15, ఆగస్టు 2022, సోమవారం

ఆనంద స్వరూపం

 

 ఆనంద స్వరూపం 

భూమిమీద వున్న ప్రతి మానవుడు నేను అది నేను ఇది అని తనగురించి చెపుతువుంటారు కానీ నిజానికి చాలామంది నీవు ఏమిటి అని అడిగితె ఇదేమి పిచ్చి ప్రశ్న నేను ఎవరు అని అడుగు అంతే కానీ నేను ఏమిటి అంటావేమిటి అని అనటం కద్దు.  ఎందుకంటె తానూ ఏమిటి అనేది చాలామంది గుర్తించినా తెలియనట్లే వుంటారు. నీవు ఎవరు అనే ప్రశ్నకు నేను రాజారావుని నేను పుల్లారావుని, నేను శేఖరుని అని ఇలా తమ తమ పేర్లు చెపుతారు.  లేకపోతె నేను ఆఫీసరుని, నేను రైతుని, నేను ఇంకోటి ఇంకొకటి అని వారి వృత్తిని చెపుతారు.  కానీ నీవు ఏమిటి అంటే మాత్రం జావాబు లేదు. 

మిత్రమా నీవు ఏమిటి అనే ప్రశ్న ఏమిటంటే నీ స్థితి ఏమిటి అని అర్ధం.  నిజానికి ఈ ప్రపంచంలో వున్న ప్రతి మనిషి వున్న, ఉండాల్సిన స్థితి ఏమిటంటే "ఆనందము" అంటే ప్రతి మనిషి ఆనందస్వరూపుడే.  ఇది వినటానికి వింతగా వుంది కదా.  కానీ ఇది అక్షరాల నిజం. అది ఎట్లనో చూద్దాం. 

మా పిల్లవాడు డిగ్రీ చదివాడు పని లేకుండా తిరుగుతున్నాడు అంటాడు ఒక తండ్రి.  ఆ పిల్లవానిని పిలిచి బాబు నీవు ఏపని చేయగలవు అంటే తాను తన ప్రావీణ్యత ఎందులో ఉందొ దానిగూర్చి చెప్పుతాడు.  ఉదాహరణకు నేను ఎలక్ట్రిషను అని ఒకడు అన్నాడనుకోండి నీవు యేమిటీచేస్తావు అంటే కరెంటుకు సంబందించిన పనులు అన్నీ నేను చేయగలను అంటాడు.  మరి మా ఇంట్లో సీలింగ్ ఫాను బిగించాలి వచ్చి బిగిస్తావా అంటే ఆ వస్తాను. అని ఊరుకోడు ఏమిస్తారు అని ప్రశ్నిస్తాడు.  అదేమిటయ్యా నీవు పనిలేదు అన్నావు కదా నేను పని చెప్పాను  పని చేయక ఏమిస్తావు అంటావేమిటి అని నీవు అంటావా అనవు   ఎందుకంటె అతను చేసే పని కేవలం ప్రతిఫలం కోసమే కానీ ఆ మాట అతను చెప్పడు నిజానికి అతనికి పనిచేయాలని లేదు కానీ పని చేస్తాడు ఎందుకంటె పనిచేస్తేనే వానికి ప్రతిఫలం లభిస్తుంది కాబట్టి పనిచేయటం ఇష్టంలేక పోయినా కష్టమైన పనిచేస్తాడు.  కారణం పనికారణంగా వచ్చే ఆర్జన. తెలిసిందా పని చేయటం కేవలం డబ్బులకోసం మాత్రమే.  అదే నీవు పనిచేయకుండా డబ్బులు ఇస్తానంటే అతను పని చేసే పనే ఉండదు. డబ్బులు ఎందుకు అంటే డబ్బులతో ఆతను సంతోషాన్ని, సుఖాన్ని కొనుక్కుంటాడు.  వాటి అంతిమ విషయమే ఆనందం. 

