9, ఆగస్టు 2026, ఆదివారం

బొట్టు పెట్టడంలో

 ఇంటికి వచ్చిన స్త్రీలకు బొట్టు పెట్టడంలో ఉన్న విశేషం. వివరణ k.h. విజయ్ బట్టర్ కడప జిల్లా అర్చక పురోహిత సమైక్య అధ్యక్షులు.


మన సనాతన భారతీయ సంస్కృతిలో అతిథిని దేవుని స్వరూపంగా భావించి గౌరవించడం ఒక గొప్ప ధర్మంగా పరిగణించబడింది. 


ముఖ్యంగా ఇంటికి వచ్చిన ముత్తైదువును లక్ష్మీదేవి, పార్వతీదేవి, పరాశక్తి స్వరూపిణిగా భావించి పసుపు, కుంకుమ, తాంబూలాలతో సత్కరించడం అనాదిగా వస్తున్న పవిత్రమైన ఆచారం. 


ఇది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, మన సంస్కృతిలో స్త్రీకి ఇచ్చిన గౌరవానికి ప్రతీక.


వివాహిత స్త్రీని "గృహలక్ష్మి" అని సంబోధిస్తారు. 


ఆమె అడుగుపెట్టిన చోట మంగళం, శుభం, ఐశ్వర్యం కలుగుతాయని మన పెద్దలు విశ్వసించారు. 


అందుకే ఇంటికి వచ్చిన ముత్తైదువుకు నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టి, పసుపు, కుంకుమ, తాంబూలం సమర్పించి సత్కరించడం ద్వారా ఆమెలోని దైవత్వాన్ని ఆరాధించినట్లుగా భావించారు.


నుదుటి మధ్య భాగాన్ని యోగశాస్త్రంలో ఆజ్ఞా చక్ర స్థానం అని పేర్కొన్నారు. 


ఈ ప్రాంతంలో కుంకుమ ధరించడం మంగళానికి, శక్తికి, సౌభాగ్యానికి సంకేతంగా భావించబడింది. 


పసుపు లక్ష్మీ కటాక్షానికి, పవిత్రతకు ప్రతీక కాగా, కుంకుమ ఆదిపరాశక్తి స్వరూపాన్ని సూచిస్తుంది. 


తాంబూలం గౌరవానికి, సంపూర్ణ ఆతిథ్యానికి చిహ్నంగా భావించబడుతుంది. 


అందుకే ఈ మూడింటిని కలిసి సమర్పించడం ఒక మంగళకరమైన ఆచారంగా కొనసాగుతోంది.


ఈ ఆచారం ద్వారా ఇంటికి వచ్చిన స్త్రీని గౌరవించడమే కాకుండా, కుటుంబంలో ప్రేమ, పరస్పర గౌరవం, మంగళం, ఐకమత్యం పెంపొందుతాయని మన సంప్రదాయం చెబుతోంది.


ఇంటిలో లక్ష్మీ కటాక్షం నిలవాలని, కుటుంబ సభ్యులందరూ సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ ఈ సత్కారాన్ని చేస్తారు.


శుక్రవారాలు, శ్రావణమాసం, వరలక్ష్మీ వ్రతం, నవరాత్రులు, దీపావళి, వివాహాలు, వ్రతాల ఉద్యాపనలు వంటి శుభసందర్భాల్లో ముత్తైదువులను ఆహ్వానించి పసుపు–కుంకుమలు సమర్పించడం ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ఆచారంగా కొనసాగుతోంది.


ధర్మశాస్త్రాలు, గృహ్యసూత్రాలు, దేవీ ఉపాసనా సంప్రదాయాల్లో సువాసినీ పూజకు విశిష్ట స్థానం ఉంది. 


అయితే సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న కొన్ని శ్లోకాలు నిజంగా స్కాంద పురాణం, దేవీ భాగవతం లేదా పద్మ పురాణంలోని యథాతథ శ్లోకాలేనా అనే విషయాన్ని ప్రామాణిక గ్రంథాల ఆధారంగా పరిశీలించి మాత్రమే పేర్కొనాలి. 


