25, జూన్ 2023, ఆదివారం


 


 

మందేశ్వర_శనేశ్వర_స్వామి_దేవాలయం

 #మందేశ్వర_శనేశ్వర_స్వామి_దేవాలయం





         శనిదేవుడు ఒక్కసారి పట్టుకుంటే, ఏడేళ్లవరకూ మనచుట్టే తారట్లాడుతుంటాడని పేరు. ఆ మందగమనుడు శివలింగాన్ని ప్రతిష్ఠించిన క్షేత్రమే, తూర్పు గోదావరి జిల్లాలోని మందపల్లి. అభిషేక ప్రియుడైన మందేశ్వరుడిని పూజిస్తే, శని ప్రభావం వదిలిపోతుందని భక్తుల విశ్వాసం.


శనీశ్వరుడికి సంబంధించి ఎన్నో కథలు. పట్టుకుంటే ఓపట్టాన వదలడంటారు. నలమహారాజును సైతం ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడని చెబుతారు. దేవతలకి కూడా దడపుట్టించగల మహాశక్తిమంతుడన్న ఖ్యాతి. ఎన్ని వేధింపులైనా ఆ క్షేత్రానికి అవతలే! ఒక్కసారి తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట మండలంలోని మందపల్లిలో వెలసిన మందేశ్వరుడిని దర్శించుకుంటే...శని ప్రభావం మటుమాయమైపోతుందని ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే, అక్కడి శివలింగాన్ని సాక్షాత్తూ శనిదేవుడే ప్రతిష్ఠించాడని ఐతిహ్యం. మందేశ్వరుడికి తైలాభిషేకాలు జరిపితే, శని వల్ల కలిగే సమస్త దోషాల నుంచీ విముక్తి లభించినట్టేనని బలమైన నమ్మకం.


ప్రతి మనిషి జీవితకాలంలో రెండుమూడుసార్లు ఏలిన నాటి శని ప్రభావం ఉంటుందనీ, శనిదేవుడికి తైలాభిషేకం చేస్తే ఆ ప్రభావాన్ని తప్పించుకోవచ్చనీ జ్యోతిష నిపుణులు చెబుతారు. ఆ కారణంగానే, దేశం నలుమూలల నుంచీ శనిత్రయోదశి లాంటి పర్వదినాల్లో వేలాది భక్తులు మందపల్లికి తరలివస్తారు. ముడినువ్వుల నూనెతో అభిషేకం చేసి, నువ్వులూ బెల్లమూ కలిపి నివేదిస్తారు. ప్రతి శనివారమూ ఆలయం శనిపీడితులతో కిటకిటలాడుతుంది. శనిదోషం లేని వారు స్వామిని దర్శించుకుంటే, రాబోయే కష్టాలూ తొలగుతాయని అంటారు.


మందేశ్వర పురాణం..

పూర్వం, ప్రస్తుతం మందపల్లిగా పిలుస్తున్న ప్రాంతం దండకారణ్యంలో భాగంగా ఉండేది. ఇక్కడ మహర్షుల ఆశ్రమాలు ఉండేవి. నిత్యం యజ్ఞయాగాదులు జరిగేవి. ఆ పరిసరాల్లోనే అశ్వత్థుడు, పిప్పలుడు అనే బ్రహ్మ రాక్షసులు నివసించేవారు. అశ్వత్థుడు రావిచెట్టు రూపంలోనూ పిప్పలుడు బ్రాహ్మణుడి రూపంలోనూ కనిపిస్తూ యజ్ఞయాగాలకు ఆటంకం కలిగించేవారు. అంతటితో ఆగకుండా, యాజ్ఞికులను చంపి తినేవారు. ఫలితంగా, బ్రాహ్మణ సంతతి అంతరించిపోసాగింది. అదంతా గ్రహదోష ఫలితమేనని భావించిన మహర్షులు శనీశ్వరుడిని ప్రార్థించి, రాక్షస కృత్యాలను నిరోధించాలని కోరారు. శనిదేవుడు ఆ బ్రహ్మ రాక్షసులిద్దరినీ ఒక్క దెబ్బతో సంహరించాడు. ఫలితంగా, శనీశ్వరుడిని బ్రహ్మహత్యా దోషం పట్టి పీడించసాగింది. దాన్ని నివారించుకోడానికి ఏం చేయాలో అర్థం కాలేదు. సాయం కోసం మహర్షుల్ని సంప్రదించాడు. పరమశివుడు మాత్రమే ఆ పాతకాన్ని పరిహరించగలడని చెప్పారు. దీంతో శనిదేవుడు మందపల్లిలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఒక్కసారి పట్టుకున్నాక వదిలే తత్వం కాదు శనిగ్రహానిది. అందుకే, మందగమనుడనీ, మందుడనీ పిలుస్తారు. మందుడు ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి, మందేశ్వరుడన్న పేరు వచ్చింది. క్షేత్రం చుట్టూ వెలసిన పల్లె మందపల్లిగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

మరో కథనం ప్రకారం...ఓసారి నారదుడికీ పరమశివుడికీ మధ్య శని గొప్పదనం విషయంలో ఓ చర్చ జరిగింది. అది కాస్తా ‘ఎవరు గొప్ప?’ అన్న వివాదంగా మారింది. ‘చేతనైతే నన్ను పీడించమను..’ అంటూ ఆవేశంగా సవాలు విసిరాడు శివుడు. ‘ఒక్క క్షణం అయినా శివుడిని పీడించి తీరతాను’ అంటూ నారదుడి ముందు ప్రతిజ్ఞ చేశాడు శని. దీంతో, ఆ గ్రహరాజుకు తన ఆనవాలు తెలియకుండా శివుడు కైలాసాన్ని వీడివచ్చి... మందపల్లిలో తలదాచుకున్నాడు. ‘దేవదేవుడివైన నువ్వు సామాన్యుడిలా దండకారణ్యం దాకా వచ్చావంటే, అదంతా నా ప్రభావం కాదంటావా స్వామీ?’ అంటూ శని పరమేశ్వరుడి పాదాల మీద పడ్డాడు. శివుడిని పీడించిన పాపానికి ప్రాయశ్చిత్తంగా లింగాన్ని ప్రతిష్ఠించాడు.


క్షేత్రపాలకుడు...