నీవు నీ దగ్గర వున్న ద్రవ్యంతో తినుబండారాలు కోన్నావనుకో అవి దేనికోసం అంటే తినటానికి అని అంటాం కానీ నిజానికి వాటి లక్ష్యం తినటం వలన కలిగే ఆనందం మాత్రమే.   ఒక భర్త ఆఫీసులో అలసి ఇంటికి వచ్చి భార్యతో అన్నం పెట్టు బాగా ఆకలిగా వుంది అంటే కేవలం ఒక చింతకాయ తొక్కు లేక  గోంగూర పచ్చడో వేసి అన్నం పెట్టిందనుకోండి అది అతనికి రుచికరంగా ఉండేదే అయినా పూర్తీ అన్నం ఒక్క పచ్చడితో తినలేడుగా అందుకే ఏడుస్తూ తింటాడు అంతేకాదు కడుపునిండా తినడు.  రోజు వండే అంత పరిమాణంలోనే అన్నం వండినా ఆ రోజు సగానికన్నా ఎక్కువ అన్నం మిగులుతుంది.  ఏమండీ ఈ రోజు మీరు సరిగా తినలేదు చూడండి వండినది వండినట్లుగానే మిగిలింది అని ఆమె అంటే, ఒక్క పచ్చడితో ఎవరైనా కడుపునిండా తింటారా నా కడుపు ఇంకా ఆకలితోనే వుంది ఏమిచేయమంటావు అని నీళ్లు తాగి గొణుక్కుంటూ పడుకుంటాడు. 

మరుసటి రోజు అదే భార్య చక్కగా రెండు పచ్చళ్ళు, కూరలు, పప్పు పులుసు చేసి వడ్డించిందనుకోండి. ఆ భర్త తన భార్యను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తి కడుపునిండా భోజనం చేయటమే కాదు ఆమె వాటా అన్నం కూడా తినేస్తాడు.  ఏమండీ మొత్తం మీరే తింటే నేనేమి తినాలి అని ఆమె అంటే ఎందుకోయి నీవు బాధపడతావు నీవు అన్నానికి కూర్చొని తింటూవుండు నేను అన్నం వండుతాను అని వండి చక్కగా భార్యకు వడ్డిస్తాడు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే నిన్న భార్యను విసుక్కున్న భర్త ఈ రోజు ఆమెను మెచ్చుకోవటమే కాకుండా చక్కగా అన్నం వండి వడ్ఢిచ్చి మరీ సంతోషపడ్డాడు ఎందుకు అంటే ఈ రోజు ఆమె చేసిన వంటకాలతో తృప్తిగా భోజనం చేసాడు.  అంటే తానూ భుజించటం వలన ఆనంద పడ్డాడు. అదే ఆనంద స్వరూపం. 

ప్రతి మనిషి కోరుకునేది ఆనందమే కానీ మరొకటి కాదు.  ఎందుకంటె మనిషి యదార్ధ స్థితి ఏమిటంటే అది ఆనంద స్వరూపం. తన యదార్ధ స్థితిని పొందటానికి ప్రతి మనిషి కోరుకుంటాడు. 

ఆనంద స్వరూపం అంటే ఏమిటి : ఆనందం అనేది ఒక్కొక్క మనిషికి ఒక్కక్క విధంగా ఉంటుంది. ఒకనికి ఇంట్లో వంట నచ్చదు బైట హోటల్లో బాగా ఖర్చుచేసి వివిధ వంటలను భుజించి ఆనంద పడతాడు. ఇక ఒకనికి సిగరెట్ త్రాగటం ఆనందాన్ని ఇస్తుంది. ఇంకొంకనికి  మద్యం సేవించటం ఆనందాన్ని ఇస్తుంది. ఒకడికి ఇంకొకడిని మోసం చేసి డబ్బు సంపాయించటం ఆనందాన్ని ఇస్తుంది. ఒకనికి ఇతర స్త్రీలతో సంబంధం పెట్టుకోవటం ఆనందం ఇస్తుంది. ఇలా చేప్పుకుంటూ పొతే అనేకమైన విధాలుగా ఒక్కొక్కరికి ఆనందం చేకూరుస్తుంది.  కానీ ఒక్కటి మాత్రం.  నిజం ఎవ్వరికీ ఏది ఆనందాన్ని ఇచ్చినా కూడా అది కేవలం తాత్కాలికం మాత్రమే. ఉదాహరణకు చక్కటి విందు ఆరగించటం వలన ఆనందం కలిగే వానికి తాను విందు భోజనము చేసే అంతవరకే ఆ ఆనందం ఉంటుంది.  కానీ తరువాత కాదు అదే విధంగా పైన పేర్కొన్న అన్ని విషయాలకు వర్తిస్తుంది.  కానీ ఎవ్వరు అది గమనించక మరల మరల తాను ఆ పనులు చేస్తూ ఆనందాన్ని వెతుకుంటూ ఉంటారు. 