అందువల్ల ఈ ఆచారం యొక్క మూలభావాన్ని మన సంప్రదాయ దృష్టితో అర్థం చేసుకోవడం సముచితం.


మన ఇంటికి వచ్చే ప్రతి స్త్రీని గౌరవిద్దాం. ఆమెను గృహలక్ష్మిగా భావించి పసుపు, కుంకుమలతో సత్కరిద్దాం. 


సనాతన భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని మనమే ఆచరిస్తూ, భావితరాలకు అందిద్దాం.


॥ సర్వే జనాః సుఖినో భవంతు ॥

నీతి శాస్త్రము

_*నీతి శాస్త్రము*_


*తల్లిదండ్రుల ఋణం – ఎన్నటికీ తీర్చలేనిది*


శ్లోకం;


*యం మాతా పితరో క్లేశం*

*సహేతే సంభవే నృణామ్ ।*

*న తస్య నిష్కృతిః శక్యా*

*కర్తుం వర్షశతైరపి ॥*


📖 *మూలం* : శ్రీమద్భాగవత మహాపురాణం – దశమ స్కంధం, 45వ అధ్యాయం, 5వ శ్లోకం.


*_భావము_*


*ఈ సృష్టిలో మనకు ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులే.*


మనకు జన్మనివ్వడం మాత్రమే కాదు, సద్గుణాలను అలవర్చడం, సంస్కారాన్ని నేర్పించడం, ధర్మమార్గంలో నడిపించడం, సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన విలువలను అందించడం వారి పవిత్రమైన కర్తవ్యం.


తల్లి తన ప్రేమతో, తండ్రి తన బాధ్యతతో సంతానాన్ని సంరక్షిస్తారు.


సంతానం సుఖసంతోషాలు, అభ్యున్నతి, శ్రేయస్సు కోసం వారు తమ స్వార్థాన్ని పక్కనబెట్టి ఎన్నో త్యాగాలు చేస్తారు. వారి ప్రేమకు హద్దులుండవు; 


వారి ఆప్యాయతకు అంతులేదు; వారి ఆశీర్వాదానికి సాటిలేదు.


అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా "తల్లిదండ్రులు సంతానం కోసం అనుభవించిన కష్టాలకు ప్రతిగా వంద సంవత్సరాలు సేవ చేసినా వారి ఋణాన్ని పూర్తిగా తీర్చడం సాధ్యం కాదు" అని ఉపదేశించాడు.


*వేదం మనకు "మాతృదేవో భవ । పితృదేవో భవ ।" అని ఆజ్ఞాపించింది.*


తల్లిని దేవతగా, తండ్రిని దేవుడిగా భావించి సేవించడం సనాతన ధర్మం. 


తల్లిదండ్రుల సేవలోనే దైవసేవ దాగి ఉంది. వారిని గౌరవించడం, వారి మాటను ఆదరించడం, వృద్ధాప్యంలో ప్రేమతో సేవించడం ప్రతి సంతానపు పరమధర్మం.


*ధర్మశాస్త్రాలు చెబుతున్న ప్రకారం, తల్లిదండ్రుల మనస్సును సంతోషపరిచినవారిపై దేవతల అనుగ్రహం, పితృదేవతల కృప, భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయి*. 


తల్లిదండ్రుల ఆశీర్వాదం జీవితం మొత్తం శుభమార్గంలో నడిపించే దివ్యశక్తి.


మనం దేవాలయాలకు వెళ్లి దేవుణ్ణి ఆరాధిస్తాం. అయితే మన ఇంట్లోనే ఉన్న తల్లిదండ్రులను గౌరవించి, సేవించడం కూడా అదే దైవారాధన అని సనాతన ధర్మం బోధిస్తోంది. 


వారి సంతోషంలోనే మన శ్రేయస్సు ఉంది; వారి ఆశీర్వాదంలోనే మన జీవిత విజయానికి బలమైన పునాది ఉంది.


