9, ఆగస్టు 2023, బుధవారం

⚜ శ్రీ దుంగేశ్వరి గుహలయం

 🕉 మన గుడి : 





⚜ బీహార్ : గయ


⚜ శ్రీ దుంగేశ్వరి గుహలయం



💠 పురాతన దుంగేశ్వరి గుహలయాలు మహాకాళ గుహ దేవాలయాలుగా ప్రసిద్ధి చెందాయి. 

గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం కోసం బోధ్ గయకు వెళ్లే ముందు ఈ గుహలలో 6 సంవత్సరాలు ఇక్కడ ధ్యానం చేశాడని నమ్ముతున్నందున, దుంగేశ్వరి కొండ బౌద్ధులచే అత్యంత గౌరవప్రదమైన ధార్మిక ప్రదేశం. 


💠 దేశంలోని ప్రముఖ గుహాలయాల్లో ఇది ఒకటి. ఈ గుహాలయానికి బౌద్ధ మతపరమైన ప్రాధాన్యత ఉంది. 

ఇక్కడే గౌతమ బుద్ధుడు 6 సంవత్సరాల కాలం ధ్యాన సాధన చేశాడు. జ్ఞానోదయ మార్గాన్ని కూడా ఆయన ఇక్కడే గ్రహించారని చెబుతారు. ఈ సాధన చేస్తున్న సమయంలోనే బుద్ధుడు ఆకలి దప్పులతో ఇబ్బంది పడ్డాడు. ఆత్మత్యాగం చేయబోయారని కూడా అంటారు.


💠 ఈ ప్రదేశంలో అతను ఒక మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటే, సుజాత అనే గ్రామ మహిళ అతనికి ఆహారం ఇచ్చింది. 

బుద్ధుడు ఆమె ప్రసాదాన్ని స్వీకరించి ఆహారాన్ని తీసుకున్నాడు. 

ఈ అనుభవం నుండి అతను జ్ఞానోదయం పొందడానికి తీవ్రమైన భోగాలు లేదా వైరాగ్యాలు సరైన మార్గం కాదని, 

మధ్య మార్గాన్ని అనుసరించడం ద్వారా, అతను అత్యున్నతమైన మోక్షాన్ని సాధించగలడని బుద్ధుడు గ్రహించాడు .


💠 సుదీర్ఘ ధ్యానం తర్వాత గౌతముడు కొండ దిగువన 5 కిమీ దూరంలో ఉన్న గ్రామానికి వచ్చాడు. అక్కడ తన ఆకలిదప్పులు తీర్చిన సుజాతకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడని అంటారు. 

ఈ గ్రామాన్ని ఇప్పుడు సుజాత గఢ్ అని పిలుస్తారు. 

 

💠 అక్కడి నుంచి బయలు దేరి గౌతముడు గయ చేరుకున్నాడు. అక్కడ మనకు తెలిసిన బుద్ధుడుగా మారాడు. 

ఆ గయే బుద్ధగయ అయింది. 


💠 బుద్ధునికి సంబంధించి నాలుగు ప్రధాన క్షేత్రాలు ఉన్నాయి.

1. లుంబినీ - గౌతముడు ఇక్కడే జన్మించాడు. 2. బుద్ధగయ ….. గౌతముడు బోధి వృక్షం క్రింద జ్ఞానోదయం పొందిన ప్రదేశం.

3. సారనాథ్ – బుద్ధుడు మొదటి సారిగా ఉపన్యాసం ఇచ్చిన ప్రదేశం..

4.కుశీనగర్ – బుద్ధుడు నిర్యాణం పొందిన ప్రదేశం.


💠 ఈ నాలిగింటి తర్వాత ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలు చాలా ఉన్నాయి.

 వాటిలో దుంగేశ్వరి గుహాలయం ఒకటి. 

బీహార్ లో చూడదగిన ప్రదేశాల్లో ఇది ముఖ్యమైనది.


💠 ఈ ప్రదేశానికి స్థానికులు సుజాత స్థాన్ అని పిలుస్తారు, ఈ గుహలు క్లిష్టమైన మరియు అద్భుతమైన బౌద్ధ పుణ్యక్షేత్రాలు మరియు స్థూపాలకు నిలయంగా ఉన్నాయి.


💠 బుద్ధుడు ఇక్కడ ధ్యానం చేసినందుకు గుర్తుగా రెండు ఆలయాలు నిర్మింపబడ్డాయి .

అందులో ఒక ఆలయంలో అతని దృఢమైన తపస్సును గుర్తుచేసే బంగారు కాలిపోయిన బుద్ధ శిల్పం ఒక గుహ దేవాలయంలో ప్రతిష్టించబడింది. 

మరొక గుహలో 6 అడుగుల ఎత్తులో ఉన్న పెద్ద బుద్ధుని విగ్రహం ఉంది. 

అలాగే, గుహ దేవాలయంలో హిందూ దేవత దుంగేశ్వరి కూడా ఉంచబడింది. 


💠 దుంగేశ్వరి హిల్స్ యొక్క సుందరమైన ప్రదేశం కూడా ఒక ప్రసిద్ధ ట్రెక్కింగ్ గమ్యస్థానం మరియు పెద్ద సంఖ్యలో ఔత్సాహికులను ఆకర్షిస్తుంది. కేవలం బౌద్ధులే కాకుండా హిందువులు కూడా ఈ గుహాలయాలను సందర్శిస్తారు. 

ఇలా హిందూ దేవతల పక్కన బుద్ధుడి విగ్రహం ఉండటం ఇక్కడి ప్రత్యేకత. 


💠 దుంగేశ్వరి కొండలు గయలోని ఫల్గు నదికి సమీపంలో ఉన్నాయి . చైనీస్ యాత్రికుడు హ్యూయెన్ త్సాంగ్ తన ప్రయాణ కథనంలో ఈ కొండల గురించి ప్రస్తావించాడు.


💠 ఈ గుహలలో నేడు అనేక దేవాలయాలు ఉన్నాయి, వీటిని భగవాన్ బుద్ధుని అడుగుజాడల్లో అనుసరించే యాత్రికులు తరచుగా సందర్శిస్తారు .


💠 దుంగేశ్వరి గుహలయాలకు చేరుకోవడం చాలా సులభం. 

ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం లేదు కాబట్టి, బోధ్ గయ నుండి నేరుగా రిక్షా ద్వారా గుహలకు చేరుకోవచ్చు. గుహలు విజువల్ అప్పీల్ లేకపోవచ్చు కానీ స్ఫూర్తిదాయకమైన ఆధ్యాత్మిక మానసిక ప్రశాంతతని అందిస్తాయి.