నీకు నీ మిత్రుడో లేక బంధువో కనపడితే నీవు అడిగే మొదటి ప్రశ్న" నీవు బాగున్నావా" అంటావు లేకపోతె "నీవు క్షేమంగా వున్నావా" అని అడుగుతావు.  పూర్వకాలంలో లేఖలు వ్రాసుకునేవారు ముందుగా "ఉభయ కుశలోపరి" అని వ్రాసేవారు అనగా ముందుగా ఉభయుల కుశలం తెలుపుతూ   తరువాత ఇతర విషయాలు ప్రస్తావించేవారు. నీవు బాగున్నావా అంటే నీవు బాగుండాలని నీ మిత్రుడు కోరుకుంటున్నాడు అని అర్ధం అంటే నీవు ఆనందంగా వున్నావా అని అర్ధం.  ఎవ్వరు కూడా నీవు భాదపడుతున్నావా, నీవు ఏడుస్తున్నావా, నీవు దుఃక్కిస్తున్నవా అని అడగరు.  అంటే అవి ఏవి నీ స్వరూపం కాదు అని అర్ధం.  బాధలో వున్నవాడు కూడా ఆనందంకోసం వెతుకుతూవుంటాడు అంతే కానీ ఆనందంలో వున్నవాడు యెవ్వడు దుఃక్కించాలని కోరుకోడు  అవునా కాదా

కాబట్టి భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే మనిషి నిజ స్వరూపం ఆనందం మాత్రమే కానీ అందుకు వేరుకాదు. ప్రతి వారు తమ జీవితం ఆనంద మయం కావాలని ప్రయత్నించే వారే.  తన వద్ద వున్న డబ్బులు తాను పొందాలనుకునే ఆనందానికి సరిపోవు అని అనుకున్నప్పుడు ఇంకా ఇంకా డబ్బులు సంపాయించటానికి మనిషి ప్రయత్నిస్తాడు. యెంత ఎక్కువ డబ్బులు ఉంటే అంత ఎక్కువ సుఖాలను, భోగాలను అనుభవించవచ్చు అంటే అంత ఎక్కువ ఆనందం కలుగుతుంది అని అనుకుంటాడు.  కానీ తానూ అనుభవించే ఆనందం పూర్తిగా క్షణికమని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు మొదలవుతుంది శాశ్వితమైన ఆనందం ఎక్కడ దొరుకుతుందా అనే వెతుకులాట.  అదే మనిషిని భగవంతుని వైపు మళ్లించే భావన.  అప్పటినుండి మనిషి తాను శాశ్విత ఆనందం పొందాలని ప్రయత్నిస్తాడు. . అందుకే మన మహర్షులు " ఆనందో బ్రహ్మ" అని అన్నారు. భగవంతుడు ఆనంద స్వరుపుతూ. మనం ఒక వెంకటేశ్వర స్వామికో లేక సత్యనారాయణ స్వామికో లేక మారె ఇతర దేవి దేవతలకైనా వివిధ పుష్పాలతో వస్త్రాలతో అలంకరించటం చేస్తాము.  దానికి కారణం ఎప్పుడైతే భక్తుడు ఆ దేవతా విగ్రహాన్ని కళ్ళతో చూస్తాడో అతని మనసులో ఆనందం కలుగుతుంది.  ఆనందం కలగాలి అని ఆలా అలంకారం చేస్తారు.  అంతిమ లక్ష్యం ఆనందమే కానీ వేరొకటి కాదు.  భక్తి భావం అంటే దాని ఫలితం ఆనందం మాత్రమే.

వైదిక శాస్త్రాలు అనేక పర్యాయములు భగవంతుడిని అనంతమైన దివ్య ఆనంద సాగరంగా అభివర్ణించాయి.

ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ (తైత్తిరీయ ఉపనిషత్తు 3.6)
"భగవంతుడంటే ఆనందమే అని తెలుసుకో."

కేవలానుభవానంద స్వరూపః పరమేశ్వరః (భాగవతం 7.6.23)
"భగవంతుని స్వరూపము స్వచ్చమైన ఆనందము చే తయారుచేయబడినది."

ఆనంద మాత్ర కర పాద ముఖోదరాది (పద్మ పురాణం)
"దేవుని చేతులు, పాదాలు, ముఖము, ఉదరము మొదలగునవన్నీ ఆనందము చే తయారు చేయబడినవి"

జో ఆనంద్ సింధు సుఖరాసి (రామాయణం)
"భగవంతుడు సంతోష-ఆనందముల మహాసాగరము"

ఈ శాస్త్రాల్లో ఉన్న మంత్రములు మరియు శ్లోకములు అన్నీ, దివ్య ఆనందమే భగవంతుని వ్యక్తిత్వ స్వభావమని వక్కాణిస్తున్నాయి. తన ఇంద్రియములు, మనస్సు మరియు బుద్ధి భగవంతుని యందే నిమగ్నం చేసినవారు, తమలోనే ఉన్న భగవంతుని యొక్క దివ్య ఆనందాన్ని అనుభవించటం ప్రారంభిస్తారు.

