబూలం వేసుకుంది అంటే భర్తగారి భోజనం అయిపోయింది అని గుర్తు. అయిదోతనానికి గుర్తు తాంబూలచర్వణం. అమ్మవారు ఎప్పుడూ తాంబూలం నములుతూ ఉంటుంది. అటువంటి తాంబూలానికి మనం చెప్పే మంత్రం ఒకటి, ఇచ్చేది ఒకటి. భక్తితో తమలపాకులు పెట్టి అందులో వక్క, అక్షతలు పెట్టి దేవుడి దగ్గర పెడితే అప్పుడు పూర్ణంగా పదార్థాలు అన్నీ వేసి తాంబూలం ఇచ్చినట్లే. 


అన్నింటికీ అక్షతలు సరిపోతున్నప్పుడు పువ్వుల దగ్గర చిదిపేసి నలిపేసి రేకులు వేయమని ఎవరు చెప్పారు? ఒక అందమైన పువ్వును ఈశ్వరుడు ఎలా సృష్టించాడో చూస్తే మహాశిల్పి కనబడతాడు. అంత అందంగా ఆయన గుదిగుచ్చి పువ్వు తయారుచేస్తే  తుంపి పూజ చేస్తారా? ఈశ్వరుడు అడిగాడా నిన్ను తక్కువైందని? తక్కువైందన్న మాట ఆయన అంటే జన్మలో పూజ చేయగలమా మనం? రోజూ సింహాసనాలు తెస్తామా? రోజూ పంచెలచాపులు తెస్తామా? పట్టుచీరలు తెస్తామా? దానికి పనికి వచ్చింది పువ్వుల దగ్గరకి వచ్చేటప్పటికి ఎందుకు తక్కువైంది? ఎందుకు పువ్వులు అలా విడగొట్టేసి రేకులు చేయడం. అది హింస. పరమ కఠోరమైన మనస్తత్త్వంతో చేసేటటువంటి పని. కొంతమంది తెలియక చేస్తారు మనస్సు కఠినమై కాదు. మనస్సు కోమలంగా ఉంటుంది. తెలియక పొరపాటు జరుగుతుంది. 


అందుకే పువ్వును చిదమనవసరం లేదు. ఒక్క పువ్వు ఉంటే ఒక్క పువ్వే ఇవ్వండి. మిగిలినవి అక్షతలతో పూరణ చేయండి.🕉️

సేకరణ

ద్విగుణీకృతమై ఉంటుందని

 .

                   _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*ఈక్షణం ద్విగుణం ప్రోక్తం*

*భాషణస్యేతి వేధసా!*

*అక్షిణి ద్వే మనుష్యాణాం*

*జిహ్వత్వేకైవ నిర్మితా!!*


తా𝕝𝕝


*మనము మాట్లాడేదానికంటే చూచి గ్రహించేది ద్విగుణీకృతమై ఉంటుందని బ్రహ్మచే చెప్పబడినది..... అందుకే మానవులకు రెండు కళ్ళు, ఒక నాలుక ఏర్పరచబడినది*.....అనగా, వీలైనంత *ఎక్కువ గ్రహించి సాధ్యమైనంత తక్కువ మాట్లాడాలి* అని భావము.....

సాదాకా మేలుకో -4 సమ భావము

సాదాకా మేలుకో -4

 సమ భావము

ఒక గురువు గారు కొంతమంది శిష్యులను కలిగి అరణ్యంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని అందులో వుంది తపస్సు చేస్తూవున్నారు. జిగ్న్యాసువులు అయిన శిష్యగణం గురువుగారి వాక్కుకు కట్టుబడి అయన చెప్పే నియమాలను ఉల్లంఘించకుండా గురువుగారిని సేవిస్తూవున్నారట. కాగా ఒకనాడు గురువు గారు శిష్యులను ఉద్దేశించి నాయనలారా తపస్సు చేసుకోవటానికి సాధన సంపత్తి కావాలి దానికోసం సదా మనస్సును అధీనంలో ఉంచుకొని ఎల్లప్పుడూ పరబ్రహ్మత్వం మీదనే మనస్సును కేంద్రీకరించాలి. ఎట్టి పరిస్థితిలోను స్త్రీలను చూడకూడదు, వారితో మాట్లాడకూడదు, వారిని స్పృసించకూడదు అలా కఠినమైన నియమాలను అలవర్చుకున్న మనస్సు స్వాధీనమై పరమాత్మా మీదకు మళ్లుతుంది అని బోధించారు. 