💠 సమయాలు: 10 AM - 5 PM


💠 ప్రవేశం: ఉచితం


💠 బీహార్ లోని బుద్ధ గయకు 12 కిమీ దూరంలో ఉంది

Panchang


 

సులువుగా చెప్పలేను.

 *శనగపిండితో ఆధ్యాత్మిక బోధ*

                   (సేకరణ)



మిఠాయి సత్యం

                 


మా ఊర్లో సత్యంగారనే ఆయన ఉండేవారు.


ఉదయం పదిగంటల నుంచి జంతికలు, చెగోడీలు, బజ్జీలు, బెల్లం మిఠాయి ఉండలు చేసి అమ్మేవాడు.


ఎవరింట్లో ‌ఏ శుభకార్యాలయినా బూంది లడ్డు, మైసూరు పాక్, ఇలాంటివి  చేయించుకొనేవారు. దానాదీనా ఆయనకి మిఠాయి సత్యం గారు అనే‌పేరు స్థిరపడిపోయింది.


ఎందుకు ఆయన గురించి చెపుతున్నా నంటే… ఆయన చదువుకోకపోయినా‌ మంచి ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాడు. తరచుగా ఆథ్యాత్మిక ఉపన్యాసాలు, హరికథలు వినేవాడు.


ఓ రోజు ఓ స్వాములవారు భగవతత్వం గురించి చెబుతూ,అనేక రూపాల్లో ఉన్నా భగవంతుడు ఒక్కడే అని చెప్పి ఏమోయ్ సత్యం అర్థమైందా అని అడిగారు.


ఈ సత్యం గారు హరికథకులకు, స్వామీజీ లకు, పౌరాణికులకు సపర్యలు చేస్తూ ఉండేవాడు.


"అయ్! అర్థమయింది. ఎలాగంటే నా బాషలో నే సెబుతా యినండి ఎలా అంటే…”


సెనగపిండి (మూలమనుకోండి)

1. సన్న గొట్టంలో సుడితే కారప్పూసండి.                                                    2. లావుగొట్టంలో సుడితే జంతికలు.                                                                3.అదే‌సెనగపిండిని సట్రంలో కొట్టి, యేరుసెనగ, పుట్నాలు, అటుకులు , కర్వేపాకు యేపి కలిపితే కారంబూంది అవుద్ది.

4.అదే సెనగపిండి సట్రంలో బూంది కొట్టి పంచదార పాకంలో వేసి ఉండకడితే లడ్డు ఔతుంది.

5.అదే సెనగపిండి వేయించి, పంచదార, నెయ్యి వేసి ఓ పాత్రలో పాకం పడితే మైసూరు పాక్ అవుతుంది.

6. అదే సెనగపిండి ‌పల్చగా కలిపి, మిరపకాయ ముంచి‌వేయిస్తే మిరపకాయ బజ్జీలు, అరటికాయ ముక్కలు ముంచివేస్తే అరటికాయ ‌బజ్జీలు.

7.అదే సెనగపిండి లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం, కలిపి‌వేయిస్తే పకోడీయండి.


ఒకే సెనగపిండికే ఇన్ని రూపాలున్నట్టే, మూలం శక్తి అయిన భగవంతుడు, మనకి శివుడుగా, యిష్ణువుగా, ఆంజనేయుడుగా, గణపతిగా ఎన్నో రూపాలుగా కనపడతాడండి ఆయ్.”


మనం ఎలా కొలిచినా, పిలిచినా పలికే‌శక్తి‌‌ ఒహటేనండి. ఆయ్! నాకరదమయినకాడికి సెప్పేనండి అన్నాడు ‌సత్యంగారు.


ఆనాటి స్వామీజీలు కనుక ఆయన తనకు అంతకు ముందే సభానిర్వాహకులు కప్పిన ‌శాలువ‌ సత్యంగారికి కప్పి నిగర్వంగా ఓ ‌మాటన్నారు…


ఇన్ని ‌శాస్త్రాలు‌‌చదివిన నేను కూడా భగవత్ తత్వాన్ని నువు చెప్పినంత సులువుగా చెప్పలేను.


నీకు పరమేశ్వర కటాక్షం దొరికింది అన్నారు.


సభంతా చప్పట్లు మోత!

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

లోకా సమస్తా సుఖినోభవన్తు!ఔ

ధర్మం

 బోయవానికి ప్రవృత్తా, న్నివృత్తా ఏముందని అతను అంతటివాడయ్యాడు అని మీరు సెలవు ఇచ్చారు. వాల్మీకి గాధ వింటే మీరు ఈ విధంగా అనరు.


బ్రహ్మ మానస పుత్రుడైన ప్రచేతసుని కుమారుడు వాల్మీకి. తండ్రి శాపం వలన అతను కిరాతకుడిగా మారవలసి వచ్చింది. సప్త ఋషులు ఆశీర్వాదంతో ఆయన తపస్సు చేసి సమాధి స్థితికి చేరుకోగలిగాడు.


తపస్సు కాలంలో ఆయన చుట్టూ పుట్టలు చేరాయి. ఆ కిరాతకును వల్మీకo నుంచి బయటకు వచ్చాడు కాబట్టి వాల్మీకి అన్నారు.

వాల్మీకి ప్రవృత్తి నివృత్తులు ఆపాదించలేం.


ఇంక ప్రహ్లాదంటారా శ్రీశర్మద గారు నుడివినట్లు నీ వృత్తి మార్గంలో స్మరణo.


ఏ బాటైనా ఆ భగవంతుని చేరుకోవడానికే. కానీ శౌచం ధర్మంలోని నాలుగు పాదాల్లో ఒక పాదం. 

భగవంతుడు సృష్టి చేసినప్పుడు మనతోపాటుగా యజ్ఞములను సృష్టించాడు. మానవులు యజ్ఞం చేసి హవిస్సులు దేవతలకు సమర్పించాలి. ఇవి వోండురుల  శ్రేయస్సుకు మంచిది. 

శుభం భూయాత్.