కాబట్టి భార్గవ శర్మ చెప్పేది ఒక్కటే మనిషి నిజ స్వరూపం ఆనందం మాత్రమే కానీ అందుకు వేరుకాదు. కాబట్టి నిత్యమైనది, శాశ్వితమైనది అయిన ఆనందమే మోక్షము.  కాబట్టి మిత్రమా ఇప్పుడే శాశ్వితము, నిత్యమూ అయిన ఆనంద స్వరూపుడైన భగవంతుని తెలుసుకో మోక్షార్థివి కమ్ము. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ భార్గవ శర్మ

సరస్వతీ రాజమణి '..

 15 ఏళ్ళకే దేశం కోసం వజ్రాల నగలు త్యాగం చేసి నేతాజీ దగ్గర గూఢచారిణి గా చేసిన 

' ధీరమణి సరస్వతీ రాజమణి '..


అది ఒక విశాలమైన రాజభవనం లాంటి మందిరం ! అడుగడుగునా వైభవం తొణికిసలాడుతున్నది ! ఆ భవనం ఉన్నది రంగూన్ లో 

.

ఆ భవనపు హాలులో గాంధీగారు ఆసీనులయి ఉన్నారు ! ఆ కుటుంబ యజమాని తదితర సభ్యులంతా చాలా శ్రద్ధగా గాంధీగారు చెప్పే విషయాలు వింటున్నారు ! 

.

ఎందుకో గాంధీగారి చూపు ఆ హాలు కిటికీ దాటి ఆ ఇంటి ఆవరణలో గల ఒక విశాలమైన మైదానంలో తుపాకీతో సాధన చేస్తున్న ఒక పది సంవత్సరాల బాలికమీదకు‌ ప్రసరించింది ! 

ఆ అమ్మాయి ని తన వద్దకు పిలిపించుకున్నారు 

..

అమ్మా ! నీవు ఈ తుపాకీతో సాధన చేస్తున్నావుకదా ఎందుకు ?...అడిగారు గాంధీగారు 

..

నా తుపాకీతో కనీసం ఒక్క బ్రిటీష్ వాడినైనా చంపెయ్యాలని నా కోరిక ...బదులిచ్చింది బాలిక 

..

"హింసా మార్గము తప్పుకదా" అని అంటూ అహింస యొక్క విశిష్టత గాంధీ గారు చెప్పటం మొదలుపెట్టారు ! 

..

వెంటనే ఆ బాలిక " నాకు మీ అహింసా మార్గము నచ్చదు ,అహింసవలన బ్రిటిష్ వాడు మనకు స్వతంత్రం ఇవ్వడు " అని నిర్మొహమాటంగా చెప్పింది ! ...నిరుత్తరుడయ్యారు గాంధీగారు 

.

ఆ బాలిక పేరు రాజమణి ఆమె తండ్రి చాలా గొప్ప సంపన్నుడు భారతదేశంలో ఒక బంగారుగనికి యజమాని ! బ్రిటిష్ వారి అణచివేతకు తట్టుకోలేక కుటుంబ సమేతంగా రంగూన్ లో నివాసం ఏర్పరచుకున్నాడు ...

..

ఈ సంఘటన జరిగిన కొద్దికాలానికి నేతాజీ రంగూన్ వచ్చి తన సైన్యానికి కావలసిన నిధులు సేకరిస్తున్నారు ! అప్పటికి రాజమణికి 15 సంవత్సరాలు వచ్చాయి ! 

.

అందరూ తమ వంటిమీది ఆభరణాలు వలిచి ఇస్తుంటే చూసిన బాలిక తానుకూడా తను ధరించిన అతిఖరీదైన వజ్రాలతో కూడిన నగలను వలిచి మూటగట్టి నేతాజీకి ఇచ్చివేసింది ! గమనించారు నేతాజీ అప్పుడు ఏమీ మాట్లాడలేదు .

.