ఆలయ ప్రాంగణంలోనే పార్వతీదేవి, ఉమా బ్రహ్మేశ్వరుడు, ఉమా నాగేశ్వరుడు వెలిశారు. క్షేత్రపాలకుడిగా వేణుగోపాలస్వామి పూజలు అందుకుంటున్నాడు. పూర్వం బ్రహ్మ ఇక్కడ ఓ యజ్ఞాన్ని తలపెట్టాడట. క్రతువు పూర్తయిన తర్వాత కూడా, యజ్ఞగుండంలోని నిప్పు ఎంతకీ చల్లారకపోవడంతో... గౌతమ మహర్షి గోదావరి నదిని గుండం మీదుగా ప్రవహింపజేశాడు. అప్పుడు కానీ, అగ్నిదేవుడు శాంతించలేదు. ఆతర్వాత బ్రహ్మ ఈ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడనీ, అదే బ్రహ్మేశ్వరుడిగా ప్రసిద్ధమైందనీ ఐతిహ్యం. కర్కోటకుడనే సర్పరాజు ఇక్కడ ఘోర తపస్సు చేశాడని అంటారు. శివ సాక్షాత్కారం తర్వాత, మందపల్లి క్షేత్రంలో దివ్యలింగాన్ని ప్రతిష్ఠించాడని చెబుతారు. ఇక్కడి నాగేశ్వరుడిని అభిషేకించినవారికి సర్పభయాలూ సర్పదోషాలూ ఉండవని వరమిచ్చినట్టు పురాణ కథనం. ఈ క్షేత్రంలో గౌతమ మహర్షి వేణుగోపాలస్వామిని కూడా ప్రతిష్ఠించాడు. దీంతో మందపల్లికి గోపాల క్షేత్రంగానూ పేరొచ్చింది. రుక్ష్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలుడి కల్యాణం ఏటా మాఘశుద్ధ ఏకాదశి నాడు వైభవంగా జరుగుతుంది. మాఘ బహుళ దశమి నుంచి ఫాల్గుణ శుద్ధ విదియ వరకూ మందేశ్వర (శనీశ్వర) స్వామి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.


ప్రాముఖ్యత

మందపల్లి శనీశ్వర స్వామి ఇతర ఆలయాలకు కాస్తంత భిన్నం. వాస్తవానికి సోమేశ్వర స్వామి ఆలయం అయినా, శనీశ్వరుడు ప్రతిష్ఠించడంతో శనీశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి విముక్తి కోసం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. జాతక చక్రంలో శనితో సమస్యలున్నవారు కూడా వస్తుంటారు. ఏటా శ్రావణ మాసం లోనూ, శనిత్రయోదశి వచ్చే రోజుల్లోనూ మందేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.శనిత్రయోదశి నాడు, మహాశివరాత్రి రోజున ఇక్కడికి వచ్చేవారి సంఖ్య వేలల్లో ఉంటుంది. శనీశ్వరుడికి తైలంతో ఇక్కడ అభిషేకం చేస్తారు. నల్లటి వస్త్రాలు దానం చేస్తారు. కోర్టు కేసులు, శత్రువులు, రోగాలు, రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని, వారి కోర్కెలు తీరిన తరువాత మొక్కులు చెల్లిస్తుంటారు.


విశేష పూజ దినములు

శని త్రయోదశి - శనివారం రోజులో వచ్చే త్రయోదశి.

మహాశివరాత్రి

శనివారం ఆమవాస్య.

పూజకు కావలసిన వస్తువులు

పసుపు

కుంకుమ

వత్తులు

ప్రమిదులు-2

నల్ల నువ్వుల నూనె-1/2 కేజి

నల్ల నువ్వులు

నవ దాన్యలు-100 గ్రాములు

మేకు-1

యెర్రటి వస్త్రం

నల్లటి వస్త్రం

బియ్యం-1/2 కేజి

బెల్లం

పువ్వులు

తమలపాకులు-10

అరటి పండ్లు-4

కర్పూరం

అగరబత్తి

ఒక్కలు-2

కొబ్బరికాయలు-2

ప్రత్తి గింజలు

అరటి ఆకు-1

గ్లాసులు-2

మందపల్లి గ్రామం రాజమండ్రికి 38 కి.మి., కాకినాడకు 60 కి.మి., అమలాపురంకు30 కి.మి., రావులపాలెంకు 9 కి.మి. దూరంలో ఉంది.

అహంభావాన్ని మాత్రం

 ఒక మహానగరం లో ఒక గొప్ప శిల్పి వుండేవాడు. ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే, పేరు ప్రఖ్యాతులున్న విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పునూ పట్టలేక పోయేవారు. ఆయన చెక్కిన శిల్పాలున్న పెద్ద గది లోకి వెళితే, అవన్నీ ప్రాణమున్న వాటివిగా, మన పక్కన వున్నట్టు, మనకు చేయి అందిస్తున్నట్టు, మనతో మాట్లాడుతున్నట్టు…సజీవంగా వుండేవి…ఎటూవంటివారైనా మంత్రముగ్ధులు కావాల్సిందే! ఆ అసాధారణ ప్రతిభ, నైపుణ్యం నెమ్మదిగా అతనిలో అహంభావాన్ని [ Ego ] నింపాయి.


ఇదిలావుండగా, ఒకరోజు ఒక జ్యోతిష్కుడు ఆయన చేతిని, జన్మ నక్షత్ర వివరాలను పరిశీలించి ‘మీరు ఫలానా రోజు చనిపోతారు సుమా!” అని చెప్పాడు.


శిల్పికి చెమటలు పట్టాయి, ఆయన ఇలా అనుకొన్నాడు, నేను బ్రహ్మ లాంటివాడిని కదా! ఆయన [ బ్రహ్మ ] మనుషులను సృష్టిస్తే, ఆ రూపాలకు నేను ప్రతిరూపాలా….అనిపించే శిల్పాలు సృష్టిస్తాను…కాబట్టి, నేను అపర బ్రహ్మ అవుతాను. మృత్యువు వచ్చిన రోజున నాలాగే వున్న మరో ఏడు శిల్పాలను చెక్కి వుంచుతాను. అపుడు మృత్యు దేవత ప్రాణమున్న శిల్పి ఎవరో, బొమ్మ ఏదో కనుక్కోలేక వెళ్ళిపోతుంది. నేను మృత్యువుకు దొరకను అని ఉపాయం పన్నాడు.


అచ్చు తనలాగా వున్న శిల్పాలు ఏడు చెక్కి, మృత్యు దేవత వచ్చే రోజున ఒక దాని వెనుక దాక్కొన్నాడు.


మృత్యుదేవత ఆ గదిలోకి వచ్చింది. శిల్పి శ్వాసను పూర్తిగా నియంత్రించి కదలకుండా నిలుచున్నాడు. దేవత వెతుకుతూ వస్తోంది. ఊపిరి బిగపట్టి చూస్తున్నాడు శిల్పి. ఇక కనుక్కోలేదులే అని అనుకొన్నాడు. శిల్పి ప్రతిభకు మృత్యు దేవత ఆశ్చర్యపోయింది. ఎంత ప్రయత్నం చేసినా జీవి ఎవరో… శిల్పమేదో… కనుక్కోలేక పోయింది.


ఇక తనవల్ల కాదని వచ్చిన దారినే వెళ్ళి పోవాలనుకొని వెనుతిరిగింది. శిల్పి ఆనందనాకి అవధులు లేవు. తన తెలివితేటలను తన కళా నైపుణ్యాన్ని తనలో తానే పొగుడుకుంటున్నాడు. ఇంతలో దేవత మళ్ళీ శిల్పాల వైపు తిరిగి “ఈ శిల్పి” ఎవరోకానీ, ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కాడు ! కానీ ఈ ఒక్క శిల్పంలోనే అతను ఒక చిన్న తప్పు చేసాడు! అంది.


