18, ఫిబ్రవరి 2026, బుధవారం

గీతలోని మొత్తం 18 అధ్యాయాల

  గీతలోని మొత్తం 18 అధ్యాయాల సారాంశాన్ని కేవలం 18 వాక్యాలలో ఇక్కడ ఇస్తున్నాను.

వన్ లైనర్ గీత -

 దీన్ని అందరికి ఫార్వార్డ్ చేసి సర్క్యులేట్ చేస్తారా? ప్రతి ఒక్కరూ దీన్ని 4 రోజుల్లో 100 మందికి ఫార్వార్డ్ చేయాలని అభ్యర్థించారు. మీ రాష్ట్రంలోనే కాదు, ఇది మొత్తం భారతదేశానికి ఫార్వార్డ్ చేయాలి.


 వన్ లైనర్ గీత


 *అధ్యాయం 1 - తప్పుడు ఆలోచన మాత్రమే జీవితంలో సమస్య .*

 *అధ్యాయం 2 - సరైన జ్ఞానం మన సమస్యలన్నింటికీ అంతిమ పరిష్కారం.*

 *అధ్యాయం 3 - నిస్వార్థం అనేది ప్రగతికి మరియు శ్రేయస్సుకు ఏకైక మార్గం.*

 *అధ్యాయం 4 - ప్రతి చర్య ప్రార్థన యొక్క చర్య కావచ్చు .*

 *అధ్యాయం 5 - వ్యక్తిత్వం యొక్క అహంకారాన్ని త్యజించండి మరియు అనంతం యొక్క ఆనందాన్ని ఆనందించండి .*

 *అధ్యాయం 6 - ప్రతిరోజూ ఉన్నత చైతన్యానికి కనెక్ట్ అవ్వండి.*

 *అధ్యాయం 7 - మీరు నేర్చుకున్న వాటిని జీవించండి .*

 *అధ్యాయం 8 - మిమ్మల్ని మీరు ఎప్పటికీ వదులుకోకండి.*

 *9వ అధ్యాయం - మీ ఆశీర్వాదాలకు విలువనివ్వండి .*

 *అధ్యాయం 10 - చుట్టూ ఉన్న దైవత్వాన్ని చూడండి .*

 *అధ్యాయం 11 - సత్యాన్ని యథాతథంగా చూడడానికి తగినంత శరణాగతి కలిగి ఉండండి.*

 *అధ్యాయం 12 - మీ మనస్సును ఉన్నతంగా గ్రహించండి.*

 *అధ్యాయం 13 - మాయ నుండి విడిపోయి దైవానికి అనుబంధం.*

 *అధ్యాయం 14 - మీ దృష్టికి సరిపోయే జీవన శైలిని గడపండి.*

 *అధ్యాయం 15 - దైవత్వానికి ప్రాధాన్యత ఇవ్వండి .*

 *అధ్యాయం 16 - మంచిగా ఉండటమే ప్రతిఫలం.*

 *అధ్యాయం 17 - ఆహ్లాదకరమైన వాటిపై హక్కును ఎంచుకోవడం శక్తికి సంకేతం .*

 *అధ్యాయం 18 - విడువండి, దేవునితో ఐక్యతకు వెళ్దాం.*

 (ఈ సూత్రంలో ప్రతి ఒక్కదానిపై ఆత్మపరిశీలన)

                          

                   || ॐ తత్సత్ ||


 P. S. - దీన్ని 100 మందికి ఫార్వార్డ్ చేసి, గీత ప్రాముఖ్యతను వివరించవలసిందిగా నేను మిమ్మల్ని పదే పదే కోరుతున్నాను.

      ⛳ జైశ్రీరామ్⛳

విశ్రాంత జీవితం

 విశ్రాంత జీవితం


అవిశ్రాంతంగా రెండున్నర దశాబ్దాలపాటు చదువుకుని, తర్వాత మూడున్నర దశాబ్దాలు ఒక సంస్థకు అంకితమై, అహరహం శ్రమపడి, చివరకు ఎంత కాలం నించో ఎదురుచూస్తున్న విశ్రాంత జీవిత ప్రస్థానం చేరుకున్నాను. 


శారీరకంగా, ఆర్థికంగా కొంప మునిగిపోయేంత సమస్యలేవీ లేవు కాబట్టి నాకు నచ్చినట్లుగా తిని, తిరిగి, చూసి, చదివి, ఆడి, పాడి జీవించాలనుకున్నాను.  


కానీ అనుకున్న దొక్కటి, అయినది ఇంకొకటి. ఏ ముహుర్తాన రిటైర్ అయ్యానో, నా వాట్సాప్, ఫేస్బుక్ ఫీడ్ అంతా రిటైర్మెంట్ డబ్బులు ఎలా దాచుకోవాలో  చెప్తున్న బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్ , రియల్ ఎస్టేట్,  ఫైనాన్స్ కంపెనీల అడ్వర్టైజ్ మెంట్లే . అవి నా డబ్బులు దోచేసే దాకా విశ్రమించేలా లేవు.


ఇక  వాట్సప్ గ్రూపుల్లో  ఇది మీ జీవితం, మీరే జీవించుకోండి, ఎవరిమీదా ఆధారపడొద్దు, కొడుకులు ,కూతుళ్ళ ఇళ్లలో ఉండకండి, మీ డబ్బులు మీ ఆవిడకు కూడా ఇవ్వకండి , మీ వారసులు ఏ టైమ్ లో ఎవరు ఎలా మారతారో చెప్పలేం అంటూ భయపెట్టేస్తున్నారు.