మరుసటి రోజున రాజమణి ఇంటిముందు ఆగిన వాహనం నుండి నేతాజీ దిగారు నేరుగా ఇంటిలోనికి వచ్చి తన చేతిలోని అత్యంత ఖరీదైన నగలమూటను ఆ బాలిక తండ్రికి ఇచ్చి తెలిసీ తెలియని వయస్సులో తన నగలు దానం చేసింది ఈ బాలిక కావున ఇవి నాకు వద్దు అని తిరిగి ఇచ్చి వేశారు .

.

తండ్రి చేతిలోని మూటను అలాగే తీసుకొని మరల నేతాజీకి ఇచ్చి "నేను తెలిసే ఇచ్చాను ! అవి నా నగలు ,నా సొమ్ము భారత స్వతంత్ర పోరాటానికి ఉపయోగ పడాలి ...అని స్థిరంగా గొప్ప పరిణతితో పలికింది .. ఆ బాలిక విజ్ఞతకు ముగ్ధుడైన నేతాజీ ఆమెకు సరస్వతి అని నామకరణం చేశారు ! 

.

అప్పటినుండి ఆవిడ

 " సరస్వతి రాజమణి ""

.

ఇంకొక రెండేళ్ళు గడిచాయి నేతాజీ మరల రంగూన్ వచ్చినప్పుడు సరస్వతి తన నలుగురు స్నేహితులతో కలిసి INA లో చేరతామని నేతాజీని అభ్యర్ధించారు ! వారి తల్లిదండ్రుల అనుమతితో వారిని తన గూఢచారిదళంలో చేర్చుకున్నారు నేతాజీ ! 

.

వారి బాధ్యత ఏమిటంటే బ్రిటిష్ సైనికాధికారుల ఇండ్లలో పని చేస్తూ సైనిక రహస్యాలను I.N.A కు చేరవేయడం ! 

.

కొంతకాలం వారి పని సజావుగా నడిచింది ...ఒకరోజు ...సరస్వతి స్నేహితురాలు దొరికిపోయింది ! 

.

బ్రిటిష్ వారు ఆమెను బంధించారు ! 

.

బంధింపబడిన తన స్నేహితురాలిని విడిపించడానికి సరస్వతి పథకరచన చేసింది ! ...ఆ కారాగారంలో ఒక వేడుక జరుగుతున్నప్పుడు తాను నృత్యకళాకారిణిగా వెళ్ళింది ! నాట్యం చేస్తూ బ్రిటిషు వారికి మత్తుమందు ఇచ్చి సమయం చూసి తన నెచ్చెలిని తప్పించి పరుగెత్తుతూ బుల్లెట్ దెబ్బతిని మూడు రోజులు చెట్టుమీద దాక్కొని బయటపడింది ..

..

తదనంతర కాలంలో ఆ గాయం తనను కుంటిగా మార్చినా చలించలేదు ఆ ధీర వనిత ! 

.

స్వతంత్ర వచ్చిన తరువాత భారత్ తిరిగి వచ్చి సరి అయిన గుర్తింపులేక పోషణకోసం పాతబట్టలు కుట్టు కుంటూ పొట్ట పోసుకుంటూనే తనకు ఉన్నంతలో సమాజసేవ చేస్తూ దుర్భరదారిద్ర్యంలో జీవనయానం సాగించింది ఆ ఆగర్భశ్రీమంతురాలు ! 

.

ఈ వీరవనిత పరిస్థితి ఎవరి ద్వారానో విన్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈవిడ ఉండటానికి అద్దెలేకుండా ఒక మంచి ఫ్లాటు ,5 లక్షల నగదు 2006 సంవత్సరంలో ఇచ్చారు ....

..

ఎందరో ధీరవనితలు ,వీరసైనికుల త్యాగఫలం మన స్వతంత్రం ! కేవలం అహింసవలననే వచ్చింది అంటే ....????

