4, జూన్ 2022, శనివారం

నిరుపహతి స్థలంబు

 సాహితీమిత్రులారా!

కృష్ణదేవరాయలు ఒక కృతిని రచింపమని అడిగితే పెద్దన ఈ పద్యం చెప్పాడని ప్రసిద్ధి చెందినది.


నిరుపహతి స్థలంబు రమణీప్రయదూతిక తెచ్చి యిచ్చు క

ప్పుర విడెమాత్మకింపయిన భోజన ముయ్యెల మంచ మొప్పు త

ప్పరయఁ రసజ్ఞు లూహఁ దెలియంగల లేఖక పాఠకోత్తముల్

దొరికినఁగాని యూరక కృతుల్ రచియింపు మటన్న శక్యమే


అంటే కృతి రాయాలంటే సరైన స్థలం దానితో పాటు రమణీయమైన ప్రియదూతిక తెచ్చి ఇచ్చే కర్పూర తాంబూలము, ఆత్మకు ఇంపైన భోజనము, ఉయ్యెల మంచము, ఇది ఒప్పు ఇది తప్పు అని తెలియగల రసజ్ఞులు, చెప్పినదాన్ని తెలుసుకొని రాయగల లేఖకులు, ఉత్తమమైన పాఠక మహాశయులు కావాలి. ఇవేవీ లేకుండా కృతి రాయడం ఎలా - అని భావం.

తరువాణి

 తరువాణి తయారి విధానం , ఉపయోగాలు  - 


   ఒక శుభ్రమైన కుండలో గంజి దినదినము పోయడం వలన తయారు అయ్యేది.  ముందు ఒక కొత్త కుండని తీసుకువచ్చి శుభ్రపరచి పరిశుభ్రమైన ప్రదేశం నందు కదల్చకుండా ఈశాన్యం మూల ఉంచి ముందు గంజిని పోసి మరుదినము అందులో కొంతగంజిని తీసివేసి కొత్తగా గంజిని పోయవలెను . ఇలా ప్రతిదినం చేయుచుండిన ఆ గంజి పులియును. దీనిలో ప్రతిదినం రాత్రుల యందు అవసరం అయినంత అన్నమును వేయుచూ మరునాడు ఆ అన్నమును పిండి తీసి అందులో కావలసినంత తరువాణి తేటను చేర్చుకొని దానిలో మజ్జిగ కలుపుకుని గాని , కలపకుండా గాని సేవింతురు . 


  దీని ఉపయోగాలు  - 


 *  మేహా శాంతి , పైత్య శాంతి చేయును . 


 *  దాహం , శరీర తాపం , శరీరశ్రమ పోగోట్టును .


 *  జీర్ణశక్తిని కలుగజేయును.


 *  శరీరపుష్టిని కలుగజేయును .


 *  అతివేడిని అణుచును . 


  కొంతమంది కేవలం గంజితోనే చేస్తారు . ఒక్కో ప్రదేశం నందు ఒక్కో రకంగా ఉండును. శ్రీకాకుళం , విజయనగరం జిల్లాలలో  ఈ తరువాణి కి కూరగాయల ముక్కలు చేర్చి అద్భుతమైన రుచితో చారు తయారుచేస్తారు.వారు ఆ కుండని లక్ష్మి కుండగా పిలుచుకుంటారు. 


            మరిన్ని అతి సులభ యోగాల కొరకు నా గ్రంథాలను చదవగలరు.


     గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

మనస్సే

 కశ్లోకం:☝️

*మన ఏవ జగత్సర్వం*

    *మన ఏవ మహారిపుః l*

*మన ఏవ హి సంసారో*

    *మన ఏవ జగత్త్రయం ll*

    - ఋభుగీత 2-34


భావం: ఈ మనస్సే సర్వజగత్తు; మనసే పరమశత్రువు; అదియే సంసారహేతువు; అదే మూడు లోకములు కూడా అగుచున్నది. మనస్సును స్వాధీనము గావించుకొనుచో జగములన్నీ స్వాధీనమై ఉండును.

ఆచారాలు

 *మడి - ఆచారాలు...*


బ్రాహ్మణ జాతిలో ఆచరించే మడి - ఆచారాలు రాను రాను జాతిలో కనుమరుగవుతున్నాయి. బయటవారిలోనే కాదు, బ్రాహ్మణ జాతి లోని యువతలోనూ అవి హాస్యాస్పదంగా, అర్థరహితంగా కనబడుతున్నవి. అందుకు కారణం ఏమిటంటే, అందులో వున్న అంతరార్ధం విడమరచి చెప్పలేక పోవడం.