మీరు బ్రతికుండగా తప్పనిసరిగా చూడవలసిన పుణ్యక్షేత్రాలుచూడక పోతే పుట్టగతులు ఉండవని కొంతమంది, చచ్చేలోపు ఈ దేశాలు, ప్రదేశాలు చూడకపోతే మీ లైఫ్ వేస్ట్ అయిపోయినట్లే అని కొంతమంది కంగారు పెట్టేస్తున్నారు.


అరవై దాటగానే నిలబడి నీళ్లు తాగకూడదని, పరిగెత్తి పాలు తాగాలని కొంతమంది,  పొద్దున్నే  వాకింగ్ చేస్తే న్యుమోనియా వస్తుందని కొంతమంది, పక్క వాళ్ళతో  కులాసాగా జోకులేస్తూ నవ్వుతూ వాకాలని కొందరు, సీరియస్ గా ముఖం పెట్టుకుని ఒగురుస్తూ వాకాలని మరికొందరూ కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు.


 ఒకడు పరిగెత్తమంటాడు, ఇంకొకడు జాగింగ్ అంటాడు, వేరొకడు బ్రిస్క్ వాకింగ్ అంటాడు, మరొకడు స్లో వాకింగ్ అంటాడు. ఇవేవీ కాదు వెనక్కి నడవమంటాడొకడు. ఎందుకీ అనవసరపు శ్రమ, సీనియర్ సిటిజన్లు కుర్చీలో కాళ్ళూపుకుంటూ కూర్చుంటే చాలంటాడు మరో పెద్దమనిషి. ఏదినిజమో అందర్నీ అడుగుతూ హిమాలయాలదాక నడిచి వెళ్ళి కనుక్కుంటే కానీ తెలీదు.


ఉన్నది ఒక జీవితమే కాబట్టి,  క్రమం తప్పక  రోజూ లిమిటెడ్ గా 'మందు' వేస్తే గుండెకు ఆరోగ్యం అని ఒకరు, మందు పూర్తిగా మానేసి, క్రమం తప్పక రోజూ మందులేసుకుంటేనే జీవితం అంటూ మరొకరు నొక్కి వక్కాణిస్తున్నారు.


ఇక నేను రోజూ ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఎలా తినాలి, ఎక్కడ తినాలి , అలా తినక పోతే ఏమేం భయంకరమైన రోగాలు చుట్టుముడతాయి వగైరా వివరాలతో పోస్టులు పెట్టి చంపేసే వాళ్ళు ఇంకొందరు. ఒకరోజైతే ఓకే. ప్రతీ రోజూ అవే పోస్టులు!


బంధాలు, అనుబంధాలు అంటూ కొన్ని పోస్టులు. కోడలితో ఎలా ఉండాలి, అల్లరి చేసినా మనవల్ని ఎందుకు తిట్టకూడదు, కొడుక్కి ఎందుకు సలహాలు ఇవ్వకూడదు, బంధువులతో ఎలా మసలుకోవాలి అంటూ కొత్తగా కాపురానికి వెడుతున్న పిల్లకి జాగర్తలు చెప్పినట్లు రోజూ చెవిలో పోరుతున్నారు.


ఇప్పటిదాకా చెప్పినవి కొన్ని మాత్రమే. ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. రోజూ వస్తున్నాయి. ఇవన్నీ చదివితే నేను పండు ముసలివాడిని అయిపోయినట్లు, అందరూ నన్ను అదోలా చూస్తున్నట్లు అనిపించేస్తోంది. అరవై ఏళ్ళు ఉత్సాహంగా, ఉల్లాసంగా, జయప్రదంగా జీవించిన నాకు అరవై దాటగానే చిన్నపిల్లలకి చెప్పినట్లు అన్నీ చెబుతూ ఈ పోస్టులేమిటో? 


అసలు రిటైర్ అవకముందు రాని ఈ పోస్టులు అన్నీ రిటైర్ అయినప్పటించే ఎందుకొస్తున్నాయి?  నేను శారీరకంగా, మానసికంగా బాగానే ఉన్నానని , నా జీవితం నా ఇష్టానుసారం గడపగలనని, నాకున్న బంధాలు, అనుబంధాలు స్ట్రాంగ్ గానే ఉన్నాయని, అందరికీ అరిచి చెప్పాలని ఉంది. కానీ ఎవరు వింటారు? ఈ విశ్రాంత జీవితంలో వీటి ప్రభావం నించి తప్పించుకోడానికి అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉండాలి. తప్పదు.

🙏🙏🙏

దశకం 18- పృథుచరితము



*దశకం 18-  పృథుచరితము*

*దశకం 18- శ్లోకం 4*


తన్నాశాత్‌ ఖలజనభీరుకైర్మునీం ద్రై:

తన్మాత్రా చిరపరిరక్షితే తదంగే ।

త్యకాఘే పరిమథితాదథోరుదండాత్‌

దోర్డండే పరిమధితే త్వమావిరాసీః ॥


ఆ వేనుని నాశనము వలన దుష్ట జనులు ఈ భూమియందు విచ్చలవిడిగా ప్రవర్తిచుండగా.,   మునిపుంగవులు భయపడిరి.


తన తల్లియైన సునీథ చే రక్షింపబడిన వేనుని శరీరములో తొడను మహర్షులు మథింపగా, అతని పాపమంతయు నశించెను. అటుపిమ్మట అతని బాహువును మథింపగా పృథువుగా నువ్వు అవతరించితివి.