అంతే! మన అపరబ్రహ్మకు అహం దెబ్బతింది. తన వృత్తి జీవితంలో ఇప్పటివరకు హేమాహేమీలు ఒక్కరు కూడా వంక పెట్టలేదు. అలాంటిది ఈరోజు తప్పు జరిగింది అంటుందా! ఈ దేవత…అనుకున్నాడు. వెంటనే తాను దాక్కొన్నాడు అన్న సంగతి కూడా మరచి కోపంతో ”ఏది? ఎక్కడుంది తప్పు చూపించు? అంతా చక్కగావుంది. ఏ తప్పూ లేదు!” అనేసాడు.


అపుడు మృత్యుదేవత నవ్వుతూ….నాకు తెలుసు అందులో ఏ తప్పూ లేదని. కానీ నిన్ను గుర్తించడానికి చెప్పానంతే. నేనేమీ నిన్ను పట్టుకోలేదు, నీకు నువ్వే పట్టుబడ్డావు! “ప్రాణాధారమైన నీ శ్వాసను కూడా నియంత్రించగలిగావు కానీ, నీ అహంభావాన్ని మాత్రం నియంత్రించలేకపోయావు, చివరకు అదే నిన్ను పట్టించింది” అని ఆయన్ను తీసుకెళ్ళిపోయింది.


మనం పెంచుకొనే అహంభావం [ Ego ] అంత ప్రమాదకరమైనది. అది సత్యాన్ని చూడనివ్వదు, వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు, మనం అనుకొన్నదే సరైంది, ఇతరులదే తప్పు అని మనం అనుకొనేలాగా చేస్తుంది. నెమ్మదిగా అది స్వార్థానికి దారి తీసి ”నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు” అనుకొంటాము. స్వార్థం ప్రకృతి విరుద్ధం, దైవం నుండి మనకు అందాల్సిన అనుగ్రహన్ని అడ్డుకొనే దెయ్యం స్వార్థం.


మీరు గమనించారా? ” అహంభావం ” అనే పదం లోంచి ‘అహం’ తీసేస్తే మిగిలేది ‘భావం’ అంటే ‘అర్థం’ అర్థమైతే అనర్థం జరగదు.

నామస్మరణతో బి.పి. నియంత్రణ

 🌼విఠ్ఠల .. విఠ్ఠల  నామస్మరణతో బి.పి. నియంత్రణ, హార్ట్ అటాక్ రాదట🌼



🌿🌼🙏పుణె లోనివేద విజ్ఞాన కేంద్ర వందలాది హృద్రోగుల మీద ప్రయోగం చేసి ఈ విషయాన్ని నిరూపించింది. ఈ విషయమై ఏషియన్ జనరల్ ఆఫ్ కాంప్లిమెంటరి అండ్ ఆల్టర్నేటివ్ మీడియా అనే అంతర్జాతీయ పత్రికలో ఒక వ్యాసం కూడా ప్రచురితమైంది.🙏🌼🌿


🌿🌼🙏విఠ్ఠల అనే పేరులో అపురూపమైన శక్తి ఉంది. విఠ్ఠల నామ స్పందన అంటే స్వరశాస్త్రం గురించి కూడా అనేక పరిశోధనలు జరపడం జరిగింది. ఈ పదాన్ని ఉచ్చరించేటపుడు ' ఠ్ఠ ' అనే అక్షరం నుండి వెలువడే శక్తి నేరుగా గుండె మీద అద్భుత పరిణామాన్ని కలిగిస్తుంది అని అధ్యయనం ద్వారా తెలిసింది.🙏🌼🌿


🌿🌼🙏రెండు మహాప్రాణాలు మరియు రెండు అల్ప ప్రాణాలు కలిగిన పదమైనందున గుండె మీద ప్రభావం కలుగుతుందని వేద విజ్ఞాన కేంద్ర తెలిపింది. 

పదిరోజులపాటు, రోజుకు 9 నిమిషాలు శాంత చిత్తంతో విఠ్ఠల నామజపం చేసినా హై బ్లడ్ ప్రెషర్ తో సహా గుండెకు సంబంధించిన సమస్యలు నివారణ అవుతాయని వేద విజ్ఞాన కేంద్ర మరియు దివంగత ఇనాందార్ హార్ట్ క్లినిక్ బృందాలు వెల్లడించాయి.🙏🌼🌿

 

🌿🌼🙏అందరం భక్తితో " విఠ్ఠల విఠ్ఠల పాండురంగ " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం, ఎంత ఆర్తితో స్మరిస్తే అంత త్వరగా అనుగ్రహిస్తాడు ఆ భగవంతుడు🙏🌼🌿


విఠ్ఠల విఠ్ఠల పాండురంగ 

విఠ్ఠల విఠ్ఠల పాండురంగ 🙏

సేకరణ

సంసారం

 *శుభోదయం*

🙏💐🙏💐🙏

*సంసారం ఒక సాగరం*

 

*జీవితం అందులో నడిచే నావ*


*జీవి నావికుడు*


*కష్టాలు, కన్నీళ్లు అలలు..* 

*సుఖాలు సంతోషాలు కూడా అలలే...* 


*నేను, నాది అనే స్వార్థం ఆ నావకున్న రంధ్రాలు..*

 

*వీటి ద్వారా కష్టాలు కన్నీళ్లు చేరి ఆ నావను ముంచేస్తాయి.....* 


*మనము, మనది అనే పరమార్థంతో ఆ రంధ్రాలను పూడ్చి వేస్తే...*

 

*సుఖము, సంతోషమనే అలలు ఆ నావను తీరానికి చేరుస్తాయి..*

 

🙏🙏🙏🙏🙏🙏

ఓం అరుణాచల శివ

ఉపనిషత్తులు

 *ఉపనిషత్తులు* 

    ➖➖➖


హిందూ ధర్మ శాస్త్రాలలో ఉపనిషత్తులు ఒక భాగం. ఇవి వేదాల చివరి భాగాలు, అందుకే వీటిని వేదాంతాలు, వేదాంతము అని కూడా అంటారు. సాధారణంగా వేదాలలో నాలుగు భాగాలు ఉంటాయి.


*1. సంహితలు*

వీటిలో మంత్రాలు స్తోత్రాలు ఆవాహనలు సంబంధించినవి ఉంటాయి.


*2. బ్రాహ్మణములు*

ఇందులో సంహితలలోని మంత్రాలను శాస్త్రవిధిగా వివరించే విషయాలు , యజ్ఞ యాగాదులకు వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు


*3. అరణ్యకములు*

ఇందులో వివిధ కర్మకాండలు యజ్ఞ యాగాదులకు సంబంధించిన వివరాలు ఉంటాయి


*4. ఉపనిషత్తులు*

ఇవి పూర్తిగా జ్ఞానకాండ కు సంబంధించినవి అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, మోక్షము, లోకము  ప్రాణులు, ప్రకృతి, భగవంతుడు మొదలగంశాలు ఇక్కడ వివరించడం జరుగుతుంది.