ఇప్పటికే, గుడీ, దైవ సంబంధమైన సామూహిక కార్యక్రమాలలో, దైవ కార్యాలు చేసే/చేయించే బ్రాహ్మణులు కూడా మడి అంతగా పాటించడం లేదు చాలాచోట్ల. మనముందే వాళ్ళు వేసుకున్న షర్టు విప్పేసి, మెడలో ఉత్తరీయం వేసుకుని ' ఓం ! ' అని పనులు మొదలు పెట్టిస్తున్నారు.


ఏదైనా దైవకార్యం నిర్వర్తించేటప్పుడు, ముందుగా ఆ దేవతను ఆహ్వానించే పద్దతి మనకు వున్నది. ప్రాణాయామం చెయ్యమనడానికి బదులు పురోహితుడు, ' మీ ముక్కులు పట్టుకోండి. ' అంటాడు. మనం పట్టుకుంటాం. ఆచమనం, ప్రాణాయామం అంత: శుద్ధి కని ఆయన చెప్పడు, మనకూ తెలీదు. అయినప్పటికీ ఇప్పటికీ మంత్రాల ద్వారా చెబుతూనే వున్నారు, అందులో మార్పు ఏమీలేదు. 


అర్ధమైన వారికి అర్ధం అవుతుంది. అర్ధం కాని వాళ్ళు పురోహితుడు, ' చేతులను మీ వైపు తిప్పుకోండి ' అని చెప్పి ఆ దేవతని ' ఆవాహయామి ' అని మన చేత చెప్పిస్తారు. అలాగే కార్యక్రమం అయిన తరువాత, ' మంత్రహీనం, క్రియాహీనము.. ' చెప్పించి, ఆ దేవతకు ఉద్యాపన చేయించి ఈశాన్యం వైపుకు జరిపిస్తారు. ఇదంతా, ' కార్యక్రమం మొదలు, తుది ' అని తెలుసు కానీ, ఆ దేవతలు మనతో అప్పటిదాకా వున్నారన్న భావం మనకు రాదు.


ఇవన్నీకూడా మనచేత చేయిస్తారు. అయినా మనకు అవేమీ పట్టవు. వచ్చిన బంధువులను చూస్తూ, 'కాఫీలు తాగారా, టిపినీలు తిన్నారా ! ' అని వాళ్ళను నవ్వుతూ పలుకరిస్తూ, వచ్చిన వాళ్ళచేతనే, ' మీరు కార్యక్రమం చేసుకోండి. మేము మాకు కావలసినవి చూసుకుంటాము, ' అని చెప్పించుకుంటాము. మీ తమ్ముళ్లతోనో, కుటుంబ సభ్యులతోనో వారు గడుపుతారు.


ఈలోపు ఇంకొక చుట్టమో, స్నేహితుడో, మన ఆఫీసరో వస్తాడు. మళ్ళీ ఇదే తతంగం. ఇంతకుముందు రోజుల్లో, పురోహితులు మధ్యలో కర్తను ఎవరైనా మాట్లాడిస్తే, అభ్యంతరం పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆలా చేస్తే, ' మళ్ళీ పిలవరేమో ' అని వాళ్ళు కూడా వాళ్ళ సెల్ ఫోన్ లతో మధ్య మధ్యలో కాలక్షేపం చేస్తూ వుంటారు.


అదే విధంగా సంధ్యావందనం సమయంలో, ' ఆయాతు వరదా దేవీ... ' అని చెప్పినప్పటినుంచి, గాయత్రీ, సావిత్రి, సరస్వతి మొదలైన దేవతలను మనమీదకు ఆహ్వానించుకుంటాము. తిరిగి ' ఉత్తమే శిఖరే జాతే.. ' అనిచెబుతూ ' గచ్ఛదేవి యధా సుఖం ' అని చెప్పేదాకా అమ్మలంతా మనతోనే వున్నారన్న మాట. ఇంత విశదంగా ఏ బ్రాహ్మలూ చెప్పరు. మనమూ తెలుసుకోవాలని అనుకోము.


అలాగే, పూర్వం రోజుల్లో, ఇళ్లల్లో ఆడవారు కూడా, ఏటికివెళ్లి నీళ్లు తెచ్చుకునేటప్పుడు, జలదేవతను ఆరాధించి నీళ్లు బిందెలతో నింపుకునేవారు. ఆ దేవత వారితో వున్నదనే భావనతో ఇంటికివచ్చి, దానితో వంట కార్యక్రమాలు చేసేవారు. అలాగే అగ్ని. అగ్నిని ఆవాహన చేసి, జలంతో వంటచేస్తూ, ' అన్నం పరబ్రహ్మ స్వరూపం. ' అనే భావనతో, బియ్యాన్ని వండుతూ, శాకంబరీ దేవతగా కూరగాయలను తయారు చేసుకుంటూ, మధ్య మధ్యలో ఇంటి యజమాని పూజకు సహాయం చేస్తూ వుండేవారు.