శ్రీ ధూర్జటిమహాకవి ఇలా అంటున్నారు



🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


శ్రీ ధూర్జటిమహాకవి ఇలా అంటున్నారు


శా//అంతామిథ్య తలంచి జూచిన నరుం డట్లౌటెరింగిన్ సదా/ 

కాంతల్పుత్రులు నర్థమున్ తనువు నిక్కంబంచు మోహార్ణవ/

భ్రాంతిం జెంది జరించు గాని,పరమార్థంబైన

నీయందు దా/

జింతాకంతయు జింత నిల్పడు గదా! శ్రీకాళహస్తీశ్వరా!//


(జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ జగత్తులో 

కనిపించేవి,వినిపించేవి, అయిన సమస్త విషయములు అశాశ్వతములే.

ఈ విషయం తెలిసినప్పటికీ, మానవులు, భ్రాంతి వల్ల నా భార్య, ,నాభర్త,నాపుత్రులు,నాధనము,నా శరీరము,అని అశాశ్వతములైన వీటినుండి సుఖాన్ని ఆశిస్తూ అగాధమైన ఈ సంసార సముద్రములో తిరుగుచున్నారు.

శాశ్వతము,పరమసత్యము, అయిన నీగురించి "చింతచెట్టు ఆకు" అంత కూడా ఆలోచించటం లేదు)




భగవంతుని మీదికి దృష్టి పోకుండా సంసారంలో మనల్ని కట్టిపడేసే, ప్రాపంచిక బంధాలు చాలా బలవత్తరమైనవి.

వాటినుండి మనంతట మనం ముక్తి పొందలేము. ఈశ్వరానుగ్రహంతోనే అది సాధ్యం అంటున్నారు.


శా / ఆలంచున్ మెడ గట్టి, దానికి నపత్యశ్రేణి గల్పించి తత్/

బాల వ్రాతము నిచ్చి పుచ్చుటను సంబంధంబు గావించి యా/

మాలర్కంబున బాంధవం బనెడి ప్రేమం గొందఱం ద్రిప్పగా/

సీలన్ సీల యమర్చి నట్లొసగితో ! శ్రీకాళహస్తీశ్వరా! //


(స్వామీ! భార్యాభర్తలనే సంబంధం మెడకు కట్టావు. సంతానాన్ని కనటం అనే ప్రక్రియ ఏర్పాటు చేసావు. ఆడపిల్లలను ఇవ్వడం, కోడండ్రను,తెచ్చుకోవడం, అనే తతంగంతో క్రొత్త క్రొత్త బాంధవ్యాలను, ప్రేమలను కల్పిస్తున్నావు.

 ఈ విధంగా మానవులను సంసారంనుండి బయటపడకుండా త్రిప్పటం అనేది, మరలలో మేకులను గట్టిగా బిగించినట్లు ఉన్నది.

సీలలో సీలలాగా బిగింపబడిన ఈ బంధములనుండి మా అంతట మేము ఎలా బయటపడగలం?

శ్రీకాళహస్తీశ్వరా! నీవే దయతో ఈ బంధములనుండి విముక్తులను చేసి మాకు ముక్తిని ప్రసాదించు స్వామీ )


శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

18-2-'26.

నేటిపెద్దలమాట

  🙏సర్వేజనాః సుఖినోభవంతు: 🙏


     🌺శుభోదయం 🌺


🌺 నేటిపెద్దలమాట 🌺


"కష్టసుఖాలు కాలాలు వంటివి. నువ్వు వద్దు అనుకున్నా సరే నీ కర్మ ప్రకారం వచ్చి అవి ఉండగలిగినంత కాలం ఉండి వెళ్లిపోతాయి. దానిని నువ్వు అడ్డుకోలేవు, ఆపనూ లేవు. ఏదైనా చేయగలిగావంటే ఒక్కటే! వచ్చి పోయే ఈ కష్టనష్టాలు గురించి పట్టించుకోకుండా పరమాత్మను గట్టిగా పట్టుకో. నీవు చేయాల్సిన పనులు దోషం లేకుండా చేసుకో. నిన్ను ఏ కర్మ ఫలం కూడా ఏమీ చేయలేదు!. 


🌹 నేటిమంచిమాట 🌹


నీ 'ఇచ్చానుసారం' అన్ని జరగాలి అని అనుకున్నంత కాలం నీకు 'శాంతి' లభించదు.నువ్వు ఎప్పుడైతే 'భగవంతుని' ఇచ్చానుసారమై అన్నీ జరుగుతున్నాయి.నేను నిమిత్రమాత్రుడినే అనే భావనతో కర్తవ్యాలను నిర్వర్తిస్తావో, అప్పుడు మాత్రమే నిజమైన సంతృప్తి, 'శాంతి' నీకు లభిస్తాయి.


🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯



🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

        🌺పంచాంగం🌺

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,


తేదీ ... 18 - 02 - 2026,

వారం ... సౌమ్యవాసరే ( బుధవారం )

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,

ఉత్తరాయనం,

శిశిర ఋతువు,

ఫాల్గుణ మాసం,

శుక్ల పక్షం,


తిథి : *పాడ్యమి* సా5.26 వరకు,

నక్షత్రం : *శతభిషం* రా10.00 వరకు,

యోగం : *శివం* రా11.42 వరకు,

కరణం : *బవ* సా5.26 వరకు

                తదుపరి *బాలువ* తె5.05 వరకు,


వర్జ్యం : *ఉ6.38 వరకు*

                              మరల *తె4.21 - 5.56*

దుర్ముహూర్తము : *ఉ11.50 - 12.36*

అమృతకాలం : *మ2.43 - 4.20*  

రాహుకాలం : *మ12.00 - 1.30* 

యమగండం : *ఉ7.30 - 9.00*

సూర్యరాశి : *కుంభం* 

చంద్రరాశి : *కుంభం*

సూర్యోదయం : 6.29,

సూర్యాస్తమయం : 5.58


                 *_నేటి మాట_*

*"జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది??..."*

భగవంతుని యందు భక్తి భావన వల్ల కొంత వియోగం దుఃఖము అనుభవింప వలసి వస్తుంది.

( రూప నామములే నమ్మి నందు వల్ల)అది కూడా మార్గమే!... అందువల్ల "అంతర్యామిగా మీరు నన్ను చూసి నట్లయితే, అప్పుడు మీకు వియోగ దుఃఖము ఉండదు, మనస్సు లో శాంతి ననుభవిఁపగలరు," అని ఈశ్వర తత్వాన్ని గోపి కలకు చెప్పాడు కృష్ణ పరమాత్మ. 


ఇది మనందరికీ శిరోధార్యములైన మాట!!...

లోకంలో భూత ప్రేత పిశాచాలను ఆరాధనచేసి నిధులు పొందిన వారున్నారు. 

అవి ఈశ్వరుడే ఇవ్వవలసిన అవసరం లేదు. 

మరి భక్తులకు ఆయన ఏమి ఇస్తాడు అంటే!!... ఎవ్వరూ ఇవ్వలేని వస్తువునే ఆయన ఇవ్వాలి మరి. 

అది సృష్టి లో ఇంకెవ్వరూ ఇవ్వలేరు ఈశ్వరుడు తప్ప, అట్టి వస్తువునే తానివ్వాలి. 

అదే ఆయన అధికారానికి తగినట్లుంటుంది. 

అట్టి వస్తువు ఏమిటంటే!!... అది జ్ఞానమే! 

చరిత్రలో అనేక మంది భక్తులు దరిద్రాన్ని అనుభవించారు, అయినా వాళ్ళు ఆయన కనపడినా కూడా ధనం అడగలేదు. 

ఈశ్వరానుగ్రహాన్ని, జ్ఞానాన్ని మాత్రమే కోరుకున్నారు, పొందారు.

తాను అనుభవించే సుఖ దుఃఖా లు, తన చేసుకున్న కర్మ ఫలితాలే అనే జ్ఞానం కలగాలి. 

ఈ రెండింటియందూ సమ భావం తో ఉండాలి. 

ఈ ప్రకారంగా తెలుసుకుని, చివరకు నేనే దైవం, శత్రువులు, మిత్రులు ఎవరూ లేరు, అందరూ దైవస్వరూపులే !... నేనే దైవం అనే జ్ఞానం కలుగుతుంది. 


             *_🌺శుభమస్తు🌺_*

🙏 సమస్త లోకాః సుఖినోభవంతు 🙏🙏సర్వేజనాః సుఖినోభవంతు: 🙏


     🌺శుభోదయం 🌺


🌺 నేటిపెద్దలమాట 🌺


"కష్టసుఖాలు కాలాలు వంటివి. నువ్వు వద్దు అనుకున్నా సరే నీ కర్మ ప్రకారం వచ్చి అవి ఉండగలిగినంత కాలం ఉండి వెళ్లిపోతాయి. దానిని నువ్వు అడ్డుకోలేవు, ఆపనూ లేవు. ఏదైనా చేయగలిగావంటే ఒక్కటే! వచ్చి పోయే ఈ కష్టనష్టాలు గురించి పట్టించుకోకుండా పరమాత్మను గట్టిగా పట్టుకో. నీవు చేయాల్సిన పనులు దోషం లేకుండా చేసుకో. నిన్ను ఏ కర్మ ఫలం కూడా ఏమీ చేయలేదు!. 


🌹 నేటిమంచిమాట 🌹


నీ 'ఇచ్చానుసారం' అన్ని జరగాలి అని అనుకున్నంత కాలం నీకు 'శాంతి' లభించదు.నువ్వు ఎప్పుడైతే 'భగవంతుని' ఇచ్చానుసారమై అన్నీ జరుగుతున్నాయి.నేను నిమిత్రమాత్రుడినే అనే భావనతో కర్తవ్యాలను నిర్వర్తిస్తావో, అప్పుడు మాత్రమే నిజమైన సంతృప్తి, 'శాంతి' నీకు లభిస్తాయి.


🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯



🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

        🌺పంచాంగం🌺

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,


తేదీ ... 18 - 02 - 2026,

వారం ... సౌమ్యవాసరే ( బుధవారం )

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,

ఉత్తరాయనం,

శిశిర ఋతువు,

ఫాల్గుణ మాసం,

శుక్ల పక్షం,


తిథి : *పాడ్యమి* సా5.26 వరకు,

నక్షత్రం : *శతభిషం* రా10.00 వరకు,

యోగం : *శివం* రా11.42 వరకు,

కరణం : *బవ* సా5.26 వరకు

                తదుపరి *బాలువ* తె5.05 వరకు,


వర్జ్యం : *ఉ6.38 వరకు*

                              మరల *తె4.21 - 5.56*

దుర్ముహూర్తము : *ఉ11.50 - 12.36*

అమృతకాలం : *మ2.43 - 4.20*  

రాహుకాలం : *మ12.00 - 1.30* 

యమగండం : *ఉ7.30 - 9.00*

సూర్యరాశి : *కుంభం* 

చంద్రరాశి : *కుంభం*

సూర్యోదయం : 6.29,

సూర్యాస్తమయం : 5.58


                 *_నేటి మాట_*

*"జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది??..."*

భగవంతుని యందు భక్తి భావన వల్ల కొంత వియోగం దుఃఖము అనుభవింప వలసి వస్తుంది.

