12, డిసెంబర్ 2022, సోమవారం

విశ్వశాంతి హోమానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

             తిరుమల, 12 డిసెంబరు, 2022


శ్రీ శ్రీనివాస విశ్వశాంతి హోమానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌


- డిసెంబరు 13 నుండి 18వ తేదీ వరకు హోమ కార్యక్రమాలు


         తిరుమ‌ల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో శ్రీ శ్రీనివాస విశ్వశాంతి హోమానికి సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ నిర్వహించారు. టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి పాల్గొన్నారు.


       ఈ సందర్భంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ఆచార్యవరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. ఆ తరువాత యాగశాల వైదిక కార్యక్రమాలు, నీరాజనం, తీర్థప్రసాద వినియోగం చేశారు.


        ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్‌ శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని ఆధ్వ‌ర్యంలో డిసెంబరు 13 నుండి 18వ తేదీ వరకు 22 మంది రుత్వికులు శ్రీ శ్రీనివాస విశ్వశాంతి హోమం నిర్వ‌హించనున్నారు.


       ప్రతిరోజూ ఉదయం 9 నుండి 12 గంటల వ‌ర‌కు, సాయంత్రం 6 నుండి 8.30 గంటల వరకు హోమ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. 


-------------------------------------------------------------

Srimadhandhra Bhagavatham -- 99

 Srimadhandhra Bhagavatham -- 99 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


శ్రీకృష్ణుడు మృతులయిన విప్రసుతులను తెచ్చుట

శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు ప్రతి ఘట్టంలోను ఆయన చేసిన లీలలచేత లోకమునంతటిని తరింపచేయడము కొరకు, మనకందరికీ కూడా పాఠం నేర్పడం కోసమని, మనం పరమేశ్వరుని చేరుకోవడానికి మార్గములను సుగమం చేయడం కోసమని ప్రాకృతికమయిన శరీరంతో వచ్చి కర్మ ఫలితం అనుభవించడం కోసమని పొందే కష్ట నష్టముల వంటివి కాకుండా హేలగా కొన్ని లీలలు చేసి వాటికి అంతమునందు జ్ఞానమును ప్రతిపాదించి మనస్సుకు ఒక ఆలంబనమును ఇవ్వకపోతే అది సరియైన ఆలంబనను పట్టుకోకుండా విషయ సుఖముల వైపు మనలను తిప్పుతుంది. ఒకవేళ ఆ జ్ఞానమునకు సంబంధించిన విషయము మనకు అవగతము కాకపోయినా బాహ్యమునందు లీల సంతోషంగా విని కృష్ణ పరమాత్మను మనసులో నిలబెట్టుకున్నా కూడా ఆ వస్తువు స్వరూపం అటువంటిది కాబట్టి అది భక్తివైపు నడిపించే విధానమును భాగవతమునందు ఆవిష్కరించారు.

పూర్వం ద్వారకానగరమును కృష్ణ భగవానుడు పరిపాలిస్తున్న రోజులలో ఒక బ్రాహ్మణుడు తన భార్యయందు ఒక కుమారుడిని కన్నాడు. ఆ పిల్లవాడు పుట్టగానే మరణించాడు. బ్రాహ్మణుడు ఆ పిల్లవానిని తీసుకువచ్చి రాజద్వారం దగ్గర పడుకోపెట్టి ‘నేను ఏ పాపమూ ఎరుగని వాడను ధర్మబద్ధమయిన నడవడి ఉన్న వాడను. అయినా సరే నా కుమారుడు మరణించాడు, అంటే దేశానికి ఆధిపత్యం వహించిన రాజు దోషం వలన ఇటువంటి పని జరిగి ఉండాలి. రాజుకు ధర్మబద్ధమయిన నడవడి లేదు’ అని ఉగ్రసేనుని నింద చేసి ఆ శవమును అక్కడ విడిచిపెట్టి కొంతసేపు తల కొట్టుకుని ఏడ్చి తరువాత ఆ పిల్లవాని శవమును తీసుకుని వెళ్ళిపోయాడు. మరల కొంతకాలము పోయిన తరువాత ఇంకొక కొడుకు పుట్టాడు. ఆ పిల్లవాడు కూడా పుట్టగానే మరణించాడు. మళ్ళీ ఆ పిల్లవాడిని తీసుకు వచ్చి రాజద్వారం దగ్గర పడుకోబెట్టాడు. ఇలా ఎనమండుగురు కుమారులు కలిగారు. అందరూ పుట్టగానే మరణించారు. ఎనిమిదవ సారి బ్రాహ్మణుడు రాజును నిందజేస్తుండగా అర్జునుడు ద్వారకా నగరంలో ఉన్నాడు. బ్రాహ్మణుడు తనకి పుట్టిన బిడ్డలందరూ కేవలం రాజు అధర్మం వల్లనే మడిసిపోతున్నారని ఏడుస్తున్న సమయంలో అర్జునుడు చూసి

'నీవు బ్రాహ్మణుడవు నీ ఏడుపులను బట్టి ఇప్పటికి నీకు ఎనమండుగురు కొడుకులు మరణించారని నాకు అర్థం అవుతున్నది. అలా మరణించిన కొడుకులను పెట్టుకుని నీవు రాజద్వారం దగ్గర ఏడుస్తుంటే నీ ఏడుపు పట్టించుకున్న వాడు ఊళ్ళో లేడు. ఈ ఏడుపు నుంచి ఉద్ధరించి నీకు పుత్రశోకము కలుగకుండా చేయగలిగిన విలుకాడు ఈ ఊళ్ళో లేడా?' అని అడిగాడు. అర్జునుడు ఈ ప్రశ్నను కృష్ణ భగవానుడు ఉన్న ఊళ్ళో అడుగుతున్నాడు. ఒక్కొక్క సారి ఎటువంటి భావనలు మనస్సులోంచి వస్తాయో చూడండి. తాను గొప్ప విలుకాడననే అతిశయం చేత ఈ మాట వచ్చింది. ఆ బ్రాహ్మణుడు ‘మాకిక్కడ కృష్ణుడు ఉన్నాడు. అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు ఉన్నారు. బలదేవుడు, ఉగ్రసేనుడు ఉన్నారు. ఇటువంటి వాళ్ళే రక్షించలేకపోయారు. నీవెవరివయ్యా ఇన్ని మాటలు అడిగావు’ అన్నాడు. ఆ మాటలకు అర్జునునికి కోపం వచ్చింది. అర్జునుడు నేనెవరినో తెలుసా! ఏ మహానుభావుడు తన గాండీవము పట్టుకుని రెండుచేతులతో బాణములను తీసి సంధించి విడిచి పెట్టి శత్రువుల మూకలను చెండాడుతాడో సవ్యసాచి అయిన పార్థుడను. నేను ఉండగా నీకు భయం లేదు. ఈసారి నీ కుమారుడు మరణించడు. నేను ఇక్కడే ఉండి నీ కుమారుడి ప్రాణములు పోకుండా కాపాడతాను. నీకు అభయం ఇస్తున్నాను. అలా నీ కొడుకును నేను కాపాడలేకపోతే నేను అగ్నిప్రవేశం చేస్తాను. ఇది నా ప్రతిజ్ఞ’ అని ద్వారకలో ఉండిపోయాడు. బ్రాహ్మణుని భార్య గర్భం దాల్చి ప్రసవ వేదన ప్రారంభం అవుతున్నదనగా అర్జునునకు కబురు చేసారు. ఆయన శుచియై ఒక పవిత్రమయిన ప్రదేశమునందు వెళ్లి నిలబడి పరమశివుని ఒకసారి తలచుకుని నమస్కారం చేసి ఆయన వలన పాశుపతాస్త్రమును పొందినవాడు కనుక అక్షయ బాణ తూణీరములను రెండు భుజములకు కట్టుకుని శరవేగంతో బాణ పరంపర ప్రయోగం చేశాడు. మంత్రపూరితములయిన బాణములతో ప్రసూతి గృహం చుట్టూ పంజరం అల్లినాడు. అందులోకి సూక్ష్మమయిన అణువు కూడా ప్రవేశించలేదు. ఒక అణువు కూడా బయటికి వెళ్ళలేదు. మృత్యుదేవత వచ్చి పిల్లవాడి ప్రాణములు తీసుకువెళ్ళడానికి వీలులేదు. దుర్భేధ్యమయిన రక్షణ కవచమును నిర్మాణం చేశాడు.

లోపల ఒక పిల్లవాని కేర్ మన్న ఏడుపు వినపడింది. ప్రసవం అయి బిడ్డడు జన్మించాడు అనుకున్నాడు. మరుక్షణంలో బిడ్డడు చనిపోయాడని ఏడుపులు వినపడ్డాయి. ఆశ్చర్యపోయి ‘ఏడి పిల్లవాడు’ అని అర్జునుడు లోపలికి వెళ్ళాడు. తీరా చూసేసరికి చనిపోయిన పిల్లవాడు మాయం అయిపోయాడు. అర్జునుడి చేత నిర్మింపబడిన దుర్భేద్యమయిన బాణ కవచము ఉన్న చోటునుండి ఈసారి శరీరం కూడా అదృశ్యం అయిపోయింది. ప్రాణములను తీసుకు వెళ్ళడం అనే విధి యమధర్మరాజు గారు చేస్తారు. తన యోగశక్తి చేత బయలుదేరి యమలోకమునకు వెళ్ళి ‘బ్రాహ్మణ కుమారుని తీసుకు వచ్చి ఎక్కడ పెట్టావు’ అని యమధర్మరాజు గారిని అడిగాడు. ఆయన నేను తీసుకురాలేదని చెప్పారు. ఆయన ధర్మరాజు అబద్ధం ఆడడు. ఆయన మాటలు విని అర్జునుడు ఆశ్చర్య పోయాడు. అక్కడి నుండి దిక్పాలకుల లోకములకు వెళ్ళాడు. అన్ని లోకములలో వెతికాడు. అందరూ కూడా తాము పిల్లవాడిని తీసుకురాలేదు అని చెప్పారు. పిల్లవాడు కనపడలేదు. తల వాల్చుకుని భూలోకమునకు ద్వారకా నగరమునకు తిరిగి వచ్చాడు. బ్రాహ్మణుడు కోసం చూస్తుంటే ఆయన కృష్ణుడి మందిరం దగ్గర ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు

'వీడు పార్థుడట! వీనికి ఒక గాండీవమట. అక్షయబాణ తూణీరములట. మంత్రపూరితమయిన బాణములట. నా కొడుకును రక్షిస్తాడట. ఇన్ని చెప్పాడు. పిల్లవాడు మాయం అయిపోయాడు. నేను పట్టుకు వస్తాను అని వెళ్ళి దిగులు మొహం వేసుకుని వస్తున్నాడు. కృష్ణుడు, బలదేవుడు ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు ఉన్నారని ముందరే చెప్పాను. వాళ్ళు చెయ్యని పని నీవెక్కడ చేస్తావన్నాను. గాండీవం చూపించాడు. తనపాటి విలుగాండ్రు ఊళ్ళో లేరా అన్నాడు. ఈ మాటలను అర్జునుడు విన్నాడు. బ్రాహ్మణుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాడు. క్షత్రియునిగా ఇంతమంది మధ్యలో అధిక్షేపించబడ్డాడు. ఇంకా ఈ బ్రతుకు ఎందుకు అని భావించి చితి పేర్పించుకుని అగ్నిహోత్రుని ప్రార్థన చేసి చితిలో ప్రవేశించ బోయాడు. కృష్ణ పరమాత్మ వచ్చి అర్జునుడి చేయి పట్టుకుని ‘బావా! ఏమిటి ఈ అగ్నిప్రవేశం? ’ అన్నాడు. అర్జునుడు ‘నేను నామాట నిలబెట్టుకోలేక పోయాను. అందుకని ప్రతిజ్ఞా పరిపాలన కోసం అగ్ని ప్రవేశం చేస్తున్నాను’ అని చెప్పాడు. అంత కృష్ణుడు ‘అంత పని చేయవద్దు. ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారో నాతోరా నేను చూపిస్తాను’ అన్నాడు. కృష్ణ పరమాత్మ రథమును ఇరువురు అధిరోహించి బయలుదేరారు. కృష్ణుని రథం సప్త సముద్రములను, మేరు పర్వతమును దాటి చీకట్లోకి వెళ్ళిపోయింది ఆ చీకటికి అర్జునుడికి భయం వేసింది. ‘ఏమిటి బావా నాకు భయం వేస్తోంది. మనం ఎక్కడికి వెళ్ళాలి’ అని అర్జునుడు అడిగాడు. నీవు భయపడకని కృష్ణ భగవానుడు తన సుదర్శన చక్రమును స్మరించి విడిచిపెట్టాడు. అది ఆ చీకట్లో ప్రయాణం చేస్తూ సహస్ర సూర్యుల పగిది వెలుతురును సృష్టించింది. ముందు సుదర్శన చక్రం వెళుతుంటే వెనుక కృష్ణ పరమాత్మ రథం వెడుతోంది. రథంలో కూర్చున్న అర్జునుడు సుదర్శనమును అనుసరిస్తూ వెళ్ళాడు. చాలా దూరం వెళ్లిన తరువాత కోటి సూర్యులు ఒక్కసారిగా ప్రకాశిస్తున్నారేమో అన్నంత తేజోమండలం కనపడింది. అపారమయిన మనశ్శాంతి కలిగింది. పాలసముద్రంలో తెల్లగా ఉన్నటువంటి ఆదిశేషుడు అనంతుడు, నల్లటి వస్త్రమును కట్టుకుని ఉంటే ఆ ఆదిశేషుడి మీద తన కుడిచేతిని హేలగా శిరస్సు క్రింద పెట్టుకుని పడుకుని ఉండగా ఆదిలక్ష్మి పాదములు ఒత్తుతున్నది. అటువంటి స్వరూపమును కృష్ణార్జునులు దర్శనం చేశారు. అటువంటి మూర్తి దర్శనం అప్పటి వరకు అర్జునుడు చెయ్యలేదు. అది శ్రీమన్నారాయణుని దర్శనం ఆయనే శ్రీమహావిష్ణువు. ఆయన అంశగా శ్రీకృష్ణభగవానుడు వచ్చాడు. ఆ శ్రీమహా విష్ణువును దర్శనం చేసి పొంగిపోయి నమస్కరించారు. ఆ మహానుభావుడిని ఋషులందరూ చుట్టూ నిలబడి స్తోత్రం చేస్తున్నారు.

అటువంటి మూర్తిని దర్శించిన తర్వాత ఆయన ‘నరనారాయణులారా! రండి’ అన్నారు. వీళ్ళిద్దరూ దగ్గరకు వెళ్లి స్వామి పాదములకు శిరస్సు తాటించి నమస్కరించి నిలబడ్డారు. మీరు నాలోంచి అంశగా బయలుదేరి భూమండలం మీద రాక్షస సంహారం చేయడానికి నరనారాయణులుగా అవతరించారు. ఈ ఋషులు నా దగ్గరకు వచ్చి నా అంశ అయిన మీరు నా దగ్గర నిలబడి ఉండగా చూడాలని కోరుకున్నారు. ఈ కోర్కె తీర్చాలి. అర్జునునకు కలిగిన కించిత్ గర్వమును అణచాలి. అందుకని బ్రాహ్మణ పిల్లలందరినీ తీసుకువచ్చాను. ఇదిగో వాళ్ళు ఇక్కడే ఉన్నారు అని చూపించాడు. వారి అదృష్టమేమిటో గానీ ఆ బ్రాహ్మణ పిల్లలందరూ శ్రీమన్నారాయణుని పాదముల దగ్గర కూర్చుని స్తోత్రము చేసుకుంటూ ఆయన పాదములకు నమస్కారం చేసుకుంటూ కూర్చున్నారు. పిమ్మట శ్రీమహావిష్ణువు మునుల వైపు తిరిగి ‘మునులారా మీ కోర్కె తీరిందా’ అని అడిగాడు. ఆ బ్రాహ్మణకుమారులనందరినీ కృష్ణుడి చేతికి ఇచ్చి ఈ పిల్లలను తీసుకుని నీవు భూమండలమునకు వెళ్లి ఆ బ్రాహ్మణునకు అప్పజెప్పు’ అన్నాడు. ఏ మహానుభావుడి దర్శనమును యోగీంద్రులయిన వారు కూడా తమ మాంస నేత్రముతో చూడలేరో అటువంటి శ్రీమన్నారాయణుణ్ణి పుట్టింది మొదలు హాయిగా ఆయన దగ్గర కూర్చుని ఆయనను చూస్తూ ఆయనను సేవిస్తూ లక్ష్మీ దేవి పెట్టిన అన్నం తింటూ ఆయనను భజించిన మహా పురుషులయిన బ్రాహ్మణ పిల్లలను తన రథంమీద కూర్చో పెట్టుకుని తిరిగి భూమండలమునకు కృష్ణ భగవానుడు తీసుకువచ్చాడు. ఆ నాడు అర్జునునకు కలిగిన కించిత్ ఆవేశము తగ్గింది. ‘నా అంత గొప్పవాడు లేడు’ అనే భావన తగ్గింది.

మనం ఒక్కొక్కసారి మనలను నిరంతరం రక్షించే పరమేశ్వరుడిని కూడా మర్చిపోతాము. ఆయనకన్నా నేనే గొప్పవాడినన్న భావన వచ్చేస్తుంది. యథార్థమునకు అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ కృష్ణుడిని చిన్నబుచ్చేదిగా ఉన్నది. కృష్ణుడు అర్జునుని ఏమీ అడగలేదు. అడగకుండా అర్జునుడు అగ్నిప్రవేశం చేసేటంత స్థితికి వచ్చేవరకు ఊరుకున్నాడు. ఆ స్థితికి వచ్చేశాడు అంటే అహంకారం పోయిందన్నమాట. అతిశయం పోయిన తర్వాత తనవాడిని తాను రక్షించుకోవాలి. అపుడు గబగబా పరుగెత్తుకు వచ్చి రక్షించుకుని అర్జునునకు మరల సత్కారమును చేయించి బ్రాహ్మణ పిల్లలందరినీ తీసుకువచ్చి బ్రాహ్మణునకు అప్పచెప్పాడు. ఆ భగవానుడిని నమ్ముకున్న వాళ్ళకు లోటేమి ఉంటుంది. మనం ఆ స్వామిని నమ్మి ‘నా స్వామి ఉన్నాడు’ అనే పూనికతో ఉంటే ఎప్పుడయినా తెలియక మనవల్ల ఏదయినా పొరపాటు జరిగినా బిడ్డడి తప్పును తండ్రి దిద్దుకున్నట్లు ఆయనే దిద్దుకుని మనను రక్షించుకుని తన వస్తువుగా మనలను మిగుల్చుకుంటాడని చెప్పగలిగిన పరమ పవిత్రమయిన లీల.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage/

*శ్రీ శారదాదేవి జీవిత విశేషాలు:34*

 ఆత్మ విద్య మీ జన్మ రహస్యం- / ఆత్మ-మీ సొంత ఇల్లు, మీ శరీరం అద్దె ఇల్లు. ఆత్మ విద్య:

*శ్రీ శారదాదేవి జీవిత విశేషాలు:34* 


       *శారదాదేవికి శ్రీరామకృష్ణులే*

               *గురువు కావడం:* 

                  ➖➖➖


పారమార్థిక (ఆధ్యాత్మిక) ఉపదేశాలను, సలహాలను అప్పుడప్పుడు ఇవ్వడంతోపాటు *గురుదేవులు శారదాదేవికి మంత్రోపదేశం చేసి, జపం, ధ్యానం ఇత్యాదులలో శిక్షణ కూడా ఇచ్చారు.* 

 

శారదాదేవి కామార్పుకూరులో ఉంటున్నప్పుడు పూర్ణానందుడనే సన్న్యాసి ఆమెకు శక్తి మంత్రదీక్ష ఇచ్చాడు. *గురుదేవులు మళ్లీ ఆమెకు శక్తి మంత్రదీక్షను ప్రసాదిస్తూ, బీజ మంత్రాన్ని ఆమె నాలుకపై వ్రాశారు.* మంత్రజపమనేది శారద నిత్యజీవితంలో కలిసిపోయిన సాధన పద్ధతిగా ఒప్పారింది. గురుదేవులకూ, ఆయన భక్తులకు రోజంతా చేయవలసిన సేవల నడుమ చాలాసేపు ఆమె జపంలోనూ, ధ్యానంలోనూ గడిపేది. 