ఇప్పుడు చెప్పండి. అలాంటివారికి, వారిని ఎవరైనా ముట్టుకున్నా, అపరిశుభ్రమైనవి ఏమైనా కనబడినా, తగిలినా, ఏదో అపరాధనా భావము కలిగి, వాటిపై శుద్ధి నిమిత్తం నీరు చల్లడము, ' విష్ణు: ,విష్ణు: అనీ శివ: శివా ' అనీ అనడమూ తిరిగి పనిలో మునిగిపోవడం ఆనవాయితీ.


జలం మానవుడికీ, దేవతలకూ అనుసంధానమైన పంచభూతములలో ఒకటి. అందువలన నీటితో ఆ గిన్నెపైనో, బట్టపైనో శుద్ధి కార్యక్రమం చేసేవారు, వీలయితే తిరిగి స్నానం చేసేవారు. ఇక్కడ ' నీళ్లు చల్లితే మైల, మడి అయిపోతుందా? ' అని ప్రశ్నలు యువతరం వేస్తారు. ' నీళ్లు గుమ్మరించుకుంటే, శుద్ధి అయిపోతారా ? ' అని వితండవాదం చేస్తారు. ఆ జలం ద్వారా, అప్పటికే వారు దేవతను ఆహ్వానించుకుని వుండడం వలన, ఆ దేవతను సంతృప్తి పరచే కార్యం శుద్ధి చేసుకోవడం.


ఇదంతా ఎవరూ చెప్పరు. ఎంత సేపటికీ, ' పసుపు వాడితే బ్యాక్తీరియా పోతుంది. ఇంకేదో చేస్తే క్రిమి కీటకాలు పోతాయి ' అని చెబుతారు కానీ. ' మనది కర్మభూమి. దైవభూమి. మనము దేవతలను నమ్ముతాము. దేవతల ప్రీతి కోసం ఇదంతా చేస్తున్నాము. ' అని ఢంకా బజాయించి యెవరూ చెప్పరు. ఇంకా హేళన చేస్తారేమో అని భయం. ఉన్న విషయం చెప్పడానికి మనకూ తెలియాలి కదా !


పెద్దలు, పండిత శ్రేష్ఠులు, అనేకమంది మన మిత్ర సమూహంలో వున్నారు. దీనిపై ఇంకా స్పందించి యువతలో మన మడి ఆచారాలమీద చులకన భావన పోయేటట్లు చేయగలరని మనవి. ముందు మన బ్రాహ్మణ యువతకు ఇవి అర్ధమైతే, మిగిలిన వారికీ చెప్పగల పరిస్థితిలో మనం వుంటాము.


మనకే అర్ధంగాక, దైవకార్యాలు జరుగుతున్నప్పుడు కూడా, మడి కట్టుకున్నవాళ్లకు దూరంగా వుండమని చెప్పలేకపోవడం మన దౌర్భాగ్యం. ' ఆయన అట్లాగే అంటాడు లేవయ్యా, అరవై దాటినాయి కదా ! చాదస్తం. ' అనే స్థితి మనకు రాకుండా మనలను మనం, కాపాడుకుందాం.

కార్తెల పరిజ్ఞానం..

 *కార్తెల పరిజ్ఞానం..*


ఉపగ్రహ సమాచారం అందుబాటులో లేని కాలంలోనే నిత్యపరిశీలనతో వాతావరణాన్ని అంచనావేస్తూ వ్యవసాయం చేశారు రైతులు. ఏడాది 27 నక్షత్రాలను 27 కార్తెలుగా (ఒక కార్తె సుమారు 14రోజులు ఉంటుంది) విభజించి ఆయా కార్తెల్లో వాతావరణం తీరు, దానికనుగుణంగా చేయాల్సిన, చేయకూడని పనులను సామెతలుగా చెప్పారు. ఈ కార్తెలలోని వర్షపాతాన్ని బట్టి ఆ ఏడు అతివృష్టా, అనావృష్టా లేక సామాన్యమా చెప్పగలిగేవారు. 


తొలకరి వానలు ఆషాఢంలో మృగశిరకార్తె (సుమారు జూన్‌ 8- 21)లో ప్రవేశిస్తాయి. *‘మృగశిర కురిస్తే ముంగిళ్లు చల్లబడతాయి,* *మృగశిర చిందిస్తే మిగిలిన కార్తులు కురుస్తాయి,* *మృగశిర వర్షిస్తే మఖ గర్జిస్తుంది, మృగశిరలో తొలకరి వర్షిస్తేనే మఖలో వర్షాలు పడతాయి,* *మృగశిర చిందిస్తే ముసలెద్దు రంకె వేస్తుంది,* *మృగశిరలో వేసిన పైరు మేలు చేస్తుంది’* తదితర సామెతలు సేద్యంలో మృగశిర  ప్రాధాన్యాన్ని చెబుతాయి.