తాపత్రయం(తపన)*

 *తాపత్రయం(తపన)*


 *ఒక కోటిశ్వరునికి పెద్ద కారు  ప్రమాదం జరిగింది.పదిహేను రోజుల తర్వాత కోమాలో నుండి స్పృహలోకి వచ్చాడు. చుట్టు ఉన్న కుటుంబ సభ్యులందరు ఆనందంతో చూసారు.*


*తాపత్రయం మొదటి మెట్టు:*

*“అందరు ఇక్కడే వున్నారా?” అని అడిగాడు.*

*అవుననే కొడుకు చెప్పాడు.*

*“అందరు ఇక్కడే ఉంటే అక్కడ షాపులో ఎవరున్నారు?” అని అడిగాడు.*


*తాపత్రయం రెండో మెట్టు:*

*“నేను అదృష్టవంతురాలిని.  నా మాంగల్యం గట్టిది. మీకు పెద్దకారు ప్రమాదం జరిగింది. కారు నుజ్జునుజ్జు అయ్యింది. అయినా మీరు ప్రాణాలతో బయటపడ్డారు,” అంది భార్య.*

*వెంటనే… “కారు ఇన్సూరెన్స్ చేయించారా?” అని అడిగాడు.*


*తాపత్రయం మూడోమెట్టు:*

*“నాన్నా మీకింకొక విషయం చెప్పాలి.  కారు ప్రమాదంలో మీచెయ్యి కారు డోరులో ఇరుక్కుపోయింది. మీచెయ్యి తీసేసారు.” అన్నాడు.* 

*చెయ్యి చూసుకున్నాడు, లేదు. “చేతికి పాతిక లక్షల రోలెక్స్ వాచీ వుండాలిరా!” అన్నాడు.*


*తాపత్రయం నాలుగో మెట్టు:*

*“వాచీ తీసుకున్నారా?” అని లేవబోయాడు.* 

*“నాన్న కంగారు పడకండి, మీకు ఇంకొక విషయం చెప్పాలి, ప్రమాదంలో మీ వెన్నెముక విరిగిపోయింది.  మీరు నడవలేరు. మీపనులన్నీ చేసుకొనేందుకు అనువుగా మీకు కోటిరూపాయలతో ఎలక్ట్రానిక్ రోబో వీల్ చెయిర్ తీసుకొన్నాం.  అందులో కూర్చుంటే పళ్ళు బ్రష్ చేసుకోవటం, స్నానం చేయటం, భోజనం చేయటం వంటి అన్ని మీపనులు మీరే చేసుకోవచ్చు!” అన్నాడు కొడుకు.*

*“కోటిరూపాయలతో కొన్నారా, కొంటానికి  కొటేషన్ తీసుకున్నారా, ఇంకా తక్కువకి వచ్చేదేమో?” అన్నాడు.*


*తాపత్రయానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఇంకేమి కావాలి?*

 

*నీతి : తాపత్రయం తగ్గించుకోండి. ఎంత తగ్గించుకుంటే అంత మంచిది, అంత ఆనందంగా ఉంటాము. చిన్న జీవితం మనది.*

జనాలు ఊరేగుతున్నారు

 మనం కలియుగంలో ఉంటూ త్రేతాయుగంలోని వాల్మీకితో పోల్చూకోకూడదండి. కృత త్రేత ద్వాపర కలియుగాలకు లక్షణాలు ధర్మాలు వేరు వేరు. 


ప్రవృత్తి నివృత్తి మార్గాలు ఉపయోగం లేనివే అయితే.... ఆదిశంకరులవారు ఈ మార్గాలన్నీ ఎందుకు బోధించినట్లు? ఉపనిషత్తులకు, భగవద్గీతకూ భాష్యాలను ఎందుకు రచించినట్లు?  వ్యాసులవారి బ్రహ్మసూత్రాలకు భాష్యమును ఎందుకు రచించినట్లు? 


ఈమధ్య సర్వమత సమానత్వం అంటూ ఒక పనికిరాని వాదం ఒకటి బయలుదేరదీశారు. ఆచారాన్ని పాటించటం సంధ్యావందనాది నిత్యనైమిత్తికాలను భారంగా భావించే వారికోసం అంటూ సొంటూ అంతా మిథ్య. నా దగ్గరకు వస్తే ఆ నిత్యనైమిత్తికాలతో పనిలేదు. ఆచారంతో పని లేదు. పూజలక్కరలేదు. తల్లిదండ్రులకు తద్దినాలు పెట్టనక్కరలేదు. అంటూ బోధించే వారు జనాలను తెగ ఆకర్షించేస్తున్నారు. ఆ మోజులో పడి మన స్వసంస్కారాలకు సంప్రదాయాలకు తిలోదకాలిచ్చి సర్వమతసమానత్వం అంటూ జనాలు ఊరేగుతున్నారు. 

ఆవిధంగా సులభపద్ధతికి అలవాటు పడిన వారికి ఇదంతా పనికిమాలిన మార్గమే....

*సంప్రదాయానికి దూరమౌతున్నవారిని చూచి ఉబికి వస్తున్న నా యొక్క ఈ ఆవేదన 

నామస్మరణం


 ఏమి చదువు రాని పామరుడికి నివృత్తి మార్గము ప్రవృత్తి మార్గము నా సృష్ఠి లో యివన్నీ ఉపయోగం లేని మాటలు. .

      మరా మారా అని వాల్మీకి (బోయవాడిచేత) నామ జపం చేయించిన నారద మహాముని నివృత్తి ప్రవుత్తి మార్గాల వూసే ఎత్తకుండా వొక్క నామము గూర్చి చెప్పి మహాత్ముని చేసాడు.

 స్వర్గీయ అబ్దుల్ కలాం గారికి ఏమార్గము యెవ్వరు ఉపదేశించారు.

నేను బ్రాహ్మనుల ను గూర్చి బ్రాహ్మనుల  కోసం సనాతన ధర్మము లు ఏమి కోరుకుంటే మోక్షం వస్తుంది అని తెలుపుతూ అన్ని వర్గాల వారికి మోక్ష సాధన ఎలాగో నామ మహిమ యెంత శక్తి వంట మయినదో చెప్పుతూ అందరూ మోక్షానికి అర్హులే అనితెలియ జేసాను

దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించే ప్రత్యక్ష దేముల్లకు ఏమంత్రాలు అవసరం.ఏ మార్గాలు అవసరం.

యివన్నీ వైరాగ్యము తో గృహస్త్రాశ్రమము లో  వుంటూ మోక్షమును కోరే వారికి మాత్రమే. 

వేదాలు ధనసంపాదన భందు ప్రీతి  భఘవంతు నికి కూడా లంచము యిచ్చే మనస్తత్వం   వీటినన్నిటికి దూరం గా వుంటూ వొక్క భగవంతుని అన్నిఛో ట్ల చూడగలిగే వారికి నామస్మరణం  వొక పెద్ద అవకాశము అవుతుంది. అంతె. ఓం నమఃశివాయ.

బురదలేనిసరస్సులుఅందంగాఉంటాయి

 🌹🌹 *సుభాషితమ్* 🌹🌹

--------------------------------------------


*శ్లోకం*


పంకైర్వినాసరోభాతి

 సభఃఖలుజనైర్వినా

కటువర్ణైఃవినాకావ్యం

మానసంవిషయైర్వినా।।


(సుభాషితరత్నావళి)


*తాత్పర్యం*


బురదలేనిసరస్సులుఅందంగాఉంటాయి,దుర్మార్గులు లేని సభశోభిస్తుంది,కటువైన అక్షరాలు లేని కావ్యంకీర్తినిపొందుతుంది,అలాగే కోరికలు లేని మనస్సుఆనందంగా ఉంటుంది.