ఒకసారి తన తమ్ముడి కుమార్తె నళినితో, "నీ వయస్కురాలినై ఉన్నప్పుడు, రోజంతా ఎన్ని పనులు చేసే దాన్నో తెలుసా? అప్పటికీ *ప్రతి రోజూ ఒక లక్ష జపం చేయడానికి సమయాన్ని కేటాయించుకొనేదాన్ని"* అంటూ కాలాంతరంలో చెప్పేవారు.


ఉన్నతమైన దివ్య పారవశ్యస్థితి నుంచి మామూలు బాహ్యస్థితికి వచ్చేటప్పుడు గురుదేవులు కొన్ని సమయాల్లో పరాశక్తి భావంలో లీనమై ఉండేవారు. ఆ సమయాల్లో తమను దేవి సేవకురాలిగా భావించేవారు. అంతేకాకుండా, శారదను ఇతరులను కూడా అలాగే చూసేవారు. అప్పుడు శారదాదేవి ఆయనను స్త్రీగా అలంకరించేది. తర్వాత తనను కూడా దేవి సేవకురాలిగా భావించుకునేది.


 *రాజయోగంలో కూడా ఆమెకు తర్ఫీదు నిచ్చారు. గురుదేవులు, మానవ శరీరంలోని చక్రాలనూ, కుండలినీ శక్తి మొదలైన వాటిని చిత్రాలుగా గీచి ఆమెకు వివరించేవారు.* 


భగవంతుని అనుభూతి ఒక్కటే, ఆమెకు లక్ష్యంగా ఉండాలి. రోగాలు నయం చేయడం లాంటి సిద్ధుల వెంట ఆమె మనస్సు వెళ్లకూడదని ఎంతో జాగ్రత్త వహించారు. గురుదేవులు. రోగాలు నయం చేసే ఒక మంత్రాన్ని ఆమె అప్పటికే నేర్చుకొంది. దక్షిణేశ్వరం వచ్చిన తర్వాత ఈ విషయం గురుదేవులతో చెప్పింది. అందుకు గురుదేవులు, "ఫరవాలేదు. నేర్చుకోవడంలో తప్పు లేదు. ఇక దానిని నీ ఇష్టదైవం పాదాల మ్రోల సమర్పించేయి" అన్నారు. ఈ కాలఘట్టంలోనే పలుదేవతా మంత్రాలనూ, వాటిని ఇతరులకు ఇవ్వవలసిన విధానాన్ని గురుదేవులు శారదకు నేర్పించారు.✍️

రేపు…35వ భాగము…

                  *శ్రీ మాత్రే నమః*

.                      🌷🙏🌷


🕉🕉🕉    * 🕉🕉🕉


               🙏🏼 *సత్యం తెలుసుకుంటే మనం చేసే సంకల్పాలన్నీ మనవి కాదని అర్థం అవుతుంది. అన్నం ముద్ద గొంతు దిగేవరకు మనకు తెలుస్తుంది. అప్పటివరకు మన ప్రతిభ అనుకుంటాం. తర్వాత జీర్ణం అవ్వడంలో మన సంకల్పం ఎంత ఉంది? అని ఆలోచిస్తే అహంకారం పతనమవుతుంది. ఒక విత్తనం నాటడం మన సంకల్పమైతే, దాని నుండి వేల ఫలాలు వెలువడడం మన సంకల్పం కాదుకదా?*


       *ఈశ్వరుడి సంకల్పశక్తిని మనం ఆపాదించుకోవడం అహంకారమే అవుతుంది*


               *మనది కేవలం గమనించే లక్షణం మాత్రమే. భగవదనుగ్రహంలో  ఏనాడు పక్షపాతం ఉండదు. యోగాయోగ్యత కలిగినవారికి తదనుగుణమైన ఫలితం లభిస్తుంది. ఈ ప్రపంచం పట్ల మనకున్న వ్యామోహాన్ని విసర్జించి అభ్యాసం ద్వారా దైవాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడమే చేయవలసిన కర్తవ్యం. మనస్సు పరిశుద్ధం కాకుంటే ఆత్మ దర్శనం, దైవ దర్శనం అసాధ్యం!* 🙏🏼


🕉✡✡🕉☸☸🕉⚛⚛🕉

లక్ష్మీదేవి - ధర్మం:

 *మార్గశిర మాసము సందర్భంగా - 17*

లక్ష్మీదేవి - ధర్మం:🙏

లక్ష్మీదేవి భూమి మీదకు రావడానికి భయపడి విష్ణుమూర్తిని వేడుకుంది. "స్వామీ.. మానవుల వద్దకు నేను వెళ్ళలేను. వారు లోభులు, బద్దకస్తులు, విచ్చలవిడితనం ఎక్కువ. కొంచెం సంపద చేతిలో ఉంటే చాలు నా అంతవాడు లేడు అంటారు. ఇలా ఒకటా రెండా? సంపదల కోసం ఏమి చేయడానికైనా వెనుకాడరు. కనుక నేను వెళ్ళలేను కనికరించండి" అని మొరపెట్టుకుంది.

అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఇలా అన్నాడు.....

"నువ్వు భయపడకు. నీకు తోడుగా నలుగురుని పంపుతున్నాను. రాజు, అగ్ని, దొంగ, రోగం... 

ఈ నలుగురు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటారు.

ధర్మంగా సంపాదించి దానధర్మాలు, పుణ్యకార్యాలు చేస్తూ ఉండే వారికి ఎల్లవేళలా నువ్వు తోడుగా ఉండు. చిన్న చిన్న కష్టాలు వచ్చినా అవి ఎంతోకాలం ఉండవు. ధర్మమే వారిని నిలబెడుతుంది.

ఈ ధర్మాన్ని ఎప్పుడైతే తప్పి అధర్మంగా జీవిస్తారో.. 

ఆనాడు రాజు వీళ్ళ సంపదని స్వాధీనం చేసుకుంటాడు.

ఇది కుదరకపోతే అగ్ని దహించివేస్తుంది. 

మొత్తాన్ని తగలబెట్టేస్తాడు అగ్ని.

ఇక్కడి నుండి తప్పుకుంటే బంధువులు, స్నేహితులు, సుతులు, పుత్రికల రూపంలోనో, లేక దొంగ రూపంలోనో వచ్చి వాడిని సర్వం హరించేస్తారు.

ఇది కూడా కాకుంటే రోగాలు చుట్టుముట్టి చంపేస్తాయి. సంపాదించినదంతా రోగాలకో, రొష్టులకో తగలబెట్టేస్తారు. ఇలా ధర్మం తప్పి ప్రవర్తించిన వారిని పైన చెప్పిన 4 కూడా ఒక్కోసారి పట్టేయవచ్చు.

కనుక నువ్వు నిర్భయంగా వెళ్లి ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ క్షేమంగా ఉండు. ధర్మం తప్పిన నాడు నలుగుురు నీకు తోడుగా ఉంటారు"

అని చెప్పారు విష్ణుమూర్తి🙏


 లక్ష్మి తల్లి అందరిని చల్లగా చూడమ్మా🙏

పిల్ల!* కథ)

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

నాకు నచ్చిన శ్రీమతి శశికళ ఓలేటి గారి కథ. 


*పిల్ల!* (మనసుకు దగ్గరగా ఇష్టంగా రాసుకున్న 2019 కథ)

              🌷🌷🌷

"బాలల హక్కులు పరిరక్షించడం అందరి బాధ్యత! ప్రస్థుత సమాజంలో పెచ్చుమీరుతున్న బాలల భౌతిక, లైంగికహింస, బాలకార్మికుల వ్యథలపై న్యాయవ్యవస్థ ఉక్కుపాదం మోపవలసిన అవసరం ఎంతయినా ఉంది. బాలల రక్షణ, విద్య, అభివృద్ధి కేవలం ప్రభుత్వానిదే కాదు పౌరులందరిదీ కూడా! ప్రభుత్వయంత్రాంగంలో భాగస్వామినయితేనే బాలల సమగ్రాభివృద్ధికి , రక్షణకై నేను కన్న కలలు నెరవేర్చగలనని భావించడం వలననే నేను ఇండియన్ సివిల్ సర్వీసెస్ ను ఎంచుకున్నాను. నా ఈ విజయం నా తల్లితండ్రులకు అంకితం! కేవలం నా విజయానికే కాదు నాకు దొరికిన అమూల్యమయిన జీవితాన్ని తమ రెండు చేతులతో కాపుకాసి, ప్రేమతో ఆలంబనిచ్చి, అందంగా మలిచిన వారిద్దరికీ నేను ఆజన్మాంతం ఋుణగ్రస్థురాలినే! "..............


            ఆమె స్వరం గంగాప్రవాహం వలే సాగిపోతోంది ఆహూతుల కరతాళధ్వనుల మధ్య! 