( రూప నామములే నమ్మి నందు వల్ల)అది కూడా మార్గమే!... అందువల్ల "అంతర్యామిగా మీరు నన్ను చూసి నట్లయితే, అప్పుడు మీకు వియోగ దుఃఖము ఉండదు, మనస్సు లో శాంతి ననుభవిఁపగలరు," అని ఈశ్వర తత్వాన్ని గోపి కలకు చెప్పాడు కృష్ణ పరమాత్మ. 


ఇది మనందరికీ శిరోధార్యములైన మాట!!...

లోకంలో భూత ప్రేత పిశాచాలను ఆరాధనచేసి నిధులు పొందిన వారున్నారు. 

అవి ఈశ్వరుడే ఇవ్వవలసిన అవసరం లేదు. 

మరి భక్తులకు ఆయన ఏమి ఇస్తాడు అంటే!!... ఎవ్వరూ ఇవ్వలేని వస్తువునే ఆయన ఇవ్వాలి మరి. 

అది సృష్టి లో ఇంకెవ్వరూ ఇవ్వలేరు ఈశ్వరుడు తప్ప, అట్టి వస్తువునే తానివ్వాలి. 

అదే ఆయన అధికారానికి తగినట్లుంటుంది. 

అట్టి వస్తువు ఏమిటంటే!!... అది జ్ఞానమే! 

చరిత్రలో అనేక మంది భక్తులు దరిద్రాన్ని అనుభవించారు, అయినా వాళ్ళు ఆయన కనపడినా కూడా ధనం అడగలేదు. 

ఈశ్వరానుగ్రహాన్ని, జ్ఞానాన్ని మాత్రమే కోరుకున్నారు, పొందారు.

తాను అనుభవించే సుఖ దుఃఖా లు, తన చేసుకున్న కర్మ ఫలితాలే అనే జ్ఞానం కలగాలి. 

ఈ రెండింటియందూ సమ భావం తో ఉండాలి. 

ఈ ప్రకారంగా తెలుసుకుని, చివరకు నేనే దైవం, శత్రువులు, మిత్రులు ఎవరూ లేరు, అందరూ దైవస్వరూపులే !... నేనే దైవం అనే జ్ఞానం కలుగుతుంది. 


             *_🌺శుభమస్తు🌺_*

🙏 సమస్త లోకాః సుఖినోభవంతు 🙏

మహాభారతము

  *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

అనుశాసనిక పర్వము చతుర్థాశ్వాసము


*655 వ రోజు*

అన్నదమ్ముల విధులు

ధర్మరాజు " పితామహా ! ఈ లోకములో అన్నదమ్ములు ఎలా ప్రవర్తించాలో తెలియజెయ్యండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! చిన్న వాళ్ళయిన తమ్ములు పెద్ద వారైన అన్నల ఎడల భక్తి శ్రద్ధలతో మెలగాలి. అలాగే అన్నయ్యలు కూడా తమ తమ్ముల పట్ల వాత్సల్యముతో ప్రవర్తించాలి. తమ్ములలో ఒకడు బుద్ధిహీనుడైనా పరవాలేదు కాని అన్నమాత్రము బాధ్యతా యుతంగా ప్రవర్తించక ఉన్న ఆ కుంటుంబం నాశనం ఔతుంది. అన్నదమ్ములు తమలో తాము తగవులు వదిలి పెద్దలు ఇచ్చిన ఆస్తిని సమంగా పంచుకోవాలి. అలా చేసిన లోకము వారిని కీర్తిస్తుంది. అలా చేయక వారిలో ఏ ఒక్కడైనా స్వార్ధంతో అంతా స్వాధీనం చేసుకున్న ఆ కుంటుంబం చిన్నాభిన్నంమై అపకీర్తి పాలు ఔతుంది. తండ్రి తరువాత తండ్రి అంతటి వాడు అన్నయ్య. ఆయన భార్య తల్లి తరువాత తల్లి వంటిది. తల్లి తండ్రుల మరణానంతరం అన్నవదిన తల్లి తండ్రులతో సమానము. అన్నదమ్ములు ఎవరైనా మిగిలిన అన్నదమ్ములకు ద్రోహం చేసిన అతడు శిక్షార్హుడు ఔతాడు. తల్లి తరువాత అక్క తల్లి వంటిది. చిన్నతనంలో తనకు పాలిచ్చి పెంచిన ఆయాలు దాదులు తల్లివంటి వారే. తండ్రి తొలి గురువు. తండ్రి గురువుకంటే పదింతలు పెద్ద. తండ్రి కంటే తల్లి పదింతలు పెద్దది. తల్లి తండ్రులు శరీరం ఇచ్చి ఈలోకలోకి తీసుకు వస్తారు. గురువు విద్యాబుద్ధులు నేర్పి మరుజన్మ ప్రసాదిస్తాడు. గురువు ఇచ్చినజన్మ అజరామరమైనది కనుక గురువు అధికంగా పూజించ అర్హుడు " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.