      

ఆరుద్ర (జూన్‌ 22- జూలై 5) కార్తెలో వర్షాలు ఎక్కువ పడడం పంటకు చాలా అవసరం. ఆ అవసరాన్ని తెలిపేవే *‘ఆరుద్ర వాన అదను వాన,* *ఆరుద్ర కురిస్తే దారిద్య్రం ఉండదు,* *ఆరుద్రకార్తె విత్తనానికి- అన్నం పెట్టిన ఇంటికి చెరుపు లేదు,* *ఆరుద్రలో అడ్డెడు చల్లితే సులువుగా పుట్టెడు పండుతాయి’* లాంటి సామెతలు. 

      

తరువాత కార్తెలు పునర్వసు (జూలై 6- 19) పుష్యమి (జూలై 20- ఆగష్టు 02). *‘పునర్వసు, పుష్యములు వర్షిస్తే పూరెడుపిట్ట అడుగైనా తడవదు’* సామెత ఆ రోజుల్లో వానలు తక్కువ అనే అంశాన్ని తెలుపుతుంది. 


ఆపై వచ్చే ఆశ్లేష కార్తె(ఆగష్టు 3- 16)లో నాన్పుడు వర్షం కురుస్తుంది. నాట్లు కూడా త్వరగా సాగుతాయి. అధిక వర్షం సాగు పనులకు ఆటంకం కలిగిస్తుంది. అరికాలు తడి అయ్యేంత వర్షం నాట్లకు అనుకూలం. అందుకే *‘ఆశ్లేషలో ఊడిస్తే అడిగినంత పంట*, *ఆశ్లేషలో అడుగునకొక చినుకు అయినా అడిగినన్ని పండలేను అందట వరి*, *ఆశ్లేషలో అడ్డెడు చల్లడం మేలు’* మొదలైనవి ఆశ్లేష కార్తెకు సంబంధించిన సామెతలు. 


మఖ (ఆగష్టు 17- 30) శ్రావణంలో వస్తుంది. వానలు ఎక్కువ. *‘మఖలో మానెడు చల్లడం కన్నా ఆశ్లేషలో అడ్డెడు చల్లడం మేలు, మఖలో చల్లిన విత్తనాలు మచ్చలు కనబడతాయి,* *మఖ ఉరిమితే వెదురు మీద కర్రయినా పండుతుంది’* లాంటివి ఈ కార్తెలో చేయాల్సిన వ్యవసాయ పనుల గురించి తెలియచేస్తాయి. 

      

ముందు వచ్చే కార్తెలలో వర్షాలు అంతగా కురవకపోయినా వర్ష రుతువులో వచ్చే మఖ, పుబ్బ (ఆగష్టు 31- సెప్టెంబరు 13) కార్తెలలో తప్పక కురవాలి. లేకపోతే క్షామం తప్పదు. *‘మఖ పుబ్బలు వరుపయితే మహా ఎత్తయిన క్షామం*, *మఖలో పుట్టి పుబ్బలో మాడినట్లు’* (పుట్టగొడుగులు మఖలో పుట్టి పుబ్బలో మాడిపోతాయి. ఏదైనా స్వల్పకాలంలోనే అణగిపోతే దీనిని వాడతారు) సామెతలు దీన్ని సూచిస్తాయి. *‘పుబ్బలో చల్లడం దిబ్బ మీద చల్లినట్లే’* అనేది పుబ్బలో విత్తడం మంచిది కాదని చెబుతుంది.


*ఉత్తర చూసి ఎత్తరగంప*


ఉత్తర కార్తె సెప్టెంబరు మధ్యలో వస్తుంది. ఖరీఫ్‌ పంట ఒకదశకు చేరుతుంది. ఈ కార్తె ప్రవేశించే నాటికి వానలు సరిగా పడకపోతే సాగు కష్టం అని చెప్పడమే ఈ సామెత ఉద్దేశం. దీన్ని సూచించేందుకే గంపను ఎత్తి పక్కన పెట్టమని చెప్పారు జానపదులు. ఉత్తరలో వరినాటడానికి ఆలస్యం అవుతుంది. వేరుశనగ, సజ్జ, పప్పు ధాన్యాలు కూడా ఈ కార్తెలో విత్తకూడదు. జొన్న మాత్రం కొన్ని ప్రాంతాలకు అనుకూలం. ఉలవ అన్ని ప్రాంతాలలో చల్లడానికి మంచి అదును. అందుకే *ఉత్తర పదును ఉలవకే అదును* అనే సామెత పుట్టింది. *‘ఉత్తర ఉరుము తప్పినా, రాజుపాడి తప్పినా, చెదపురుగుకి రెక్కలొచ్చినా కష్టం, విశాఖ చూసి విడవర కొంప*, *ఉత్తర హస్తలు వృష్టికి ప్రమాణం* లాంటి సామెతలూ ఇలాంటివే. 