శేఫాలికాపుష్పం లాగా సున్నితంగా, హిమశైలలా ధీరగంభీరగా, రెక్కలు పూర్తిగా విప్పార్చి స్వేచ్ఛగా ఆకాశమే హద్దులుగా ఎగురుతున్న శ్వేతవిహంగంలా............ ఆ తెల్లని "పిల్ల" మెరుస్తున్న బాదంకాయలంటి నల్లనికళ్ల పిల్ల .... పోతపోసిన బంగారు బొమ్మలా నిలబడి మాట్లాడుతుంటే రెండుకళ్లూ చాలడం లేదు సుధీరకూ, శేఖర్ కూ , ఆమె కవల అన్నగార్లకూ. మనసు గర్వంతో ఉత్తేజితమవుతూ ఒకసారి, కళ్లు సజలాలవుతూ మరోసారి..... మొత్తానికి తమ" పిల్ల" విజయానికి హర్షపులకితులవుతూ మరోసారి. 


          ఇండియన్ సివిల్ సర్వీసెస్ లో ఓపెన్ మెరిట్ లో జాతీయస్థాయిలో మూడవర్యాంక్ సాధించిన తమకూతురు " అనిల వల్లూరి"కి 

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మెయిన్ ఆడిటోరియంలో ఆచార్యులు, విద్యార్ధులు, తల్లితండ్రులు, ప్రభుత్వ, రాజకీయ ప్రముఖుల మధ్య జరిగుతున్న ఘనసన్మానం! 


      " మా నాన్న.......",  ఉద్యోగవిజయంలో తన తండ్రి తనకిచ్చిన ధైర్యము, దన్నూ గురించి చెప్తోంది అనిల! 


అనిలమాటలు వింటూనే సుధీర మస్థిష్కం ఇరవైయేళ్ల క్రితం గతంలోకి పరుగులు తీసింది

               * * * *       

" నానా! లే నానా! నానా లే! ఆకలేత్తాంది! లే! ఇంటికెల్దాం!  తీసుకెల్లు! లే! ".........


" అబ్బా"..... చెవుల మీదకు దిండు లాక్కుంది సుధీర. పేలవంగా దుఃఖం, భయం కలగలిసిన ఆస్వరం ఎంత ప్రయత్నించినా చెవుల్లో పడుతూనే ఉంది. ఇంక నిద్రాదేవి కరుణించదని తెలుసుకుని దిగ్గున మంచంమీంచి లేచి, తలుపు తెరుచుకుని బెడ్ రూమ్ బాల్కనీలోకి వచ్చినిలబడింది. 


               మధ్యాహ్నం మూడున్నర! ఆలస్యమయిన ఋుతుపవనాలు నగరాన్ని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని గత మూడురోజులుగా కురుస్తూ, మురిపిస్తున్న వైనం! వీధంతా కడిగి , ఒత్తుగా ఎర్రని గుల్ మొహర్ చెట్లపూలు పరుపులు పరిచినట్లు  ఎంతో అందంగా ఉంది. 


         సుధీర దృష్టి ఇప్పుడు వానరాకతో పులకించిపోతున్న ప్రకృతిమీద లేదు. తమింటికి వందడుగుల దూరంలో ఉన్న ఆ తండ్రీకూతురు మీదే ఉంది. 

   

"ఎవరు వీళ్లు? ప్రొద్దున్న ఎనిమిదింటికి సండే మార్కెట్ కు వెళ్లడానికి కారు తీస్తుంటే, తమ యింటికెదురుగా ఉన్న మూసేసిన చిన్న డిపార్ట్ మెంటల్ స్టోర్స్ పోర్టికోలో చూసింది. చిన్నపిల్ల. నాలుగైదేళ్లు ఉంటాయేమో! తెల్లగా, నల్లని పొడుగ్గా విరబోసిన జుట్టుతో కూర్చుని ఏడుస్తోంది. పక్కన పళ్లు అమ్మే చెక్కపెట్టి మీద స్పృహలేకుండా పడున్న మగమనిషి. నల్లకట్టెలా ఉన్నాడు. తైలసంస్కారం లేని జుట్టూ, చిరిగిపోయిన చొక్కా, తోలులాంటి పంట్లాంతో అడ్డదిడ్డంగా పడున్నాడు. ఆ చిన్నపిల్ల తండ్రిని కుదుపుతూ ఏడుస్తోంది. "అతడు చచ్చిపోయాడో లేక తాగిపడున్నాడో  తెలియడం లేదు ఆమెకు. ఇంతలో " వస్తున్నావా?" అని స్నేహితురాలు ఫోన్ చెయ్యడంతో , ఆ దృశ్యం నుంచి తలతిప్పుకుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయింది!


, రిటర్న్ లో కారాపి  విషయం కనుక్కుందామంటూ చూసిన సుధీరకు ఖాళీ జాగా కనిపించింది. భారంగా నిశ్వసించి లోపలకు వెళ్లిపోయింది. 


           ఇంకో గంటకు మళ్లీ ప్రత్యక్షం. వాడు సారా పేకట్లతో, పాప బిస్కట్ పాకెట్టు, నీళ్లసీసాతో! 


" ఎవరీ చిన్నపిల్ల. అతను  తండ్రా? నక్కకీ నాగలోకానికీ లా ఉన్నారు. ఎత్తుకొచ్చాడా? ..... గుండె జల్లుమంది సుధీరకు. ఇంకో గంటకే బాంధవ్యం అర్ధమయింది. శవంలా పడున్న వాడిని లేపుతూ పిల్ల .... " నానా! నానా! " అంటూ లేపుతూ! 


ఒంటిగంటకు బాల్కనీలో కెళ్లి చూసింది. వాన తగ్గి

జ్యేష్టమాసపుటెండ చిరచిరలాడిస్తోంది. గుల్ మొహర్ చెట్టుకింద చేరిన నీళ్లలో ఆడుతోంది పిల్ల. 


" పాపా! " గట్టిగా పిలిచింది సుధీర. తలెత్తి వింతగా చూసిన పిల్లతో , " అన్నం తింటావా? "అడిగింది. కళ్లల్లోకి దూసుకొచ్చిన ఆకలిని కన్నీళ్లతో కప్పేసి, తండ్రి పడున్న చెక్కబల్ల వెనక్కి పోయి నక్కింది పిల్ల. రెండుసార్లు పిలిచి, విసుగొచ్చి లోపలికి పోయింది సుధీర 


     భోజనం సహించడం లేదు. భర్త శేఖర్, పదమూడేళ్ల కవలకొడుకులూ హాయిగా భోంచేసి క్రికెట్ చూసుకుంటున్నారు. 


" దేవుడా! నాకేంటి ఈగోల? ప్రపంచంలో ఏవయితే నాకేం? అందరిలా నాకెందుకులే! అనుకోలేకపోతున్నా. ఎవరెలా పోతే నాకేంటి? నేనెందుకింత సున్నితం? వీధికుక్కలేడ్చినా బాధే! పిల్లలు కష్టపడుతున్నా బాధే! వృద్ధులబాధలు చూస్తే తట్టుకోలేకపోతున్నా! మనశ్సాంతియ్యి . మరుపు ఇయ్యి"...... కోపంగా తనను తను శపించుకుంటోంది సుధీర. 


తనకు తెలుసు తనేం చెయ్యలేనని, తన స్వేచ్ఛాపరిధి చాలా ఇరుకని, ఆర్ధికంగా సాధికారత సాధించుకున్నా, సాధించే భర్తా, అత్తగార్ల పంజావిసుర్లు తట్టుకోలేని దుర్బలనని! 


      పిల్ల ఏడుస్తూనే ఉంది. తను పిలిచినప్పుడల్లా దాక్కుంటూనే ఉంది.ఈ దాగుడుమూతలు విసుగ్గా ఉంది సుధీరకు. లోపలికెళ్లి టీ పెట్టి అత్తగారి గదిలోకెళ్లి ఇచ్చి, తనదీ, భర్తదీ తీసుకుని మీడియా రూంలో కూర్చుంది. నెమ్మదిగా క్రికెట్ ఆమె ధ్యాసను క్రిష్ణబిలంలోకి లాక్కున్నట్టు లాక్కుంది. 


రాత్రి ఎనిమిదింటికి పిజ్జా ఆర్డర్ చేస్తుంటే పిల్ల కళ్లముందు మెదిలింది. మరో మీడియం పిజ్జా ఆర్డర్ ఇచ్చి, డెలివరీ బాయ్ కు చెట్టుకింద పిల్లకు అందచెయ్యమని నీళ్లసీసాతో పాటూ అందించి, కాస్త ఊపిరిపీల్చుకుంది రిలీఫ్ తో! 


               రాత్రి పన్నెండింటికి మళ్లీ వానధారల శబ్దానికి ఆదరాబాదరా లేచి బాల్కనీలోకి పరిగెట్టింది సుధీర. ఎక్కడా వాళ్లిద్దరి జాడా లేదు. ఎందుకో వెర్రి దిగులు మనసంతా! " పోనీలే! ఇంటికి పోయుంటారు!", పిల్లనే తలుచుకుంటూ ఎప్పటికో నిద్రపోయింది ఆ వెర్రితల్లి. 


వారాంతపు సుఖానికి అలవాటు పడ్డ ప్రాణాలకు సోమవారం మహా భారం. యాంత్రికంగా లేచి, పిల్లలిద్దరినీ తయారవ్వమని చెప్పి, బ్రేక్ ఫాస్ట్ చేస్తోంది. సెల్ ఫోన్లో వాట్సప్ నోటిఫికేషన్ ఠింగ్ మని ప్రత్యక్షమయ్యింది. సారాంశం..... తొమ్మిదో తరగతి అమ్మాయెవరో ల్యుకీమియాతో శనివారం చనిపోయినందున స్కూల్ శెలవు ప్రకటిస్తున్నామని...... పిల్లల స్కూల్ మేనేజ్ మెంట్ నుండి. 