నవవిధభక్తిమార్గాల

 అవన్నీ నవవిధభక్తిమార్గాలలోని భేదాలండి.


*శ్రవణం కీర్తనం విష్ణోఃస్మరణం పాదసేవనం*

*అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం*


1. శ్రవణం: భగవంతుని కథలను శ్రద్ధాభక్తులతో వినటం ద్వారా భగవంతుని సేవించుకోవటం 

ఉదా: పరీక్షిత్తు మహారాజు 


2. కీర్తనం: కీర్తనలను భక్తిశ్రద్ధలతో పాడుకొంటూ భగవంతుని సేవించుకోవటం 

ఉదా: మీరాబాయి, అన్నమయ్య మొ॥


3. విష్ణోఃస్మరణం: ఎల్లప్పుడూ భగవంతుని స్మరించుకొంటూ భగవంతుని సేవించుకోవటం 

ఉదా: ప్రహ్లాదుడు 


4. పాదసేవనం: భక్తిశ్రద్ధలతో భగవంతునికి పాదసేవ చేసుకొనటం ద్వారా భగవంతుని సేవించుకోవటం 

ఉదా: 


5. అర్చనం: శ్రద్ధాభక్తులతో భగవంతుని పూజించుకోవటం 

ఉదా: మనందరం చేసేది ఇదే 


6 వందనం: నమస్కరించటం ద్వారా భగవంతుని సేవించుకోవటం 

ఉదా:


7. దాస్యం: దాసుడిగా భగవంతునికి సేవచేసుకోవటం ద్వారా భగవంతుని సేవించుకోవటం 

ఉదా:


9. సఖ్యం: భగవంతునితో స్నేహము చేయటం ద్వారా భగవంతుని సేవించుకోవటం 

ఉదా: కుచేలుడు 


10. ఆత్మనివేదనం: భగవంతునికి తనను తాను సమర్పించుకోవటం. 

ఉదా: గోపికలు 


ఇవి తొమ్మిది విధాలైన భక్తిమార్గాలు 


వీటిలో అన్ని విధాల భక్తి విశేషాలకు ఉదాహరణలు నాకు జ్ఞప్తి లేవు. మీకెవరికైనా తెలిస్తే చెప్పవచ్చు.

శరవణ భవ

 శరవణ భవ


#శరవణ_భవ


కృత్తికా నక్షత్రాన జన్మించిన వాడు సుబ్రహ్మణ్యుడు. అందుకే సుబ్రహ్మణ్యుని ఆరాధనలో కృత్తికా నక్షత్రం ప్రత్యేకమైంది. సూర్యుడు కర్కాటక రాశిలో ఉండగా వచ్చే కృత్తికా నక్షత్రం రోజున తమిళనాట ఆడికృత్తికను నిర్వహిస్తారు. సుబ్రహ్మణ్యస్వామికి అత్యంత ప్రీతికరమైన రోజది. ఆడికృత్తికనాడు సుబ్రహ్మణ్య భక్తులు తమిళనాడులో 'ఆరు పడైవీడు'గా ప్రసిద్ది చెందిన ఆరు ప్రధాన క్షేత్రాలను దర్శించి విశేష పూజలు చేస్తారు. వీటిని ఒకేరోజులో దర్శించలేం. ఆడికృత్తిక నాడు శరవణ భవ నామంతో కలిపి ఈ క్షేత్రాల పేర్లను తలుచుకుంటే దర్శించిన ఫలం లభిస్తుంది.


🌺 దేవసేనా సమేతుడు - తిరుప్పరకుండ్రం 🌺


సుబ్రహ్మణ్యస్వామికి వల్లి, దేవసేన అని ఇద్దరు భార్యలున్నారు. వారిద్దరూ పూర్వజన్మలో విష్ణుమూర్తి కుమార్తెలే. అప్పుడు వారిపేర్లు అమృతవల్లి, సుందరవల్లి. వారిలో అమృతవల్లిని దేవేంద్రుడు పెంచుకున్నాడు. ఆమెయే దేవసేన. తారకాసురుడిని సంహరించి తనను రక్షించిన సుబ్రహ్మణ్యస్వామికి దేవసేననిచ్చి దేవేంద్రుడు తిరుప్పరకుండ్రంలో వివాహం జరిపించాడు.


తిరుప్పరకుండ్రం లో ఆలయం శివమలై అనే కొండ పై వుంది. వివిధ మండపాలు కలిగిన ఆలయ ప్రధాన గర్భాలయం లో స్వామి వారు పెండ్లికుమారుడిగా చతుర్భుజాలతో దర్శనం ఇస్తాడు. ఈ క్షేత్రంలో అభిషేకం మూలవిరాట్టుకు కాకుండా స్వామి వారి ఆయుధం అయిన దండానికి చేయడం విశేషం. స్వామి వారితో పాటు గర్భాలయంలో దేవసేన, విష్ణువు దుర్గాదేవి, లక్ష్మి వంటి దేవతాముర్తులు కొలువుదీరి వున్నారు. కాగా, మదురై లోని మీనాక్షి సుందరేశ్వరులు తమ కుమారుడి వివాహం జరిగిన ఈ క్షేత్రాన్ని ఎప్పుడు చూస్తూ ఉంటారని కథనం.


🚩 #డైలీ_విష్ 🚩

దయ జూపుతారు.

 శ్లోకం:☝️

*నిర్గుణేష్వపి సత్త్వేషు*

  *దయాం కుర్వన్తి సాధవః |*

*న హి సంహరతే జ్యోత్స్నాం*

  *చంద్రశ్చాండాలవేష్మని ||*


భావం: తన చల్లని వెన్నెల కాంతితో ప్రపంచాన్ని చల్లబరిచే చంద్రుడు, ఎలా చండాలుడి ఇంటిని కూడా తన అమృత కిరణాలతో చల్లబరుస్తాడో ; అదే విధంగా సజ్జనులు గణహీనుల పట్ల కూడా దయ జూపుతారు.🙏

పంచాంగం 09.08.2023 Wednesday,

 ఈ రోజు పంచాంగం 09.08.2023 Wednesday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు అధిక శ్రావణ మాస కృష్ణ  పక్ష: నవమి తిధి సౌమ్య వాసర: కృత్తిక నక్షత్రం వృద్ది యోగ: తైతుల తదుపరి గరజి కరణం ఇది ఈరోజు పంచాంగం. 


నవమి రాత్రి 04:12 వరకు.

కృత్తిక రాత్రి 02:30 వరకు.