courtesy : వూటుకూరు జానకిరామారావు

Kashmir issue atal bihari Vajpai

 PV నరసింహారావు గారు PM గా  ఉన్నప్పుడు atal bihari Vajpai గారిని India representative గా UNO కి పంపడం జరిగింది. UNO లో Kashmir issue గురించి hot డిస్కషన్స్ జరుగుతున్నయ్యి. Vajpai గారు తన ఉపన్యాసం start చేశారు. నా views చెప్పడానికి ముందు చిన్న స్టోరీ చెప్తాను అన్నారు.  చాలా కాలానికి ముందు కశ్యప్ అనే ఒక ఋషి (saint)ఉండేవాడు. ఆయన పేరు మీదనే ప్రస్తుత Kashmir కి ఆ పేరు వచ్చింది.  కశ్యప్ దట్టమైన అడవి దారిలో వెళ్తూ ఒక అందమైన  సరస్సు చూసాడు. అక్కడ స్నానం చేద్దామని నిర్ణయించుకొని బట్టలు తీసి ఒడ్డున  పెట్టి సరస్సులోకి దిగాడు. స్నానం చేసి ఒడ్డుకొచ్చేసరికి ఒక పాకిస్తానీ తన దుస్తులు అపహరించారని గ్రహించాడు. ఇలా  చెప్పుకుపోతూ ఉండగా సభలో నుండి ఒక పాకిస్తానీ లేచి objection  raise చేసాడు.  ఋషి కశ్యప్ కాలంలో అసలు పాకిస్తాన్ లేనేలేదు,  పాకిస్తానీ ఋషి యొక్క బట్టలెలా అపహరిస్తాడు అని చెప్పి  Vajapayi మీద  కేకలు వేసాడు.  అపుడు Vajpayi నవ్వుతూ "నేను UNO కి చెప్పదలచుకున్న అంశం పూర్తి అయింది, అప్పుడు పాకిస్తాన్ లేనేలేదు అంటున్నారు ఇప్పుడు Kashmir,  Pakistan కి చెందినది  అంటున్నారు" అని అన్నారు.  సభలో వాళ్లంతా తమ కరతాళధ్వనులతో జయజయ  నినాదాలు చేసారు. 

దీనిని మీ ఇతర గ్రూప్ లకి f/w చేయండి.

స్వాతంత్ర్య పతాకం

 శీర్షిక.. స్వాతంత్ర్య పతాకం 

వందనం..వందనం..మన జాతీయ జెండాకు వందనం..అభివందనం

ఎగురుతోంది ఎగురుతోంది మన భారత జెండా గౌరవం నిండా

గ్రామ గ్రామంలో నగర నగరంలో

రాజధాని ఢిల్లీలో సగర్వంగా ఎగురుతోంది...భారత కీర్తి కిరీటమై శాశ్వత సౌర్యమై జాతికి స్పూర్తి యై  ......వందనం వందనం

రూపకర్తలు పింగళి కృత మువ్వన్నె ల జండా..ముచ్చటగా గగనాన విజయవిహారం...మన జాతీయ జెండా...గౌరవం నిండా......

కాషాయం...త్యాగముగా..శ్వేతవర్ణం స్వచ్ఛంగా..హరితవర్ణం...సంపద అభివృద్ధి ల సంగమమై..

మధ్యనుండు అశోకచక్రం...ధైర్యం..పరాక్రమం సూచిస్తూ....ఎగురుతోంది...జాతీయ జెండా.....

ఎదురు లేని భారతికీ...అలుపెరుగని విజయానికి చిహ్నంగా...జాతీయ జెండా....జాతి గౌరవ కీర్తి మకుటమై.....

వందనం..వందనం...నీకిదే అభివందనం

దేశమంత జరుపుకునే ఉత్సవాలు....గణతంత్ర దినం..స్వాతంత్ర్యదినం..బాపూజీ జన్మదినం. అల్లూరి జన్మదినం ...

మురిపెముగా చూసుకునే మన జెండా నేర్పుతోంది...శాంతి..ధర్మం.....ధైర్యం సాహసం..స్పూర్తిగా...

  వందనం...వందనం...నీకిదే అభివందనం

విప్లవ జ్యోతి అల్లూరి కలలు కన్న స్వాతంత్ర్య దేశం

హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులం

అందరమొకటై...హాయిగ కలసి.

చేసుకునే వేడుకే... ..

వందనం...వందనం..జాతీయ జెండాకు అభివందనం..మనసాభివందనం.

ఆజాదీ కా అమృతోత్సవ శుభ వేళ సమైక్య వందనం

సంతోష వందనం ..వందనం వందనం

.

 ...డాక్టర్ దేవులపల్లి పద్మజ 

 విశాఖపట్నం....

శ్రీచక్రాలయం

 .

*...*

ప్రపంచం మొత్తంలో … అతి పెద్ద అందమైన, అద్భుతమైన *శ్రీచక్రాలయం*…!