విషయం తెలిసి, " హేయ్! థేంక్స్ టు దట్ గాల్" అనుకుంటూ బేగ్లు పడేసి గెంతుతున్న కొడుకుల కేసి కంపరంగా చూసింది సుధీర. ఎక్కడిదీ వికృతప్రవృత్తి! ఎందుకీ పిల్లలు మానవసహజ మానసిక సౌకుమార్యత కోల్పోతున్నారు? కనీససంతాప ఛాయలు కూడా లేవు ఆ అమ్మాయి చావు పట్ల. ఒక సెలవు వారికి ఒక ప్రాణం కన్నా విలువయినదా? ఎన్ని బుద్ధులు నేర్పించిందో, ఎన్ని సుద్దులు మప్పిందో! వింటారు కానీ ఆచరణలో శూన్యం. భర్తకు వాళ్ల మెరిట్ మార్కులు చాలు! వాళ్లు నీలా కాకుండా నాలా ప్రాక్టికల్ గా పెరుగుతున్నారు! సంతోషం" అంటూ తీసి పడేస్తాడు.


 పిల్లలను ఒక్క కసురు కసిరి నోరు మూయించి, డైనింగ్ టేబుల్ దగ్గరే  లాప్ టాప్ తెరిచి పనిలో పడింది క్లయింట్ కు ఇన్ వాయిస్ పంపుతూ! 


         హఠాత్తుగా చేతిలోని పుస్తకాలు పక్కన పడేసి మెట్లకేసి పరిగెడుతున్నారు పిల్లలు. కిందనుండి అరుపులు. హెల్పర్ లక్ష్మివి! గబగబా పంపిస్తున్న ఈమెయిల్ కు సెండ్ కొట్టీ తనూ పరిగెట్టింది సుధీర క్రిందకు. 


            " పిల్ల"..... ఒణికిపోతూ, ఏడుస్తూ, బిత్తరిచూపులు చూస్తూ ....... " నాన!!మా నాన!" అంటూ నత్తుతోంది. 


" చూడండమ్మా! మన వరండాలో సోఫాలో పడుకునుంది నేను వచ్చేసరికి. ఫో అంటే పోదు. " చేతిలో చీపురు వూపుతూ పెద్ద ఘనకార్యం చేసినట్టే చెప్తోంది లక్ష్మి. 


                   సుధీరను చూస్తూనే పిల్ల నల్లని కళ్లు నీలాలే అయ్యాయి. కళ్లలో చిన్న ధైర్యం. మెల్లగా అడుగులేస్తూ సుధీర వెనుక నక్కింది. 


" ఛీ! దయిద్రపుదానా! బయటకు రా! అమ్మగారి చీర పాడయిపోద్ది"....... అమ్మగారు కట్టుకున్న మెత్తని ప్యూర్ క్రేప్ చీరను భక్తిగా చూస్తూ! 


సుధీర అసంకల్పితంగా పిల్లను ముందుకు లాక్కుంది. అది మరింత చీరకుచ్చిళ్లలోకి ఒదిగిపోతూ..... కళ్లెత్తి సుధీర మొహం లోకి చూస్తూ..... " నాన లేడు. రాలేదు. ఎలిపోయాడు".... అంటూ వెక్కు మొదలుపెట్టింది! 


"మమ్మీ ! హూ ఈజ్ దిస్ డర్టీ పిగ్ లెట్?"....... ప్రశ్న పూర్తవలేదు...... కొడుకు చెంప పేలిపోయింది. హఠాత్పరిణామానికి అవాక్కయిన లక్ష్మిని......" నడు, పాపని క్లీన్ చేద్దాం" ...... పిల్లను ఎత్తిపట్టుకుని భుజాన్నేసుకుని మెట్టెక్కుతున్న అమ్మగారి వెనుక వింతగా చూస్తూ పరిగెట్టింది లక్ష్మి. 


డ్రాయింగ్ రూమ్ లో షూలేస్ కట్టుకుంటున్న శేఖర్, దేవుడి గదిలోంచి బయటకొచ్చిన అత్తగారూ కళ్లు పెద్దవిచేస్తూ ప్రశ్నావళి సంధిస్తున్నా విననట్టే పిల్లను తన బాత్ రూంలోకి తీసుకుపోయింది. 


తెల్ల చవకరకపు నైలాను గౌను ఎర్రమట్టిరంగులోకి మారిపోయింది. వుచ్చకంపు కొడుతున్న లాగు తియ్యనని పిల్ల చేతులడ్డు పెడుతుంటే.....ప్రకృతి పుట్టుకతోనే ఆడపిల్లకు నేర్పించే డిఫెన్సివ్ మెకానిజమ్ గుర్తొచ్చింది. 


            లక్ష్మి ఒళ్లు రుద్దుతుంటే పిల్ల ఎందుకో నొప్పితో " అమ్మా" అని అరుస్తోంది. బాత్ రూంలో లైట్లన్నీ వేసి పరిశీలనగా చూసింది సుధీర. తెల్లని గులాబీ బాలలా ఉంది పిల్ల. కానీ బుగ్గల మీద,మెడలపక్క, భుజాలమీద, వీపు మీద , తొడలమీద గాయాలు. కొన్ని పచ్చిగా, కొన్ని మానుతూ. " ఏంటివి? పంటిగాట్లు... భగవంతుడా! "...... మ్రాన్పడి నిలబడిపోయిన మేడమ్ నూ.. పిల్లను మార్చిమార్చి చూస్తూ " ఎవరమ్మా ఈ పాప?" అయోమయంగా అడుగుతోంది లక్ష్మి. 


" అనిల...... నా పేరు అనిల"....... జవాబు పిల్లనోటి నుండి. 

" మీ అమ్మా నాన్నా ఎవరమ్మా? ఎక్కడుంటారు మీరు? " మళ్లీ లక్ష్మే పిల్లకు ఒళ్లంతా మెత్తని తువ్వాలుతో తుడిచి, సుధీర అందించిన సెటోఫిల్ గాయాలకు సున్నితంగా రాస్తూ అడుగుతోంది. 


" ఆంటీ! నా యాపీ బడ్డే కదా. మా యమ్మ కేక్ కొంది కదా! అంకుల్లందరూ ఒచ్చేరు కదా. మాయమ్మ చికెనూ, బిరియానీ చేసింది కదా. మా నాన తాగొచ్చాడు. మా యమ్మతో గొడవ పెట్టుకుని నన్నట్టుకుని రైలెక్కామా! మల్లీ ఇక్కడ తాగీసి, నన్ను తీసుకెల్లకుండా పోయాడు...... " పిల్ల ఇవన్నీ మామూలే అన్నట్టు నిర్వేదంగా చెప్తోంది. నాన నాన అని తండ్రిని తలుస్తోంది తప్పా వాళ్లమ్మ పేరు తలవడం లేదు. 


లక్ష్మికి రోజూ రాత్రిపూట పూటుగా తాగొచ్చి, కూతుళ్లను ఆబగా తాకే తన మొగుడు, వాడినుండి రక్షించుకోడానికి ఎవరెవరి ఇళ్లలోనో రాత్రి తలదాచుకునే తన కూతుళ్లు గుర్తుకొచ్చి, పేగు మెలిపెట్టింది. 


అనిలకు టవల్ చుట్టి, గదిలో కూర్చో పెట్టి, మూడ్రోజుల నాగా తరవాత వచ్చిన వంటామెకి వేడి పాలు తెమ్మని పురమాయించి, డ్రైవర్ కు మంచి షాపికెళ్లి తన కూతురు సైజ్ బట్టలు ఓ పదిజతలు తెమ్మనమని డబ్బులిచ్చి మళ్లీ గదిలోకొచ్చి తలుపేసింది. 


" మీ వూరేంటి అనిలా? 

" అల్లక్కడ సీ ఉంటదా, అక్కడ నేవోళ్లు గోడకడుతున్నారా! అక్కడ! "


"సీ, నేవీ వాళ్లు అంటే విశాఖపట్నమా? "

" కాదు వొయిజాగు"

" అంత దూరం నుండి తీసుకొచ్చేసాడా! మీ అమ్మ ఏం చేస్తుంది?"

" మా యమ్మ మంచిది కాదు. అంకుల్స్ తో తిరుగుతాది. మా నాన ఎల్డర్. తాగి అమ్మను కొడతాడు కానీ నన్ను కొట్టడు. మా అమ్మ రుసికొండ దగ్గర అయ్యగారి గెస్టోస్ లో పనికెల్తది. కానీ పనిసెయదు. అయగారు మాకు రోజూ బిర్యానీ, థంప్సప్ పంపుతారు. అక్కడికి కాలేజీ అక్కలు కార్ లో వత్తారు కదా! ఆ అయ్గారు...." కళ్లు తిప్పుతూ ఆరిందాలా చేతులూపుతూ చెప్తున్న పిల్లను చూస్తుంటే సుధీరకి మొత్తం దృశ్యం అర్ధమయింది. 


" ఎవరమ్మా ఇలా కొరికారు? "..... అడగలేక అడగలేక.... ఏం వినాలా అని భయపడుతూ అడిగింది, ఇడ్లీ తుంచి నోట్లో పెడుతూ. 


" నేవీ గోడ కట్టే రామంకులూ, బీహారీ అంకులూ , మా పయివేటు అంకులూ ఆళ్లు.. మా యమ్మ అక్కడ పొద్దున్నే నన్నొదిలేసి ఎలిపోతుందిగా! ఆళ్లే! సెత్తగాళ్లు" 


నీ కెన్నేళ్లు అనిలా? నువ్వు ట్యూషన్ కెళ్లడమేంటి?"

మెల్లగా ఒక్కో వేలు విప్పి నాలుగు చూపించింది. 

" గాడ్! నాలుగేళ్లా? ఇంత ముదురగా మాటలెలా వచ్చాయి? పెరిగిన వాతావరణమా? "..... పిల్ల పెరుగుతున్న పరిసరాల ప్రభావాన్ని, పిల్ల భవిష్యత్తు తలుచుకుంటే వెన్నులో చలిపుడుతోంది సుధీరకు. 


అప్రయత్నంగా తన ఎడమభుజం కింద తడుముకుంది అభద్రతతో! చిన్నతాతగారు మనసుకూ, నమ్మకానికీ చేసిన గాటు! 