సూర్యోదయం : 06:01

సూర్యాస్తమయం : 06:42

వర్జ్యం : రాత్రి 02:02 నుండి 03:42 వరకు.

దుర్ముహూర్తం: పగలు 11:56 నుండి మధ్యాహ్నం 12:47 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.


యమగండం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.  

 


శుభోదయ:, నమస్కార:

యమునా నదీ హర్షము

 


యమునా నదీ హర్షము 

--------------------------------------


మ: ముదితా! యేతటినీ పయః కణములన్ మున్ వేణు వింతయ్యె నా

నది సత్పుత్రుని గన్న తల్లి పగిదిన్ నందంబుతో నేఁడు స

మ్మద హంసధ్వని పాటగా వికచ పద్మశ్రేణి రోమాంచ మై 

యొదవన్ తుంగ తరంగ హస్త నటనోద్యోగంబుఁ గావింప దే!


ఇరువురు గోపికలు పరస్పరం యమునాతీరంలో కృష్ణుని బృందావన విహార సోయగాన్ని చూస్తో మాటలాడిన రీతిగా పోతన వర్ణించినతీరు అనన్య సామాన్యమైనది.


సఖీ చూశావా! తన నీటితో పెరిగి కృష్ణుని చేతికెక్కి భువన మోహనమైన రాగాలను వినిపించుచున్న ఈ వంశిని జూచి ప్రయోజకుడైన కొడుకును జూచి సంబరపడే తల్లివలె హంసనాదములనే పాటతో వికసిత పద్మములను రోమాంచముతో పైకెగసిపడే కెరటములనే హస్తములతో యమున నాట్యం చేస్తున్నది. అని భావం!


పెరిగి పెద్దవాడై ప్రయోజకుడైన కొడుకును చూస్తే యేతల్లికి ఆనందం కలుగదు? అలాంటి ఆనందం యమునకు ఆవంశిని జూస్తే కల్గినదట! ఇంత మొలకగా తనగట్టున మొలచి, తన నీటితో నింతింతై యెదిగి కృష్ణయ్య చేతిలో మురళిగా మారింది. అలామారి యతనిచే పూరిపఁ బడి జగన్మోహనకరమైన రాగా లాపన చేస్తుంటే దానిని చూచి అంతులేని యానందం యమునకు కలుగదా మరి!


ఆనందం కలిగినప్పుడు దానిని రక రకాలుగా వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక్కడ యమున హంసధ్వనియే పాటగా( హంసధ్వని రాగంకూడా ఉంది. ఉల్లాసంగా హుషారుగా పాడుకుంటానికి అనువైనది) వికసించిన పద్మ సముదాయమే రోమాంచముగా ( సంతోష సమయంలో శరీరంలోని కేశములు నిక్క బొడచుట రోమాంచము) యెత్తైన కెరటములనే హస్తముల చాలనచే నాట్యం చేసే ప్రయత్నం చేస్తోందట!


రాగ తాళాను గుణ్యముగా నటన మాడుట నాట్యవిధానము. దానికనుగుణ మైన ప్రవృత్తి యమునా నదిలో సాక్షాత్కరింపజేసి పోతన యీ ఘట్టాన్ని అతి మనోహరంగా తీర్చి దిద్దినాడు. వస్తువునకు తగిన ప్రకృతి ప్రకృతకి తగిన వర్ణనము వర్ణనమునకు తగిన భావములు భావములకు తగిన పదములు పదములకు తగిన కూర్పు అందుకు తగిన పద్యములయల్లిక పోతన కవితా విెశిష్టతకు ప్రతీకలు!


ఇంత సుందరమైన సుమధురమైన వర్ణనా సామర్ధ్యము పోతనకు దైవదత్తమైనవరము. అందుచేతనే కాబోలును ఆంధ్రదేశమున పోతన భాగవతమున కున్న ప్రచారము సంస్కృత భారతమునకు కనిపించదు. 

మిత్రులారా! భాగవతం చదవండి! చదివించండి!


                        స్వస్తి !🙏🌷🌷🌷

తిప్పసత్తు

 తిప్పసత్తు  తయారీ విధానము  - 


   ముదిరిన తిప్పతీగ వ్రేళ్ళను తెచ్చి కత్తితో పైన పొట్టు తీసి సన్నని ముక్కలుగా కొట్టి దంచి నీటిలో కడగవలెను . జిగురు వచ్చు వరకు దంచి కడగవలెను. కడిగిన నీళ్లు ప్రత్యేకముగా ఉంచవలెను. జిగురు రాకపోయినా దంచి కడుగుటను మాని మొదట కడిగిన నీళ్లను వెడల్పాటి పళ్ళెములో పోయవలెను. సత్తు అంతా తెల్లగా అడుగున పేరి నీరు పైకి తేలును. ఆ నీటిని వంచివేయవలెను . ఈ విధముగా రెండోసారి , మూడోసారి తిప్పతీగని కడిగిన నీటిని పళ్ళెము లొ పొసి ఉంచవలెను. ఇందులొ తయారు అగు సత్తు మొదటి దాని అంత తెల్లగా ఉండదు. పైకి తేలిన నీటిని ఎప్పటికప్పుడు వంచివేయచుండవలెను . ఇటుల చేరిన సత్తుని బాగుగా ఎండు వరకు ఉంచిన అవి ముక్కలు అగును. ఇది రెండు రొజులలొ తయారు అగును . 


                 రాత్రుల యందు పాత్ర ను మూతతో కప్పి ఉంచవలెను. మూలికను దంచునప్పుడు రోలుకు కాని , రోకలికి కాని సున్నము తగలరాదు. సున్నము తగిలినచో సత్తు విరిగిపోవును. పళ్లెము కి కూడా సున్నము తగలనివ్వరాదు. 


             ఈ సత్తుని ప్రత్యేకంగా వాడుట యే కాక ఇతర ఔషదాలతో కూడా కలిపి ఇవ్వవచ్చు.


 దీని ఉపయోగాలు  - 


 *  దీనిని తేనెతో తీసుకుంటే కఫం పోవును .


 *  బెల్లముతో తీసుకున్నచో మలబద్దకం పోవును . 


 *  పంచదారతో ఇచ్చిన పైత్యమును , నేతితో ఇచ్చిన వాతమును హరించును. 


  * దీనిని అనుపానములతో ఇచ్చిన సర్వరోగములు పోగొట్టును . 


 * షుగర్ వ్యాధిగ్రస్తులు విడవకుండా వాడితే షుగర్ 

అదుపులో ఉండటానికి తోడ్పడుతుంది. 


 *  ఎప్పుడు నోరు పూస్తుంది అనేవారు తిప్పసత్తుని కర్పూర శిలజిత్ ని పంచదారతో గాని నేతితో గాని  కలిపి తీసుకుంటే శరీరంలో అతివేడి తగ్గును . 