*_ఆధ్యాత్మిక సందేశం_*


తల్లి గర్భమే మనకు మొదటి దేవాలయం.

తండ్రి భుజమే మనకు మొదటి రక్షణ.

వారి ప్రేమే మనకు మొదటి వరం.

వారి ఆశీర్వాదమే మన జీవితానికి మొదటి సంపద.


తల్లిదండ్రులను గౌరవించడం ధర్మం.

వారిని సేవించడం పుణ్యం.

వారిని సంతోషపరచడం భగవంతుని ఆరాధించడం వంటిదే.


ఈ జన్మలో మనం వారికి చేయగలిగే గొప్ప ఉపకారం, వారిని ప్రేమతో చూసుకోవడం, గౌరవించడం, వారి హృదయాన్ని నొప్పించకుండా జీవించడం.


*_నీతి_*


తల్లిదండ్రుల ప్రేమకు ధర లేదు.

వారి త్యాగానికి కొలమానం లేదు.

వారి ఋణానికి తీర్చుబాటు లేదు.

వారి ఆశీర్వాదానికి సమానమైన సంపద ఈ లోకంలో మరొకటి లేదు.


తల్లిదండ్రులను గౌరవిద్దాం.

వారిని ప్రేమతో సేవిద్దాం.

వారి ఆశీర్వాదంతో మన


* ।

ఆంధ్రుల గురించిన

 ఆంధ్రుల గురించిన చారిత్రిక ప్రస్తావనలు

పాత రాతి యుగం:

కడప, కర్నూల్, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో పాత రాతి పనిముట్లు అసంఖ్యాకంగా దొరికినాయి. 

డోర్నకల్ సమీపంలో నందికనుమ (గిద్దలూరు) ప్రాంతం పాత రాతి పనిముట్ల పరిశ్రమకు కేంద్రం అని శాస్త్రవేత్తల అంచనా.

నవ (నవీన) శిలాయుగం, తామ్రయుగం లకు సంబంధించి కూడా కొన్ని ఆధారాలు లభించాయి.

వైదీక సంస్కృతి:

ఋగ్వేద ప్రజలకు దక్షిణాపథం గురించి స్పష్టమైన పరిజ్ఞానం లేదు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఆంధ్ర ప్రాంతం గురించి దక్షిణాపథం (దక్షిణానికి దారి అనే అర్థం లో) అని చాలా చోట్ల ప్రస్తావించబడినది.

" ఆ సముద్రాత్తువై పూర్వదా సముద్రాత్తు పశ్చిమా తయోరేవాంత రంగిర్యో ఆర్యావర్తం విదుర్భదాః "


ఐతరేయ బ్రాహ్మణం విదర్భ రాజ్యాన్ని పేర్కొంటున్నది. అదే బ్రాహ్మణంలో శునశేఫదేవరాతుని కథలో ఆంధ్ర, శబర, మూతిబ, పుళింద, పుండ్ర తెగల ప్రస్తావన ఉంది.

అలాగే పాణిని అష్టధ్యాయి లో దక్షిణాపథంలోని కళింగ, అస్మక రాజ్యాలను పేర్కొతెలుగు భాష సంస్కృతానికి నుడికారం. సంస్కృతానికి డు, ము, వు, లు చెరిస్తే తెలుగయింది. మనది ద్రవిడ భాష కాదు. మనం ద్రవిడములు కాదు, మన భాష ద్రవిడ భాష కాదు. 

 తెలుగు భాషకు గుర్తించలేక సెంట్రల్ లింగ్విస్టిక్ మినిస్ట్రీలో 

 మనది ద్రవిడ్ భాష గాని పేర్కొన్నారు. తెలుగు వారంతా ఆర్యులు. వైదిక ధర్మాన్ని ఔపోసన పట్టిన వాళ్ళు. ద్రవిడులు శ్రీలంక నుంచి వచ్చిన వాళ్ళు. రామేశ్వరం దగ్గర 13 కిలోమీటర్ల దూరంలో శ్రీలంక హద్దులు ఉంటాయి. 