      

ఉత్తర తరువాత వచ్చేది హస్త (సెప్టెంబరు 27- అక్టోబర్‌ 11). ఆశ్లేషలో నాటిన వరిపంట హస్తకార్తె వచ్చే సరికి అనాకుపొట్ట దశకు వస్తుంది. చిత్తకార్తెలో (అక్టోబరు 11- 23) చిరుపొట్ట వస్తుంది. వెన్ను చిరుపొట్టతో ఉంటుంది. ఈ సమయంలో నీరు చాలా అవసరం. అప్పుడు వర్షం లేకపోతే పంట చేతికి రావడం కష్టం. *‘హస్త కురవక పోతే విత్తినవాడూ, విత్తని వాడూ ఒక్కటే*, *హస్తకు అనాకుపొట్ట, చిత్తకు చిరాకు పొట్ట*, హస్త చిత్తలు ఒక్కటైతే అందరి సేద్యం ఒక్కటే, చిత్త కురిస్తే చింతలు కాస్తాయి, *చిత్త స్వాతులు కురవకపోతే చిగురుటాకులు మాడిపోతాయి...’* లాంటి సామెతలు చాలా ఉన్నాయి.


*యథా చిత్త తథా స్వాతి*


చిత్తలో వర్షం ఎలా ఉంటుందో, స్వాతిలో కూడా అలాగే ఉంటుంది. ఈ కార్తెలో సాధారణంగా గాలివానలు వస్తాయి. *‘స్వాతివాన చేనుకు హర్షం* (మెట్ట ప్రాంతం), *చిత్త చిత్తగించి, స్వాతి చల్లచేసి, విశాఖ విసరకుంటే వీసానికి పుట్టెడు పండుతానంటుంది జొన్న’* లాంటి సామెతలు తెలుగులో ఎన్నో ఉన్నాయి. విశాఖ కార్తె వచ్చేప్పటికి వరి కోతకు సిద్ధంగా ఉంటుంది. వర్షం అవసరం ఉండదు. ఈ అనుభవంతో వచ్చిన సామెత *‘విశాఖ కురిస్తే పంటకు విషమే’*. అయితే.. మఖ, పుబ్బల్లో చల్లిన ఆముదాలు విశాఖలో పొట్టమీద ఉంటాయి. అప్పుడు వాటికి వర్షం అవసరం. అందుకే *‘విశాఖ వర్షం ఆముదాలకు హర్షం’*! 


ఇక భరణి (ఏప్రిల్‌ 27- మే 10), కృత్తిక (మే 11- 24), రోహిణి (మే 25- జూన్‌ 7)లపై *‘భరణి కురిస్తే ధరణి పండును*, *కృత్తికలో విత్తితే కుత్తుకలు నిండవు*, *రోహిణిలో విత్తితే రోటిలో విత్తినట్లే’* లాంటివి రైతుల ప్రకృతి పరిశీలనా దృష్టికి నిదర్శనాలు.


*ఊరిముందరి చేను... ఊళ్లో వియ్యం అందిరావు*


ఊరికి సమీపంలో చేను ఉంటే ఊళ్లో ఉండేవారు, వచ్చిపోయే వారు, పశువుల బెడద... ఇంత కష్టం ఉంటుంది. ఇక ఊళ్లో వియ్యం సంగతి... భార్యా భర్తలిద్దరిది ఒకే ఊరయితే ఆ ఇంట్లో విషయం ఈ ఇంట్లో, *ఈ ఇంట్లో విషయాలు ఆ ఇంట్లో తెలిసి సంసారం ఇబ్బందికరంగా సాగుతుంది.* ఈ సామెత పుట్టుకకు కారణం ఇదే. *‘కర్ణునితో భారతం సరి కార్తీకంతో వానలు సరి, ఫాల్గుణమాసపు వాన పది పనులకు చెరుపు’* ఇలా ఎన్నో సామెతలు జీవితానుభవం నుంచి పుట్టాయి. 