 *  పొడిదగ్గు కి కూడా ఇదే మిశ్రమాన్ని వాడవలెను.


 *  వేడి శరీరం ఉన్నవారు ప్రతిరోజు తిప్పసత్తు వాడితే ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి.


 గమనిక  -  ఆయుర్వేద పచారి షాపుల్లో మీకు తిప్పసత్తు దొరకును. మీకు వీలుంటే సొంతంగా చేసుకోవచ్చు .


    పూర్తి వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


    

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 6 మరియు 7*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 6 మరియు 7*


నరేంద్రుడు తన ఎనిమిదవ ఏట  (1871 సంII )లో ఈశ్వరచంద్ర విద్యాసాగర్  మెట్రోపాలిటన్ పాఠశాలలో చేరాడు. ఆనాటి పాఠశాలలలో అది బహుళ ప్రాచుర్యం పొందింది.


చరిత్ర, సంస్కృతం అతడికి నచ్చిన పాఠ్యాంశాలు, గణితమంటే నచ్చదు. 'గణితం కిల్లీ కొట్టువాడికి సముచితమని అతని తండ్రి వ్యాఖ్యానించే వాడు. నరేంద్రుని అభిప్రాయం కూడా ఇదే. ఆంగ్లం నేర్చుకోవడానికి కూడా అతడు ఇష్టపడలేదు. మాతృభాషలో చక్కగా చదువుకోవడం మానుకొని పరాయి భాషను చదువుకోవడమెందుకని అతడు వాదించేవాడు. 

                          తల్లితండ్రులు ఎంతగా నచ్చజెప్పినప్పటికీ నరేంద్రుణ్ణి మొదట    సమ్మతింపజేయలేకపోయారు. 

తరువాత మొత్తానికి ఎలాగో అతడు వారి సలహాను పాటించాడు. ఆంగ్ల అక్షరమాలనూ, ప్రాథమిక పాఠాలనూ స్వయంగా భువనేశ్వరే అతడికి నేర్పింది. కాని అతడికి దాన్లో అంతగా అభిరుచి కలుగలేదు.


కాని ఎవరు చేసిన పుణ్యమో, కాదు, లోకం చేసుకొన్న పుణ్య ఫలంగా అతడు ఆంగ్లభాషను ఆసక్తితో నేర్చుకోసాగాడు. కాలాంతరంలో ఆ భాషకే వన్నె తెచ్చే రీతిలో ఆంగ్లభాషాకోవిదుడయ్యాడు.

నరేన్ బడికి పోవడం మొదలుపెట్టినప్పుడు ప్రారంభమయిన అజీర్తి వ్యాధి అతణ్ణి దీర్ఘకాలం పీడించింది.  అయినా చలాకీతనంలో, వేడుకలు వినోదాలలో ఎలాంటి మార్పూ లేదు.


నరేంద్రుడు సూక్ష్మబుద్ధి గలవాడు. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉండాలనిపించేది. క్షణం కూడా ఊరకే ఉండలేడు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు.  లేదా చెయ్యవలసినదాన్ని గూర్చి యోచిస్తూవుంటాడు. ఏదో 'ఒక శక్తి ఊట తనలో పొంగిపొరలుతున్నట్లు అనిపించడంతో అతడు సదా కార్యోన్ముఖుడయ్యే ఉండేవాడు. 


స్నేహితులతో కలిసి ఒక నాటకం ప్రదర్శించి చూపిస్తాడు. వ్యాయామం చేస్తూవుంటాడు. మిత్రులకు సరదాగా  పేర్లు పెట్టడంలో

సిద్ధహస్తుడు. ఆటల్లోనూ అమిత ఆసక్తి చూపేవాడు .(గోలీలాట. ఎత్తు దూకడం, పరుగు, కబడి, దాగుడు మూతలు, మల్లయుద్ధం మొదలైన ఆటలన్నీ అతడికి కరతలామలకాలు). 


చిన్నతనం నుండే ఆట వస్తువులతో ఆడుకోవడం నరేంద్రునికి చాలాఇష్టం. ఎదిగేకొద్దీ ఈ ఇష్టం విజ్ఞానశాస్త్రపరమైన పరికరాలు తయారుచేసే అభిరుచిగా పరిణమించింది. సహజవాయువుతో పనిచేసే పరికరాలు, బొమ్మ రైలు, నాడు కలకత్తాలో బహుళ ప్రాచుర్యం పొందిన సోడా మొదలైనవి తయారుచేయడంలో నరేంద్రుడు నిమగ్నమయ్యేవాడు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -13*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -13*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


 అంతట ఆవు అంబా, అంబాయని అరుచుకొనుచు కన్నుల వెంబడి నీరుకారుచుండగ పర్వతము దిగి చోళరాజు వద్దకు వెళ్ళెను. ఎన్నడూ పొందని ఆశ్చర్యము పొందినాడు రాజు. 


వెంటనే దాని సంగతి సందర్భాలు తెలుసుకొన నిశ్చయించినాడు. మహాశ్చర్యభరిత ఆలోచనా సమన్విత హృదయుడై ఆ రాజు తాను స్వయముగా ఆ ఆవు ననుసరించి పర్వతాన్ని అదిరోహించి పుట్ట చెంతకు చేరాడు. 


పుట్ట నుండి రక్తము వచ్చుట ఎట్టు జరుగుచున్నది? గోపాలుడు మూర్చబోవడానికి కారణము ఏమిటి? అనే ఆలోచనలు అతని మెదడులో తిరుగాడసాగాయి! ఇంతలో...


ఇంతులో ఏమి జరిగినదీ అంటే గాయమూ, రక్తమూ కలిగిన తలతో శ్రీమహావిష్ణువే పుట్టవెలుపలికి వచ్చేశాడు. వచ్చి, చోళరాజును జూచినవాడై ఆగ్రహముతో ‘‘ఓరీ! మదాంధా! నీచరాజా! నీకు కళ్ళు ఎంతగా మూసుకొనిపోయినవి? లేకున్న నీకు యెగ్గూ తలపెట్టని నన్ను. నీ గోపాలుని చేత గండ్రగొడ్డలితో కొట్టించుటకు సాహసించి యుందువా! 


నా కోపమునకు, నా బాధకు నీవు కారణమైతివి గనుక, ఇదిగో శపించుచున్నాను, ఆ తప్పు ని కాదు. ఆ గోపాలునిదే అనగలవేమో! సేవకుల దోషములకు యజమానులకు దండన వుండి తీరును, అందువలన నీవు పిశాచమయిపోయెదవు గాక!’’ యని శపించెను. 