గురువు గారి బోధలను తూ చా తప్పకుండ పాటిస్తున్నారు శిష్యబృందం. వారు అడవిలో నివసిస్తున్నారు కాబట్టి వారికి సభ్య సమాజం చాలా దూరంగా ఉండటం వలన వారికి వారు వారి గురువుగారు మినహా వేరే మనుషులు ఆ అరణ్యంలో తారసపడటం లేదు కాబట్టి వారికి స్త్రీలను చూద్దామన్నా కనపడరు అందువలన వారు గురువుగారి ఆదేశాన్ని యధాతతంగా పాటించగలుగుతున్నారు. 

కొంతకాలం తరువాత శిష్యులు సమిధలు తీసుకొని రావటానికి అరణ్యంలోకి వెళితే వారికి అక్కడ ఒక తీవ్రంగా పారుతున్న యేరు కనిపించింది. ఆ యేటి వడ్డున ఒక యువతి ఆ యేటిని దాటటానికి ప్రయత్నిస్తూ దాటగలనో లేనో అని భయంతో ఉండటం గమనించారు.  శిష్య్లను చుసిన ఆ యువతి అయ్యలారా నేను ఆసక్తురాలను నా మీద దయతో ఈ యేటిని దాటించగలరు అని వేడుకుండి అది విన్న శిష్యులు వారికి వారి గురువుగారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి అరే  మనం  గురువుగాను మనకు ఏమిచెప్పారు మనలను స్త్రీలను చూడకూడదు, మాట్లాడకూడదు, అన్నారుకదా కాబట్టి మనంఆమెవైపు చూడకూడదు అని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆమెను వదిలి  వెళ్లారు. ఎవరు  సాయ పడటానికి ముందుకు రావటంతో ఆమె  నిరాశపడింది. అప్పుడు సత్యపాలకుడు అనే ఒక శిష్యుడు అమ్మ నీవు విచారించవలదు నేను నీకు సాయపడగలను అని ఆమెను తన రెండు చేతులతో ఎత్తుకొని నదిని దాటించాడు. అతను చేసిన సహాయానికి ఆమె కృతజ్ఞతలు తెలిపి వేదిలింది. తరువాత సత్యపాలకుడు మరల నదిని దాటి ఇవతలైవడ్డుకు వచ్చి మిగిలిన తన మిత్రులను కలిసాడు.

మిత్రులంతా కూడా సత్యపాలుని మీద కోపంగా వున్నారు.  నీకు గురువు గారి మీద ఏమాత్రం గౌరవం లేదు నీకు గురువు గారి మాటపై ఏమాత్రం విలువ లేదు.  మేము గురువుగారితో చెప్పి నిన్ను ఆశ్రమనుంచి పంపిస్తాము అని బెదరించి చీదరించుకుంటూ, విస్సుకుంటూ ఆశ్రమ దోవపట్టారు. అందరు ఆశ్రమంలో గురువుగారిని కలుసుకొని సత్యపాలుడు చేసిన పని చెప్పి గురువుగారు సత్యపాలుడు సాధనకు పనికి రాదు మీ మాటలను అస్సలు గౌరవించలేదు యవ్వనంలో వున్న ఒక యువతితో మాట్లాడటమే కాకుండా అమాంతం ఆమెను తన రెండు చేతులతో మోసుకొని వెళ్లి నది అవతలి వడ్డుకు చేర్చాడు.  ఇటువంటి గురుద్రోహిని వెంటనే మన ఆశ్రమంనుండి వెళ్ళకొట్టండి అని అన్నారు. 