ఉపవాస వ్రతము

ధర్మరాజు " పితామహా ! ఉపవాసవ్రతము బ్రాహ్మణులకు క్షత్రియులకు మాత్రమే నిర్దేశింపబడింది. మిగిలిన వర్ణములకు కాదు అంటారు కదా ! పైగా ఎక్కువ ఉపవాసములు చెయ్యడం దోషము అంటారు కదా ! అసలు ఉపవాసము అంటే ఏమిటి ? దానికి ఉండవలసిన యోగ్యతలు ఏమిటి ? ఉపవాసము వలన కలుగు ఫలితం ఏమిటి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! నువ్వు అడిగినట్లే నేను అంగీరసుడు అనే మునీశ్వరుడిని అడిగాను. ఆయన చెప్పినది నీకు చెప్తాను విను. బ్రాహ్మణుడు, క్షత్రియుడు మూడు రాత్రులు ఉపవసించ వచ్చు. శరీరము సహకరించి అనారోగ్యము పాలుకాకున్న మరి కొన్ని రోజులు ఉపవశించ వచ్చు. వైశ్యులు, శూద్రులు నాలుగు పూటలు మించి ఉపవసించ రాదు. పౌర్ణమి, శుక్లపక్ష అష్టమి, చతుర్ధశి, శుక్లపక్ష పంచమి, షష్టి, అలాగే బహుళ పంచమి, షష్టి ఉపవాసముకు తగిన పర్వ దినములు. రోజుకు ఒక రోజు మాత్రమే తిని ఉపవాసము ఉండు బ్రాహ్మణుడికి అందమైన భార్య, సంతానం కలుగి ఐశ్వర్యవంతుడు ఔతాడు. ఇలా ఒక్క సంవత్సరము ఉపవాసము ఉన్న అతడికి ఈ లోకములోని సౌఖ్యములన్నీ పొందుతారు. ఎన్ని రోజులు ఉపవాసము ఉంటే అన్ని సౌఖ్యములు కలుగుతాయి. ఒక సంవత్సరములో 15 రోజులు ఉపవసించిన పుణ్యలోకప్రాప్తి కలిగుతుంది. ఒక మాసము ఉపవసించిన బ్రహ్మలోకప్రాప్తి కలుగుతుంది. కాని ఎవరూ సంవత్సరంలో ఒక మాసము మించి ఉపవసించ రాదు. యుగయుగానికి మనుష్యునికి ఉపవాస సామర్ధ్యము మారుతుంది కనుక వారి కాల ప్రమాణం అనుసరించి ఉపవాస దినముల సంఖ్య మారుతుంటుంది. తల్లిని మించిన గురువు, వేదముకు మించిన శాస్త్రము, ధర్మముకు మించిన లాభము లేదు. పవిత్రములైన వాటిలోక్లెల్లా బ్రాహ్మణుడు పవిత్రుడు. కనుక బ్రాహ్మణుడిని భక్తితో పూజించాలి. పూర్వము దేవతలు మునులు ఉపవాసధర్మము అనుసరించి గొప్పవాళ్ళు అయ్యారు. విశ్వామిత్రుడు తన జీవితమంతా ఏక భుక్త్వము చేసి బ్రాహ్మణత్వము పొందాడు. కనుక ఉపవాసముకు మించిన వ్రతము లేదు. ఉపవాసవ్రతము అనుసరించడం వలన మనసు శరీరము పవిత్రమౌతాయి. పైన చెప్పిన ఉపవాస ధర్మము లోకముకు అంగీరస మహర్షి అందించాడు. అంగీరసుడు చెప్పిన విధంగా వ్రతాచరణ చేసిన మానవుడికి పాపములు అంటవు " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీ ప్రసన్న వరదరాజ పెరుమాళ్ ఆలయం

 🕉 మన గుడి : నెం 1392


⚜ తమిళనాడు : శూలగిరి


⚜ శ్రీ ప్రసన్న వరదరాజ పెరుమాళ్ ఆలయం



💠 భారతదేశంలోని తమిళనాడులోని శూలగిరిలోని వరదరాజ పెరుమాళ్ ఆలయం విష్ణువుకు అంకితం చేయబడిన దేవాలయం . 



💠 వరదరాజ పెరుమాళ్ ఆలయం తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా శూలగిరిలో ఉంది.

 ఈ పురాతన ఆలయం ప్రసిద్ధి చెందిన విష్ణు దేవాలయం. 


💠 ఈ ఆలయాన్ని చాలా కాలంగా అనేక మంది రాజులు నిర్మించారు. మహాభారత కాలంలో అర్జునుడు వనవాస కాలంలో ఈ ఆలయాన్ని ప్రతిష్టించాడు . 


💠 ఈ ఆలయంలోని గర్భగ్రహాన్ని చోళ రాజులు నిర్మించారు . 

ముందు హాలు (మండపం) విజయనగర సామ్రాజ్యానికి చెందిన కృష్ణదేవరాయలు నిర్మించారు . తరువాత, హొయసల రాజులు , మరియు విజయనగరానికి చెందిన చిన్న రాజులు ఈ ఆలయాన్ని క్రమంగా విస్తరించి పూజలు చేశారు.


💠 ద్వాపర యుగంలో, పంచపాండవులు దుర్యోధనుడి చేతిలో జూదంలో ఓడిపోయినప్పుడు , జూదం నిబంధనల ప్రకారం వారిని అడవిలో బహిష్కరించారు. 