భరించలేని పిశాచరూపము పొందునట్లు స్వామి తీవ్రకోపముతో శపించగా చోళరాజు దుఃఖమును పట్టలేకపోయెను. అతడు స్వామి పవిత్ర పాదముల పై కుప్పగా కూలిపోయాడు. విలపించడం ప్రారంభించాడు.


‘‘ఓ స్వామీ! పవిత్రమూర్తీ నేను ఏ పాపమున్నూ యెరుగను. గోపాలుని గండ్ర గొడ్డలితో నిన్ను కొట్టమని నేను అసలు యాజ్ఞపించలేదు స్వామీ! నిజముస్వామీ నమ్ము స్వామీ! నన్ను పిశాచముగా మారిపోవుట యెందులకు మీరు శపించినారు. ఎంత ఘోరమయిన శాపమిచ్చినారు? 


స్వామీ!’’ అసలు మీరీ పుట్టలో నున్నట్లు నాకు తెలియనే తెలియదు. రక్షించు స్వామీ! అని అతిదీనముగా విలపించసాగినాడు.


భగవానుడు కరుణామయుడు, ప్రేమహృదయుడు కదా! చోళరాజకృత ప్రార్ధనకు కరిగిపోయాడు. 


ఆలోచించి చోళరాజుతో ‘‘ఓ రాజా యేదియేమైనను నా శాపము వ్యర్థమగుట జరుగని పని, కాని, నీవు యీ శరీరము వదలిన వెనుక తిరిగి చోళవంశములోనే పుడతావు. 


అప్పుడు నీ పేరు ఆకాశరాజుగా వుంటుంది. నీకు ఒక కుమార్తె కలుగగలదు. ఆమె పద్మావతి నామముతో విలసిల్లుతుంది.


 యుక్తవయస్సు వచ్చిన వెనుక నీ కుమార్తె అయిన పద్మావతిని నాకిచ్చి వివాహము చేయుట జరుగును. వివాహ శుభసయములో నీవు అందమయిన వజ్రకిరీటాన్ని నాకు బహూకరిస్తావు. 


శుక్రవారం నాడు మాత్రమే నేను దానిని ధరిస్తుంటాను. ఆ శుక్రవారము రోజుతోనే నీకు పిశాచరూపము పోతుంది’’ అన్నాడు.


గోపాలునికి అంధత్వము ఎప్పుడు పోతుంది?


మూర్ఛబోయిన గోపాలుడు మూర్ఛనుండి తేరుకొన్నాడు. అతడు అంధుడయి పోయినాడు. వాడున్నూ శ్రీమన్నారాయణుని పవిత్రపాద పద్మముల పైబడి ‘‘స్వామీ! అంధుడయిన నాకు త్రోవ చూపుటకు ఆధారము నీవు కావా? నన్ను రక్షించవా? స్వామీ!’’ అని దీనాతిదీనముగా వేడుకొనెను. 


ఎవ్వరి దుఃఖాన్నీ చూడలేనివాడు కదా స్వామీ!’’ అనుగ్రహ వాక్యాలు ఈ విధంగా పలికాడు ‘‘ఓరీ కొన్ని రోజులు గడిచిన పిదప ఇదుగో ఈ పర్వతము మీదనే నేను వెలయుట జరుగను. నీవు అప్పటి వరకు మాత్రము అంధుడవయి యుండవలెను. అది తప్పదు. అప్పటి నా అవతారదర్శనమాత్రముననే నీకు అంధత్వము పోవును’’ అని శ్రీమహావిష్ణువు అచ్చట నుండి బయలుదేరి వెళ్ళిపోయినాడు.


 *పద్మావతిప్రియ గోవిందా, ప్రసన్నమూర్తీ గోవిందా,* *అభయమూర్తి గోవిందా, ఆశ్రిత వరద గోవిందా; |* 


 *గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి* *గోవిందా, వేంకట రమణా గోవిందా. ||13||*


శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.


 *🙏ఓం నమో వెంకటేశాయ🙏*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కర్మ తప్పదు.

 శరీరము ఉన్నంతవరకు కర్మ తప్పదు. ఎటువంటివారైనా కర్మ చెయ్యవలసినదే. అది గృహస్థుడైనా పూర్తి వైరాగ్యం పొందిన సన్న్యాసి అయినా తప్పదు. 


పూర్తిగా వైరాగ్యం పొందిన సన్న్యాసులకూ కర్మ అవసరమేమున్నది? అనే ప్రశ్న రావచ్చును. 


వైరాగ్యం పొందిశా, ఆత్మజ్ఞానాన్ని పొందినా శరీరం ఉంటుంది కదా! కనుక శరీరం నిలచి ఉన్నంతవరకు దానిని పోషించవలసి ఉంటుంది. అటువంటప్పుడు శరీరానికి ఆహారము, నిద్ర,శౌచము కనీస అవసరాలు. వాటిని శరీరానికి అందించటము కూడా కర్మచెయ్యటమే అని చెప్పబడినది. కనుక ఎటువంటి శరీరధారికైననూ కర్మాచరణ తప్పదు. అయితే...

 నేను ఈ పని చేస్తున్నాను. దీని ఫలితం నాకు ఇలా లభిస్తుంది అనే స్పృహ/కోరిక అనేవి విడిచివెయ్యాలి నేను చేస్తున్నాను అనే భావన ఉండకూడదు. అదేవిధంగా ఆ కర్మాచరణ వలన కలిగే ఫలితాన్నీ ఆశించకూడదు. అన్నిటికీ కర్త కర్మ క్రియ అంతా భగవంతుడే అని భావించాలి. ఏ కర్మ చేసినా భగవద్దత్తంగా చెయ్యాలి. నేను, నాది అనేది పూర్తిగా విడిచివెయ్యాలి. అప్పుడే కర్మఫలాలు మంచివైనా చెడ్డవైనా అంటుకోవు. కర్మఫలాలు ఎప్పుడైతే అంటుకోవో అప్పుడు శరీరధారి/జీవుడు కర్మరహితుడు అవుతాడు. కర్మరాహిత్యం వలననే మోక్షం లభిస్తుంది. 


ఈ కర్మరాహిత్యమైన స్థితికి చేరిన శరీరధారికి అసంకల్పితంగానే జ్ఞానం ఉద్భవిస్తుంది. 


జ్ఞానము అంటే ఆత్మను తెలుసుకోవటమే. ఆత్మను తెలొసుకోవటమంటే బ్రహ్మమును తెలుసుకోవటమే.