 మరల అయ్యంగార్లు ఆర్యులె. మన తెలుగు పదాల్లో ద్రవిడ పదాలు లేనే లేవు. ఒకప్పుడు మాదిరాజు అగ్రహరం తర్వాత కాలంలో ఇంగ్లీష్ వాళ్ళు పలకలేక మద్రాస్ గా మార్చారు. అక్కడున్న వాళ్ళందరూ శ్రీలంక వాళ్లే. వాళ్ల సంగతి మనకెందుకు గాని మన భాష మాత్రం ద్రవిడ భాష కాదు.న్నారు.

పంచాంగం 09.08.2026 Sunday

 ఈ రోజు పంచాంగం 09.08.2026 Sunday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస కృష్ణ పక్ష ఏకాదశి తిథి భాను వాసర మృగశిర నక్షత్రం హర్షణ యోగః బాలవ తదుపరి కౌలవ కరణం.


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.

  

 


శ్రాద్ధ తిథి: ద్వాదశి 



 

నమస్కారఃఈ రోజు పంచాంగం 09.08.2026 Sunday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస కృష్ణ పక్ష ఏకాదశి తిథి భాను వాసర మృగశిర నక్షత్రం హర్షణ యోగః బాలవ తదుపరి కౌలవ కరణం.


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.

  

 


శ్రాద్ధ తిథి: ద్వాదశి 



 

నమస్కారః , శుభోదయం , శుభోదయం

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము



యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరమ్ ।

తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్ ।। 26 ।।


ప్రతిపదార్థ:


యతః యతః — ఎప్పుడెప్పుడైతే, ఎక్కడెక్కడికైతే; నిశ్చరతి — సంచరించునో; మనః — మనస్సు; చంచలం — చంచలమైన; అస్థిరం — నిలకడ లేని; తతః తతః — అక్కడ నుండి; నియమ్య — నిగ్రహింపబడి; ఏతత్ — ఇది; ఆత్మని — భగవంతునిపై; ఏవ — తప్పకుండా; వశం — వశములోనికి; నయేత్ — తీస్కురావలెను.



తాత్పర్యము: 


 

ఎప్పుడెప్పుడైతే ఎక్కడెక్కడికైతే ఈ చంచలమైన నిలకడ లేని మనస్సు పరిభ్రమిస్తుందో దానిని తిరిగి తెచ్చి నిరంతరం భగవంతుని మీదనే కేంద్రీకరించాలి.



వివరణ:


ధ్యానంలో విజయం ఒక్క రోజులో రాదు; పరిపూర్ణ సిద్ధి పొందే మార్గం సుదూరమైనది మరియు క్లిష్టమైనది. భగవంతునిపై మనస్సు కేంద్రీకరించాలని మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు, మనకు చాలా సార్లు తెలిసేదేమిటంటే, మనస్సు ప్రాపంచిక సంకల్ప వికల్పాలలో భ్రమించిపోతుంది. దీన్ని ఎదుర్కోవటానికి, ధ్యాన ప్రక్రియలో ఉన్న మూడు అంచెలని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది:


- బుద్ధి యొక్క విచక్షణా శక్తితో మనం ఈ ప్రపంచం మన లక్ష్యం కాదు అని నిర్ణయించుకోవాలి. కాబట్టి, మనం బలవంతంగా మనస్సుని ప్రాపంచికత్వం నుండి వేరు చెయ్యాలి. దీనికి పరిశ్రమ అవసరం.


- మరల, బుద్ధి యొక్క విచక్షణా శక్తిచే భగవంతుడు మాత్రమే మనవాడని అర్థం చేసుకుని, మరియు భగవంతుడిని పొందటమే మన లక్ష్యంగా చేసుకోవాలి. కాబట్టి, మనస్సుని తిరిగి తెచ్చి భగవంతునిపైనే కేంద్రీకరించాలి. దీనికి కూడా పరిశ్రమ అవసరం.