ఈ లోపున డ్రైవర్ బట్టలు తెచ్చాడు. పేకట్ అందుకుంటూ, "ఇంత ఆలస్యం చేసారేంటి రసూల్ ".... అంటుంటే, అమ్మా అక్కడ కల్లుపాకల దగ్గర పిల్లల బట్టల కొట్టు దగ్గర జనం, పోలీసులూ ! రాత్రి దొమ్మీలో ఎవడో తాగుబోతోడిని కొట్టి చంపేసారట. పోలీసులకు అతని ఆధారాలేం దొరకలేదట. పోస్టుమార్టమ్ కు తీసుకుపోతున్నారు గాంధీకి!" ........ సుధీరకు చిక్కుముడి విడిపోయింది అనిల తండ్రి ఎందుకు అదృశ్యమయ్యాడో! 


            పిల్లకు బట్టలు వేయడంతోనే, కూరుకుపోతున్న కళ్లతో నిద్రలోకి జారిపోయింది. పిల్లలో ఏ కోశానా తనవారి కోసం బెంగలేదు , తనేమయిపోతానా అన్న భయం లేదు! తిండి దొరికింది, పడుకోడానికి జాగా దొరికింది. విసికించే అంకుల్స్ లేరు, ముడుకుల మీద కొట్టి మూతిమీద ముద్దుపెట్టే ట్యూషనంకుల్ లేడు. అంతే ! ఆ క్షణాలే ఆమెకు ముఖ్యం. తరవాత ఏమవుతుందో తెలీదు. అంతలా ఆ చిన్ని దేహం, బుర్రా ట్యూన్ అయిపోయాయి! 


           " ఏం చెయ్యాలీ పిల్లను? ఎవరికివ్వాలి? ఎక్కడకు పంపాలి? తల్లి దగ్గరకు మాత్రం పంపకూడదు. అసలు నిజమైన తల్లో కాదో కూడా! వ్యభిచారం కోసం ఎత్తుకొచ్చిన పిల్లేమో!ఆ గతం తాలూకు ప్రభావం నుండీ, అబ్యూస్ నుండి బయట పడేయాలి. సభ్యసమాజంలో నిలతొక్కుకునేలా గ్రూం చెయ్యాలి!  "...... బుర్ర చిట్లిపోతుంటే బయటకు వచ్చింది.


ఆమెను నేరస్థురాలిలా చూస్తూ అక్కడ నలుగురు. 


     " మీరు ఆఫీస్ కు వెళ్లలేదా??....... గొంతుకు పెగల్చుకుని అడిగింది శేఖర్ ను. 

    జవాబు అత్తగారినుండి వచ్చింది. " వెళ్లడు. వెళ్లద్దని నేనే చెప్పా! అమ్మాయ్ ! నీ సంపాదన అంటూ ఎవరికి ధారపోసినా మేం మాట్లాడలేదు. ఇప్పుడిలా అలగాజనాలని ఇళ్లలోకి తెస్తే నేను ఊరుకోను. మన హోదా, ఇంటిపేరు చెడగొడితే ఊరుకునేది లేదు! చెప్పు శేఖర్.......!" అంటూ కొట్టినట్టు చెప్పి కొడుక్కేసి చూసింది. 


    శేఖర్ మొహం గంటు పెట్టుక్కూర్చున్నాడు. పిల్లల ముందు వాదించుకోకూడదని ఒప్పందం ఇద్దరికీ. 


అమ్మకొట్టిన దెబ్బ మనసునూ , చెంపనూ మండిస్తుంటే కొడుకు అందుకున్నాడు. " నాన్నా! మమ్మీ ఇలాంటి స్ట్రే చిల్డ్రన్ నీ , ఆర్ఫన్స్ నీ ఇంట్లో వుంచితే మేము హాస్టల్ కు వెళిపోతాము. ఆ పిల్ల గురించి ఎంత గట్టిగా కొట్టిందో....... తల్లి కేసి కక్షగా చూస్తూ! 


             "ఫాట్"...... సుధీరచేతిలో కాఫీకప్పు ఎగిరి గోడకు బలంగా తగిలి చెల్లాచెదురైంది. ఫిట్ వచ్చినదానిలా ఊగిపోతోందామె కోపంతో! ఉద్రేకంలో కన్నీరుమున్నీరవుతోంది. పెద్దగా ఏడుస్తూ......


" ఎవ్వరూ పోనక్కరలేదు. నేనే పోతాను బయటకు. ఒక చిన్నపిల్ల! అనాధ! దిక్కూమొక్కూ లేకుండా ఉంది. తల్లి వ్యభిచారి. తండ్రి తాగుడుకోసం పిల్లని అమ్మబోయి, మైకంలో వేరేచోటకు పోయి పిల్ల కనిపించకపోడంతో వాళ్ల చేతిలో చచ్చేడు. వెనక్కి పంపితే, రాబందుల్లా కాటేసే మగాళ్లు చుట్టూ! ఎంత కావాలి ఆ పసిప్రాణానికి. ఇంత తిండి పెట్టి, చదువు చెప్పిస్తే చాలు కదా! దానికి ఇన్ని ఆరాలూ, ఇన్ని ఆంక్షలూనా. నిజానికి అనిల కోలుకున్నాకా మంచి ఆశ్రమానికి పంపిద్దామవుకున్నా! కానీ ఇప్పుడు చెప్తున్నా! నా పరపతినంతా వాడుకుని పిల్లను నేను దత్తత చేసుకుంటా. ఏం ఏడుస్తారో ఏడవండి 


       ఏరా వెధవల్లారా! సాటి స్టూడెంట్ పోతే పండగచేసుకునే బ్రూట్స్ ఇద్దరూ! బాలవికాస్ కెళ్లి శ్లోకాలు నేర్చుకుంటే చాలదురా, ఫెలో హ్యూమన్ బీయింగ్ ని ఏక్సెప్ట్ చెయ్యగలగాలి. ఇంటర్నేషనల్ స్కూళ్లకెళ్లి నాలుగు ఇంగ్లీషు బూతులు మాట్లాడుతూ హీరోలనుకుంటున్నారా? బీ రియల్ హ్యూమన్స్! మగపిల్లలుగా మీరు ఆడపిల్లల పట్ల ఎన్నో విలువలు పాటించాలి. లేకపోతే ఇలాంటి చిన్నిపాపల జీవితాలు చిదిమిపోతాయి".....అంటూనే


               గబగబా పిల్లగదిలోకి వెళ్లి, భుజం మీదేసుకుని హాల్లోకొచ్చింది సుధీర. శేఖర్ ఏదో ఫోన్ కాల్ అటెండ్ అవుతున్నాడు. 


అత్తగారికి కంగారుగా ఉంది. నిష్పూచీగా రాణీయోగం అనుభవిస్తూ, కూర్చోకుండా అనవసర విషయాలు కెలికి కొరివితో తలగోక్కుంటున్నానేమో అని అంతర్మధనం. లీలగా తను విధవతల్లితో పాటూ మేనమావల యింట పడ్డ వేదనలు గుండెను చెమ్మరిస్తున్నాయి. 


" సుధీరా! విషయం సీరియస్ చెయ్యకు. పనివాళ్లు చూస్తున్నారు! ఆలోచిద్దాం పాప గురించి. మోస్ట్లీ నువ్వు కోరినట్టే జరుగుతుంది. ఐ ప్రామిస్! "...... శేఖర్ భార్యచేతిని పట్టుకుని ఆపాడు. 

పిల్లలు మొహం గంటు పెట్టుకుని లోపలికి పోయారు. 


              భర్త నుండి ఆశించని ఈ ప్రతిక్రియకు ఆశ్చర్యపోతూ, అపనమ్మకంగా చూస్తూ గదిలోకెళ్లింది సుధీర అనిలతో. 


" అమ్మా! పిల్ల అడుగుపెట్టిన వేళావిశేషం. ఎప్పటినుండో ఎదురుచూస్తున్న అవకాశం చేతికొచ్చింది. అతిపెద్ద బిజినెస్ హౌస్ ఆడిటర్స్ గా నా కంపెనీని నియమించబోతోంది! " చేతులూపేస్తూ ఆనందంగా చెప్తున్న కొడుకు కేసి సాలోచనగా , నిర్వేదంగా చూసింది తల్లి. 


" హు! తన స్వార్ధప్రయోజనం నెరవేరితేనే మగాడికి తన తల్లయినా ,భార్యయినా, పిల్లలయినా, ఈ పిల్లయినా! " 

గొణుక్కుంటూ పిల్లను చూడడానికి వెళ్లిందామె!! 

              * * * * *

సుధీర భయాలన్ని వమ్ముచేస్తూ ఆరునెలల్లో పిల్ల కాస్తా ఆ యింటి గారాలకల్పవల్లి అయింది. అఖండమయిన తెలివి, పసితనానే అలవడిన ఆత్మనిర్భరత, తెలుసుకున్న జీవితావసరాలు.... ఆ పిల్లను దొరికిన ఆసరాను కాపాడుకునే దిశానిర్దేశం చేసాయేమో మరి...... ఆ ఇంటి అబ్బాయిల ఛీత్కారాలను సహనంతో , సహజసిద్ధంగా అబ్బిన ముగ్దత్వంతో మార్చుకుని మచ్చిక చేసుకుంది.....చెల్లిపాప అని పిలిపించుకునేంతగా! 


               భాషమార్చుకుంది. సభ్యత నేర్చుకుంది. తన అస్థిత్వాన్ని కాపాడుకోవాలంటే చేసుకోవలసిన మంచిమార్పులన్నీ చేసుకుంది. 


అదృష్టం తెచ్చిందిలే అని ఆ యింట ప్రవేశానికి ఒప్పుకున్న శేఖర్ ప్రాక్టికాలిటీకి ముకుతాడు వేసింది పిల్ల. లేస్తూ పిల్ల మొహం చూస్తేనే కానీ దినచర్య మొదలుపెట్టనంత బలహీనుడిని చేసింది. దత్తత పత్రాల్లో సుధీరకన్నా ముందు దుమికి తండ్రిస్థానంలో సంతకం చేసేసేంత! 