నాలుగు వేదాలలో కలిపి మొత్తము 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. అయితే వేదాలలో ఉన్న శాఖల ఆధారంగా వాటిలో 108 ఉపనిషత్తులు మాత్రమే ముఖ్యమైనవి, వాటిలోనూ 10 మాత్రమే ప్రధానమైనవి.


*ఉపనిషత్తుల వివరణ*

భారతీయ తత్వ శాస్త్రానికి ఉపనిషత్తులు శిరోమాణిక్యాల వంటివి. ఉపనిషత్ అంటే దగ్గరగా కూర్చుని అభ్యసించడం లేదా సమీపమును కూర్చుని నేర్చుకునే విద్య అని భాష్య కారులు అర్థం చెప్పారు. ఈ ఉపనిషత్తులకే వేదాంతం అనే మరొక పేరు కూడా కలదు.


వేద సూక్తులు ఆర్యుల కవితావేశానికి చిహ్నం. అంతటి సామర్థ్యం గల ఒక శాఖ ఆర్యులలో ఉండి, ఈ వేదాలు ఉద్భవించడానికి కనీసం కొన్ని శతాబ్దాలు పట్టి ఉంటుంది. ఇందులో అనార్యులు కూడా చాలామంది చేరారు. ఈ ఉపనిషత్తులు క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల తర్వాత రూపొందాయని భావిస్తారు.


అయితే ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్నప్పుడు, ఒక్క భారతదేశం మాత్రమే ఆధ్యాత్మిక ప్రకాశంతో విరాజిల్లింది . అప్పుడు సంపన్నులైన భారతీయ ఋషులు సమస్తమైన అంధకారానికి అతీతమైన సూర్య దీప్తితో ప్రకాశించే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని వారు సాక్షాత్కరించుకున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.


ఈ ఉపనిషత్తులు కొన్ని బ్రహ్మ తత్వాన్ని, గురించి కొన్ని ఆత్మ తత్వాన్ని ,గురించి కొన్ని దేహ తత్వాన్ని గురించి, కొన్ని ప్రపంచ స్వరూపాన్ని, మరికొన్ని జీవస్వరూపాన్ని, మరికొన్ని పంచభూతాలైన పృథ్వి నీరు నిప్పు గాలి, ఆకాశాల స్థూల సూక్ష్మరూపాలను, మరికొన్ని మరణాన్ని ,మరణానంతర స్థితులను, కర్మలను ,ఆశ్రమ ధర్మాలను, మోక్ష స్వరూపాలను గురించి చర్చించాయి. అంటే ఈ ఉపనిషత్తులు మొత్తం మీద జ్ఞానాన్ని గురించి మాత్రమే చర్చించాయి మిగతాయి కర్మకాండం గురించి చర్చించాయి ఉపనిషత్తులు జ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞాన విషయాల గురించి చర్చించాయి.

    

ఈ ఉపనిషత్తులు అన్నీ వాదప్రతివాద , సంవాదాల రూపంలో ఉంటాయి. అంటే ఒకరు ఒక విషయాన్ని గురించి ప్రశ్నించడం, ఆ ప్రశ్నకు అనేకమంది కానీ లేదా ఏ ఒక్కరో కానీ సమాధానం ఇవ్వడం జరుగుతుంది. ఒక ప్రశ్నను వేయడం దానికి సమాధానం చెప్పడం, ఆ సమాధానాన్ని ఖండించడం లేదా సమర్థించడం లేదా సంస్కరించడం లేదా మరొక నూతనమైన సమాధానాన్ని చెప్పడం ఉపనిషత్తులోని వాద పద్ధతిని సూచిస్తాయి. ఈ వాద ఉపవాదాలు అతి విశాలమైన అరణ్యాల్లోనూ, ఆశ్రమాలలోనూ విద్వత్ సభల్లోను జరిగాయి. ప్రతి ఉపనిషత్తు ఒక ముఖ్యమైన విషయాన్ని మనకు తెలియజేస్తుంది. జగద్గురువులు శ్రీ శంకరాచార్యులు వారు మొత్తం ఉపనిషత్తులలో ముఖ్యమైన పది ఉపనిషత్తులకు భాష్యాలను వ్రాశారు.


*ప్రధానమైన పది ఉపనిషత్తులు*

1. ఈశావాశ ఉపనిషత్తు

2. కేన ఉపనిషత్తు

3. కఠ ఉపనిషత్తు

4. ప్రశ్న ఉపనిషత్తు

5. ముండక ఉపనిషత్తు

6. మాండూక్య ఉపనిషత్తు

7. త్తెత్తరీయ ఉపనిషత్తు

8. ఐతరీయ ఉపనిషత్తు

9. ఛాందోగ్య ఉపనిషత్తు

10. బృహదారణ్యక ఉపనిషత్తు.

      

తిరస్కరించబడిన

 .            

                      _*సుభాషితమ్*_


 𝕝𝕝 శ్లోకం𝕝𝕝


*అవజ్ఞాత్రుటితం ప్రేమ* 

*నవీకర్తుం క ఈశ్వరః |*

*సన్ధిం న యాతి స్ఫుటితం* 

*లాక్షాలేపేన మౌక్తికమ్||*


తా𝕝𝕝 

తిరస్కరించబడిన ప్రేమను మళ్లీ కొత్తగా మొదటి స్థితికి తెచ్చుకోవడం ఈశ్వరునికైనను సాధ్యం కాదు. అలాగే, పగిలిపోయిన ముత్యానికి లక్క పూసినా అది చక్కబడదు.




..















 

తిరుపతి చుట్టూ చూడదగ్గ క్షేత్రాలు

 తిరుపతి చుట్టూ చూడదగ్గ క్షేత్రాలు ప్రదేశాలు...


తిరుచానూరులో పద్మావతి అమ్మవారు,నూతనంగా పునరుద్ధరించిన పేరూరు బండ వద్ద గల ఒకులామాత ఆలయం, శ్రీనివాస మంగాపురం శ్రీనివాసుడి ఆలయం(వెంకటేశ్వర స్వామి దర్శనం క్షణిక కాలం ఇక్కడ స్వామిని చూసినట్టే ఉంటుంది), అప్పలాయగుంట వెంకటేశ్వర స్వామి ఆలయం, వికృతమాల గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తిస్వర దర్శనం,

 గుడిమల్లం గుడి దర్శనం, అర్ధగిరి ఆంజనేయ స్వామి దర్శనం, కాణిపాకం గణేష్ గుడి దర్శనం,తలకోన జలపాతం ఇంకా ముందుకు వెళదాచుకుంటే నారాయణవనంలో వెంకటేశ్వర స్వామి వివాహమైన ఆలయం, నాగలాపురంలో మచ్చా అవతార వెంకటేశ్వర స్వామి,

రామగిరి లో ఈశ్వరాలయం నంది నోటి నుంచి వచ్చే నీరు, సురుటుపల్లి లో సేయనించి

 ఉన్న ఈశ్వరుడి ఆలయం,తిరుపతిలో కపిల తీర్థం, గోవింద రాజస్వామి దర్శనం, ఇస్కాన్ టెంపుల్,చంద్రగిరి కోట, రీజనల్ సైన్స్ సెంటర్ (పిల్లలకు చాలా ఉపయోగం),శ్రీనివాసం వసతి సముదాయం లో మధ్యాహ్నం,రాత్రి ఉచిత బోజన సదుపాయం కలదు.ఇలాతిరుపతి చుట్టూ ఎన్నో ఆధ్యాత్మిక క్షేత్రాలు,ప్రదేశాలు ఉన్నాయి.