🛕🛕🛕🛕🛕🛕🛕🛕


          *దేవీపురం*

                  

      *(సహస్రాక్షిగా రాజరాజేశ్వరీదేవి)*


*విశాఖ జిల్లాలోని దేవీపురం - ఇంత పెద్ద శ్రీ చక్రాలయం ప్రపంచం మొత్తంలో ఇంకెక్కడా లేదు.*


*విశాఖపట్నానికి దగ్గరలో ఉన్న సబ్బవరం గ్రామానికి 5 కి.మీ దూరంలో, నారపాడు గ్రామశివార్లలో తొమ్మిది కొండల నడుమ, పచ్చని తోటల మధ్య, దేవీపురంలోని శ్రీచక్రాలయంలో “సహస్రాక్షి” గా శ్రీరాజరాజేశ్వరీ దేవి భక్తులకు దర్శనమిస్తోంది.*


*ఇక్కడి ఆలయం అంతా ఒక శ్రీ చక్రమే. ఇంత పెద్ద శ్రీచక్రాలయం ప్రపంచం మొత్తంలో ఇంకెక్కడా లేదు.*


*“నాకు ఇల్లు కట్టించు!”*


*న్యూక్లియర్ ఫిజిక్స్ లో డాక్టరేట్ చేసి, ముంబాయిలోని టాటా ఇన్ స్టిట్యూట్ లో శాస్త్రవేత్త గా పనిచేస్తున్న నిష్ఠల ప్రహ్లాద శాస్త్రిని ఈ ఆలయ నిర్మాణానికి అమ్మవారు ఎన్నుకుంది. ఒకసారి ప్రహ్లాదశాస్త్రి గారు హైదరాబాద్ లో బిర్లామందిర్ కు వెళ్ళి, బాలాజీని దర్శించి, ఒకచోట ధ్యానం చేసుకుంటుండగా, వారికి బాలాజీ స్త్రీ రూపంలో త్రిపురసుందరిగా దర్శనమిచ్చి "నాకు ఇల్లు కట్టించు!" అని పలికి అంతర్థానమైనట్లుఅనిపించిందిట.*


*అప్పుడే కాకుండా మరొకమారు వారికి ధ్యానసమయంలో దర్శనమిచ్చి "ఈ కార్యం నీ వల్లే నెరవేరాలి. జాగ్రత్తగా, దోషరహితంగా, ప్రజలందరికీ మేలు కలిగేలా శ్రీదేవి నిలయం నిర్మించు!" అని ఆదేశించింది.*


*ప్రహ్లాద శాస్త్రి తమ ఉద్యోగానికి రాజీనామా చేసి స్వస్థలమైన విశాఖపట్నం వచ్చారు.*


*ఆలయం ఎక్కడ కట్టాలి ?*


*ఆలయం నిర్మించాలనే సంకల్పంతో 1982 లో 108 రుత్విక్కులతో 16 రోజులు దేవీయాగం చేశారు. ఆ యజ్ఞంలో ఆలయం నిమిత్తం మూడు ఎకరాల భూమి యజ్ఞప్రసాదంగా లభించింది. ఈ విధంగా శ్రీ చక్రాలయ నిర్మాణ స్థలాన్ని త్రిపురసుందరీ దేవి స్వయంగా ఎంచుకుంది. తొమ్మిది కొండల మధ్య, రమణీయంగా, ప్రశాంతంగా ఉన్న ఆ స్థలంలో ప్రహ్లాదశాస్త్రి తిరుగుతూ ఉండగా, ఒకరోజు ఒక అగ్ని గుండంలో మెరుపులతో మెరిసే శరీరంతో 16 ఏళ్ళ అమ్మాయిలా దేవి కనిపించింది. పూజలు అందుకుంది. తనకు అక్కడే ఇల్లు కట్టాల్సిందిగా ఆదేశించింది.* 


*ఆ ప్రదేశంలో తవ్వితే, అగ్నిలో కాల్చిన గుర్తులున్న పంచలోహ శ్రీచక్ర మేరువు లభించింది. దాని గురించి విచారించగా సుమారు 250 ఏళ్ళ క్రితం అక్కడ గొప్ప యజ్ఞం జరిగినట్లు తెలిసింది.*


*ఆ శ్రీచక్రమేరువును మళ్ళీ భూమిలో నిక్షిప్తం చేసి దానిపై కామాఖ్యపీఠం ప్రతిష్టించారు.* 


*ప్రక్కనే వున్న ఎత్తైన కొండమీద శివాలయం కట్టించారు.*


*ఆలయ సొగసులు :*


*ఈ దేవీపురం ప్రాంతంలోని శ్రీచక్రమేరునిలయం 108 అడుగుల పొడవు, 108 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తు కొలతలతో నిర్మితమైంది. *