- మనస్సు భగవంతుని నుండి వేరుగా వచ్చేసి మరల ప్రపంచంలో తిరుగుతుంటుంది. దీనికి శ్రమ అవసరం లేదు, దానికదే అనాయాసముగా అయిపోతుంది.


       ఎప్పుడైతే ఈ మూడవది దానికదే అయిపోతుందో, సాధకులు తరచుగా నిరాశ పడతారు, ‘భగవంతుని పై మనస్సు కేంద్రీకరించటానికి నేను చాలా ప్రయత్నించాను కానీ మనస్సు తిరిగి ఈ ప్రపంచంలోకి వెళ్లి పోయింది.’ అని. శ్రీ కృష్ణుడు మనలను ఇలా నిరాశ పడవద్దు అంటున్నాడు. మనస్సు బహు చంచలమైనది, మనం ఎంత ప్రయత్నించినా అది సహజంగానే, తన ఆసక్తి ఉన్న చోటికి వెళ్ళిపోతుంది. కానీ, అది చంచలమైపోయినప్పుడు, తిరిగి మరోసారి, 1వ, 2వ ఉపాయం అవలంబించాలి – మనస్సుని ఈ ప్రపంచం నుండి దూరంగా తీసివేయాలి మరియు తిరిగి భగవంతునిపై కేంద్రీకరించాలి. మరల 3వ పని దానికదే అయిపోతుంది, అని మనకు అనుభవంలోకివస్తుంది. మనం నిరాశ చెందకుండా, మరల 1వ, 2వ ఉపాయాలు ఉపయోగించుకోవాలి.


ఈ సాధనని మరల మరల చేయాలి. అప్పుడు క్రమక్రమంగా భగవంతుని పట్ల, మనస్సు యొక్క మమకారాసక్తి పెరగటం మొదలవుతుంది. అదే సమయంలో, ప్రపంచం మీద వైరాగ్యం కూడా పెరుగుతుంది. ఇది జరిగే క్రమంలో, ధ్యానం చేయటం ఇంకా ఇంకా సులువుగా అవుతుంది. కానీ, ప్రారంభంలో మనస్సుని క్రమశిక్షణ లోనికి--------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము



యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరమ్ ।

తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్ ।। 26 ।।


ప్రతిపదార్థ:


యతః యతః — ఎప్పుడెప్పుడైతే, ఎక్కడెక్కడికైతే; నిశ్చరతి — సంచరించునో; మనః — మనస్సు; చంచలం — చంచలమైన; అస్థిరం — నిలకడ లేని; తతః తతః — అక్కడ నుండి; నియమ్య — నిగ్రహింపబడి; ఏతత్ — ఇది; ఆత్మని — భగవంతునిపై; ఏవ — తప్పకుండా; వశం — వశములోనికి; నయేత్ — తీస్కురావలెను.



తాత్పర్యము: 


 

ఎప్పుడెప్పుడైతే ఎక్కడెక్కడికైతే ఈ చంచలమైన నిలకడ లేని మనస్సు పరిభ్రమిస్తుందో దానిని తిరిగి తెచ్చి నిరంతరం భగవంతుని మీదనే కేంద్రీకరించాలి.



వివరణ:


ధ్యానంలో విజయం ఒక్క రోజులో రాదు; పరిపూర్ణ సిద్ధి పొందే మార్గం సుదూరమైనది మరియు క్లిష్టమైనది. భగవంతునిపై మనస్సు కేంద్రీకరించాలని మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు, మనకు చాలా సార్లు తెలిసేదేమిటంటే, మనస్సు ప్రాపంచిక సంకల్ప వికల్పాలలో భ్రమించిపోతుంది. దీన్ని ఎదుర్కోవటానికి, ధ్యాన ప్రక్రియలో ఉన్న మూడు అంచెలని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది:


- బుద్ధి యొక్క విచక్షణా శక్తితో మనం ఈ ప్రపంచం మన లక్ష్యం కాదు అని నిర్ణయించుకోవాలి. కాబట్టి, మనం బలవంతంగా మనస్సుని ప్రాపంచికత్వం నుండి వేరు చెయ్యాలి. దీనికి పరిశ్రమ అవసరం.