💠 వనవాస కాలంలో, పంచ పాండవులు అనేక ప్రదేశాలకు వెళ్లి శూలగిరికి కూడా వచ్చారు. శూలగిరిలో, అర్జునుడు వరదరాజ పెరుమాళ్‌ను ప్రతిష్టించి పూజించాడు. 

పంచ పాండవులు ఈ ప్రదేశానికి వచ్చినందుకు గుర్తుగా, శూలగిరి కొండలో 5 పెద్ద రాళ్ళు కలిసి ఉన్నాయి 


💠 శూలగిరి కొండ త్రిశూలాన్ని (తమిళంలో శూలం) పోలి ఉండటం వల్ల, ఈ ప్రదేశానికి కాలక్రమేణా 'శూలగిరి' అనే పేరు వచ్చింది.


💠 శ్రీ ప్రసన్న వరదరాజ పెరుమాళ్ దేవాలయం షూలగిరిలో మూడు కొండల పాదాల మీద కలిసి కలుస్తుంది కాబట్టి దీనిని త్రికూటాచల క్షేత్రం అని పిలుస్తారు. 


💠 ఈ ఆలయాన్ని దక్షిణ వైకుండం లేదా హస్తశైల శ్రీ క్షేత్రం అని కూడా అంటారు. 


💠 ఈ ఆలయంలో వరదరాజ పెరుమాళ్ పశ్చిమ ముఖంగా ఉంటాడు. 

తల్లి పెరుందేవి మహాలక్ష్మి ప్రత్యేక గర్భగుడిలో తూర్పు ముఖంగా ఉంటారు.


💠 ప్రతి సంవత్సరం ఉత్తరారణ్య కాలంలో (జనవరి మధ్య నుండి జూలై మధ్య వరకు), సూర్యాస్తమయం సమయంలో సూర్యకిరణాలు వరదరాజ పెరుమాళ్ పాదాలపై పడతాయి.


💠 ఉత్తరాయణ కాలంలో అస్తమించే సూర్యకిరణాలు పెరుమాళ్ పాదాలపై పడడంతో, ఆయనను ఉదయస్థగిరినాధర్ అని పిలుస్తారు .


💠 ఈ ఆలయం పడమర ముఖంగా ఉంది మరియు ఇరుకైన వీధిలో ఉంది. 

భక్తులు పశ్చిమ ముఖంగా ఉన్న ఆలయానికి చేరుకోవడానికి దాదాపు 20 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. 

ఈ ఆలయంలో మూడు అంచెల రంగుల రాజగోపురం ఉంటుంది. 


💠 ఈ ఆలయం అసలు పేరు 

శ్రీ భూ నీలా పెరుందేవి నాయికా సమేత శ్రీ ప్రసన్న వరదరాజ పెరుమాళ్ ఆలయం. 


💠 ఈ ఆలయం ఉన్న ఇరుకైన వీధిని కృష్ణగిరి జిల్లా పరిధిలోకి వచ్చే శూలగిరిలోని హస్తగిరిపురం అని పిలుస్తారు.


💠 రాజగోపురం క్రింద ఆళ్వార్లు, గణపతి విగ్రహం మరియు ఆంజనేయ విగ్రహం ఉన్నాయి. మూలస్థానానికి ఎదురుగా గరుడాళ్వార్ సన్నధి ఉంది. 


💠 అనేక స్తంభాలు కలిగిన బహుళ స్తంభాల మండపంలో శ్రీకృష్ణుడు, నవ నరసింహుడు, దశావతారం మొదలైన అనేక విగ్రహాలు ఉన్నాయి. 


💠 గర్భగుడి బహుళ స్తంభాల మండపంలో ఉంది మరియు పశ్చిమ ముఖంగా ఉంది, దీనిలో శ్రీ ప్రసన్న వరదరాజ పెరుమాళ్ నిలబడి ఉన్న భంగిమలో కనిపిస్తాడు. మూలవార్‌తో పాటు నమ్మాళ్వార్, విశ్వక్సేనర్ మరియు రామానుజర్ విగ్రహాలు ఉన్నాయి. 


💠 ఈ ఆలయం యొక్క మరొక లక్షణం భక్తులు మూలస్థానాన్ని లోపలి నుండి ప్రదక్షిణ చేయవచ్చు. శ్రీ వీర ఆంజనేయర్ మరియు శ్రీ భక్త ఆంజనేయర్ ఉన్న రెండు ఉప మందిరాలు ప్రక్కనే ఉన్నాయి. 


💠 సమీపంలో ఒక జత యాగకుండం ఉంది. 

తాయార్ సన్నధి తూర్పు ముఖంగా ఉంది మరియు ఆమెను పెరుందేవి మహాలక్ష్మి తాయార్ అని పిలుస్తారు, ఆమె పద్మాసనములో కనిపిస్తుంది. 


💠 ఆమె మందిరానికి ఎదురుగా అర్జునుడి లక్ష్యాన్ని గుర్తుచేసే ఒక చేప చిహ్నం ఉంది మరియు దానికి దగ్గరగా చంద్రుడిని మింగినట్లుగా ఒక పాము ఉంది. 

ఈ చిత్రాలు పైకప్పుపై వర్ణించబడ్డాయి. 


💠 ప్రతి ఉత్తరాయణం సమయంలో సూర్య భగవానుడు విష్ణువును పూజిస్తాడు మరియు ఈ రోజుల్లో సూర్యాస్తమయం సమయంలో సూర్యకిరణాలు ఇక్కడ అధిష్టాన దేవత పాదాల వద్ద పడతాయి.