      

వందల ఏళ్లుగా ఈ విజ్ఞానం రైతులకు దారిదీపంగా నిలిచింది. ఇప్పుడు ఈ విజ్ఞానం రూపుమాసిపోతోంది. ఇప్పటి వారికి చాలా సామెతలు, ముఖ్యంగా వ్యవసాయ పనులకు సంబంధించినవి తెలియవు. వీటిని పాఠ్యప్రణాళికలో భాగం చేయాలి. అప్పుడే మనదైన విజ్ఞానం ముందుతరాలకు భద్రంగా అందుతుంది.


 స్వస్తి

మెసేజస్

 గ్రూపులో మెసేజస్ కి చక్కగా స్పందించే రంగారావు గారు గ్రూపు నుండి లెఫ్ట్ అయ్యారు, సరదాగా కలవడానికి కూడా రావటం లేదు.. కొన్ని వారాలయ్యాక గ్రూప్ అడ్మిన్ నాగేంద్ర ఆయన ఇంటికి వెళ్ళేసరికి , బాగా చలిగా ఉండటం వలన కొన్ని కర్ర దుంగల మంటల పక్కన చలి కాగుతూ ఒంటరిగా కూర్చున్నారు.. నాగేంద్రను చూసి విష్ చేసారు.. ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది.. కాలుతూ నాట్యం చేస్తున్న జ్వాలను చూస్తున్నారు.. మధ్యలో నాగేంద్ర లేచి బాగా కాలుతున్న కర్ర దుంగను పక్కకు లాగేసి మరల కుర్చీలో కూర్చున్నారు.. జరిగే దానిని నిశితంగా చూస్తున్నాడు రంగారావు.. పక్కకు లాగిన ,  బాగా కాల్తున్న ఒంటరి దుంగ, క్రమేపీ మంట ఆరి చల్లబడి నల్లని బొగ్గుగా మారింది.. తిరిగి చచ్చుబడి, చల్లబడిన దుంగను కాలుతున్న మంటల్లో వేసాడు అడ్మిన్. అది తిరిగి కాలుతున్న దుంగలతో కలసి మండి వేడిని కాంతిని ఇచ్చింది. నాగేంద్ర లేచి వెళ్ళడానికి గేట్ దగ్గరకు చేరాడు.. ఇంటికి వచ్చి  నందుకు, మనసుకు హత్తుకునే పాఠం చెప్పినందుకు ధాంక్యూ నాగేంద్రా ! రేపటి నుండి మన మీటింగులకు వస్తాను. తిరిగి మన వాట్సప్ గ్రూపులో నన్ను ఏడ్ చెయ్ అన్నాడు.. అసలు  జీవితంలో గ్రూపు ఎందుకంటే ప్రతి మెంబరు మిగిలినవారి  నుండి జ్వాల , వేడిని ( fire & heat ) పొంది ఉత్తేజాన్ని పొంద  టానికి.. గ్రూపు లోని వారందరూ వేడి తగ్గకుండా ఏక్టివ్ గా  ఉండాలి.. గ్రూపనేది ఒక కుటుంబం. ఏదో ఒక సమయంలో కొన్ని msgs, మాటల యుద్ధాలు, అపార్ధాలు గ్రూపు సభ్యుల్ని బాధ పెట్టొచ్చు.. గ్రూపనేది మనం కలవడానికి, ఆలోచనలు పంచుకో డానికి , మనం ఒంటరివాళ్ళం కాదని చెప్పడానికి.. జీవితం చాలా అందమైంది ! ఎప్పుడో తెలుసా! కుటుంబ సభ్యులు , మరియు స్నేహితులతో ఉన్నప్పుడు.. మనలో హుషారు జ్వాలలు రగిలుస్తున్న స్నేహితులు, కుటుంబంతో  ఉన్న గ్రూపుకు , గ్రూపు అడ్మిన్ కు ధాంక్స్ చెబుదాం.... 

శుభోదయ వందనములతో..

పొడుపు పద్యాలు

 జాతీయ తెలుగు సాహితీ పీఠము …. 

  తేనియల్ చిందు నా భాష తెలుగుభాష

        డా. నలవోలు నరసింహా రెడ్డి


          ……  పొడుపు పద్యాలు …...


1. ఆ. నమ్మదగిన పదము నాలు గక్షరములు  

ఒండు జూడ నర్థమొప్పు ''మంచి''       

అరయ నాది తొలగ నగను ''అక్షరము''గ    

పదము తెలుప వలయు పసిడి బాల..!  


2. తే.గీ.పడతి పంచాక్షర ములును పదములోన

కొమ్మ మొదటిది నాల్గును గూడ కీర్తి

పొలతి మూడునైదును గూడ భుజగమగును

తెలిసి యున్నచో చెప్పుము తెలుగు లేమ

పి.మోహన్ రెడ్డి.