*ప్రహ్లాదశాస్త్రి ఏకాగ్రతతో, సౌందర్యలహరిలో ఆదిశంకరులు సూచించిన విధంగా, లలితా సహస్రనామ స్తోత్రంలో వాగ్దేవతలు వర్ణించిన విధంగా ఉండేటట్లు, ఆలయ నిర్మాణం పూర్తి చేయించారు.* 


*1990 లో జూన్ 4 వతేదీన మూలవిరాట్ ‘సహస్రాక్షి’ విగ్రహ ప్రతిష్ట జరిగింది.*


*శ్రీ చక్రాలయంలో బిందు స్థానంలో (మూడో అంతస్తు) పవళించిన సదాశివుని మీద కూర్చున్న, నిలువెత్తు ఆ విగ్రహం కళ్ళలోకి చూస్తుంటే, జీవకళ ఉట్టిపడుతూ, జీవితం ధన్యమవుతుంది. ఆమె చుట్టూ, క్రింది అంతస్తులలో, నక్షత్రాలను పోలిన ఆవరణలు, వాటిలో ఆమె పరివార దేవతలు ఉన్నారు.*


*నిష్ఠల ప్రహ్లాద శాస్త్రికి ధ్యానంలో గోచరించిన విధంగా ఖడ్గమాల దేవతలకు రూపకల్పన చేసి గంధర్వ మాతృమూర్తులుగా 68 విగ్రహాలను భూమి మీద, 10 విగ్రహాలను మొదటి అంతస్తులోను, రెండో అంతస్తులో 10 విగ్రహాలను సిమెంటు చేసి పెట్టారు. మిగిలిన విగ్రహాలను పంచలోహాలతో చేయించి మూడో అంతస్తులో అష్ట దళ పద్మంలో ఉంచారు. ఇవికాక భూమిమీదే భ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారీ, వైష్ణవీ, వారాహీ, మాహేంద్రీ, చాముండీ, మహాలక్ష్మీ, బాలాజీ, కాళియమర్దన చేస్తున్న శ్రీకృష్ణుడు _ఈ పది విగ్రహాలనూ రాతితో చెక్కించి ప్రతిష్టించారు. ఈ విగ్రహాలకు భక్తులు అభిషేకాలు చేస్తారు…*

🙏🙏🙏🛕🙏🙏🙏

సేకరణ

నాలుగు ప్రశ్నలు

 శ్లోకం:☝️

*సముద్యతే కుత్ర న యాతి పాంశులా*

*సముద్యతే కుత్ర భయం భవేజ్జలాత్ l*

*సముద్యతే కుత్ర తవాపయాత్యారి:*

*ప్రహేణ సంబోధన వాచికం పదం ll*


భావం: ఈ శ్లోకంలో నాలుగు ప్రశ్నలున్నాయి. మొదటి సమాధానం నుండి ఒక అక్షరం తగ్గిస్తే రెండో సమాధానం వస్తుంది. రెండోదాన్ని నుండి ఒక అక్షరం తగ్గిస్తే మూడో సమాధానం వస్తుంది. మూడో సమాధానం నుండి ఒక అక్షరం తగ్గిస్తే నాల్గవ ప్రశ్నకు సమాధానం వస్తుంది.

ఒకటవ ప్రశ్న: ఎవరు ఉదయిస్తే వ్యభిచారులు తిరగడం మానేస్తారు? సమాధానం 'హిమకరః' అంటే (చంద్రుడు), ఈ శ్లోకం లోని ప్రశ్నలన్నీ సతి సప్తమిలో (సప్తమీ విభక్తిిిి లో) వున్నాయి. కనుక సమాధానాలు కూడా సతి సప్తమిలోనే ఉండాలి. కనుక సమాధానం *హిమకరే*

రెండవ ప్రశ్న: ఏ జంతువు నీటినుండి బయటకు వస్తే భయం కలుగుతుంది? మొసలి. సంస్కృతంలో మొసలిని 'మకరః' అంటారు. సప్తమీ విభక్తి కనుక *మకరే* సమాధానం.

మూడవ ప్రశ్న: నీవు ఏది ఎత్తితే నీ శత్రువులు పారిపోతారు? 'కరః' అంటే చేయి. సతి సప్తమి కనుక *కరే* నీవు చేయి ఎత్తితే శత్రువులు పారిపోతారు.

నాలుగవ ప్రశ్న: హీన కర్మల నాచరించే వాడిని ఏమని పిలుస్తారు? 'ఒరే' అని గౌరవం లేకుండా పిలుస్తారు. దీన్ని సంస్కృతములో *రే* అంటారు.