గురువుగారు సత్యపాలుని ఉద్దేశించి నాయనా వాళ్ళు చెప్పేది నిజమేనా నీవు ఒక యువతిని నది దాటించావా అని అడిగారు.  దానికి సత్యపాలుడు గురువుగారు నేను ఒక మనిషిని నది దాటించిన మాట నిజమే కానీ అది స్త్రీయా లేక పురుషుడా అనేది గమనించలేదు అని జవాబు చెప్పాడు.\
నీవు పూర్తిగా అబద్దం చెపుతున్నావు ఇప్పడికి మాకు ఆ అమ్మాయి మొహం జ్ఞ్యాపకం వుంది ఆమె కట్టుకున్న వస్త్రాలు, ఆమె కురులు ఒక్కసారి చుస్తే చాలు ఎవరు కూడా మరచిపోలేరు. గురువుగారు వీడు పూర్తిగా అబద్దం చెపుతున్నాడు మీరు కోరితే నేను ఆ అమ్మాయి బొమ్మను కూడా గీసి చూపించగలను వాడు అవునంటాడో  కాదంటాడో చూస్తాను అని ఆవేశంతో ఒక శిష్యుడు పలికాడు. గురువుగారు మరల సత్యపాలుని అడిగారు.  దానికి సత్యపాలుడు వినమ్రుడు గురువర్యా నేను వారు చెప్పింది ఏది కూడా గమనించలేదు అని బదులు చెప్పాడు.
గురువుగారు శిష్యులను ఉద్దేశించి ఇలా అన్నారు నాయనలారా మీరు ఆమెను తాకను కూడా తాకలేదు అని అనుకుంటున్నారు  కానీ మీరు ఇంకా ఆమె విగ్రహాన్ని మనసులో  తాకుతున్నారు. సత్యపాలుడు ఆమెను నది ఒడ్డున ఆమె స్మృతులతో సహా వదిలివేసాడు కానీ ఇంకా మీరు ఆమెను మీ మనస్సులో మోస్తున్నారు. నేను చెప్పింది పూర్తిగా ఆచరించిన వాడు సత్యపాలుడు కానీ మీరు కాదు నాయనా మనస్సును శుద్ధిగా ఉంచుకోలేని వాడు సాధనకు పనికిరాడు  అని వారలను  మందలించారు   గురువుగారు. 
సాధకుడు అలవరచుకోవలసిన అతి కఠినమైనది, ఉత్కృష్టమైనది అంటే సమభావం.మాత్రమే  ఇది సాధించటం చెప్పినంత సులువు కాదు మహా మహా తాపసులు కూడా జారి కింద పడ్డ సందర్భాలు అనేకం మనకు పురాణాలలో తెలియచేయబడింది. మహా తపోధనుడు సృష్టికి ప్రతిసృష్టి చేయగల మహర్షి విస్వామిత్రుడు వంటి వారే సమ భావనను ఆచరించలేక మేనకకు లొంగి తన దీక్ష భంగం చేసుకున్న ఉదంతం మనందరికీ విదితమే. 
కాబట్టి సాదారణ తపమాచరించి మనము ఏమాత్రము మనస్సును నిగ్రహించుకోగలము అనేది సందేహాత్మకమే కానీ సాధకుడు ఎట్టిపరిస్థితిలోను తానూ తన అకుంఠిత దీక్షను విరమించుకోవటానికి సిద్దపడదు కాబట్టి దీక్షాపరుడైన సాధకుడు నిరంతరం పరబ్రహ్మ మీదనే మనస్సును నిలపటానికోసం కఠోర నియమాలను ఆచరించవలెను. 
సాధకుడు ఇతర జీవులతో సమభావం కలిగి ఉండటం గురించి ఇంకొక కందికలో తెలుసుకుందాం. 

ఓం తత్సత్

ఓం శాంతి శాంతి శాంతిః

ఇట్లు భార్గవశర్మ