భూమికి నమస్కరించాలి!*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*భూమికి ఎందుకు నమస్కరించాలి!* 


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌿మనము ఎన్ని తప్పులు చేసినా, చేయకూడని పనులు చేసినా, చిన్నతనంలో తల్లి (జన్మనిచ్చిన తల్లి) గోరు ముద్దలు తినిపించి, 


🌸ఎత్తుకొని, ముద్దాడి, ప్రేమతో బిడ్డే తన లోకంగా జీవిస్తుంది తల్లి అలాంటి అమ్మ మనలని నవమాసాలు మోసి జన్మనిచ్చింది కనుక జనని అయింది.                   ఆ తరువాత అమ్మ బిడ్డను భూమాతకు ఇచ్చింది కాబట్టి (జనని జన్మ భుమిచ్చా స్వర్గాదపి గరియసి)జనని జన్మ భూమికి ఇచ్చింది ఈ భూమి మనలను జీవితాంతం మోసి చనిపోయిన తరువాత తనలోనే కలుపుకొంటుoది కనుకనే ఈ భూమి స్వర్గం కన్న గొప్పది. 


🌿అలాగే భూమాత మన ఆకలి తీరుస్తోంది.. దాహం తీరుస్తోంది.. సకల జీవరాసులకు, 84 కోట్ల జీవరాసుల ఆకలి దప్పులు తీర్చుతున్న తల్లి భూమాత. 


🌸అలాగే 84 కోట్ల జీవరాసుల మల మూత్రములను భరించి స్వీకరిస్తున్న మాత భూమాత.. 


🌿మనకు 10 సం:ల వయసు వచ్చిన తర్వాత మన తల్లి మన మల మూత్రములను తీసి శుభ్రం చేస్తుందా.?


🌸 మనకు ఎంత వయసు వచ్చినా, మన యొక్క మల మూత్రములను, తన మీద భరించడమే కాక, వాటి వలన దుర్గంథము రాకుండా, తద్వారా వ్యాధులు ప్రబలకుండా, 


🌿దానిని తనలో ఐక్యం చేసుకొని, 

ఈ జీవ కోటిని అనంత ప్రేమానురాగములతో కాపాడుచున్న మాత భూమాత.. 


🌸చివరికి మనము మరణించిన తర్వాత మనతో పాటు అమ్మ (కన్నతల్లి), నా వారు నా వారు అని కౌగలించుకొని మనతో సహజీవనము చేసిన భార్య/ భర్త, బిడ్డలు, స్నేహితులు, బంధువులు మనతో రాకుండా శ్మశానములో ఆగిపోతే, 


🌿నా బిడ్డ ఇంతకాలం (మరణిచిన మృతదేహము ఎలాంటి జీవనమును కలిగి ఉండినా సరే) జీవించి తనువు చాలించాడు.., అని అవ్యాజమైన ప్రేమతో, తన కడుపులో దాచుకునే తల్లి భూమాత... 


🌸కేవలం మనలనే కాదు 84 కోట్ల జీవరాసులను ఆదరించే తల్లి భూమాత. 


🌿ఇక్కడ ఒక్కక్షణం ఆలోచించండి.., భూమాత అలా తన కడుపులో దాచుకోక వదిలేస్తే, ఆ శరీరాలు కృళ్లి, కృశించి, దుర్గంధ భూయిష్టమై రకరకాల వ్యాధులు (కలరా/ ప్లేగు/మలేరియా) ప్రబలితే, 


🌸ఎంత జన నష్టం జరుగుతుందో ఆలోచించండి.. ఏ ఒక్కరు మరణించిన మృతదేహమును ఆ తల్లి కరుణించక, తనలో కలుపుకొనక పోతే 


🌿ఈ జనారణ్యములో ఆ మృతదేహమును వదిలేస్తే కలరా/ ప్లేగు/ మలేరియా ప్రబలితే, మిగిలిన జీవరాసులు కూడా భూమి మీద అంతరించి పోవా..?


🌸 అందుకే భూమిపై కాలు మోపే ముందు ఆ తల్లిని క్షమాభిక్ష కోరుతూ ( సముద్ర వసనే పర్వత స్తన మండలే భూదేవి విష్ణు పత్నించ  పాద స్పర్శo నమస్తుభ్యం) అని సాష్టాంగ నమస్కారం చేస్తూ భూమాతను ప్రార్థించాలి.. అలా ప్రార్థించ లేకపోతే మనంత కృతఘ్నులు ఈ ప్రపంచములో మరొకరు ఉండరు. 


🌿 మిగిలిన జీవరాసుల విషయంలో వాటికి జ్ఞానం లేదు.., ఆలోచించే శక్తి లేదు.. ఆ శక్తి కేవలం ఈ మానవ మాత్రులకు మాత్రమే ఉంది సర్వే జనాః లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి...🚩🌞🙏🌹🎻

 *సేకరణ: వాట్సాప్.* 

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

వివిధ దేశాల సంకల్పాలు

 *వివిధ దేశాల సంకల్పాలు*  


వీటిలో తగిన మార్పులు ఉంటే సరి చేసుకొండి. 