మీ ఓపిక మీరు కేటాయించుకున్న రోజులను బట్టి దర్శనాలు చేసుకోవచ్చు.


ఓం నమో నారాయణాయ🙏🙏🙏

ఈ రోజు పదము:

 201వ రోజు: (భాను వారము) 25-06-2023

మన మాతృ భాష సేవలో


ఈ రోజు పదము:

సోదరుడు (Brother): ఏకోదరుడు, కేశటుడు, తోబుట్టినవాడు, భ్రాత, సగర్భుడు, సజాతుడు, సనాభి, సమానోదర్యుడు, సహజన్ముడు, సహజుడు, సోదరుడు, సైదోడు. 


 ఈ రోజు పద్యము:


నరవరుఁడు నమ్మి తను నౌ

కరిలో నుంచునెడ వాని కార్యములందున్

సరిగా మెలంగ నేర్చిన 

పురుషుడు లోకమునఁగీర్తి బొందు కుమారా!


 ఓ కుమారా! రాజు ఎవనినమ్మి తనకు సేవకునిగా నియమించుకొనునో అట్టివాడు అతని పనులను శ్రద్దతో చేయుచుండిన కీర్తి పొందును.

ఆర్య చాణక్య*♦️ .*పార్ట్ - 101*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


.*పార్ట్ - 101*


ఆ అంగుళీయకాన్ని చూస్తూ సాలోచనగా భృకుటి ముడిచాడు చాణక్యుడు. దానిపై రాక్షసామాత్యుని పేరు చెక్కి ఉన్నది. దానిని చాణక్య శిష్యుడు భద్రుడు తెచ్చి సమర్పించాడు. 


చాణక్యుడు ఆ ఉంగర పరిశీలనము ముగించి తలెత్తి "చెప్పు" అని ఆదేశించాడు. భిక్షుక వేషంలో ఉన్న భద్రుడు గొంతు సవరించుకొని "నేనీ భిక్షుక వేషంలో నగరంలో వీధుల్లో సంచరిస్తూ, శత్రు రహస్యాల కోసం అన్వేషిస్తూ ఒక ఇంటి ముందు నేను భిక్ష కోసం అరుస్తుండగా ఒక బాలుడు నా గొంతువిని బాల్యచాపల్యం చేత బయటికి పరిగెత్తుకొచ్చాడు. మరుక్షణమే ఆతని తల్లి పరిగెత్తుకువచ్చి కంగారుగా కుమారుని ఎత్తుకొని లోనికి తీసుకుపోతుండగా ఆమె చేతివ్రేలినుండి ఆ ఉంగరము జారి నా ముందు పడింది. ఆమె తన కంగారులో ఉంగరం పడిపోవడానికి గమనించలేదు గానీ, నేను ఆ తల్లీ బిడ్డలను గుర్తించాను. వారు రాక్షసామాత్యుని భార్య, కుమారుడు. ఆ ఉంగరాన్ని ఎవ్వరూ చూడకుండా తస్కరించి....." అని చెప్పి నవ్వాడు. 


చాణక్యుడు తల పంకించి "మంచిది. ఇక నువ్వు పోవచ్చు...." అని చెప్పాడు. భద్రుడు నమస్కరించి నిష్క్రమించాడు. 


చాణక్యుడు తన శిష్యుడు ఆగమసిద్ధిని పిలిచి "కుమార చంద్రగుప్తునికి మా సందేశాన్ని తక్షణమే వెళ్లి వినిపించు. నేపాళ ప్రభువు పర్వతకుని మృతదేహం పైనుంచి తీసి దాచిన వారి ఆభరణాలను వెంటనే ముగ్గురు సద్భ్రాహ్మణులకు దానమియ్యవలెను. ఆ ముగ్గురు బ్రాహ్మణులను కూడా మేమే పంపిస్తామని చెప్పు. వెళ్ళు" అని ఆదేశించాడు. 


ఆగమసిద్ధి ఆగమేఘాల మీద చంద్రగుప్తుని వద్దకు వెళ్లి చాణక్యుని ఆదేశాన్ని వినిపించాడు. ఆ తదుపరి చాణక్యుని పనుపున్న ముగ్గురి శిష్యులు అక్కడికి వచ్చి ఆ దానములు స్వీకరించి, తిరిగి వచ్చి ఆభరణాలు చాణక్యునికి సమర్పించి నిష్క్రమించారు. 


అనంతరం చాణక్యుడు తన శిష్యుడు గుణశర్మకి ఆ నగలు అప్పగించి "నీవు తక్షణం రత్నవ్యాపారి వేషం ధరించి నేపాళ రాజధాని మంజుపట్టణానికి వెళ్ళు. ఈ ఆభరణాలు రాక్షసునికి విక్రయించు" అని రహస్యంగా ఆదేశించాడు. గుణవర్మ తలవూపి ఆ ఆభరణాలతో నిష్క్రమించాడు. అంతట చాణక్యుడు తిక్కిరి బిక్కిరి రాతతో ఒక లేఖ రాసి, తన శిష్యుడు సిద్ధార్థకునికి ఇచ్చి "సిద్ధార్థకా ! ఈ చేతి వ్రాత తిక్కిరి బిక్కిరి వున్నదని సాకు చూపి రాక్షసమిత్రుడు శకటదాసు స్వహస్తాలతో సాపు ప్రతి వ్రాయించి తీసుకురా. అతడు వృత్తిరీత్యా లేఖకుడు గనక నిన్ను అనుమానించడులే..." అని చెప్పి పంపించాడు. 


ఒక అర్థఘడియ కాలము తర్వాత సిద్ధార్థకుడు లేఖతో తిరిగి వచ్చాడు. చాణక్యుడు లేఖపై రాక్షసుని అంగుళీయకపు ముద్రవేసి ఆ లేఖని, అంగుళీయకాన్ని సిద్ధార్థకునికి ఇచ్చి అతని చెవిలో గుసగుసలాడి "అర్థమైంది గదా...." అన్నాడు. సిద్ధార్థకుడు మందహాసం చేసి తలవూపి వెళ్ళిపోయాడు. చాణక్యుడు మరి కాసేపు ఆలోచించి నగర రక్షకభటాధ్యాక్షుడిని తన ఆశ్రమానికి పిలిపించాడు. 