ఆ ఇంట అయినింటి ఆడపిల్లకు జరిగే అన్ని అచ్చటముచ్చటలూ జరిపించుకుంది పిల్ల. 

నిజానికి దొరికిన అండను కుటుంబంగా మార్చుకున్న ఆ పిల్లది పోరాటమంటే! చేయూతను నిచ్చెనగా మార్చుకున్న పోరాటం! జాలిని ప్రేమగా మార్చుకున్న పోరాటం. జన్మను ధన్యతగా మార్చుకున్న పోరాటం!

                * * * *

హోరెత్తిపోతున్న చప్పట్లశబ్దానికి ఒక్కసారి వాస్తవానికి వచ్చింది సుధీర. ముఖ్యమంత్రిగారి చేత సత్కారం అందుకుంటున్న కూతుర్ని , అనిలను, తన పిల్లను చూస్తూ........ అనిలా వల్లూరి , ఐ. పీ. ఎస్ .... అంటూ గర్వంగా గుండె నిండా గాలిపీల్చుకుంది. అవును అనిల జీవితాశయం చట్టాన్ని సంరక్షించే ఐ. పీ.యెస్ ఆఫీసర్ అవ్వడం!


శశికళ ఓలేటి

7-12-2019

సంకటహర చవితి.

 ఈ రోజు సంకటహర చవితి.


నారదమహర్షి చేసిన శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం సంకటహర చవితి రోజు 4 సార్లు చదవడం వలన గణపతి అనుగ్రహంతో మనం జీవితంలో సంకటాలు తోలగిపోతాయి.


ఓం శ్రీ గణేశాయ నమః

ఓం గం గణపతయే నమః


శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం


నారద ఉవాచ

ప్రణమ్య శిరసా దేవం, గౌరీ పుత్రం వినాయకం |

భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుః కామార్ధసిద్ధయే | 1 |


ప్రథమం వక్రతుండం చ,ఏకదంతం ద్వితీయకం | 

తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్ధకం | 2 |


లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ |

సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తధాష్టమం | 3 |


నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకం |

ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననం | 4 |


ద్వాదశైతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః |

న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికరం ప్రభో! | 5 |


విద్యార్థీ లభతే విద్యాం, ధనార్థీ లభతే ధనం |

పుత్రార్థీ లభతే పుత్రాన్,మోక్షార్థీ లభతే గతిం | 6 | 


జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్ |

సంవత్సరేణ సిద్ధిం చ,లభతే నాత్ర సంశయః | 7 |


అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్ |

తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః | 8 |


|| ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశనం నామ గణేశ స్తోత్రం సంపూర్ణం ||


ఓం శాంతిః శాంతిః శాంతిః


మార్గశిర మాసంలో వచ్చిన ఈ సంకష్టహర చవితి పేరు ఆఖురథ సంకష్టహర చవితి. 


ఓం శ్రీ గణేశాయ నమః

తిరుమల - తిరుపతి - దేవస్థానాల జాబితా.

 తిరుమల - తిరుపతి - దేవస్థానాల జాబితా.

............................................................


(౧) తిరుమలలో శ్రీవేంకటేశ్వరాలయము.

తిరుమలలోనే వున్న ఇతర దేవాలయాలు.


(అ) వారాహి

(ఆ) శ్రీభాష్యకారుల వారి దేవాలయం - 1

(ఇ) బేడి హనుమంతరాయ దేవాలయం

(ఈ) క్షేత్రపాలకుల ఆలయం

(ఉ) దేవభాష్యకారుల ఆలయము

(ఊ) ఆంజనేయస్వామి ఆలయము


(౨)  తిరుపతిలో 


(అ) సాలెనాంచారమ్మ గుడి

(ఆ) చూడికోదత్త నాంచారమ్మగుడి

      (అండాళమ్మ గుడి)

(ఇ) మాడల అళ్వారు గుడి

(ఈ) చక్రాత్ అళ్వారు గుడి

(ఉ) మధురకవి అళ్వారు గుడి

(ఊ) ధ్వజస్తంభము వద్ద     ఆంజనేయస్వామి దేవాలయము

(ఎ) పెద్దబుగ్గ వద్ద ఆంజనేయస్వామి దేవాలయము

(ఏ) మనవల మహాముని గుడి

(ఐ) నమ్మళ్వార్ గుడి

( ఒ) వేదాంతదేశికులవారి గుడి

( ఓ) ఊళు అళ్వారుల గుడి 

(ఔ) తిరుమల నంబి గుడి

(అం) భాష్యకారుల గుడి - 2

(ఆ:) తిరుమంగళ్ అళ్వారు గుడి

(క) కురాతాళ్వారుల సన్నిధి

(ఖ)  సంజీవరాయ స్వామి దేవాలయం

(గ) పార్థసారధి దేవాలయం

(ఘ) వేంకటేశ్వరస్వామి గుడి


(౩) తిరుపతిలో 


(అ) కోదండరామాలయము

(ఆ) కపిలేశ్వరస్వామి దేవాలయము

  

(౪ ) తిరుచానూరులో


(అ)పద్మావతి దేవాలయము

(ఆ) కృష్ణస్వామి

(ఇ) సూర్యనారాయణస్వామి

(ఈ)  సుందరరాజస్వామి


(౫ ) నారాయణవనములో

(అ) కళ్యాణ వేంకటేశ్వరస్వామి గుడి

(ఆ) పాపేశ్వరస్వామిగుడి

(ఇ) అవనాక్షయమ్మ గుడి

(ఈ) వీరభద్రస్వామి

(ఉ) శక్తివినాయక దేవాలయము

(౬ ) వేంకటేశ్వరస్వామి దేవాలయం - మంగాపురము

(౭) వేదాంతనారాయణస్వామి దేవాలయము - నాగులాపురము


 (౮) బుుషికేశ్వరం (ఉత్తరాఖండ్ - రాష్ట్రము)

(అ) చంద్రమౌళేశ్వరస్వామి దేవాలయం

(ఆ) వేంకటేశ్వరదేవాలయము


 (౯) వకుళమాత దేవాలయము - చంద్రగిరి - పేరూరు బండ.

(౧0) కరిమాణిక్యస్వామి -  దేవాలయం - తుమ్మూరు

(౧౧) పట్టాభిరామాలయము - వాల్మీకిపురము

(౧౨) కరివరదరాజ దేవాలయము - సత్రవాడ

(౧ ౩)అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరాలయం - బుగ్గఅగ్రహారం

(14) లక్ష్మీనరసింహదేవాలయము - తరిగొండ

(15) ప్రసన్న వెంకటేశ్వర దేవాలయం - కోసువారిపల్లె

(16)కోనేటిరాయల దేవాలయం - కీలపట్ల

(17) శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయము - మంగళంపేట

(18) కోదండరామ దేవాలయము - ఒంటిమిట్ట

(19) వీరాంజనేయ దేవాలయం - గండి

(20)నారాపుర వెంకటేశ్వర దేవాలయం - జమ్మలమడుగు


(21) లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయము - దేవునికడప

(22) సిద్దేశ్వర దేవాలయం - తాళ్లపాక

(23) చెన్నకేశవ దేవాలయము - తాళ్లపాక

(24) కొండండ రామాలయము - ముప్పవరం

(25) శ్రీ వేంకటేశ్వర దేవాలయము - అనంతవరము

(26) సీతారామస్వామి దేవాలయము - సారిపల్లి

(27) పద్మావతిసమేత వెంకటేశ్వర దేవాలయం - పిఠాపురము.


ఈ దేవాలయాలు కొన్ని ప్రధానదేవాలయాలలో ఉప దేవాలయాలుగా వున్నాయి.


................... సేకరణ 

జి.బి.విశ్వనాథ, 9441245857, అనంతపురము.

సెల్ఫోను - సింకార్డు

  సెల్ఫోను - సింకార్డు

 సెల్పోనులో సింకార్డు ఉండి పోను పనులన్నీ చేయిస్తున్నది. ఒక ఫోను పనిచేస్తున్నది అంటే దానికి సింకార్డే మూలం అనగా సిం కార్డు లేకుండా సెల్ఫోను లేదనే కదా దాని  అర్ధం. కానీ నిజానికి మనం సెల్ఫోను అని పిలుస్తాము కానీ సిం కార్డు అనిపిలవము. సింకార్డుకి ఒక నెంబరు ఉంటుంది దానిని మనం ఫోనుకు ఆపాదించి నీ ఫోను నెంబరు ఏమిటి అని అంటాము.  నిజానికి నీవు అడిగింది మాత్రం ఫోను నెంబరు కాదు సిం కార్డు నెంబరు మాత్రమే.   సిం కార్డుకు వున్న నెంబరుతో ర నెంబరులతో అనుసందానం కలగటానికి ఫోను పరికరం  ఉపకరిస్తుంది. కానీ అదే నెంబరుకు మనం ఫోను చేయలేము. ఇది అందరకు అర్ధం కావటానికి పేర్కొన్నది. ఇక ఇదేవిషయం ఆధ్యాత్మికతకు అనువర్తిస్తే 

 ఆత్మ తన శక్తితో ఇంద్రియాలను ఉత్తేజపరుస్తుంది తత్ద్వారా ఇతర ప్రపంచం మొత్తం తెలుసుకోగలుగుతున్నది.  కానీ అది తనకు తానుగా ఇంద్రియాలద్వారా తెలియబడదు. ఇది అర్ధం చేసుకోవటమే జ్ఞ్యానం.  కేవలం జ్ఞ్యని తన అనుభూతులతో, అనుభవంతో మాత్రమే తెలుసుకోగలడు.  దానికి చేయుయవలసిం కృషే నిత్యయోగ సాధన 

సాధకుడు-శరీర సంరక్షణ  

సాధకునికి మనస్సు నియంత్రణ ఉండాలి "చిత్తవృత్తి నిరోధమే" యోగం అన్నది నిజమే కానీ ప్రతి సాధకుడు తన మనోవృత్తులను నిరోధించుకోవటానికి ప్రయత్నించే ముందు తన శరీరానికి సంబందించిన జాగ్రత్తలు తీసుకోవాలి.  అట్లా అని దేహ మోహంలో ఉండకూడదు.  మరి శరీరంగూర్చి ఎలాంటి శ్రార్ధ తీసుకోవాలి అనేది ముఖ్యమైన విషయం