- మరల, బుద్ధి యొక్క విచక్షణా శక్తిచే భగవంతుడు మాత్రమే మనవాడని అర్థం చేసుకుని, మరియు భగవంతుడిని పొందటమే మన లక్ష్యంగా చేసుకోవాలి. కాబట్టి, మనస్సుని తిరిగి తెచ్చి భగవంతునిపైనే కేంద్రీకరించాలి. దీనికి కూడా పరిశ్రమ అవసరం.


- మనస్సు భగవంతుని నుండి వేరుగా వచ్చేసి మరల ప్రపంచంలో తిరుగుతుంటుంది. దీనికి శ్రమ అవసరం లేదు, దానికదే అనాయాసముగా అయిపోతుంది.


       ఎప్పుడైతే ఈ మూడవది దానికదే అయిపోతుందో, సాధకులు తరచుగా నిరాశ పడతారు, ‘భగవంతుని పై మనస్సు కేంద్రీకరించటానికి నేను చాలా ప్రయత్నించాను కానీ మనస్సు తిరిగి ఈ ప్రపంచంలోకి వెళ్లి పోయింది.’ అని. శ్రీ కృష్ణుడు మనలను ఇలా నిరాశ పడవద్దు అంటున్నాడు. మనస్సు బహు చంచలమైనది, మనం ఎంత ప్రయత్నించినా అది సహజంగానే, తన ఆసక్తి ఉన్న చోటికి వెళ్ళిపోతుంది. కానీ, అది చంచలమైపోయినప్పుడు, తిరిగి మరోసారి, 1వ, 2వ ఉపాయం అవలంబించాలి – మనస్సుని ఈ ప్రపంచం నుండి దూరంగా తీసివేయాలి మరియు తిరిగి భగవంతునిపై కేంద్రీకరించాలి. మరల 3వ పని దానికదే అయిపోతుంది, అని మనకు అనుభవంలోకివస్తుంది. మనం నిరాశ చెందకుండా, మరల 1వ, 2వ ఉపాయాలు ఉపయోగించుకోవాలి.


ఈ సాధనని మరల మరల చేయాలి. అప్పుడు క్రమక్రమంగా భగవంతుని పట్ల, మనస్సు యొక్క మమకారాసక్తి పెరగటం మొదలవుతుంది. అదే సమయంలో, ప్రపంచం మీద వైరాగ్యం కూడా పెరుగుతుంది. ఇది జరిగే క్రమంలో, ధ్యానం చేయటం ఇంకా ఇంకా సులువుగా అవుతుంది. కానీ, ప్రారంభంలో మనస్సుని క్రమశిక్షణ లోనికి తెచ్చే పోరాటానికి సిద్ధపడాలి. తెచ్చే పోరాటానికి సిద్ధపడాలి.

పాదారవింద శతకం - 2*

 *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*పాదారవింద శతకం - 2*


*శ్లోకము - 42*


*మరుద్భిః సంసేవ్యా సతతమపి చాంచల్యరహితా*

*సదారుణ్యం యాంతీ పరిణతిదరిద్రాణసుషమా ।*

*గుణోత్కర్షాన్మాంజీరకకలకలైస్తర్జనపటుః*

*ప్రవాలం కామాక్ష్యాః పరిహసతి పాదాబ్జయుగలీ ॥*


*భావము :*


*అమ్మా! లేత చిగురుటాకులు కొన్నాళ్ళకి పండి రాలిపోతాయి. నీ పాదములు ఎప్పటికీ నవనవోన్మేషములు. చిగురుటాకులవలే కాక నీ పాదములు ఎప్పుడూ ఎరుపు వర్ణముతో ఉండి మమ్ములను అనుగ్రహిస్తాయి.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