"లేఖరి శకటదాసు రాజద్రోహి. అతని తక్షణం బంధించండి. రేపు ఉదయమే అతడికి శూలారోహణం ద్వారా మరణశిక్ష అమలు చేయండి... పర్వతక మరణానికి కారణమైన విషకన్య సృష్టికర్త ఆ బౌద్ధ బిక్షువు జీవసిద్ధి. మరణము పర్వతకుడికి సంభవించినా దానిని ప్రయోగించబోయినది మన మహారాజుల వారిపైన... కనక ఆ జీవసిద్ధిని తక్షణం బంధించి అతనికి శిరోముండనం గావించి, గాడిదపై నెక్కించి ఊరేగించి దేశాన్నుంచి వెళ్లగొట్టండి.... అలాగే రత్నవ్యాపారి చందనదాస శ్రేష్టికి కబురుపెట్టండి. వారి సత్వర దర్శనం మాకు అవసరం...." అని ఆజ్ఞాపించాడు చాణక్యుడు. 


చాణక్యుని ఆజ్ఞను అనుసరించి శకటదాసును బంధించి కారాగారంలో పడేశారు. బౌద్ధభిక్షువు జీవసిద్ధికి గుండుగీయించి, గాడిదపై ఊరేగించి నగరాన్నించి వెళ్ళగొట్టారు. ఇవి జరుగుతుండగానే చందనదాసు ఆశ్రమానికి వచ్చి చాణక్యుని దర్శించుకున్నాడు. 

(ఇంకా ఉంది)....🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

రిటైరైనోడి

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

👨🏽రిటైరైనోడి బ్రతుకు 😩

1.పొద్దున్నే లేవకపోతే,👵🏾 లేవండి రిటైరయ్యానని ఎప్పుడూ పడుకోవడమేనా?

2. త్వరగా లేస్తే,👵🏾మీకు వయసైపోయి నిద్ర తగ్గిందని తెల్లారక ముందే లేచి అందరి నిద్ర పాడుచేస్తే ఎలా?

3.ఇంట్లో కూర్చుండిపోతే,👵🏾 అస్తమానం ఆ మొబైల్ పట్టుక్కూర్చోక పోతే వంటపనిలో సాయపడొచ్చు కదా?

4. ఒక వేళ ఇంటి బయట ఎక్కువ ఉంటే,👵🏾 కాలికి బలపం కట్టుకొని ఊరంతా తిరగకపోతే  'రామా కృష్ణా' అంటూ ఓ మూలుండవచ్చు కదా?

5. పూజ గదిలో ఎక్కువ సేపుంటే,👵🏾ఎప్పుడూ లొడలొడా మంత్రాలు చెప్తూ గంట వాయించి హారతులిస్తే దేవుడు దిగొస్తాడేంటి?

6. పార్ట్ టైమ్ జాబ్ చేసి కాస్త డబ్బులు సంపాదిస్తే,👵🏾రిటైరయ్యాక మళ్ళీ డబ్బులు సంపాదిస్తున్నానని పేద్ద ఫోజు, ఆ ఏడుపు అప్పుడు ఉండుంటే ఈ పాటికి నాలుగు అంతస్థుల మేడ ఉండేది.

7. భార్యను 'చార్ ధామ్'యాత్రకు తీసుకెళ్తే,👵🏾అబ్బో పేద్ద యాత్రలు! ఎదురింటి ఎంకట్రావ్ భార్యతో 'ఊటీ కాశ్మీర్ సిమ్లా కులూ మనాలి'తీసుకెళ్లాడు.

8. ఒకేళ 'ఊటీ కాశ్మీర్ సిమ్లా కులూ  మనాలి' తీసుకెళ్తే,👵🏾 అంతలేసి డబ్బులు తగలేసే బదులు నాకు రవ్వల గాజులో లేక నెక్లేసో చేయించొచ్చు కదా?

9. అపార్ట్మెంట్ వెల్ఫెర్ అసోసియేషన్ ప్రెసిడెంటై బిజీగా ఉంటే,👵🏾మొదట ఇంటి పనులు చేసి ఆ తర్వాత ఊరును ఉద్ధరించండి.

10. ఒక వేళ ఏది పట్టించుకోకుండా   ఊరుకుంటే,👵🏾పొరుగింటి పుల్లారావును చూసి నేర్చుకోండి, అపార్ట్మెంట్ వెల్ఫెర్ అసోసియేషన్ ప్రెసిడెంటై సెక్యూరిటీ గార్డ్ చేత సెల్యూట్ కొట్టించుకుంటున్నాడు. మీరూ ఉన్నారెందుకు?🤔

👌🏽ఓల్ మొత్తంగా నేను చెప్పేదేమిటంటే; రిటైరయ్యాక 'నేనది చేస్తా ఇది చేస్తా ' అని ఓవర్ గా ఇదైపోయి ఫోజులు కొట్టకుండా భార్య చెపినట్టు వింటే మంచిది. ఏది ఏమైనా భార్యచేత చీవాట్లు తప్పదు!

DISCLAIMER: అమ్మ తోడు ఇది మాత్రం నా అనుభవము కాదు. పక్కింటి  పుల్లా రావు అగచాట్లు చూసి రాసింది.🤨🤔😩

Pury jagannadh temle


 

చేమకూర భావనా ప్రతిభ!

 శుభోదయం🙏


చేమకూర భావనా ప్రతిభ!! 


       ఉ:-పున్నెమిరేల దత్పురము పొంతనఁబోన్ శిఖరాళి దాకి వి 

             ఛ్ఛిన్న గతిన్ సుధారసముజింది పయింబడ నంతనుం 

               డిన్నెల సన్నగిల్లు నదినిక్కమ కాదనిరేనియా పదా 

                 ర్వన్నె పసిండిమేడలకు రాబనియేమిల సౌధనామముల్ ; 

         

                  చామకూరవేంకటకవి- విజయవిలాసము; 


           చామకూర పద చమత్కారముననేగాక,భావచమత్కారమునగూడదిట్ట. విజయవిలాసమున పురవర్ణన 

            చేయుచు ఇంద్రప్రస్ధమునందలి మేడలను వర్ణించుచు అచటిపైడిమేడలకు సౌధములను పేరువచ్చుటకు 

              కారణమేమి?అనిప్రశ్నించుచు, దానికిసమాధానముగా నీకధనువివరించుచున్నాడు. "చందమామ 

               పున్నమిరాత్రులలోనీమేడలమీదుగాపయనించుటచే,ఈమేడలకున్నపొడవైన శిఖరములు కడపులోనికి 

                దిగబడి చందమామలోని'అమృత'మంతయు చంద్రునిపై బడియుండును, లేకున్ననీబంగరుమేడలకు 

                 సౌధము లనుపేరేలవచ్చును? అనిసమాధానమొసంగుచున్నాడు. 

                           ఇక్కడ "సుధ- శబ్దమునకు- అమృతము,సున్నము,అనురెండర్ధములుఉండుటచే కవియీ 

                     చనత్కారమునుసాధించినాడు.

నిరుక్తి అలంకారము!💄

వేదాద్రి

 🕉  మన గుడి :


🔆 కృష్ణా జిల్లా : " వేదాద్రి "






👉 శ్రీ యోగనంద లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం


💠'  వేదాద్రి ' వేదాలని నిక్షిప్త్రం చేసిన పర్వత పర్వత ప్రదేశం కాబట్టి .. వేదాద్రిగా ప్రాచూర్యం పొందింది ..


💠 ప్రశాంతమైన అరణ్య మధ్యమున, కృష్ణవేణి తరంగ నాదములతో ప్రకృతి సహజసిద్ధ సౌందర్యములను నిండుగా అలంకరించుకొని భక్తకోటి ముక్తియే 'వేదాద్రి'గా అలరారుతోంది.

క్రిష్ణా నది తీరంలో  కొలువు దీరిన

అత్యంత మహిమలు గల ఈ దేవాలయం ... విజయవాడకు 60 కిలో మీటర్ల దూరం లో ఉంది .

ఒక్కసారి ఇక్కడి నర్సింహా స్వామిని దర్శించికుంటే మానసిక 

ప్రశాంతత చేకూరుతుంది


💠 కృష్ణా నదీ తీరాన వున్న పంచ నారసింహ క్షేత్రాలలో ఒకటి వేదాద్రి.  ఇది కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకి సమీపంలో వున్నది.  

మిగతా నాలుగూ వాడపల్లి, మట్టపల్లి, కేతవరం, మంగళగిరి. 


🔔 స్థలపురాణం 🔔


💠 క్షేత్రం వెనక ఉన్న పురాణ గాధ

వేదాద్రి క్షేత్ర మహాత్మ్యాన్ని గురించిన ప్రస్తావన శ్రీనాథుడి 'కాశీ ఖండం' లో కనిపిస్తుంది. 

పూర్వకాలంలో బ్రహ్మదేవుని నుండి వేదాలను సోమకారసుడను రాక్షసుడు తస్కరించి సముద్రమందు దాక్కున్నాడు. 

బ్రహ్మ తన జనకుడైన శ్రీమన్నారాయణుడి వద్దకు వెళ్ళి, జరిగింది వివరించి, వేదాలను తిరిగి అనుగ్రహించాలని ప్రార్థించాడు. భక్తవత్సలుడైన నారాయణుడు మత్స్యావతారం ధరించి సముద్రంలో దాక్కున్న సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను కాపాడాడు. 

వేదాలు పురుష రూపం ధరించి "దేవా! మమ్ము కరుణించి తరింప జేయుము” అని ప్రార్థించగా, నేను హిరణ్య కశపుణ్ణి సంహరించడానికై నృసింహావతారం ధరిస్తాను. అప్పుడు మీ శిరస్సులపై నేను పంచమూర్తియై మీ శిరస్సులపై నివసిస్తాను. అప్పటి వరకు మీరు కృష్ణవేణి గర్భంలో సాలగ్రామ స్వరూపంలో ఉండండి. మీవలెనే కృష్ణవేణి కూడా ప్రతిరోజు నన్ను అభిషేకించాలని ప్రార్థిస్తోంది. 

ఆమె కోరిక కూడా ఈ విధంగా తీరుతుంది". అని అనుగ్రహించగా వేదాలు ఎంతో సంతోషించి, సాలగ్రామ రూపంలో కృష్ణా నదిలో వుండసాగాయి.


💠 అనంతరం నారాయణుడు నృసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుని 

 సంహరించిన అనంతరం, స్వామి అక్కడే అయిదు అంశలతో ఆవిర్భవించాడు.

ఇక్కడ పంచ నారసింహ ప్రతిమలు ఉన్నాయి. అవి వీర, యోగ, జ్వాల, సాలగ్రామ, లక్ష్మీ నృసింహస్వామి. ఈ క్షేత్రం పంచనారసింహ 

(జ్వాల, సాలగ్రామ, వీర, యోగానంద, లక్ష్మీనృసింహామూర్తుల) క్షేత్రమైన వేదాద్రిగా పిలువబడుచున్నది.


🔅 1. శ్రీ జ్వాలా నరసింహస్వామి -- స్వయంభూ -- శిఖర స్ధితి (ఆలయం పక్కనుంచి మెట్లు కనబడతాయి)


🔅2. శ్రీ సాలిగ్రామ నృసింహ స్వామి --

 బ్రహ్మ ప్రతిష్ఠ -- కృష్ణానదిలో (ఆలయంలో నుంచి కూడా చూడవచ్చు)


🔅3. శ్రీ వీర నృసింహ స్వామి -- 

స్వయంభూ -- గరుడాచలం (ఇక్కడికి 5 కి.మీ.ల దూరంలో)


🔅4. శ్రీ యోగానంద స్వామి – త్రేతాయుగంలో ఋష్యశృంగ మహర్షి ప్రతిష్ఠించినది --మూలవిరాట్, గర్భాలయం


🔅5. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి -- 

మూలవిరాట్ పీఠం – లోక కళ్యాణార్ధం ప్రతిష్ఠింపబడ్డది.


 

💠 యోగానంద నృసింహస్వామి వారి మూల రూపము ఈ ప్రపంచములో ఎక్కడా లేనంత సుందరముగా సాలిగ్రామ శిలతో చేయబడి త్రేతాయుగములో ఋష్యశృంగ మహర్షిచే ప్రతిష్ఠింపబడినది. 'విశ్వేశ్వరుడు' క్షేత్ర పాలకుడిగా వ్యవహరించే ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం.


💠 గుడిలో స్వామితోబాటు చెంచు లక్ష్మి, రాజ్య లక్ష్మి అమ్మవార్లకు ప్రత్యేక మందిరాలు వున్నాయి. క్షేత్రపాలకుడు విశ్వేశ్వర స్వామికి మరియు నవగ్రహాలకు కూడా ఉపాలయములు ఉన్నాయి.


💠 కలియుగ ప్రారంభంలో కరువుకాటకాలు ఏర్పడటంతో ఋషులంతా వ్యాసుడి బోధతో కృష్ణానదీ తీరమున పంచనారసింహ క్షేత్రం కలదని, అక్కడ తపస్సు చేస్తే ముక్తి సాధ్యమవుతుందని విని, అక్కడికి వస్తుండగా, దారిలో నదీతీరం వెంబడి సుస్వరోచ్చారణమున వేదమంత్రాలు వినబడ్డాయి. ప్రకృతే ఆవిధంగా వేదాలను పఠిస్తోందని తెలుసుకుని, ఆశ్చర్యపోయారు. సమీపంలోని ఒక పర్వతం నుండే ఈ ధ్వని వినిపిస్తోందని నిశ్చయించుకొని, ఆ పర్వతానికి ప్రదక్షిణలు చేసారు. “ఋషులారా! ఇదే వేదగిరి. ఇందు శ్రీమన్నారాయణుడు నృసింహరూపంలో ఆర్చామూర్తియై వెలసినాడు. వెళ్ళి వారిని సేవించండి” అనే అశరీరవాణి మాటలు వినబడ్డాయి. వారు అట్లే వెళ్ళి స్వామివారిని కనుగొని, సేవించి తరించారు.