 

ఆత్మ శరీరాన్ని ఆశ్రయించి వున్నది. శరీరానికన్నా బిన్నంగా ఉంటూనే ఆత్మ శరీరంలో ఉండి ఇంద్రియాలతో జీవన వ్యాపారాలను సాగిస్తుంది. నిజానికి ఇంద్రియ జ్ఞ్యానం పూర్తిగా ఆత్మేకలిగి ఉంటుంది. కేనోపనిషత్ విషయంలో స్పష్టమైన వివరం ఇచ్చింది

కేనేషితం పతతి ప్రేషితం మనః

కేన ప్రాణః ప్రథమః ప్రైతి యుక్తః

కేనేషితాం వాచమిమాం వదన్తి

చక్షుః శ్రోత్రం దేవో యునక్తి 

మంత్రార్ధము ఏమిటంటే ఎవరిచేత కోరబడి పంపబడినదియై మనస్సు వస్తు ప్రపంచము పైకి నడచుచున్నది. ఎవరి ఆజ్ఞకు లోబడి ముఖ్య ప్రాణము చరించుచున్నది. ఎవరి వలన వాక్కు నడచుచున్నది. జ్ఞానము ఛక్షుశ్శ్రోత్రములను నడిపించుచున్నది అంటే జ్ఞ్యానాలు ఎవరి ఆధీనంలో వున్నాయి, ఎవరు వీటిని నియంత్రిస్తున్నారు అని ప్రశ్నిస్తున్నది. తదుపరి మంత్రంలో 

 

శ్రోత్రస్య శ్రోతం మనసో మనో

ద్వాచో వాచం ప్రాణస్య ప్రాణః

చక్షుష శ్చక్షు రతిముచ్య ధీరాః

ప్రేత్యాస్మాల్లోకా దమృతా భవన్తి  

 

మంత్రంలో ఏదైతే చెవికి చెవిగా, మనస్సునకు మనస్సుగా, వాక్కనకు వాక్కుగా ఉన్నదో అదియే ప్రాణమునకు ప్రాణముగా, నేత్రమునకు నేత్రముగా ఉన్నది అని గ్రహించిన ధీర పురుషులు విముక్తినొందినవారై లోకము నుండి విడిపడి అమృతతత్వమును పొందుచున్నారు.అనగా మనస్సు మనస్సుగా పనిచేస్తున్నది ఎవరి నియంత్రణలో అదే విధంగా వాక్కు, ప్రాణము, నేత్రాలు ఎవరి ఆధీనంలో వున్నదో దానినిని తెలుసుకొనవలెనని పేర్కొనుచున్నది. తదుపరి మంత్రంలో 

 న తత్ర చక్షుర్గచ్ఛతి

వాక్ గచ్ఛతి నో మనో

విద్మః విజానీమః

యథా ఏతత్ అనుశిష్యాత్

అన్యదేవ తత్ విదితాత్

అథః అవిదితా దధి

ఇతి శుశ్రుమ పూర్వేషాం 

 

మంత్రంలో ఆత్మస్వరూపాన్ని గూర్చి ఇలా చెప్తున్నారు. దానిని నేత్రములు చూడలేవు. వాక్కు దానినిగూర్చి పలుకలేదు. దానినిగూర్చి ఎలా తెలుపవలెనో మాకు తెలియదు. తెలిసినదాని కంటెను, తెలియనిదాని కంటెను అది అతీతమైనది. దానినిగూర్చి మాకు భోధించిన మా పూర్వీకుల నుండి మేము అలాగే విన్నాము అని మహర్షులు వక్కాణించారు.  దీనిని పరిశీలిస్తే కొంతవరకు ఆత్మ స్వరూపం అర్ధం చేసుకోవచ్చు. మొదటిది మన ఇంద్రియములు ఆత్మను తెలుసుకోవటానికి సహకరించవు.  ఎందుకంటె ఆత్మా ఇంద్రియగోచరం కాదు కాబట్టి. 

అది తెలిసిన దానికంటెను అనగా మనకు తెలిసిన ప్రతివిషయం కూడా భౌతికమైనదే అంటే అది భౌతికమైనది కాదు.  అదేవిధంగా తెలియనిదానికంటే మనకు తెలియనిది అని అనుకునేది కూడా భౌతికమైనదే ఎందుకంటె నాకు తెలియనిది నీకు తెలుసు అంటే ఆ తెలిసిన విషయం తప్పకుండా బౌతికంగా వుంది ఇంద్రియ గోచరంగా ఉండాలి.  ఒక్కమాటలో చెప్పాలి అంటే మనం తెలుసు అని అనుకునేది తెలియదు అని అనుకునేది రెండు కూడా భౌతికమై వుంది ఇంద్రియగోచరంగా ఉంటున్నాయి.  మహర్షులు అత్యంత జ్ఞ్యానం కలిగినవారు వారు ఇలా ఆత్మ జ్ఞనాన్ని ఎవరికి వారుగా మాత్రమే తెలుసుకోవాలని సూచనప్రాయంగా తెలుపుతున్నారు. వారు వారి జ్ఞ్యానంతో మనకు ఆత్మజ్ఞ్యానాని ఆవిష్కరించారు 

సాధనకు శరీరం ముఖ్యం,  కాబట్టి శరీరాన్ని సదా జాగ్రత్తగా చూసుకోవలెను. శరీరాన్ని సదా ఆరోగ్యంగా ఉండేవిధంగా చూసుకోవాలి.  శరీరం సదా సాధకుని సాధనకు అనుకూలంగా ఉండేటట్లు చూసుకోవాలి

ఆహారానియమాలు.  మనం తీసుకునే ఆహరం మన శరీరం మీద, మనస్సు మీద ప్రభావితం కలిగి ఉంటాయి. కాబట్టి సాధకుడు ఎల్లప్పుడూ సాత్వికమైన మితాహారం మాత్రమే తీసుకోవాలి. భగవతి గీత ఆహార నియమాలు  

 

ఆయుః సత్త్వబలారోగ్యసుఖప్రీతివివర్ధనాః

రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్త్వికప్రియాః ।। 8 ।।

 

BG 17.8: సత్త్వగుణ ప్రధానముగా ఉండేవారు - ఆయుష్షుని పెంచేవి, మరియు సౌశీల్యమును, బలమును, ఆరోగ్యమును, సుఖమును, మరియు తృప్తిని పెంచేవాటిని ఇష్టపడుతారు. ఇటువంటి ఆహారము రసముతో, సత్తువతో, పోషకములతో కూడినవై, మరియు సహజంగానే రుచిగా ఉంటాయి.  సాధకుడు ఎల్లప్పుడూ సత్వగుణాన్ని వృద్ధి చేసే ఆహరం మాత్రమే తీసుకోవాలి. ఆహరం ఎలావుంటుందో కూడా భగవానులు మనకు తెలిపారు. సాధకుడు ఆహరం తీసుకున్న తరువాత వెంటనే దాహం కాకుండా వుండే ఆహరం తీసుకోవాలి. అది ఆహారంలో భగవానులు మనకు తెలుపలేదు.  కానీ సాధకుడి తెలుసుకోవాలి

 

శరీరం మీద శ్రర్ధ . సాధకునికి ఎల్లప్పుడూ శరీరం మీద శ్రర్ధ కలిగి ఉండాలి. సమయానికి, కాలకృత్యాలు తీర్చుకోవటం, స్నానాదులు చేయటం. పరిశుబ్రమైన దుస్తులు ధరించటం. కేశ సంరక్షణ అంటే సమయానికి క్షౌరం చేయించుకోవటం. శరీరం, మీద మొహాన్ని పెంచేది శరీర అందం.  ఒక మనిషి ఎప్పుడైతే తాను అందంగా వున్నానని భావన కలుగుతుందో అప్పుడు శరీరం మీద మొహం కలుగుతుంది.  ఇంకొక విషయం ముఖం అందంగా కనబటాటానికి కేశాలు ఒక కారణం.  ఎప్పుడైతే సాధకుడు ముండనం చేయించుకుంటాడో అప్పుడు శరీర మొహం కొంతవరకు తగ్గుతుంది. శరీరాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకోవాలి.  అంటే బద్ధకం అసలు ఉండకూడదు.ఒకే ఆసనంమీద ఎక్కువ సేపు ఉండగల్గటం ఇత్యాదులు నియంత్రణలో ఉంచుకోవాలి

 

పతంగాలి మహర్షి మనకు యోగసూత్రాలను తెలియచేసారు.  ఆయనకూడా శరీరం ఎలా స్వాదీనం చేసుకోవాలో కొన్ని నియమాలను చెప్పారు అవి పతంజలి మహర్షి యోగ సూత్రములు వ్రాశాడు. యోగను అష్టాంగ యోగం అన్నాడు. అవి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. యోగాభ్యాసం చేయించే యోగ గురువులు ఆసనం నుంచి మొదలు పెడ్తారు. మొదటి రెండు సూత్రాలైన యమ నియమాలు కేవలం కొంత సమయం పాటు చేసేందుకు పరిమితమైనవి కావు. ఇవి జీవితకాలం పాటు సాధన చేయాలి

 

కాబట్టి ప్రతి సాధకుడు తన శరీరం సాధనకు పనికి వచ్చే విధంగా మలచుకోవాలి.  తత్ద్వారా దీర్ఘ ఆయుష్షు, సంపూర్ణ ఆరోగ్యం పొంది సాధన చేసి బ్రహ్మజ్ఞాని కాగలడు.  ఇంకొక పర్యాయం సాధకుడు మనస్సుని ఎలా నియంత్రించుకోవాలో తెలుసుకుందాం

 

ఓం తత్సత్ 

 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ భార్గవ శర్మ