*Sankalpam for the US*


క్రౌంచ ద్వీపే, రమణక వర్షే, ఐన్ద్ర ఖండే, ప్రశాంత సాగరే, పుష్కర క్షేత్రే,  రాకీ మిక్కిలిని పర్వతయోర్ మధ్యే, మిస్సిసిప్పీ మిస్సోరి ఇత్యాది షోడశ జీవ నదీనాం మధ్యే, ఇండియానా రాష్ట్రే, మిన్నిసోటా జీవ నది తీరే,  బ్లూమింగ్టన్నగరే, వసతి గృహే. 


*(Above is for Bloomington city in Indiana state. Please make the required changes to your city)*


*Australia*


శాల్మాలి ద్వీపే, ఐల వర్షే, నవ ఖండే, మేరో దక్షిణ దిగ్భాగే, అస్త్రాలయ దేశే,  భరతదేశే ఆగ్నేయ దిగ్గబాగే,  హిందూ మహా సముద్ర తీరే సిద్ధిపుర్యామ్. 


*UK Region*


విన్ధ్యస్య  పశ్చిమ దీక్భాగే, శాల్మలీ ద్వీపే, సముద్రమధ్యస్థిత బృహదారణ్య క్షేత్రే, ఐరోపా వ్యవహార నామ ఖండే, థేమ్స్ నదీ తీరే, లండన్ నగరేౌ. 


*Africa*


ప్లక్ష ద్వీపె, వింధ్యస్య నైరుతి దిక్భాగె, తామ్ర ఖండె, కెన్య దేసే,  ...... నగరరే, ....... లక్ష్మి నివాస గ్రుహె. 

 

*ముంబాయి*


వింధ్యస్య పశ్చిమ దిక్భాగె, సహయాద్రి పర్వత ప్రాంతె, అరబీ మహా సాగర తీరె, ముంబాయి నగరె, ....   లక్ష్మి నివాస గృహే/స్వగృహే. 


*The Middle East*


జంబూ ద్వీపే భరత వర్షే, భరత ఖండే, వింధ్యస్య  పస్చిమ  దిగ్భాగే, అరబీ మహాసాగర పస్చిమ తటె, కతార్ దేశే, దొహా నగరె,  ........ గ్రుహె. 


*Delhi*


మెరొహ్ దక్షిణ పార్స్వె, వింధ్యస్య పశ్చిమ దిగ్భాగే, ఆర్య వర్తైక ప్రదెశె, యమునా తటె, ధిల్లీ నగరె, ... గ్రుహె .  


*SINGAPORE*


మేరొ ఆగ్నేయ దిక్భాగే, మలయ ద్వీపస్య దక్షిణ భాగె, పూర్వ సముద్ర తీరే, సింహపురి మహా ద్వీపే, సెరంగూన్ నదీ పరివాహక ప్రదేశే, వసతి గృహే/లక్ష్మీ నివాస గృహే, సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర గురు చరణ సన్నీధౌ.And so on.


*VARANASI*


వింధ్యస్య పశ్చిమ దిక్భాగె, అశీ వరుణయొర్ మధ్యే, మహాస్మశానె, ఆనందవనె, త్రికంటక విరాజితే, అవిముక్త వారణాశీ క్షెత్రె, ఉత్తరవాహిన్యా భాగీరధీ పశ్చిమ తటె, వసతి గ్రుహె, విశ్వెస్వర విశాలాక్షీ ఇత్యాది త్రయస్త్రిగిం శత్కొటి దెవత, గొ బ్రహ్మణ గురుచరణ సన్నిధౌ,


*Bangalore*


శ్రీశైలస్య నైరుతి ప్రదెశె, తుంగ భద్ర కావెరి మధ్య ప్రదెసె, శ్రీ శ్రుంగగిరి సమీప ప్రాంతె, ..... గ్రుహె ..... సమస్త దేవతా. 


*Chennai*


శ్రీ శైలస్య ఆగ్నేయ ప్రదేసే, కృష్ణ కావేరి మధ్య ప్రదేశ.


*Vishakhapatnam*


శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, గంగా గోదావరి మధ్య ప్రదేశే.


*South Korea*


జంబూ ద్వీపె, అఖండ భరత వర్షె, మేరొ: పూర్వ దిక్భాగే, హరిద్రా సాగర తటె, కొరియా నామ ద్వీపె, వసతి గృహే సమస్త దేవతా గో బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ. 


 🙏🙏🙏