విద్యయొకటె యెపుడు


           *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_*


 𝕝𝕝శ్లోకం𝕝𝕝 


*సర్వద్రవ్యేషు విద్యైవ*

*ద్రవ్యమాహురనుత్తమమ్।*

*అహార్యత్వాదనర్ఘత్వాత్*

*దక్షయత్వాచ్చ సర్వదా॥*


              ....*హితోపదేశః*


𝕝𝕝తా𝕝𝕝

అన్ని కాలములయందు విద్య, ఇతరులచే దొంగిలింపరానిదైనందు వలన, వెలకట్టరానిదైనందు వలన, ఎంత ఇచ్చిననూ... పంచిననూ... తరగనిదైనందువలన కూడా, ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ విద్యయే అన్ని రకముల విలువైన ద్రవ్యముల యందు, సర్వోత్తమమైన ద్రవ్యము అని విద్వాంసులు చెప్పుచున్నారు.


సర్వద్రవ్యమందు నుర్విలోశ్రేష్ఠమ్ము

విద్యయొకటె యెపుడు వెదకిచూడ

దొంగలించబడదు దుర్మార్గులవలన

తరగ దెపుడు యెంత దాన మిడిన

ॐ శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్

 ॐ   శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ 


                             శ్లోకం:42/150 


మహాసేనో విశాఖశ్చ 

షష్ఠిభాగో గవాంపతిః I 

వజ్రహస్తశ్చ విస్రంభో 

చమూస్తంభన ఏవచ ॥ 42 ॥ 


* మహాసేన = గొప్పసేన కలవాడు, 

* విశాఖః = కుమారస్వామి తానే అయినవాడు (సేనాపతి), 

* షష్టిభాగః = కాలమును అరవై భాగాలుగా విభజించినవాడు, 

* గవాంపతిః = గోవులయొక్క పతి (వృషభము) తానే అయినవాడు, 

* వజ్రహస్తః = వజ్రాయుధము చేతియందు కలవాడు, 

* విస్రంభః = స్వేచ్ఛగా సంచరించువాడు, 

* చమూస్తంభనః = సేనా సమూహమును నిరోధించువాడు. 


                    కొనసాగింపు ... 


https://youtu.be/L4DZ8-2KFH0 


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

ప్రపంచంలో అత్యధిక

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

ప్రపంచంలో అత్యధిక వ్యభిచార రేట్లు ఉన్న 10 దేశాలు:

   1. థాయిలాండ్ (బౌద్ధం)

   2. డెన్మార్క్ (క్రిస్టియన్)

   3. ఇటాలియన్ (క్రిస్టియన్)

   4. జర్మన్ (క్రిస్టియన్)

   5. ఫ్రెంచ్ (క్రిస్టియన్)

   6. నార్వే (క్రిస్టియన్)

   7. బెల్జియం (క్రిస్టియన్)

   8. స్పానిష్ (క్రిస్టియన్)

   9. యునైటెడ్ కింగ్‌డమ్ (క్రిస్టియన్)

  10. ఫిన్లాండ్ (క్రిస్టియన్)


 ,


  ప్రపంచంలో అత్యధిక మద్య వ్యసనం ఉన్న 10 దేశాలు:

   1) మోల్డోవా (క్రిస్టియన్)

   2) బెలారసియన్ (క్రిస్టియన్)

   3) లిథువేనియా (క్రిస్టియన్)

   4) రష్యా (క్రిస్టియన్)

   5) చెక్ రిపబ్లిక్ (క్రిస్టియన్)

   6) ఉక్రేనియన్ (క్రిస్టియన్)

   7) అండోరా (క్రిస్టియన్)

   8. రోమేనియన్ (క్రిస్టియన్)

   9) సెర్బియన్ (క్రిస్టియన్)

   10) ఆస్ట్రేలియా (క్రిస్టియన్)


 ,


  ప్రపంచంలో అత్యధిక హత్యలు జరుగుతున్న దేశాలు:

   1. హోండురాస్ (క్రిస్టియన్)

   2. వెనిజులా (క్రిస్టియన్)

   3. బెలిజ్ (క్రిస్టియన్)

   4. ఎల్ సావడార్ (క్రిస్టియన్)

   5. గ్వాటెమాల (క్రిస్టియన్)

   6. దక్షిణాఫ్రికా (క్రిస్టియన్)

   7. సెయింట్ కిట్స్ మరియు నెవిస్ (క్రిస్టియన్)

   8. బహామాస్ (క్రిస్టియన్)

   9. లెసోతో (క్రిస్టియన్)

  10. జమైకా (క్రిస్టియన్)


 ,


  ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన గ్యాంగ్‌స్టర్ల పేర్లు:

  1. యాకూజా

  2. అగ్బెరోస్ (క్రిస్టియన్)

  3. వా సింగ్ (క్రిస్టియన్)

  4. జమైకన్ పోజ్ (క్రిస్టియన్)

  5. ప్రైమిరో (క్రిస్టియన్)

  6. ఆర్యన్ బ్రదర్‌హుడ్ (క్రిస్టియన్)

  7. రక్తం (క్రిస్టియన్)

  8. 18వ వీధి గ్యాంగ్ (క్రిస్టియన్)

  9. ముంగికి (క్రిస్టియన్)

  10. మార సల్వారుచా (క్రైస్తవుడు)


 ,


  ప్రపంచంలోని డ్రగ్ కార్టెల్స్ యొక్క పెద్ద పేర్లు: -

                        

  1. పాబ్లో ఎస్కోబార్-కొలంబియా (క్రిస్టియన్)

  2. అమాడో కారెల్లో-కొలంబియా (క్రిస్టియన్)

  3. కార్లోస్ లెహ్డర్-జర్మన్ (క్రిస్టియన్)

  4. గ్రిసెల్డా బ్లాంకో-కొలంబియా (క్రిస్టియన్)

  5. జోక్విన్ గుజ్మాన్ - మెక్సికో (క్రిస్టియన్)

  6. రాఫెల్ కారో - మెక్సికో (క్రిస్టియన్)


 ,


 ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద ఉగ్రవాద సంస్థలు

                    

 1. ఇస్లామిక్ స్టేట్ (ISIS)

 2. అల్ ఖైదా

 3. తాలిబాన్

 4. తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్

 5. బోకో హరామ్

 6. అల్ నుస్రా ఫ్రంట్

 7. హిజ్బుల్లాహ్

 8. హమాస్

 9. కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ (PKK)

 10. కొలంబియా యొక్క రివల్యూషనరీ ఆర్మ్డ్ ఫోర్సెస్


 ,


 కానీ భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం  హింసకు ,  అత్యాచారాలకు  హిందువులు బాధ్యత వహించేల  చేస్తున్నారు .. మరో చోటా రాహుల్ విన్సీ వంటి హిందువుల ద్రోహులు విదేశాలకు వెళ్లి సనాతనాన్ని పరువు తీస్తారు!

 

*సేకరణ:- జి.టి.ఎస్. ఆచార్య గారి వాట్సాప్ పోస్ట్.*