💠 ఈ దేవాలయాన్ని ఎఱ్ఱాప్రగడ, శ్రీనాథుడు, నారాయణతీర్థులు తదితర మహానుభావులు దర్శించి. పునీతులయ్యారు.



💠 ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమికి స్వామి వారి కళ్యాణం వైభవంగా జరుగుతుంది.

విశేషమైనటు వంటి పర్వదినాల్లో భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.


💠 ఈ స్వామిని సేవిస్తే గ్రహబాధలు, మానసిక రుగ్మతలు తొలగిపోతాయట. 


💠ఇక్కడ సౌకర్యాలు ఎక్కువ వుండవు.  

బస, భోజనం జగ్గయ్యపేటలో అయితే ఇబ్బందిలేకుండా వుంటుంది. 

దేవుడికి పూలమాలలు సమర్పించాలనుకుంటే జగ్గయ్యపేటనుంచి

తీసుకువెళ్ళండి. అలంకరిస్తారు. గుడి దగ్గర దొరకవు.

శ్రీ రంగనాథ స్వామి ఆలయం

 🕉 మన గుడి : 






⚜ కడప జిల్లా : పులివెందుల


⚜ శ్రీ రంగనాథ స్వామి ఆలయం


💠 పూర్వం ఇక్కడ పులులు మందలుగా తిరుగుతూ ఉండటం చేత ఈ ఊరుకు పులిమందల అన్న పేరు పడి, అది కాలక్రమేణా పులివెందుల అయిందని ప్రతీతి. 


💠 పులివెందులలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం చాల ప్రసిద్దమైనది. 

పులివెందులలోని గోస్తని తీర్థం ఒడ్డున వెలసిన శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని మాంధాత మహారాజు నిర్మించాడని, శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ  క్షేత్రం దివ్యస్థలంగా మారిందని ఆలయ చరిత్ర  చెబుతోంది. 


💠 1509 లో  బెజవాడ పురాధీశుడైన నరసయ్యదేవ , పులివెందుల శ్రీరంగరాజుల ( శ్రీరంగనాథుడి) నైవేద్యానికి, అంగరంగ వైభోగాల కోసం పులివెందుల  స్థలమందలి కుందలూడు అనే గ్రామాన్ని దానంచేశాడు.

ఈ శాసనం చారిత్రకంగా ఏంతో విలువైనది 


 💠 1509 నుండి 1690 వరకు శ్రీ రంగనాథ స్వామి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగేవి. 1690 వ సంవత్సరంలో ఔరంగజేబు సర్దార్ మహమ్మద్ జాఫర్ సాహెబ్ ఈ ఆలయాన్ని కొల్లగొట్టి ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేశాడు.


💠 ఆ తరువాత ఈ ప్రాంతము మరాఠాల ఆధీనంలో ఉన్నప్పుడు పీష్వా బాలాజీ బాజీరావు సమయంలో చిన్న రంగాపురం కరణము పూనా వెళ్లి బాలాజీ బాజీరావు అనుమతి  తీసుకొని 1756 సంవత్సరంలో శ్రీ రంగనాథ స్వామి ఆలయ విగ్రహాన్ని పునరుద్ధరించాడు.


💠 శ్రీ రంగనాథస్వామి మహిమల గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నవి. 

పులివెందుల ప్రాంతం ఒకప్పుడు  వేములపాలెంలో ఉండేది. 

982వ సంవత్సరంలో వేముల కోటను జయించడానికి రాజరాజ చోళరాజు సైన్యం దండెత్తి రాగా, వేముల పాలేగాడు శ్రీరంగనాథుడి భక్తుడైన భట్టారువారి వంశీకుడు ఆలయమును చేరి స్వామివారిని ప్రార్థించగా రంగనాథస్వామి కృపవల్ల తెల్లవారేసరికి చోళ రాజ్య సైన్యం భయపడి పలాయనం అయ్యారట. 

అప్పుడు వేముల పాలేగాడు భట్టారు వంశీకులకు "దుర్వార చోళ గర్వ తమో నిరసన మార్తాండ" అని బిరుదునిచ్చారట.


💠 ప్రతి ఏటా శ్రీరంగనాథుడి బ్రహ్మోత్సవాలు ఇప్పటికి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

పులివెందుల మున్సిపాలిటీ లోగో కూడా రంగనాథ స్వామి ఆలయ గోపురాన్ని చూడవచ్చు .

ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పులివెందులలోని మిట్ట మల్లేశ్వర స్వామి ఆలయం మరియు రంగనాథస్వామి ఆలయం పునరుద్ధరణ పనులకు నిధులు మంజూరు చేసింది.


💠 గుప్త నిధుల అన్వేషణ లో దుండగుల చేతిలో గర్భగుడిని చాలాసార్లు ధ్వంసం చెయ్యగా మళ్లీ ఆలయాన్ని పునరుద్ధరించారు, అలా ఈ ఆలయంలోని మూలవిరాట్‌ని ఇప్పటికి 3 సార్లు మార్చడం జరిగింది. 


💠 ఇప్పుడు ఉన్న విగ్రహం ఆదిశేషువుపై శయనించిన విష్ణు మూర్తిలాగా చాలా అందంగా ఉంటుంది. 

ఈ గుడిని చాల విశాలంగా ఎంతో సుందరంగా కట్టించారు.

గర్భగుడికి రెండు వైపుల రెండు చిన్న ఆలయాలు వాటిలో భూదేవి, నీళాదేవి అమ్మవార్ల విగ్రహాలు ఉన్నాయి. 


💠 గుడి వెనుక  భాగాన నాగదేవత విగ్రహలు రావి చెట్టు కింద ఉన్నాయి. మరో ప్రక్కన ఆంజనేయస్వామి ఆలయం కూడా ఉంది.

అన్ని ప్రసిద్ధ ఆలయాలలాగానే ఈ ఆలయానికి కూడా నాలుగు ద్వారాలు ఉన్నాయి, ప్రధాన ద్వారం దగ్గర ఉన్న గోపురం శిథిలావస్థలో ఉన్నందున, దాన్ని తొలగించి తిరిగి కట్టడం ప్రారంభించారు. 

గుడి ప్రాంగణం వెలుపల ఎంతో విశాలమైన పార్కు ఏర్పాటు చేసారు, 


💠 ఇక్కడి  శిల్పాలు కుడా చాలా అందంగా కనులకు వినోదాన్ని కలిగిస్తాయి.

ఈ ఆలయం ఔటెర్ రింగ్ రోడ్ కి ఆనుకుని పులివెందుల టౌన్ కి ఒక కిమీ దూరంలో ఉంది. 


💠 ఇక్కడికి చేరుకోవడానికి అన్ని ప్రముఖ పట్టణాలనుండి పులివెందులకు బస్ సౌకర్యం కలదు. 

పులివెందుల పట్టణం నుండి గుడికి ఆటోలో వెళ్లొచ్చు.