 ఈ ఆలయాన్ని రాహు కేతు పరిహార స్థలంగా పరిగణిస్తారు.


💠 ప్రతి సంవత్సరం మే 21వ తేదీన వరదరాజ పెరుమాళ్ జయంతిని పురస్కరించుకుని వరదరాజ్ పెరుమాళ్ మరియు తాయార్ పెరుందేవి మహాలక్ష్మి దేవికి ప్రత్యేక పూజలు, హోమాలు మరియు కళ్యాణోత్సవం నిర్వహించారు.


💠 గరుడ సేవ వైకుంఠ ఏకాదశి మరియు మార్గశి తమిళ మాసంలో (డిసెంబర్ మధ్య - జనవరి మధ్యలో) జరుగుతుంది . సమీపంలోని అన్ని ఆలయాలతో ఈ ఆలయంలో అతిపెద్ద గరుడ వాహనం ఉంది.


💠 హోసూర్ నుండి షూలగిరికి దూరం 26 కి.మీ.,బెంగళూరు నుండి షూలగిరి దూరం 64 కి.మీ.


రచన

©️ Santosh Kumar

శ్రీ ధూర్జటిమహాకవి ఇలా అంటున్నారు

 


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


శ్రీ ధూర్జటిమహాకవి ఇలా అంటున్నారు


శా//అంతామిథ్య తలంచి జూచిన నరుం డట్లౌటెరింగిన్ సదా/ 

కాంతల్పుత్రులు నర్థమున్ తనువు నిక్కంబంచు మోహార్ణవ/

భ్రాంతిం జెంది జరించు గాని,పరమార్థంబైన

నీయందు దా/

జింతాకంతయు జింత నిల్పడు గదా! శ్రీకాళహస్తీశ్వరా!//


(జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ జగత్తులో 

కనిపించేవి,వినిపించేవి, అయిన సమస్త విషయములు అశాశ్వతములే.

ఈ విషయం తెలిసినప్పటికీ, మానవులు, భ్రాంతి వల్ల నా భార్య, ,నాభర్త,నాపుత్రులు,నాధనము,నా శరీరము,అని అశాశ్వతములైన వీటినుండి సుఖాన్ని ఆశిస్తూ అగాధమైన ఈ సంసార సముద్రములో తిరుగుచున్నారు.

శాశ్వతము,పరమసత్యము, అయిన నీగురించి "చింతచెట్టు ఆకు" అంత కూడా ఆలోచించటం లేదు)




భగవంతుని మీదికి దృష్టి పోకుండా సంసారంలో మనల్ని కట్టిపడేసే, ప్రాపంచిక బంధాలు చాలా బలవత్తరమైనవి.

వాటినుండి మనంతట మనం ముక్తి పొందలేము. ఈశ్వరానుగ్రహంతోనే అది సాధ్యం అంటున్నారు.


శా / ఆలంచున్ మెడ గట్టి, దానికి నపత్యశ్రేణి గల్పించి తత్/

బాల వ్రాతము నిచ్చి పుచ్చుటను సంబంధంబు గావించి యా/

మాలర్కంబున బాంధవం బనెడి ప్రేమం గొందఱం ద్రిప్పగా/

సీలన్ సీల యమర్చి నట్లొసగితో ! శ్రీకాళహస్తీశ్వరా! //


(స్వామీ! భార్యాభర్తలనే సంబంధం మెడకు కట్టావు. సంతానాన్ని కనటం అనే ప్రక్రియ ఏర్పాటు చేసావు. ఆడపిల్లలను ఇవ్వడం, కోడండ్రను,తెచ్చుకోవడం, అనే తతంగంతో క్రొత్త క్రొత్త బాంధవ్యాలను, ప్రేమలను కల్పిస్తున్నావు.

 ఈ విధంగా మానవులను సంసారంనుండి బయటపడకుండా త్రిప్పటం అనేది, మరలలో మేకులను గట్టిగా బిగించినట్లు ఉన్నది.

సీలలో సీలలాగా బిగింపబడిన ఈ బంధములనుండి మా అంతట మేము ఎలా బయటపడగలం?

శ్రీకాళహస్తీశ్వరా! నీవే దయతో ఈ బంధములనుండి విముక్తులను చేసి మాకు ముక్తిని ప్రసాదించు స్వామీ )


శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

18-2-'26.

విఘ్నేశ్వర స్తుతి

   ☘️విఘ్నేశ్వర స్తుతి🙏


సీ .పార్వతినందనా! పరమపురుషనిను 

సేవింతు నిత్యము చింత తీర్చు

సకలభూ తాదులు సైతంబు నినుకొల్చు

శివదేవ సుతుడవు శిష్ట గాత్ర 

లంబోదరా! వేగరావయ్య పుడమికి

దనుజసంహారక ధర్మ చరిత 

విఘ్నవినాయక! వేదవే ద్యనిరతము

మముకావగా రావ మమతతోడ

తే ఘనముగనినుకొలిచెదము గౌరి తనయ!

సాధుజన పరిరక్షక సత్యపాల

సర్వదేవ గణార్చిత సాధుశీల

అగ్ర పూజలొ నర్తు గణాగ్రగణ్య!


 సాహితీ శ్రీ జయలక్ష్మి

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం - ప్రతిపత్ - శతభిషం -‌‌ సౌమ్య వాసరే* (18.02.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.






.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*