12, డిసెంబర్ 2022, సోమవారం

విశ్వశాంతి హోమానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

             తిరుమల, 12 డిసెంబరు, 2022


శ్రీ శ్రీనివాస విశ్వశాంతి హోమానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌


- డిసెంబరు 13 నుండి 18వ తేదీ వరకు హోమ కార్యక్రమాలు


         తిరుమ‌ల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో శ్రీ శ్రీనివాస విశ్వశాంతి హోమానికి సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ నిర్వహించారు. టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి పాల్గొన్నారు.


       ఈ సందర్భంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ఆచార్యవరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. ఆ తరువాత యాగశాల వైదిక కార్యక్రమాలు, నీరాజనం, తీర్థప్రసాద వినియోగం చేశారు.


        ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్‌ శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని ఆధ్వ‌ర్యంలో డిసెంబరు 13 నుండి 18వ తేదీ వరకు 22 మంది రుత్వికులు శ్రీ శ్రీనివాస విశ్వశాంతి హోమం నిర్వ‌హించనున్నారు.


       ప్రతిరోజూ ఉదయం 9 నుండి 12 గంటల వ‌ర‌కు, సాయంత్రం 6 నుండి 8.30 గంటల వరకు హోమ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. 


-------------------------------------------------------------

కామెంట్‌లు లేవు: